18, ఫిబ్రవరి 2009, బుధవారం

ఏదీ గాంధీ వాదం?

`నా జీవితమే నా సందేశం'.. జాతిపిత మహాత్మాగాంధీ తన జాతికి అందించిన జీవన సూత్రమిది. దాదాపు అర్ధశతాబ్దం పాటు జాతిని స్ఫూర్తిమంతం చేసి దేశానికి స్వాతంత్య్ర ఫలాలను అందించిన వారిలో అగ్రగణ్యుడుగా నిలిచిన వాడాయన. ఆంగ్లేయుల దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించేందుకు తాను జన్మించడానికి ముందు నుంచీ సాగుతున్న పోరాటాన్ని అందిపుచ్చుకుని గమ్యం వైపు నడిపించినవాడు. జాతీయోద్యమ రంగం పైకి లోక్‌మాన్య బాలగంగాధర్‌ తిలక్‌ తరువాత ప్రవేశించిన గాంధీజీ తన పోరాటాన్ని ప్రధానంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సాగించాడు. స్వాతంత్య్రం కోసం సత్యాగ్రహ ఉద్యమాదులు, సామాజిక రంగంలో కులభేద నిరసన, అస్పృశ్యత మద్యపాన నిషేధము, ఆర్థిక రంగంలో దేశీయ పరిశ్రమలు, గ్రామ స్వరాజ్యము, ఖాకీ వంటి వాటిని ప్రధానంగా చేసుకుని ఆయన పోరాటాలు సాగాయి. ఆయన ప్రారంభించిన సత్యాగ్రహ ఉద్యమం ప్రపంచ విముక్తి ఉద్యమాల్లో ఒక కొత్త సమర సాధనంగా మారింది. స్వాతంత్య్రానికి ముందు, ఆ తరువాత ఈ అరవై ఏళ్లలోనూ మన దేశంలో సత్యాగ్రహ, సహాయ నిరాకరణ ఉద్యమాలే ప్రజల సమస్యల పరిష్కార సాధనాలుగా మారాయి. గాంధీజీ ఆచరించిన అతి సామాన్యమైన విధానాలు ఆలోచనకు, ఆచరణకు మధ్య ఉన్న అంతరాలను చెరిపేశాయి. మొట్టమొదటి సారిగా భారతీయులపై దక్షిణాఫ్రికాలో శే్వతజాతీయులు జరుపుతున్న దమనకాండను నిరసిస్తూ గాంధీ ప్రయోగించిన మహాస్త్రం `సత్యాగ్రహా'నికి వందేళు్ల పూర్తయిన సందర్భంలో ఆయన జయంతిని ప్రత్యేకంగా జరుపుకున్నాం కూడా. జాతీయోద్యమంలో గాంధీజీ ప్రతిపాదించిన మత సామరస్యం వంటి అంశాలు జాతి సమగ్రతకు, పటిష్ఠ నిరా్మణానికి ప్రాతిపదికను వేసినప్పటికీ కూడా రాజకీయ ఆచరణలో ఆనాడు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ద్విజాతి సిద్ధాంతాన్ని బలంగా ముందుకు తీసుకువచ్చింది. స్వాతంత్య్రం రావడంతోనే దేశం ఛిన్నాభిన్నమైపోయింది. అప్పటిదాకా మార్గదర్శకుడుగా ఉన్న గాంధీ రంగం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. స్వాతంత్య్ర సమయంలో దేశ విభజన జరగడంతోనే ద్విజాతి సిద్ధాంతం అంతమైపోతుందని అనుకున్న వారికి అవి భ్రమలేనని తేలడానికి ఎంతోకాలం పట్టలేదు. స్వాతంత్య్రం వచ్చి అరవై ఏళు్ల పూర్తయిన తరువాత దేశంలో ద్విజాతి సిద్ధాంతం కాస్తా బహుళ జాతి సిద్ధాంతంగా పరిణమించే ప్రమాదం ఏర్పడింది. ఏ కులమత విభేదనను గాంధీ నిరసించాడో ఆ కుల, మత విభేదన పునాదులపైనే నేటి భారత రాజకీయ వ్యవస్థ వర్ధిల్లుతోంది. ఈ విభేదాలే ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో వరా్గన్ని ఓటుబ్యాంకుగా మార్చివేశాయి. ఫలితం వర్గవైషమ్యాలు, మత విద్వేషాలు, ఉద్యమాలు.. ఈ ఉద్యమాలు సైతం మళ్లీ గాంధేయ మార్గంలోనే కొనసాగడం విచిత్రం. ఈ సమరసత లోపించడాన్ని విదేశీ టెరర్రిస్టులు అవకాశంగా తీసుకున్న పర్యవసానం గత రెండు దశాబ్దాలుగా దేశంలో అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న హింసాకాండ. ఇవాళ దేశంలో ఏ ఒక్క నగరమూ సురక్షితం కాదు. వేరా్పటు వాదులు ఒక వంక, మావోయిస్టులు మరో వంక, అతివాద సంస్థలు ఇంకొక వంక దోపిడీ దారులు మరో పక్క హింసాకార్యకలాపాలను స్వేచ్ఛగా సాగిస్తున్నారు. వేల మంది అన్యాయంగా అసువులు బాస్తున్నారు. ఒక చెంపపై కొడితే, మరో చెంప చూపించే వ్యక్తి కలికానికి కూడా ఇవాళ ఈ భారత దేశంలో కనపడడు. శాసనకర్తల స్థానంలో నేరగాళు్ల కూర్చొనే దారుణమైన పరిస్థితులు ఉన్న ఈ దేశంలో గాంధీ ప్రవచించిన అహింసకు తావెక్కడుంటుంది? రాజకీయాల పుణ్యమా అని దేశంలో రాజకీయాల ముసుగులో పార్టీలే మతాల మధ్య చిచ్చుకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమవుతున్నాయన్నది నిష్ఠుర సత్యం. అవినీతి పూర్తిగా చట్టబద్ధమైపోయింది. లంచం ఇవ్వడానికి ప్రజలు మానసికంగా సిద్ధపడిపోయారు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే గాంధీజీ దర్శించిన స్వరాజ్యమేనా ఇది? అని ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో, జాతీయ పునరుజ్జీవనోద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన గాంధీజీ అందించిన స్ఫూర్తిని ఆయన్ను తండ్రిగా ఆరాధిస్తున్న జాతి ఎంతవరకు అందిపుచ్చుకున్నది? ఆయన ప్రతిపాదించిన రాజకీయ విధానాలు కానీ, ఆర్థిక విధానాలను కానీ, సామాజిక అంశాలను కానీ ఆయన్ను మహాత్ముడిగా భావన చేస్తున్న మనం ఎంతవరకు పట్టించుకుంటున్నాం? అని ప్రశ్నించుకుంటే ఏమీ లేదనే చెప్పాలి. ఆయన జయంతిని ఏటా వాడవాడలా, దేశవిదేశాల్లో జరుపుకుంటున్నాం. ఆయన ప్రవచించిన అహింస, సత్యాగ్రహ వాదాలను సందర్భం వచ్చినప్పుడల్లా తలచుకుంటున్నాం. దేశమంతటా లక్షలాది విగ్రహాలను స్థాపించుకున్నాం. రాజ్‌ఘాట్‌లో అఖండదీపాన్ని వెలిగించి ఘనంగానే నివాళులర్పిస్తున్నాం. కానీ, స్వాతంత్య్రానంతరం గాంధీ కాంక్షించినది ఒక్కటీ నెరవేరలేదు. ప్రపంచీకరణ, సంస్కరణల ప్రభావంతో గాంధీ ఆర్థిక విధానాలు కనపడకుండా పోయాయి. స్వదేశీ పరిశ్రమలు లక్షల సంఖ్యలో మూతపడ్డాయి. వృత్తులు మట్టికొట్టుకుపోయాయి. పట్టణీకరణ అత్యంత వేగంగా పెరిగిపోయి, పల్లెసీమలు కనుమరుగవుతున్నాయి. గాంధీజీ చెప్పిన గ్రామస్వరాజ్యం రూపురేఖలు కూడా ఇప్పుడు కనపడవు. మన రాష్ట్రంలోనే పంచాయితీలకు ఎన్నికలు జరిగితే ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చిన ప్రబుద్ధులు వేలం పాటలో పదవులను కొనుక్కున వైనాలు నిన్న మొన్నటి ఘటనలే. స్థానిక స్వపరిపాలన సజావుగా సాగడం కోసం వాటికి తగిన అధికారాలు కాగితాల్లో రాసే ఉంటాయి. కానీ వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు తమ దగ్గర అట్టే పెట్టుకుంటాయి. ఎన్నటికీ బదలాయింపు జరగదు. ఏ విధంగా చూసినా ఇవాళ ఈ దేశంలో గాంధీ కేవలం ఏడాదికి ఓసారి దండ వేసేందుకు వాడుకునే విగ్రహం మాత్రమే. రంగు వేసుకుని ముష్టెత్తుకోవడానికి పనికివచ్చే ఓ వేషం మాత్రమే. అంతే కానీ, ప్రస్తుతం ఈ దేశంలో మనుగడ సాగిస్తున్న జాతికి గాంధీజీ తండ్రి మాత్రం కాలేడు.

ఎందుకీ చదువులు?

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ చదువు అన్నది రోజు రోజుకూ డబ్బున్నోళ్ల చదువుగా మారిపోతోంది. ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సీట్లు దొరికే విద్యార్థుల మాటెలా ఉన్నప్పటికీ, ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో చదివే విద్యార్థుల నుంచి ఏ యేటికాయేడు ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నారు. కన్వీనర్‌ కోటాలో చేరిన విద్యార్థులే దాదాపు 30 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అదే యాజమాన్యం కోటా పరిధిలో చేరిన విద్యార్థులు ఇక నుంచి ఏకంగా బాటా లెక్క ప్రకారం లక్షకు ఒక రూపాయి తక్కువ అన్నట్లే ఉంటుంది. దీనికి అదనంగా కము్యనికేషన్‌‌స స్కిల్‌‌స అనో, సాఫ్‌‌ట స్కిల్‌‌స అనో, కాషన్‌ డిపాజిట్‌ అనో రకరకాల పేర్లతో మరో పది వేల రూపాయలు యాజమాన్యాలు గుంజుకుంటాయి. ఇక ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి సీటు సంగతి చెప్పనే అక్కర్లేదు. కాలేజీకి చెల్లించే డబ్బులు కాకుండా విద్యార్థులకు పుస్తకాలకు.. ఇతరత్రా విడిగా అయ్యే డబ్బులకు లెక్కే ఉండదు. ఇప్పుడున్న ఫీజులతోనే యాజమాన్యాలు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు దండుకుంటున్నాయన్నది నిష్ఠురసత్యం. గత కొనే్నళు్లగా ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఉన్న సీట్లన్నీ భర్తీయే కావడం లేదు. సుమారు పదిహేను వేల సీట్లు ఏటా మిగిలిపోతున్నాయన్నది నిష్ఠుర సత్యం. ఆ ఖాళీ సీట్ల వల్ల నష్టపోతున్న ఆదాయాన్ని ఫీజు పెంపు ద్వారా భర్తీ చేసుకోవాలన్నది యాజమాన్యాల ఊహ కావచ్చు. అయితే ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగా స్పందించడం ఆశ్చర్యమేం కాదు. ఇవాళ రేపు ఇంటర్మీడియట్‌ చదువులకే 40 నుంచి 45 వేల రూపాయల దాకా ఖర్చవుతున్నప్పుడు, ఇంజనీరింగ్‌కు ఆ మాత్రం ఫీజు లేకుండా ఉంటే ఎలా అన్న వాదనకు జవాబు ఉండదు.
రాష్ట్రంలో ప్రస్తుతం 262 ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. అడ్మిషన్ల కౌన్సిలింగ్‌ నాటికి మరో పదమూడు కళాశాలలు కొత్తవి రానున్నాయి. మొత్తం కళాశాలల్లో ఇప్పటికి తొంభై రెండు వేల సీట్లు ఉన్నాయి. అయితే చాలా యాజమాన్యాలు తమ కళాశాలలకు సంబంధించిన సౌకరా్యలు, పనితీరుకు సంబంధించిన నివేదికలు సమర్పించకపోవడంతో ఏఐసిటిఇ ఇప్పటికే పదివేల సీట్లను తెగ్గోసింది. వీటికి సంబంధించిన దిగులు యాజమాన్యానికి పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే కౌన్సిలింగ్‌ నాటికి ఏదో నివేదిక పంపించి ఏఐసిటిఇ ఆమోదం పొందడం వాటికి కష్టమైన పనేం కాదు. ఇక కొత్త కళాశాలలు కూడా తోడైతే మొత్తం సీట్లు అక్షరాలా లక్ష దాటుతాయి. వీటిలో ఇరవై శాతం అంటే సుమారు ఇరవై వేల సీట్లు యాజమాన్యం కోటా(దీనే్న ఎన్‌ఆర్‌ఐ కోటాగా ఇటీవలే మారా్చరు)లో భర్తీ చేస్తారు. ఈ కోటా కింద ఒక్కో విద్యార్థి సుమారు లక్ష రూపాయల దాకా చెల్లించుకోవలసి ఉంటుంది. అంటే యాజమాన్యాలకు దాదాపు రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం అన్నమాట. కన్వీనర్‌ కోటా కింద భర్తీ అయ్యే సీట్ల ద్వారా మరో మూడు వందల కోట్ల రూపాయల మేర ఆదాయం సుమారుగా వస్తుంది. వెరసి ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రతి సంవత్సరం అయిదు వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందన్నమాట. ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నప్పటికీ, అనేక ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఫ్యాకల్టీలు ఉండవు. వƒలిక సౌకరా్యల జాడే ఉండదు. నిపుణులైన అధ్యాపకుల నియామకమే జరగదు. మొక్కుబడిగా చదువులు చెప్పి, ఓ పట్టాను చేతిలో పెట్టి వీధుల్లోకి పంపిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్‌ పట్టభద్రులైన విద్యార్థుల్లో కేవలం నాలుగు శాతం మంది మాత్రమే ప్రామాణికతను కలిగి ఉంటున్నారని, మిగతా 96 శాతం మంది సగటు విద్యార్థులేనని, వారిలో వృత్తి నైపుణ్యం ఎంతమాత్రం లేదని నాస్‌కామ్‌ ఓ సర్వేలో తేల్చింది. మరి ఎలాంటి ప్రమాణాలు లేని ఈ చదువులను ఇంతింత ఫీజులు చెల్లించి చదవటం దేనికి?
ఇంజనీరింగ్‌ విద్యలో ఉన్నత స్థాయి ప్రమాణాలను సాధించేందుకు రకరకాల చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం చాలా ఏళు్లగా చెప్తూనే ఉంది. వాస్తవంగా జరుగుతున్నది మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. నిజం చెప్పాలంటే వృత్తి విద్యకు సంబంధించి ప్రభుత్వానికి ఒక విధానమన్నదే లేదు. ఇంజనీరింగ్‌, ఎంబిఏ, ఎంసిఏ, బిఇడి వంటి వృత్తివిద్యాకోర్సులకు సంబంధించి సంయుక్తంగా ఒక సమగ్ర విధానాన్ని అనుసరిస్తే ఇన్ని రకాల సమస్యలు వచ్చేవి కావు. కళాశాలల గుర్తింపు, రిజిస్ట్రేషన్‌, అడ్మిషన్లు, మైనారిటీ కాలేజీలు... ఇలా ఒక్కో అంశానికి ఒక్కో విధానాన్ని అనుసరిస్తూ పోవడం... ఒక్కో వృత్తి విద్యకు ఒక్కో విధానాన్ని అవలంబించడం లేని పోని గందరగోళానికి దారితీస్తోంది. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితిని చక్కదిద్దడానికి కొత్తగా చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న నియమాలను లొసుగులకు తావివ్వకుండా చక్కదిద్దితే చాలు. నియమాలను పటిష్ఠం చేస్తే యాజమాన్యాలకు ఇబ్బంది. అలాంటి ఇబ్బంది కలిగించే పనులను ప్రభుత్వం సహజంగానే చేయదు. పర్యవసానం ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ సమయంలో అయోమయం.. సీట్లను భర్తీ చేసే సరికే సగం విద్యాసంవత్సరం పూర్తయిపోతుంది. ఒకటికి రెండుసార్లు.. మూడు సార్లు కౌన్సిలింగ్‌ జరిగిన సందరా్భలు గతంలో కొల్లలు. గత సంవత్సరం కౌన్సిలింగ్‌ పూర్తయిన తరువాత ఓ కళాశాలకు అకస్మాత్తుగా మైనారిటీ హోదా కట్టబెట్టడం వల్ల విద్యార్థులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. విద్యార్థులను ఇంజనీర్లుగా తయారు చేయడం కోసం కాకుండా, వారికి ఇంజనీరింగ్‌ పట్టాలను అము్మకోవడం కోసమన్నట్లుగా కళాశాలల పనితీరు నడుస్తోంది. ఇలాంటి చదువులు చదివినా, చదవకపోయినా ఒకటే. ఇప్పటికైనా ప్రభుత్వం వృత్తివిద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే, రాను రాను రాష్ట్ర ఇంజనీర్లకు ఎక్కడా ఉపాధి దొరకని పరిస్థితి తలెత్తినా ఆశ్చర్యపోనవసరం లేదు.

11, ఫిబ్రవరి 2009, బుధవారం

మహిళల సాధికారత అంటే ఇదేనా?

`సమర్థులూ, నిర్భయులూ, అంకిత భావం కలవాళూ్ల ఒక వేయి మంది పురుషులతో భారత దేశ సమస్యల్ని సమర్థంగా జయించగలను.. అయితే ఇవే గుణాలున్న స్త్రీలు ఉన్నట్లయితే అందులో పదోవంతైనా చాలు.. అదే పనిని అంతకంటే త్వరగా, అంతకంటే శక్తిమంతంగా సాధించగలను..' సరిగ్గా శతాబ్దం క్రితం ప్రపంచానికి భారతీయ మార్గాన్ని నిర్దేశం చేసిన మహా పురుషుడు స్వామి వివేకానంద అన్న మాటలివి. మహిళా శక్తిని ఆనాడే ఇంత శక్తిమంతంగా అంచనా వేయగలిగిన వ్యక్తి మరొకరు లేరు. ఆనాటి ఆయన మాటలను ప్రపంచ మహిళ ఈనాడు నిజం చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా సరే తాను ఎవరికీ ఎంతమాత్రం తక్కువ సమానం కాదన్నది ఇప్పటికే దాదాపు అన్ని రంగాల్లోనూ నిరూపితమైంది. జాతి, భాష, సంస్కృతి, సంపద, రాజకీయాల హద్దులు ఆమెకు లేవు. ఏ ఎల్లలూ ఆమెను కట్టిపడేయలేవు. ఆమె ఇప్పుడు అబల కాదు. తన స్వేచ్ఛ, స్వాతంత్య్రాల గురించి స్పష్టమైన అవగాహన ఉన్న పరిపూర్ణ వ్యక్తి. తరాలు మారుతున్న కొద్దీ మహిళ వ్యక్తిత్వంలో అనేక మార్పులు. ఉరకలు వేసే ఉత్సాహం. పురుషుడి కంటే ఎన్నో రెట్లు వేగంగా ఇవాళ స్త్రీ పురోగమన దిశలో పరుగులు పెడ్తోంది. ఆర్థిక స్వాతంత్య్రమే కాదు.. అధికార వాసనలూ ఆమెకు తెలుసు. ఒక గ్రామ సర్పంచి పదవి నుంచి అగ్రరాజ్యానికి అధ్యక్ష స్థాయి వరకూ ఆమె ప్రస్థానాన్ని ఎవరు ఆపగలరు? అనేక సామాజిక, విజ్ఞాన సాంస్కృతిక రంగాల్లో ఇప్పటికే మహిళ అత్యున్నత స్థాయికి చేరుకుంది. కేవల గృహిణిగా కుటుంబాన్ని నడపడమే కాదు.. వ్యోమగామిగా రోదసిదాకా ప్రయాణించి రాగల శక్తిసంపన్నత తనకుందని నిరూపించుకున్నది. భారతీయ సంస్కృతి మహిళకు ఇచ్చిన గుర్తింపు `శక్తి స్వరూపిణి'. ఆ స్వరూపం ఇవాళ ప్రపంచమంతటా విశ్వరూపమై ఆవరించింది.
స్త్రీత్వం అన్నది ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో, ఒక జాతికో, ఒక దేశానికో పరిమితం కాదు. ఇది మానవతకూ, విశ్వజనీనతకూ సంబంధించినది. ఒక్క మాటలో చెప్పాలంటే, `మానవ జాతి మనుగడకీ ప్రాణం పోసింది మగువ.' ఎంత క్లాసికల్‌ భావన ఇది..! ప్రపంచంలో ఏదైనా అబద్ధం కావచ్చేమో కానీ, ఈ భావన మాత్రం సార్వకాలిక మైన నిజం. సమాజం ఎంత ఆధునికమైనా, ఎన్ని మార్పులు చేర్పులకు లోనైనా, ఎంతగా పురోగమించినా అన్నింటికీ ఆధారభూమికగా మహిళ నిలవకుండా సాధ్యం కాదన్నది నిజం. ప్రపంచంలో ఎక్కడైనా సరే మహిళకున్న ప్రత్యేక స్థానానికి ఇది ఓ చిన్న గుర్తింపు మాత్రమే. బాలికగా జన్మించినప్పటి నుంచీ, సోదరిగా, ఇల్లాలిగా ఒదిగినా, ఉద్యోగినిగా ఎదిగినా, నాయకురాలిగా సమాజాన్ని శాసించినా, తల్లిలా పరిపూర్ణతను సాధించేంత వరకూ అనేక రూపాలలో ఎదిగే వ్యక్తిత్వం ఆమెది. ఆమె ప్రకృతి.. ప్రకృతిలో ఎన్ని రకాల చైతన్యాలున్నాయో, ఎన్ని వైరుధ్యాలు కనిపిస్తాయో, అన్ని రకాల చైతన్యాలు.. వైరుధ్యాలు ఆమెలో కనిపిస్తాయి. ఏడాది పొడవునా సంభవించే ఆరు రుతువులు మహిళలోని ఆరు లక్షణాల సమన్వితం.
సమగ్ర మానవ సంస్కృతిని, నాగరికతల్ని నిర్మించే లక్ష్యాన్ని సాధించడానికి చేసే ప్రయత్నంలో స్త్రీ, పురుషులిద్దరిదీ సమాన భాగస్వామ్యం. ఒకరి ప్రయోజనాలను మరొకరు కాపాడుకుంటూ ముందుకు సాగితేనే గమ్యం సిద్ధిస్తుంది. కానీ, పాశ్చాత్య ప్రపంచం ఇందుకు విరుద్ధంగా నడిచింది. ప్రాపంచిక దృక్పథం స్త్రీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మారింది. ఈ దృక్పథాన్ని పురుషుడు ఆమోదించిన పర్యవసానం స్త్రీవాద ఉద్యమాలు. పాశ్చాత్య పోకడలను పుణికిపుచ్చుకున్న భారతదేశంలోనూ అదే ధోరణి ప్రబలడం ప్రాచీన కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నానికి దారి తీసింది. పురుషులతో సమానత్వాన్ని సాధించడానికి, ఆర్థిక స్వేచ్ఛ కోసం వీధుల్లోకి వచ్చి మహిళలు ఉద్యమించాల్సిన పరిస్థితులు దాపురించడం నిజంగా దురదృష్టమే. కానీ, ఈ ఉద్యమాలు విశ్వవ్యాప్తంగా మహిళల్లో నిద్రాణమైన చైతన్యాన్ని వెలుగులోకి తెచ్చిన శుభ సందర్భం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర సృష్టించిన సాధారణ మహిళ కథ ఈ మహిళా దినోత్సవం. సమాజంలో మగవాడితో సమానంగా అడుగులు కలిపి నడిచేందుకు జరిపిన పోరాటానికి తీపి గుర్తు ఈ రోజు. ఫ్రెంచ్‌ విప్లవం జరుగుతున్న రోజుల్లో యుద్ధాన్ని నివారించేందుకు గ్రీసు దేశంలో మహిళలు మగవారిపై సెక్సువల్‌ సమ్మెను ప్రకటించాల్సి వచ్చింది. మహిళలంతా ఏకమై యుద్ధం ఆపితే కానీ, పడగ్గది వైపు కూడా రానివ్వబోమని చేసిన హెచ్చరిక ప్రపంచంలో స్త్రీ ఉద్యమాలకు ఒక విధంగా నాంది. ఆ తరువాత కొన్నాళ్లకే పర్షియాలో మగువలు మగవారి అణచివేత విధానాలను ఆనాడే నిరసించారు. స్వేచ్ఛ, సమానత్వాలను డిమాండ్‌ చేస్తూ అప్పుడే తొలి ప్రదర్శన జరిగింది. ఈ ఉద్యమాలు, ఆందోళనలన్నీ ఏకపక్షంగా, ఎక్కడికక్కడ జరిగినవే. ఆయా దేశాలకు పరిమితం అయినవే. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ మహిళల పట్ల ఒకరకమైన వివక్ష కొనసాగుతున్నా విశ్వవ్యాప్తంగా ఒకవిధమైన చైతన్యం రావడానికి చాలా కాలమే పట్టింది. 20వ శతాబ్దంలో ఓ పక్క పారిశ్రామిక విప్లవం రావడం.., మరో పక్క జనాభా విస్ఫోటనం.., మహిళల పట్ల మరింత వివక్షకు దారి తీసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో కొద్దో గొప్పో మహిళల పరిస్థితి ఒకలా ఉంటే, వెనుకబడిన దేశాల్లో మరింత దారుణంగా మారింది. సంపన్న దేశాల్లో జాతి వివక్ష పెరిగి, విజాతీయులపై వేధింపులు అధికమయ్యాయి. ఆర్థికపరమైన అవసరాలు, సామాజిక ప్రయోజనాలు పురుషాధిక్యతను సహించరాని స్థితికి చేర్చాయి. ప్రతి చిన్న విషయానికీ తనపై ఆధారపడి ఉండేలా మహిళను పంజరంలో చిలుకగా మార్చడం వల్లనే ఉద్యమాలు విశ్వరూపం దాల్చాయి. అమెరికాలో జాత్యహంకారం నల్లజాతి మహిళల పరిస్థితిని దుర్భరం చేశాయి. ఆఫ్రికాలో మహిళ పరిస్థితి ఆదిమ కాలం నుంచి ఇవాళ్టికీ బయటపడలేదు. ఆసియా మహిళపైనా వివక్షే. ఇస్లామిక్‌ దేశాల్లో మహిళకు అన్నీ బంధనాలే.. ఆసియాలో, ఐరోపాలో, ఆస్ట్రేలియాలో నాగరిక సమాజాలని చెప్పుకున్న అన్ని సమాజాల్లోనూ మహిళల హక్కుల్ని కాలరాయడం వల్లనే వారి హక్కుల పరిరక్షణ ప్రత్యేక లక్ష్యంగా నిర్దేశించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు 1975లో ఐక్యరాజ్యసమితి ప్రత్యక్షంగా చొరవ తీసుకుని మార్చి ఎనిమిదో తేదీని అంతర్జాతీయ మహిళాదినోత్సవానికి గుర్తింపునివ్వడం ద్వారా విశ్వవ్యాప్తంగా మహిళను ఏకత్రితం చేసింది. అప్పట్నుంచి ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్ని ప్రపంచం అంతటా జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలలో చాలా దేశాలు ఈ రోజును జాతీయ సెలవుదినంగా కూడా ప్రకటించడం గమనార్హం.

ఇంతవరకూ బాగానే ఉంది. మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించడం అన్ని విధాలా స్వాగతించదగిందే. కానీ, ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు జరుగుతున్న మహిళా ఉద్యమాలు కానీ, స్త్రీవాద సాహిత్యం కానీ ఎంతమంది ప్రయోజనాలను కాపాడుతున్నాయి...? ఎందరు మహిళలకు సాధికారత సంపాదించి పెట్టగలిగాయి అన్న ప్రశ్నలకు జవాబు అసంపూర్ణమే. .నగరాల్లో, పట్టణాల్లో, ప్రపంచ రాజధానుల్లో జరుగుతున్న ఉద్యమాలు సంపన్న వర్గాల మహిళలు ఒక విధంగా తమ గుర్తింపు కోసం, పాపులారిటీ కోసం చేస్తున్నారనే ఆరోపణలు సత్యదూరం కావు. తమ ఆర్థిక, అధికార అవసరాలు, ప్రయోజనాల కోసం చేస్తున్నవే తప్ప, నిజంగా స్త్రీ వివక్షకు గురవుతున్న ప్రాంతాల్లో, ఈ మహిళా సంఘాలు కానీ, ఉద్యమకారులు చేపట్టిన కార్యక్రమాలను వేళ్లపైన లెక్కించవచ్చు. ఒకరిద్దరు మహిళలు అప్పుడప్పుడూ వెలుగులోకి వచ్చిన సందర్భాలు తప్ప ఈ దినోత్సవాల వల్ల కానీ, ప్రసంగ, ప్రచారాల వల్ల కానీ సాధించింది శూన్యం. ఆఫ్రికాలో 90 శాతం మంది మహిళలు నిరక్షరాస్యులుగానే ఉన్నారన్న నిజాన్ని ఇవాళ ఎవరు కాదనగలరు? ఎవరూ కనీసం వారికి అక్షరం ముక్క నేర్పేవారు లేకుండా పోయారు. ఇవాళ్టికీ ఆఫ్రికా దేశాల్లోని అనేక ప్రాంతాల్లో నూటికి తొంభై మంది మహిళలు నాగరిక సమాజానికి దూరంగానే అడవి జీవితాలను గడుపుతున్నారన్నది కఠిన వాస్తవం. చదువు వారికి దూరం కనీసం కాగితం అంటే ఏమిటో వారికి తెలియదు. ఒంటిపై అర్ధభాగం వరకూ ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా గడపడం వారికి సర్వసాధారణం. అడవే వారి ప్రపంచం. అదే జీవితం. ప్రపంచం ఎన్ని వేల కిలోమీటర్లు వాయు వేగంతో ప్రయాణిస్తున్నా, దాంతో వారికి నిమిత్తం లేదు. ఈ పరిస్థితి ఒక్క ఆఫ్రికాలోనే లేదు.. ప్రపంచంలోని అన్ని కొండ ప్రాంతాల్లోనూ ఉన్నది ఇదే పరిస్థితి. గిరిజన మహిళలకు ఇవాల్టికీ అటవీ ఉత్పత్తులే అమృత సమానాలు. వారిని ఉద్ధరించడం మాట దేవుడెరుగు... వారికి ఉన్న ఆ కాస్త ఆస్తిని కూడా దోచుకునే దొంగలే ఈ నాగరిక సమాజంలో ఉన్నారు. వారి సంక్షేమం గురించి ఈ మహిళా ఉద్యమకారులు చేస్తున్నదేమిటి? ఏడాదికోమారు హక్కులంటూ ప్రదర్శనలు చేయడం తప్ప..
ఇస్లామిక్‌ దేశాల్లో ముస్లిం మహిళల పరిస్థితిని ఐక్యరాజ్యసమితి కానీ, హక్కుల సంఘాలు కానీ ఏనాడైనా గమనించాయా? మొన్నమొన్నటి వరకూ అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు దశాబ్దకాలం పాటు మహిళను అత్యంత దారుణంగా అణచివేస్తే ఈ హక్కుల సంఘాలు కనీసం నిరసన అయినా చెప్పలేకపోయాయి. చదువు లేక, ఆపాదమస్తకం బురఖా ధరించి పురుషుడి సాయం లేకుండా బయటకు రాలేక, ఇంట్లో ఓ మూల కూర్చోలేక వాళు్ల పడిన వేదనలు అన్నీ ఇన్నీ కావు. అప్పుడంటే తాలిబన్లకు భయపడి ఉద్యమకారులు అక్కడ కాలుమోపలేకపోవచ్చు. ఇప్పుడు అఫ్గానిస్తాన్‌ అమెరికా స్వాధీనంలో ఉంది. అయినప్పటికీ అఫ్గాన్‌ ఆడపిల్లలను ఆదుకుని వృద్ధిలోకి తీసుకురావడానికి ప్రపంచ మహిళా సంఘాలు చేస్తున్న ప్రయత్నాలు నామమాత్రమే కదా! షరియత్‌ పేరుతో ముస్లిం మహిళపై మత ఛాందసవాదులు మోపుతున్న ఆంక్షలకు అడ్డుచెప్పేవారెవరు? ఇరాక్‌లోనూ అదే పరిస్థితి. వీళ్లను కాపాడటం ఐక్యరాజ్యసమితికి కానీ, అంతర్జాతీయ మహిళాసంఘాలకు కానీ లేదా?
కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉన్నంత కాలం స్త్రీపురుషుల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే స్త్రీ, పురుషులు ఒకరికొకరు తమకు పోటీలుగా భావించడం మొదలు పెట్టారో అప్పుడే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతూ వచ్చింది. పురుషుడు తప్పు చేశాడు కాబట్టి తాను తప్పు చేయడం కరెక్టనే వాదం విచ్చలవిడితనానికి దారి తీసింది. పురుషుడి విశృంఖలత్వాన్ని నియంత్రించే బదులు, మహిళ కూడా అదే మార్గంలో నడిచేందుకు చేసిన ప్రయత్నం స్వేచ్ఛా శృంగారం జడలు విప్పేందుకు దోహదపడింది. గే, లెస్బియనిజంలు పెరిగి చివరకు ఎయిడ్‌‌స వంటి ప్రాణాంతక వ్యాధుల విస్తరణకు కారణమయింది. ఏ లైంగిక స్వేచ్ఛ కోసమైతే అమెరికాలో ఒకప్పుడు ఉద్యమాలు చేశారో, ఆ ఉద్యమకారులే ప్రపంచంలోని విపరిణామాలను గుర్తెరిగారు. భారతీయ కుటుంబ వ్యవస్థ ఆధారంగా వివాహ వ్యవస్థకు పునాదులు వేస్తున్నారు.

భారత దేశంలో 20వ శతాబ్దానికి పూర్వం వరకూ ఎలాంటి స్త్రీవాద ఉద్యమం రాలేదు. భారతీయ దృక్పథం మొదట్నుంచీ కూడా పురుషుణ్ణి ఏ విధంగా చూసిందో, స్త్రీని కూడా అదే దృక్పథంతో చూసింది. సామాజిక మత రంగాల్లో పురుషునితో సమానమైన స్త్రీని ఋగ్వేదం చిత్రించింది. ఆచారాల నిర్వహణలోనూ, మంత్ర రచనలోనూ, క్లిష్టమైన యుద్ధ, పాలనా రంగాల్లో కూడా వేదకాలపు స్త్రీ పురుషుడి సహచారిణిగా, సహ భాగినిగా దర్శనమిస్తుంది. అందుకే ఆమెను శక్తిగా ఆరాధించారు. ఒకే దివ్యత్వానికి చెందిన రెండు సగాలుగా స్త్రీపురుషులను భారతీయ సంస్కృతి సంభావించింది. సహజ ప్రకృతి లింగభేదం లేకుండా, స్వచ్ఛమూ, సమగ్రమూ, స్వతంత్రమూ అయిన ఆత్మ సమన్వయం గురించి ఉపనిషత్తులు గుర్తించాయి. ఆనాడు పురుషుడితో సమానంగా మహిళకు సైతం ఉపనయనాది సంస్కారాలు జరిగాయని, వారు వేద విధులను నిర్వర్తించేవారన్న విషయాలు ఈరోజు ఎవరికైనా తెలుసా? అన్నింటికంటే ఇక్కడ కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ భారతీయ ఆలోచనావిధానానికి నిదర్శనం. ఆ తరువాత భారతీయ సంస్కృతిపై పాశ్చాత్య దాడులు ఇక్కడి సామరస్యాన్ని విచ్ఛిన్నం చేశాయి. క్రమంగా స్త్రీ పురుష వివక్ష సమాజంలో విషం చిమ్మింది. పురుషుడి సాచివేత ధోరణి స్త్రీల పట్ల దారుణమైన ప్రవర్తన ఉద్యమాలు, ఆందోళనలకు కారణభూతమయ్యాయి. హక్కుల పోరాటాలు ప్రారంభమయ్యాయంటే అందుకు కారణం నిస్సందేహంగా ఇక్కడి పురుషాధిక్యతేనని స్పష్టం. బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలు.. ఒక పక్క, పెళ్లిళ్ల పేరుతో వ్యాపారాలు స్త్రీని అన్ని విధాలా అణచివేసింది. ఇవాళ్టికీ మన దేశంలో కేవలం వరకట్న వేధింపులతో ఏడాదికి 25 వేల మంది పెళ్లికూతుళ్లను సజీవ దహనం చేస్తున్నారన్నది పచ్చినిజం. చదువుకున్న వాళు్ల, అత్యాధునిక నాగరికత ఉందని భ్రమించే అమెరికాలో ఉండి జీవితాల్ని వెలగబెడ్తున్న వాళు్ల సైతం ఆడవాళ్లను వరకట్న వేధింపులకు పాల్పడటం పైశాచికం. ఒకనాడు పురుషుడితో అన్ని విధాలా సమాన స్థాయిలో ఉన్న మహిళను రాను రాను విద్యకు దూరం చేశారు. వేదాలను వినవద్దన్నారు. ఇంటికి పరిమితం చేసి వంటింటి పంజరంలో బంధించారు. ఇదే సమయంలో ఇక్కడికి వచ్చిన పాశ్చాత్యపు వలసవాద సంస్కృతి, విదేశాల్లో వచ్చిన ఉద్యమాలు ఇక్కడి మహిళల్లో చైతన్యాన్ని తీసుకువచ్చాయనడంలో సందేహం లేదు. అయితే ఈ చైతన్యం వారిలో సాధికారతను సాధించే దిశలో ఎంత తోడ్పడిందో, పెడమార్గం పట్టడానికీ కొంతవరకు కారణమయింది. ప్రాచీన భారతీయ సంస్కృతికి, సనాతనమైన స్త్రీత్వానికి విపరీతార్థాలు ఆపాదించి, అసలు స్త్రీకి ఏనాడూ భారతదేశం పూచికపుల్లంత విలువైనా ఇవ్వలేదన్న అపార్థాలకు ఇక్కడ వచ్చిన ఉద్యమాలు ప్రచారాన్ని కల్పించాయి. శృంగారం శృతి తప్పింది. ఒక పక్క పాశ్చాత్య దేశాలు లైంగిక స్వేచ్ఛకు పరిమితులు కల్పించుకుని, కుటుంబ వ్యవస్థను కోరుకుంటుంటే, భారత్‌లో మాత్రం ఏ చిన్న సమస్యనైనా భూతద్దంల్లోంచి చూసి విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. కురచ చొక్కాలు ధరించి అర్ధనగ్నంగా కనిపించడం సభ్యత కాదంటే విడాకులు.. అకలి లేదన్నా బలవంతంగా తినమన్నారంటూ విడాకుల పత్రం దాఖలు.. ఇంతకన్నా హాస్యాస్పదమైన ధోరణి మరేదైనా ఉంటుందా? స్త్రీ జనోద్ధరణకోసమే తమ జీవితాల్ని అంకితం చేశామని చెప్పుకునే వాళ్లే లెస్బియనిజాన్ని ప్రోత్సహించే దుస్థితి ఇక్కడ ప్రబలింది. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పించాలని ఉద్యమించడంలో తప్పు లేదు. కానీ, నిజంగా చట్టసభల్లో ప్రవేశించినవాళ్లలో ఎంతమంది స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు? ఉద్యమకారులే కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశంలో స్త్రీవాద ఉద్యమానికి పురుషద్వేషం ఒక్కటే ప్రాతిపదిక. ఈ రకమైన ధోరణి సమాజంలో అసంతులనానికి దారి తీసింది. ప్రధాన, అప్రధాన భేదం లేకుండా స్త్రీ తన హక్కుల కోసం పోరాడాల్సిందే. కానీ, ఈ ప్రపంచంలో స్త్రీ, పురుషులు హక్కులు, బాధ్యతలను పంచుకుని వారి మధ్య సామరస్య పూరిత సంబంధాన్ని బాధించుకోకుండా తగిన సర్దుబాట్లు చేసుకున్నప్పుడే దాన్నుండి ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుంది.


అంతర్జాతీయ మహిళా దినోత్సవం... క్రోనోలాజీ...
1909..
అమెరికాలోని సోషలిస్టు పార్టీ పిలుపు మేరకు మొట్టమొదటి జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 28వ తేదీన అమెరికాలో జరిగింది. 1913 వరకు పిబ్రవరి చివరి ఆదివారం నాడు వారు ఈ దినోత్సవాన్ని క్రమం తప్పకుండా జరుపుకున్నారు.
1910...
కోపెన్‌ హెగెన్‌లో సోషలిస్‌‌ట ఇంటర్నేషనల్‌ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్పానించింది. విశ్వవ్యాప్తంగా అణచివేతకు గురవుతున్న మహిళల హక్కుల కోసం పోరాడాలని తీర్మానించారు. పదిహేడు దేశాల నుంచి వచ్చిన వంద మంది మహిళలు ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కానీ, ఏ రోజున అంతర్జాతీయ మహిళా దినాన్ని జరుపుకోవాలన్నది నిర్ణయించనే లేదు.
1911...
కోపెన్‌ హెగెన్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆస్ట్రియాలో మొట్టమొదటి సారిగా మార్చి 19వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. డెన్మార్‌‌క, జర్మనీ, స్విట్జర్లాండ్‌ తదితర దేశాల్లో దాదాపు పది లక్షల మంది స్త్రీ, పురుషులు ప్రదర్శనల్లో పాల్గొన్నారు. వోటు హక్కు, ప్రభుత్వ ఉద్యోగాలు, పని చేసే హక్కు, ఉద్యోగాల్లో వివక్ష తొలగింపు వంటి డిమాండ్లను ఈ సందర్భంగా చేశారు.
ఆ తరువాత వారం రోజుల లోపే అంటే మార్చి 25న న్యూయార్‌‌క నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 140 మంది వర్కింగ్‌ గర్‌‌ల్స దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఇటాలియన్లు, యూదులే. ఈ దుర్ఘటన అమెరికా కార్మిక చట్టంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. కార్మికులకు సురక్షితమైన పనిచేసే పరిస్థితులు కల్పించడంపై చట్టం చేసింది.
1913-14
మొదటి ప్రపంచ యుద్ధాన్ని పురస్కరించుకుని రష్యా మహిళలు మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1913 ఫిబ్రవరి చివరి ఆదివారం నాడు జరుపుకున్నారు. ఆ తరువాతి సంవత్సరంలో ఐరోపా దేశాలు మార్చి ఎనిమిదో తేదీన ఈ దినోత్సవాన్ని పాటించాయి.
1917..
యుద్ధంలో దాదాపు 20 లక్షల మంది రష్యన్‌ సైనికులు మరణించడంతో అక్కడి మహిళలు మరోసారి ఫిబ్రవరి చివరి ఆదివారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. యుద్ధాన్ని వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు.
ఆ తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి విశ్వవ్యాప్తంగా కొత్త గుర్తింపు వచ్చింది. 1975లో ఐక్యరాజ్యసమితి ఈ కార్యక్రమాన్ని తానుగా చేపట్టింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

భారత దేశంలో 1971 నుంచి మహిళల సంరక్షణపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. 1971లో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక కమిటీని నియమించింది. 1980వ దశకంలో అభివృద్ధి ప్రణాళికలో మహిళలను ప్రత్యేక లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం ప్రత్యేక చాప్టర్‌ను చేర్చారు. ఆరో పంచవర్ష ప్రణాళికలో మహిళా అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. ఎనిమిదో ప్రణాళిక నాటికి మహిళలకు ఉపాధి, ఆర్థిక స్వాతంత్య్రం, విద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం వంటి కార్యకలాపాలతో పాటు సాధికారత కూడా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
1996 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మహిళల జనాభా 450 మిలియన్లు ఉంది. అంటే దాదాపు దేశ జనాభాలో 49 శాతం అన్నమాట.
1985లో మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలో స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినప్పటి నుంచి దేశంలో మహిళా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చెందాయి. అప్పటి నుంచి వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. 1992లో జాతీయ మహిళా కమిషన్‌ ఏర్పడింది. ప్రస్తుతం సీనియర్‌ కాంగ్రెస్‌ నేత గిరిజావ్యాస్‌ దీనికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.

సాధికారత కోసమేనా రిజర్వేషన్లు..?
చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కావాలని చాలా కాలంగా మన దేశంలో ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి రాజకీయ పార్టీలు పైకి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, లోపాయికారిగా ఎంతగా అడ్డుకుంటున్నదీ జగద్విదితం. పార్లమెంటు సమావేశమైన ప్రతిసారీ మహిళా రిజర్వేషన్‌ బిల్లు గురించి కాసింత రభస జరగడం ఆ తరువాత మర్చి పోవడం రివాజుగా మారింది. మన రాష్ట్రంలోనైతే పంచాయితీల్లో ఇప్పటికే 33 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. అయితే ఈ సాధికారతను ఎంతవరకు మహిళలు స్వతంత్రంగా అనుభవిస్తున్నారంటే ప్రశ్నార్థకమే. నిజంగా సర్పంచ్‌లుగా ఎన్నికైన వారిలో ఎంతమంది భర్త ప్రమేయం లేకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు? చాలా చోట్ల భర్తల పెత్తనమే నడుస్తున్నదన్నదన్నది కఠిన సత్యం. అందాకా ఎందుకు అరున్నరేళు్లగా బీహార్‌లో ఉన్న మహిళా ముఖ్యమంత్రి రాబ్రీదేవిపై పెత్తనం లాలూది కాదా? ఈరకమైన సాధికారతనేనా మహిళలు కోరుకుంటున్నది?

విశ్వసుందరి అయినా అంగడి బొమ్మే!
ప్రపంచ వ్యాప్తంగా విశ్వసుందరి పోటీలు జరుగుతున్నాయి. ఆడదాన్ని విశ్వసుందరిగా కొనియాడటం వెనుక ఉన్న వ్యాపార ధోరణి ఎంతటి దారుణమైందో తెలియంది కాదు. కాస్మొటిక్‌ సామ్రాజ్యానికి ఏ మార్కెట్‌పై దృష్టి ఉంటే, ఆ దేశానికి చెందిన సుందరి విశ్వసుందరి కావడం నిజం. గతంలో భారత్‌కు వరుసగా నాలుగేళ్ల పాటు దక్కిన గౌరవం ఈ కాస్మొటిక్‌ మార్కెట్‌ విస్తరణ కోసమేనని నిర్వివాదం. వెరసి ఆడదానికి ఎలాంటి గౌరవాన్ని పురుషుడు ఇస్తున్నా, ఎంత గొప్పగా కీర్తిస్తున్నా, ఇప్పటికీ మహిళను ఆటబొమ్మగా చూస్తున్నాడనడానికి ఈ పోటీలు ఓ నిదర్శనం కాదా!

క్రెడిట్ కార్డు కష్టాలు

క్రెడిట్‌ కార్డు ఒకసారి తీసుకున్నారంటే దాని వల్ల కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కస్టమర్లతో తెలివిగా మాట్లాడి ఊబిలోకి దించడంలో బ్యాంకు ఏజెంట్ల సమర్థతకు సాటి లేదు. ఆ తరువాత కష్టాలన్నీ మొదలయ్యేది. అడక్కుండానే కార్డు జారీ చేసేయడం, టెలిఫోన్‌ ద్వారా కస్టమర్లను ఇబ్బందులకు గురి చేయడం దారుణం. వినియోగదారులకు ప్రధానంగా బ్యాంకు నుంచి ఎదురయ్యే సమస్య నెలవారీ బిల్లులేనని స్పష్టం. బ్యాంకులు కానీ, బ్యాకింగేతర కార్యకలాపాలు నిర్వహించే ఆర్థిక సంస్థలు(ఎన్‌బిఎఫ్‌సి) కానీ వడ్డీ రేటును వార్షిక పద్ధతిన మాత్రమే విధించాలన్నది చట్టం స్పష్టంగా చెప్తోంది. కానీ క్రెడిట్‌ కార్డులు జారీ చేసే కంపెనీలు 2.99 శాతం వడ్డీ రేటును నెలవారీ పద్ధతిన అత్యంత దారుణంగా వసూలు చేస్తున్నాయి. ఎన్‌బిఎఫ్‌సి ప్రకారం వార్షిక పద్ధతిన లెక్కిస్తే ఈ వడ్డీ రేటు సుమారు 35 శాతం ఉండటం నిష్ఠురసత్యం. వడ్డీ రేటుకు మరో 12 శాతం సర్వీసు చార్జీగా వసూలు చేయడం గోరు చుట్టుపై రోకటి పోటు లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రెడిట్‌ కార్డు కంపెనీలు, బ్యాంకులు లైసెన్‌‌సడ్‌ దోపిడి దొంగల్లా వ్యవహరిస్తున్నాయనడం అతిశయోక్తి కాదు. ఈ వడ్డీ రేటు వ్యవహారంలో మరో మోసమూ దాగుంది. వినియోగదారులు చేసిన ప్రతి కొనుగోలు పైనా 50 రోజుల దాకా వడ్డీ ఉండదని బ్యాంకులు చెప్పేదంతా కూడా పచ్చి బూటకం. స్టేట్‌మెంట్‌ తయారు చేసే నాటికి ఉన్న కొనుగోళ్లన్నింటికీ కలిపి వడ్డీని నిర్ణయిస్తారు. ఉదాహరణకు వినియోగదారుడి బిల్లు డేటు పదిహేను అయితే, పధ్నాలుగో తేదీన చేసిన కొనుగోలు కూడా స్టేట్‌మెంట్‌లో కలిసి చెల్లించాల్సిన మొత్తంపై వడ్డీ లెక్కగడతారు. అంటే 50 రోజుల దాకా వడ్డీ ఉండదన్న క్రెడిట్‌ కార్డు సంస్థ వారి తాయిలం, ఆ కొనుగోలుకు వర్తించదన్నమాట. ఇలాంటి చిత్రవిచిత్ర లీలలను దృష్టిలో ఉంచుకునే క్రెడిట్‌ కార్డు సంస్థలు తమ వార్షిక పర్సంటేజీలు, జమాఖర్చుల వ్యవహారంలో మరింత పారదర్శకత ప్రదర్శించాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది.
కార్డులు జారీ చేసే ముందు తీయగా మాట్లాడే బ్యాంకు ఏజెంట్ల విశ్వరూపం బకాయిల వసూలు దగ్గర కానీ బయటపడదు. అడక్కుండానే బలవంతంగా అప్పుల్ని అంటగట్టే బ్యాంకులు ఆ తరువాత బకాయిలను వసూలు చేయడానికి అనేక వేధింపులకు పాల్పడటం అమానుషం. కొన్ని బహుళ జాతి సంస్థలైతే ఏకంగా ఏజెంట్ల పేరుతో ప్రైవేటు సైన్యానే్న నిర్వహిస్తుండటం నిజం. బకాయిల వసూలుకు వినియోగదారులు ఎక్కడ ఉంటే అక్కడికి చొరబడి అప్పు తీర్చే దాకా నక్షత్రకుడిలా వెంటబడటం భరించరాని స్థాయికి చేరుకున్నాయనడానికి దేశంలోని బాంబే హైకోర్టులో నమోదైన కేసులు ప్రత్యక్ష తారా్కణం. వ్యక్తిగత స్వేచ్ఛ అన్నది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. దాన్ని హరించే అధికారం ఎవరికీ లేదు. కానీ, క్రెడిట్‌ కార్డు సంస్థలు మాత్రం నిర్నిరోధంగా ఈ హక్కును హరిస్తున్నాయి. ఒక విధంగా ప్రయివేటు వడ్డీ వ్యాపారులకంటే హేయంగా ఈ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. దేశంలోని అనేక చోట్ల ఏజెంట్లు రౌడీలను, గూండాలను కూడా పెంచి పోషిస్తున్నారంటేనే పరిస్థితి ఏమిటన్నది తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. వీరి కారణంగా కస్టమర్లు శారీరకంగా దాడులను కూడా ఎదుర్కొంటున్న సందరా్భలున్నాయి. ఇలాంటి వేధింపులను అరికట్టాలని కస్టమర్ల డిమాండ్‌ ఇంతకాలానికి రిజర్వుబ్యాంకు దృష్టికి రావడం మంచి సంకేతం. ఈ అంశంపై రిజర్వు బ్యాంకు తీవ్రంగానే స్పందించింది. కస్టమర్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని రిజర్వుబ్యాంకు తన మార్గదర్శక సూత్రాల్లో ఖచ్చితంగా పేర్కొనడం క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు పూర్తిగా కాకున్నా, కొంతైనా ఊరట కలుగుతుంది. కనీసం నెలవారీ స్టేట్‌మెంట్లయినా సరిగ్గా సమయానికి అందుతాయా అంటే అదీ లేదు. గడువు తేదీ వరకూ స్టేట్‌మెంట్లు వినియోగదారుడి చేతికి అందని సందరా్భలు కోకొల్లలు. సమయానికి స్టేట్‌మెంట్‌ పంపకుండా, గడువులోగా చెల్లింపు జరగలేదని పెనాల్టీని వేసి వినియోగదారుల ముక్కుపిండి వసూలు చేసే విధానానికి కూడా స్వస్తి పలకాలని ఆర్బీఐ ఆదేశాలు ఎంతవరకు అమలవుతాయో వేచి చూడాలి. క్రెడిట్‌ కార్డు సంస్థల ఆగడాల్లో అన్నింటికీ మించింది అడక్కుండానే కార్డు ఇవ్వడం... వినియోగదారుడి అనుమతి లేకుండానే కార్డును ఆక్టివేట్‌ చేసి నెల కాగానే బిల్లు పంపించడం... ఇటువంటి చర్యల ద్వారా బలవంతంగా జనాల్ని రొంపిలోకి దింపుతున్నాయి. ఇలాంటి చర్యలు ఇక ముందు చేయడానికి వీల్లేదని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. వినియోగదారుడి అనుమతి లేకుండా అతనికి బిల్లు పంపించి బలవంతంగా వసూలు చేసినట్లయితే, సదరు సంస్థ అంతకు రెట్టింపు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమం వల్ల వినియోగదారులకు ఈ ఫోన్ల బెడద కాస్తంతైనా తప్పుతుంది. ఆర్‌బిఐ జారీ చేసిన ఈ మార్గదర్శక సూత్రాలతో క్రెడిట్‌* కష్టాలు పూర్తిగా తీరుతాయనుకుంటే అంతకంటే పొరపాటు ఉండదు. ఈ ఆదేశాలు కేవలం ఉపశమనం కలిగించేవి మాత్రమే. అవసరమున్నా లేకుండా స్టేటస్‌ కోసం క్రెడిట్‌ కార్డు తీసుకుని, అనవసర ఖర్చులు చేసి అంతులేని ఆర్థిక చిక్కుల్లో చిక్కుకోకుండా తన్ను తాను కాపాడుకోవలసింది అంతిమంగా వినియోగదారుడేనన్నది కఠిన సత్యం.

9, ఫిబ్రవరి 2009, సోమవారం

ధార్మిక వివ్లవ జ్యోతి ఆర్య సమాజం

దయానంద ధార్మిక వివ్లవ జ్యోతిగా ఆరంభ`మైన ఆర్యసవజ జ్యోతులు ఆనాడు దక్కను కనుమలు దాటి హైదరాబాద్‌ రాజ్యంలో అనేక మలువులు తిరిగాయి. అన్య ధర్మీయుల అధార్మిక పాలనలో సతమతమవుతున్న అధిక సంఖ్యాక జనత హితం కోసం సంస్థానంలో ఆర్యసవజ వతాక మహోజ్జ్వలంగా ఎగిసింది. కలలోనైనా నిజాం వ్రభ`ువును ధిక్కరించేందుకు సాహసించని సావన్య వనవుల్లో అసావన్య సాహసాన్ని నింవి సత్యాగ్రహ క్రతువును నిర్వహించిన వేదిక ఆర్యసవజం. సంస్థాన ఆర్యసవజం బవళి మకుట వద్మం. ఇందులో కార్యకర్తలే రాజకీయ దురంధరులƒ్యిరు. ఆర్య సవజంలో ఉగ్గుపాలు తాగిన వారే నిజాం వ్యతిరేక తిరుగుబాటుకు వూ్యహకర్తలƒ్యిరు. ఆ కార్యకర్తలే శ్రీకృష్ణ జన్మస్థానాన్ని వెనుకడుగు వేయకుండా ధీరోదాత్తంగా స్వీకరించారు. సర్కారును వల్లెత్తు వట అనడానికి ధైర్యం చేయలేని స్వరాలు ఉన్న కాలం అది. ఆ వాతావరణంలో వ్రజల్లో ధైర్యాన్ని, సాహసాన్ని మతంతో రంగరించి పోసిన వీర వివ్లవ సంస్థ ఆర్యసవజం. హైదరాబాద్‌ సంస్థాన సీమలో ఆర్యసవజ సంకల్పానికి స్పందిస్త వేలాది వ్రజలు జైలుకెళ్లటం ఇక్కడి చరిత్రవుటల్లో చందనవు కాగితం.
కృణ్వంతో విశ్వవర్యమ్‌ అన్నది ఆర్యసవజ ఉద్యమ వ్రధాన లక్ష్యం. 1910 నుంచి 1947లో స్వాతంత్య్రం వచ్చేంత వరకు హైదరాబాదు సంస్థానంలో చైతన్య విద్యుత్తు కేంద్రంగా ఆర్యసవజం నిలిచింది. బొలారం, సుల్తాన్‌బజార్‌, కిషన్‌గంజ్‌, లాల్‌ దర్వాజలలో వ్రధాన కార్యాల…లను ఏర్పాటు చేసుకుని సంస్థానంలోని అన్ని జిల్లాలలో జాతీెద్యవన్ని ఉద్ధృతం చేసిన చరిత్ర ఆర్యసవజానిది. వాస్తవానికి రాజకీ…లతో సంబంధం లేని ఒకానొక మత సంస్థ ఈ విధంగా పాలక వర్గంెవ తిరుగుబాటు చేసి, బానిసత్వ శృంఖలాలు తెంచటంలో కీలక భ`మిక నిర్వహించటం ఒకింత ఆశ్చర్యం కొలిేవ అంశమే. అయితే ఈ మతమే సంస్థాన స్వాతంత్య్ర సమరంలో ఆర్యసవజోద్యవనికి వునాది అయింది.
నిజాం వరిపాలనలో హింద సవజానికి, ధర్మానికి తీరని వని కలిగిన కాలం అది. నిజాం రాజుకు, ఆతని అనుచర ముష్కర గణానికి మతోన్మాదమే తవ్ప మతం లేదు. మతం ేవరుతో ఈ ముష్కరులు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు. సంస్థానాన్ని ముస్లిం సేవట్‌గా వర్చటానికి కుతుబ్‌`ాల కాలం నాటి నుంచీ వ్రయత్నాలు జరుగుతనే ఉన్నాయి. హస్తినలో మొవులులు అనుసరించిన వూ్యవన్నే హైదరాబాద్‌ సంస్థానాన్ని ఏలిన ముస్లిం రాజుల అనుసరిస్త వచ్చారు. సామదాన భేద దండోపా…లన్నీ వ్రెగించి బలవంతవు మతవర్పిళ్లకు ఒత్తిడి చేసేవారు. మొదట్లో సంస్థానంలో హిందువుల జనాభా 99 శాతం ఉండేది. ఆ తరువాత మహబబ్‌ అలీఖాన్‌ కాలం నాటికి వది శాతం తగ్గిపోయింది. ఇక ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఈ విషయంలో తన తాత ముత్తాతల కంటే ఎనిమిది ఆకులు ఎక్కువే చదివాడు. ఇతని దగ్గర వనిచేసే మున్సబ్‌లు, జాగీర్దార్లు, మఖ్తేదార్లు, దేశ్‌ముఖ్‌లు, దేశాయిలు అంతా కనీవినీ ఎరుగని నిజాం విధేయతను కనవరిచేవారు. వీరు హిందువులైనా, ముస్లింలు అయినా అదే వరిస్థితి. సంస్థానంలో జరుగుతున్న అన్యా…లను వటివంచుకునే వాడే లేడు. వీళ్లందరికీ నిజాం వ్రభ`ుత్వంలో అందలము, రాజుగారు ఇచ్చే నజరానాలే ముఖ్యం. సంవ్రదా…లు, సంస్కృతి, ఆచారాలెవ అవ్రతిహత వ్రతిబంధకాలు ఉండేవి.. కనీసం ఉత్సవాలు కూడా జరువుకోవటానికి వీల్లేదు. వ్రభ`ుత్వ పారవ్టశాలల్లో ముస్లిం విల్లలతో హింద విల్లలకు కూడా ఖురాన్‌ సక్తులు, మత విశ్వాసాలను నేర్పిస్త, అవగాహన కల్పించేవారు.(ఇవాళ మిషనరీ స్కళు్ల చేసు్తన్న వనీ అదే.). ఒక్క వటలో చెప్పాలంటే నిజాం రాజ్యంలోని హిందువులు ఒక దశలో తాము హింద ధర్ములమనే విష…న్నే మరచిపో…రు. విచిత్రమేమంటే, మొహర్రం వండుగ వస్తే.. ఆ వండుగ నుంచి నలభై రోజుల పాటు హిందువులు సంస్థానంలో ఏ ఒక్క వండుగను కానీ, శుభ`కార్యాన్ని కానీ చేసుకోరాదన్న ఆంక్ష ఉండేది.
``బంద్‌ నాకూన్‌ వళివా సున్కే నారాయే తక్బీర్‌ జల్‌జలా ఆహీగ… రిశ్తయే జున్నార్‌ వర్‌''(అల్లాహో అక్బర్‌ నినాదంతో శంఖనాదాలు స్తంభించిపో…యి. సిఖా సత్రధారులెవ వ్రళయం వచ్చివడింది. )
ఈ వరిణామం రానురాన మరింత వ్రవదకరంగా వరింది. సంస్థానంలో హిందువులు ఉండటమే గగనంగా వరిపోయింది. జవయితే ఇత్తెవదుల్‌ ముసల్మీన్‌ సంస్థ రెచ్చిపోయింది. బహద్దర్‌ …ర్జంగ్‌ నేతృత్వంలో నిజాం బంటులు ఇ`ావరాజ్యంగా గ్రావలమీద వడ్డారు.. వేలాది వ్రజలను `నౌ ముస్లిం'లుగా(కొత్తగా ఇస్లాం మతాన్ని వుచ్చుకున్నవారు) వర్చారు. గమ్మత్తేమిటంటే ముస్లింలుగా వర్చిన హిందువులను వూర్తిగా తమలో కలువుకున్నారా అంటే అదీ లేదు. నౌముస్లింలు అంట కొత్త ేవరుతో సరికొత్త కులాన్ని త…రు చేశారు. 
``అక్కడెవరో వదిగదాన్ని ఎత్కపోయిండ్రంట''
``వదిగోన్ని తుర్కోన్ని చేసిండ్రంట''
``చాకలిదాన్ని పాడు చేసిండ్రంట''
`` ఆ ఇంట విధవని తుర్కోడు ఎత్కపోయిండట'' ఇలా ఎవరికి వారు గుసగుసలుగా వట్లాడుకోవటమే తవ్ప ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు. 
వటవణాల్లో సుకువరమైన వూల దుకాణాలు, గాజుల దుకాణాల ముసుగులో జరిగే దారుణాలను బతుకుమీద ఆశ ఉన్న వాడెవ్వడ వటివంచుకునే సాహసం చేయడు. ఇక వల్లె బతుకులు సవ్త నరకాలతో సవనమైనవి. అన్నింటికీ మించి భ`స్వామ్య వ్యవస్థ వల్లె జీవనాన్ని ఛిన్నాభిన్నం చేసింది. జంతువులు కూడా అంత హీనంగా బతకలేదంటే ఆశ్చర్యం కాదు.. వల్లెల్లో భ`స్వామ్య వ్యవస్థే ఒక ెవద్ద కుట్ర. దీని వల్ల వల్లె సీమల్లో వ్రజల్లో అభివనం, విశ్వాసాలు చచ్చిపో…యి. జాతి జీవచ్ఛవంలా వరిపోయింది. ఇంతటి వివత్కర సమయంలో ఆర్యసవజం హైదరాబాద్‌ సంస్థానంలోని వ్రజలకు అమృతోవశమనాన్ని కలిగించేందుకు వూనుకుంది. మహర్షి ద…నందులు `సత్యార్థ వ్రకాశిక' గ్రంథం ద్వారా చైతన్యస్రవంతిని వ్రవహింవజేశారు.
ఆర్యసవజం మొదట 1891లో సంస్థానంలోని బీడ్‌ జిల్లా ధారల్‌లో ఏర్పాటైంది. వండిత భ`గవత్‌ స్వరవ్‌ గోకుల్‌ వ్రసాద్‌ ఈ సవజ స్థావనకు తొలుత కృషి చేసిన వారు. ఆ తరువాత సంవత్సరానికి స్వామిగిరానంద సరస్వతి గారు హైదరాబాద్‌ వచ్చారు. అనర్గళమైన తన ఉవన్యాసాల ద్వారా వ్రజల్లో భావచైతన్యం కలిగించటానికి స్వామి గిరానంద చేసిన కృషి అపారం. ముఖ్యంగా వ్రజల్లో వ్రగతిశీల భావాలను రగల్చటానికి ఆర్యసవజం ఒక వేదికగా వరింది. ఉద్యవల నిర్మాణానికి, వ్రజలను సమీకరించటానికి ఆర్యసవజం ఒక వ్రబలమైన ఉవకరణంగా వరిపోయింది. ఎందరెందరో నాయకులు ఆర్యసవజం ద్వారా హిందువులందరినీ సంవుటితం చేసేందుకు నడుం బిగించారు. బన్సీలాల్‌, శ్యామ్‌లాల్‌, దత్తాత్రేయ వ్రసాద్‌, వినాయకరావు, విద్యాలంకార్‌ చంద్రపాల్‌, శంకర్‌రెడ్డి, వండిత గణవతిరావు, ఆదివూడి సోమనాథరావు, శ్యామలరావు, బాజీ కిషన్‌రావు, బాలరాజు వాసుదేవ మొదలి…ర్‌, సిద్దోజు రామస్వామి, గురుమూర్తి, అన్నం రామలింగం ఒకరా ఇద్దరా.. అసంఖ్యాకంగా నాయకులు ఆర్య సంస్కారాన్ని వ్రచారం చేయటంలో రేయింబవళు్ల శ్రమించారు. ఒక వక్క కుల రహిత సవజ స్థావనకు కృషి చేస్తనే, రాజకీయ స్వాతంత్య్రం కోసం,మత స్వాతంత్య్రం కోసం ఆర్యసవజికులు సలివిన ఉద్యమం అసాధారణమైంది. అంతే కాదు...నిజాం రక్కసి కోరల్లో అభాగ్యులెందరో చిక్కుకుపోవటానికి బలమైన కారణాల్లో భ`స్వామ్య వ్యవస్థ కూడా ఒకటని ముందుగా గుర్తించింది ఆర్యసవజమే. ఈ వ్యవస్థను ముందుగా వ్యతిరేకించిందీ ఆర్యసవజమే. భ`స్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సంస్థానమంతటా ఉద్యవన్ని అన్ని వైవుల నుంచి నిర్మించుకుంట వచ్చింది.
1930 నాటికి రాష్ట్ర మంతటా ఆర్యసవజం బలంగా విస్తరించింది. హైదరాబాద్‌లో వండిత నరేంద్ర నాయకత్వంలో బి.వెంకటస్వామి, ఎస్‌. వెంకటస్వామి, శంకర్‌రెడ్డి వ్రచారం చేస్తే, వరంగల్లులో వ్రజాకవి కాళోజీ నారాయణరావు, గంగు సత్యనారాయణలు ఆర్యసవజ విస్తృతిలో భాగం వంచుకున్నారు. ఆర్యసవజం బలవడటం నిజాం రాజుకు మింగుడువడని అంశం. రోజురోజుకూ హిందువులు సంవుటితం కావటం అంతకన్నా నచ్చని వ్యవవరం. అందుకే ఆర్యసవజంెవ ఉక్కుపాదం వెవింది. ముందుగా సవజ వత్రిక సత్యార్థ వ్రకాశికతో పాటు ఇతర సాహిత్యాన్ని నిజాం భ`ృత్యులు జవు్త చేశారు. సవజ కార్యకర్తలెవ అణచివేత కార్యక్రవలకు వూనుకున్నారు ఆంక్షలు విధించారు. సాహిత్యాన్ని నిషేధించారు.
నల్గొండ జిల్లాలోని భ`ువనగిరికి చెందిన ఉత్పల వెంకటరావు రాసిన ``ధర్మగీత''ను నిజాం సర్కారు కర్కశంగా నిషేధించింది. నిజాం పాలనలో తన సోదరులు నికృషవమైన బతుకు ఈడుసు్తన్నారు. దొరల ఆగడాలు మితిమీరిపో…యి. ముస్లిం మతాధికారం ముందు తెలుగు భాష, సంస్కృతికి సరైన స్థానం లేకుండా పోవటాన్ని సహించలేక ఆర్యసవజ ్రేవరణతో ధర్మగీత గ్రంథం రాశారు. ఇందులో 39 పాటలున్నాయి. ఈ పాటల్ని ఆర్యసవజం భ`జన మండల్లో వడినా అంతర్గతంగా నైజాం వ్యతిరేకత స్పషవంగా వినివిసు్తది. ``ధనములన్నియు వ్యర్థమే... ఈ బటకవు దొరతనములన్నియు వ్యర్థమే.. తన సహోదరులాత్మగౌరవమనునదే లేకుండా క్రూరత!నణచబడుట యెరింగియెటివ సవయమొనరించుటకు బనని'' ెవద్దలను ఈ పాటల్లో హెచ్చరిస్తారు. నిజాం నవాబు మన్ననలను అందుకునే జాగీర్దారులను, జమీందారులను కూడా ఆయన ఈ పాటల్లో అన్యావదేశంగా హెచ్చరించటం ఉత్పల వెంకటరావు చేసిన దుస్సాహసం. మహమ్మదీయ రాజుకు వ్యతిరేకంగా ఆర్యసవజం కార్యక్రవలను చేవటవడమే కాకుండా గే…లతో ఓ సంకలనం వెలువరించటం తటువకోలేక ``ధర్మగీత''ను నిజాం నిషేధించాడు. 1949దాకా ఈ నిషేధం కొనసాగింది. 
ఇలాంటి దారుణమైన వరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంట, ఉద్యవన్ని మరింత బలంగా ముందుకు తీసుకుపోవటానికి ఆర్యవ్రతినిధి సభ` `ఆర్య రక్షా సమితి'ని ఏర్పాటు చేసింది. నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాటానికి ఈ సమితియే సంవూర్ణ నాయకత్వం వహించింది. సంస్థానమంతటా ెవద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళనను విస్తరింవచేయటంలో స్వాతంత్రసమరెధుడు, హైదరాబాదు ఉక్కుమనిషి వండిత నరేంద్రజీ పాత్రను మరవలేం. నరేంద్రజీ లేని హైదరాబాద్‌ ఆర్యసవజం లేదు. నరేంద్రజీ లేని హైదరాబాద్‌ స్వాతంత్య్ర సమరం లేదు అంటే అతిశెక్తి కాదు. నిజాంకు వ్యతిరేకంగా ఆరోజుల్లో ఉద్యమించటం అంటే ప్రాణాలకు తెగించటం అన్నవటే. కేవలం హైదరాబాదు రాష్ట్రంలోనే కాదు.. దక్షిణ భారతావని అంతటా ఆర్యసవజ కుసువలను వికసింవజేయటంలో ఆయన పాత్రను గణనీయంగా చెవ్పుకోవచ్చు. సంస్థాన స్వాతంత్య్ర పోరాటంలోనైతే నరేంద్రజీ మూలస్తంభ`ంగా నిలిచాడు. ఆయనెవ నిజాం ముష్కరులు చేయించిన దాడులు అన్నీ ఇన్నీ కావు.. అరెసువలు చేశారు.. జైళ్లకు వంపారు.. చతుర్విధ ఉపా…లన్నీ వ్రెగించారు. కానీ, మూర్తీభ`వించిన జాతీయ నాయకుడు కాబటేవ నరేంద్రజీ తన వ్రజా చైతన్య …త్రను తుదకంటా దిగ్విజయంగా కొనసాగించగలిగారు.
వూల దుకాణాలకు వెళ్లిన స్త్రీలన విడిచిెవటవని దుర్మార్గం ఇత్తెవదుల్‌ ముసల్మీన్‌, బహద్దర్‌ …ర్జంగ్‌ అను…యులది. స్త్రీలు రక్షణకోసం వక్కనున్న ఏ ముస్లిం ఇంటిలోకి వరిగెత్తితే.. వాళు్ల అందులోంచి బయటకు వచ్చేవారు కారు. ఈ దారుణ దుస్థితి నుంచి మహిళలను కాపాడటానికి హింద వరివారాలను నరేంద్రజీ సవవేశవరిచి స్త్రీలోకాన్ని జాగృతవరిచే కార్యక్రవన్ని చేవటావడు. ఈ స్ఫర్తితో అన్ని జిల్లా కేంద్రాలలో ఆర్యసవజ కార్యకర్తలు విజృంభించి జనజాగరణ కార్యక్రవల్ని చేవటావరు. భారీగా జనసమీకరణకు వూనుకున్నారు. నాడు హైదరాబాద్‌లో జరిగిన ఆర్యసవజ సభ`లకు 50 వేల మందికి తగ్గకుండా హింద వ్రజలు వజరƒ్యిరంటేనే సవజం ఎంతగా వ్రజలను వ్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. భాయీ శ్యాంలాల్‌ జిల్లాల్లో తిరుగుత ఆర్యసవజ్‌ వ్రచారాన్ని జోరుగా చేశారు. నరేంద్రజీ తరువాత ఆర్యసవజంలో అంతటి వాడుగా వ్రసిద్ధి చెందిన శ్యాంలాల్‌ యువజనాన్ని సంవుటిత వరచటంలో దిటవ. జిల్లాల్లో సవజం విస్తరించటానికి ఆయనే వ్రధాన కారకుడని చెవ్పుకోవాలి. 1938లో ఆయనెవ నిజాం వ్రభ`ుత్వం హత్యానేరం వెవి జైల్లో నిర్బంధించింది. ఆయనకు కొద్దిగా అస్వస్తత ఉన్న సమ…న్ని అదునుగా ఎంచుకొని ఔషధంలో విషం కలివి ఆయన్ను హతవర్చింది. దాదావు ఏడేళ్ల పాటు భాయీ శ్యాంలాల్‌ను ముస్లిం సంస్థలు నానా…తనలకు గురి చేసింది. నిజానికి 1936నాటికే ఆర్యసవజ కార్యకర్తలెవనా, కార్యాల…లెవ నిజాం దాడులు నానాటికీ అధికమవుత వచ్చాయి. 
గుండేటి ఆర్యసవజ కార్యకర్త వేదవ్రకాశ్‌కు చాలాసార్లు బెదిరింవు వార్తలు వచ్చినా ఆయన ఉద్యవన్ని వీడలేదు.. సరికదా మరింత ఉద్ధృతం చేశాడు. దావూద్‌ ఖాన్‌ నేతృత్వంలో దాదావు 300 మంది గండాలు వేదవ్రకాశ్‌ెవ దాడి చేసి చిత్రహింసలకు గురిచేశారు. కసిగా ఆయన తల నరికి రక్తంతో రంగేళీ ఆడుకున్నారు. 
అదే విధంగా గుల్బర్గాలో హోళీ వండుగ నాడు ఓ ముస్లిం వ్యకిె్తవ పొరపాటున రంగు వడిందనే సాకుతో లేని గొడవ సృషివంచి హిందువులెవ దాడులకు వూనుకున్నారు. ఈ దాడుల్లో ఓ ముస్లిం యువకుడు చనిపోతే, దానికి ఆర్యసవజ కార్యకర్తలను బాధ్యుల్ని చేశారు. 
మరో వక్క కళ్యాణిలో ఆర్యవీర్‌ దళ్‌ శిక్షకుడైన ధర్మవ్రకాశ్‌ను గండాలు ెవురావ్‌ చేశారు. అనుమతిలేకుండా జెండా ఎగురవేసావని నిలదీశారు. పోలీసుల సాయంతో జెండాను తీసివేయించారు. అయినా ఆర్యసవజ కార్యకలాపాలు ఆగకపోయేసరికి గండాలు అకస్మాత్తుగా విరుచుకువడి ధర్మవ్రకాశ్‌ తల నరికేశారు.
ఇలా గ్రామ, గ్రావన ఆర్యసవజం అసాధారణంగా విస్తరించింది. ``హిందువులం ఇంతమందిమీ వుండీ ఎటవ బతుకుతున్నం? మనమందరం ఒకటై ఎదిరించి మన బతుకులు మంచిగ చేసుకోవచ్చు.''అనేది ఆర్యసవజ సభ`ల ధోరణి. వీటికి తోడు ెవద్ద ఎత్తున జరిగే ఉత్సవాలు మరికొన్ని. ముస్లిమేతరులలో ఉత్సాహం, జాగృతి, చైతన్యం కలిగించే ఉవన్యాసాలు నరేంద్రజీ వంటివారు అనర్గళంగా చేసే వారు. వీటికి సవంతరంగా గణవతి ఉత్సవాలు మరింత వునంగా జరిగేవి. ఈ ఉత్సవాల్లో విద్యార్థులే ఎక్కువగా పాల్గొనే వారు. వరంగల్‌లో గణవతి ఉత్సవాలకు, ఆర్యసవజ కార్యకలాపాలకు నాయకత్వం వహించిన వాళ్లలో వ్రజాకవి కాళోజీ నారాయణరావు, ఇటికాల మధుసదన్‌, వరిటాల రావరావు, హయగ్రీవాచారి, సి.రంగారెడ్డి వంటివాళు్ల వ్రముఖులు. పోసవర్లు రాయటం, వ్లకార్డులు రాయటం. రంగురంగుల బొమ్మలు వేసి ఉత్సవానికి వ్రచారం తీసుకురావటం వీరి వని. `సంవుటనే శక్తి, సహకారమే మేలు' వంటి చైతన్య నినాదాలను వ్లకార్డులెవ రాసేవారు. ముల్లును ముల్లుతోటే తీ…లి, కుక్కకాటుకు చెవ్పుదెబ్బ వంటి నినాదాలు కూడా వీటిలో కనివించేవి. హన్మకొండలోని బ్రాహ్మణవాడలో ఓసారి యథావిధిగా గణవతి ఊరేగింవు మొదలైంది. రాగన్నదర్వాజా దగ్గరకు ఊరేగింవుచేరేసరికి హైదరాబాద్‌ నుంచి వచ్చిన డిఐజి ఈ వ్లకార్డులెవ ఆక్షేవణ వ్యక్తం చేశారు. దీంతో అంతా గణవతిని అక్కడే వదిలేసి వెళ్లిపో…రు. గణవతిని తీసుకుపొమ్మంటే విల్లవాళు్ల లేకుండా తీసుకుపోయేది లేదని ెవద్దల వ్రతిన. చివరకు కాళోజీని బతిమిలాడి తీసుకువచ్చి గణవతి ఊరేగింవును కొనసాగించాల్సి వచ్చింది. ఇక్కడ విగ్రవరాధన కంటే సవజ సంవుటనే ఉద్యమకారులకు వ్రధాన లక్ష్యమైంది కాబటివ ఆర్యసవజీయులు సైతం జనసమీకరణకు ఈ ఉత్సవాలను వేదికగా మలచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆర్యసవజంెవ హవనం చేయరాదని నిషేధం విధిస్తే, పావలానో, ఆరణాలో ఇచ్చి ఒక గది అద్దెకు తీసుకుని ఒక ఇనువ కుంవటి ెవటువకుని వ్రతి శుక్రవారం ఉదయం 8గంటలకు వెళ్లి హవనం చేసేవారు కాళోజీ. ఆ గదికి ఆయన ఆర్యసవజం అని ఓ బోర్డు కూడా తగిలించాడు.(కాళోజీ ఆత్మకథ నుంచి)
ఆర్యసవజానికి మన దేశంలో వచ్చిన వ్రచారం కంటే సంస్థానంలో వచ్చిన వ్రచారమే ఎక్కువ. ఉద్యమం జోరుగా సాగుతున్నరోజుల్లో 1937లో నిజాం వ్రభ`ుత్వం సవజ కార్యకలాపాలను నిషేధిస్త ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ఆర్యవీరులను ఆేవదెవరు? వ్రభ`ుత్వం ఎంత వేటాడినా ఆర్యకార్యకర్తలు తమ ఉద్యవన్ని కొనసాగిస్తనే వచ్చారు. వేలాది యువకులను అక్రమంగా జైళ్లలో నిర్బంధించారు. చిత్రహింసలకు గురిచేశారు. కాళూ్లచేతులు విరిచికటివ విసిరేశారు. జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన వరిస్థితి తలెత్తడంతో ఆర్యవ్రతినిధి సభ` భారీ ఎత్తున సత్యాగ్రవనికి వూనుకుంది. అంతకు ముందే వండిత నరేంద్రజీని నిజాం సర్కారు అరెసువ చేసింది. 1938 అకోవబర్‌ 29న ఆర్యరక్షాసమితి తొలి సత్యాగ్రహం ప్రారంభ`మైంది. జట్లు జట్లుగా ఆర్యవీరులు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దేవీలాల్‌, శ్రీనివృతిరెడ్డి, బాల్‌రెడ్డి, నారాయణస్వామి, వునశ్యామ్‌ సింహ్‌జీ, చాంద్‌కిరణజీ శారదా ఇలా దేశం నలుమూలల నుంచి వ్రముఖ ఆర్యసవజ నాయకులు ెవద్ద ఎత్తున కార్యకర్తలతో హైదరాబాద్‌ను చుటువముటావరు. 1938 డిసెంబర్‌ 23న దేశం నలుమూలల నుంచి జటువ జట్లుగా సత్యాగ్రవళిలు హైదరాబాద్‌కు బయలు దేరారు. మవత్మా నారాయణస్వామి సుల్తాన్‌ బజార్‌ ఆర్యభ`వన్‌కు పోలీసుల కళ్లల్లో కారం కొటివ వచ్చారు. నిషేధాజ్ఞలు ఉన్నవ్పటికీ వేలాది హిందువులు అక్కడికి చేరుకోవటం పోలీసులకు విస్మయం కలిగించింది. దాదావు వన్నెండు వేల మందిని పోలీసులు అరెసువ చేశారు. వీళ్లను ఉంచటానికి జైళ్లలో చోటు చాలలేదంటే ఆశ్చర్యం వేయదు. ఈ సందర్భంలో ఆర్యసవజ నేతలు నాగవూర్‌లో రాష్రీవయ స్వయంసేవక్‌ సంవ్‌ు స్థావకులు డాకవర్‌ కేశవరావ్‌ బలీరాం హెడ్గేవార్‌ను కలిసి తాము నిర్వహించనున్న సత్యాగ్రవనికి స్వయం సేవకులు అండగా నిలవాలని కోరారు. అంతే దాదావు రెండువేల మంది స్వయంసేవకులు ఆర్యసవజ సత్యాగ్రహోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. వీళ్లందరినీ అదువు చేయటం నిజాం సర్కారు వల్ల కాలేదు. చివరకు నియంత దిగిరాక తవ్పలేదు. 1939 జూలై 19 నాడు అధికారులు ఆర్యవ్రతినిధి సభ`కు ఇక చాలు ఆగిపోండని మొరెవటువకుంది. సంవ్రదింవులు ప్రారంభించింది. ఒవ్పందానికి వచ్చింది. సవజం చేసిన వదిహేను డివండ్లను ఒవ్పుకుంది. 
``కసి ఆరిపోకుండ బుస కొటువచుండాలి.. కాలంబు రాగానే కాటేసి తీరాలి'' అన్న కాళోజీ వటలను స్ఫర్తిగా తీసుకుని ఆర్యసవజ ఉద్యమం కొనసాగింది. వ్రభ`ుత్వాన్ని కూకటివేళ్లతో ెవకిలించివే…లన్న దృఢ సంకల్పాన్ని వ్రజల్లో కల్పించటంలో ఆర్యసవజం కృతకృత్యమైంది. ఆనాడు విరిసిన క్రాంతి విసు్ఫలింగాలే క్రమంగా రగిలి వివ్లవజ్వాలలుగా వరిణమించాయి. 1939 తరువాత అటు ఆంధ్రమవసభ`, ఇటు ఆర్యసవజం సవంతరంగా సత్యాగ్రహ ఉద్యవలను నిర్వహించాయి. 
1946లో వరంగల్‌లో మూడు రోజుల పాటు జరిగిన వంచవర్య సమ్మేళనం నభ`తో నభ`విష్యతి. ఈ అవూర్వ మవ సభ`లకు వినాయకరావు విద్యాలంకార్‌ అధ్యక్షత వహించారు. స్వాగతాధ్యక్షులు చెరుకు కాంతయ్య. మూడు రోజుల పాటు అనేక రంగాలకు చెందిన శక్తి వ్రదర్శనలు, సాంస్కృతిక కళావ్రదర్శనలు కన్నులకు వండుగ చేశాయి. చివరి రోజున నరేంద్రజీ ఆగమనంతో వరంగల్‌ వీధులు విక్కటిల్లాయి. ఆనాటి ఆ వీర వ్రతాపాలను చసి వ్రజాకవి కాళోజీ అన్న వటలు ఇవి.. ... కుక్కలు మొరగవు, నక్కలు కూయవు.. కారణవ వ నరేంద్ర సింగము గర్జించునులే ఈనాడు..''. అసలే వరంగల్లు వివ్లవాల గడ్డ. మవమంత్రి యౌగంధరాయణుడి వటవణం. అందుకు తోడు ఈ సమ్మేళనం... అవ్పటిదాకా నివురుగవి్పన నివ్పులా ఉన్న స్వాతంత్య్ర కాంక్షను ఈ సమ్మేళనం కణకణం మండించి ఆజ్యం పోసింది. వల్లె వల్లెన కదిలించింది. వ్రత్యక్షపోరాటానికి రంగం సిద్ధం చేసింది. గ్రామ గ్రావన రక్షణ దళాలు నిర్మాణమƒ్యియి. వూ్యహం అల్లుకున్నాయి. తలచుకుంటే చాలు జనం... వ్రళయకాల వ్రభ`ంజనం అన్న రీతిలో నిజాం సర్కారు మూటాముల్లే సర్దుకోవలసిన వరిస్థితి కల్పించింది. 1948 సెెవవంబర్‌ 17న భారత ఉక్కుమనిషి సర్దార్‌ వటేల్‌ సాహసోేవతమైన పోలీసు చర్యకు నిజాం తోకముడిచే దాకా ఆర్యసవజం స్వాతంత్య్ర సంగ్రామంలో చైతన్యవంతమైన పాత్రను పోషించింది. అది అవెవుమైంది. మరువరానిది. 
భారత ఉవఖండంెవ వెయ్యేళ్లపాటు జరిగిన ముష్కరుల దాడులన్నీ మత, ధార్మిక, సాంస్కృతిక విచ్ఛిన్న దిశగా సాగినవే. తురుషు్కలు, మొవులులు, ఆంగ్లేయులు, కుతుబ్‌`ాలు, అసవ్‌జాహీలు.... వ్రసు్తతం అ`లౌకిక వాదులు' వ్రత్యక్షంగా, వరోక్షంగా చేసిన చేసు్తన్న దాడులు అన్నీకూడా ఆసేతు హివచలం సుసంవన్నమైన భారతీయ సంస్కృతిని విధ్వంసం చేయటం ద్వారా ఈ దేశ సంవదను, జాతీయతను దోచుకునే లక్ష్యంగా సాగినవే. వ్రవంచానికి నాగరకాన్ని నేర్పిన దేశం ఈరోజు వర్ధవన దేశంగా(మరో వటలో అభివృద్ధి చెందుతున్న దేశం) ఉందంటే అందుకు కారణం ఈ జాతి తన మూలాల్ని మరచిపోయి బానిసత్వవు బందీఖానానుంచి ఇంకా బయటకు రాకపోవటమే. తెల్లవారు బందీఖానా తలువులు తెరిచి లండన్‌కు వెళ్లిపోయి ఆరు దశాబ్దాలు గడిచిపోయినా మనం అందులోనే ఉండిపోతున్నాం. తలువులు తెరుచుకోవటమే మనకు స్వాతంత్య్రం. వాటిని తెరివించటం కోసమేనా మన వాళు్ల ప్రాణాలకు తెగించి పోరాటాలు చేసింది? జాతి మూలాలను కాపాడటానికి అలుెవరుగని పోరాటం చేసిన ఆర్యసవజం వంటి సంస్థలు సాంస్కృతిక సంగ్రావనికి ఇవాళ ఉన్న విలువ ఏమిటి? అసలు ఈ సంగ్రామం గురించి ఈ తరంలో ఎందరికి తెలుసు? ఈ తరం తెలంగాణ వ్రజానీకానికి ఈ …భై ఏళ్ల చరిత్ర వత్రమే తెలుసు. అసాధారణ నాగరికమైన ఈ జాతి మూలాలను గురించి వారికి తెలిసింది శూన్యం. నిజాం వ్రభ`ువు వునకీర్తులను పొగిడే భ`ుజకీర్తులుగా తగిలించుకునే రాజకీయ నేతలు, వారి వందివగధ బృందం ఒక్కసారి వెనక్కి తిరిగి చసుకోవాలి. ఏ జాతి అయినా తన మూలాల్ని విస్మరిస్తే దాని మనుగడకే వ్రవదం ఎదురవుతుంది. ఇవాళ తెలంగాణ ప్రాంతం ఆ వ్రవదవుటంచున ఉన్నది. దీన్ని కాపాడుకోవటం మనందరి కర్తవ్యం. మరోసారి సంస్థాన వివెచన కోసం జరిగిన పోరాటాలను వ్రతి ఒక్కర ఒక్కసారి స్మరిస్తే.. తెలంగాణాలో నిద్రాణమై ఉన్న చైతన్య జ్వాలలు మళ్లీ వ్రజ్వరిల్లుతాయనటంలో సందేహం లేదు.

5, ఫిబ్రవరి 2009, గురువారం

వినిమయ సంస్కృతి ఓ ఊబి

మధ్యతరగతికి, ఉన్నత మధ్యతరగతికి మధ్యనున్న సన్నని రేఖ చెరిగిపోవటంతో వ్రజల్లో కన్స్యమరిజం రోజురోజుకూ విస్తృతమవుత వసు్తన్నది. ఇరవై ఏళ్ల వయసు్సలోనే యువతకు వేనకు వేలు జీతాలిచ్చి వని చేయించుకుంటున్న కార్పొరేట్‌ వ్యాపార వ్యవస్థ, యువతీ యువకులకు బలవంతంగానే `ావింగ్‌ సంస్కృతికి అలవాటు చేసు్తన్నది. గత జీతాలు కాకుండా కార్పొరేటు కంెవనీలు అదనంగా ఇసు్తన్న `కూవన్లు' కొనుగోలు శక్తిని ెవంచటం కంటే, అవసరమున్నా లేకున్నా ఏదో ఒకటి కొనేసి ఖర్చు చేసే అనారోగ్యకర విధానానికి యువతను బానిస చేసు్తన్నవి. ఓ చేత్తో వేలకు వేలు జీతాలు ఇస్తనే, మరో రవంలో లాక్కోవటం కార్పొరేట్‌ సంస్కృతి రహస్య రవం. సావ్‌వవేర్‌ రంగంలోనో, మరో ఐటి వ్రధాన రంగంలోనో ెవద్ద ెవద్ద కంెవనీలు ెవటేవ వ్యాపారులు, మరోచోట ెవద్ద ెవద్ద మెగా `ావింగ్‌ వల్‌లను ఏర్పాటు చేస్తారు. చీవుర్ల దగ్గరి నుంచి హోం థియేటర్‌ దాకా వాళ్ల దగ్గర దొరకని వసు్తవంట ఉండదు. ఆ… కంెవనీల్లో వనిచేసే కార్మికులు(హోదా ఏదైనా కావచ్చు.. చేసే వని వత్రం వెటివ చాకిరీయే కదా!) ఈ `ావింగ్‌ వల్‌లకు వెళ్లి కూవన్లు, క్రెడిట్‌, డెబిట్‌, మింట్‌, ఇఎంఐ వంటి సవాలక్ష ేవర్లతో ఉండే కార్డులను ఉవెగించి ఇబ్బడిముబ్బడిగా కొనుగోళు్ల చేస్తారు. అక్కడ కంెవనీలో జీతంలో ఒక భాగంగా ఇచ్చే కూవన్ల విలువకు సరివడా వసు్తవులు ఈ మెగా కొట్లలో తీసుకోవాలన్నవట. తమ ఉద్యోగులకు ఇచ్చే జీతాల లెక్కలో ఈ గివ్‌వ కూవన్లు కూడా జత చేరుతాయి. నగదు రవంలో ఉంటే వారికి ఏదో అవసరానికి ఉవెగవడతాయి. కానీ ఈ కూవన్లను ఖచ్చితంగా వాడి తీరాల్సిందే. ఈ విధానం ఏ విధంగా చసినా కార్పొరేట్‌ కంెవనీలకు లాభ`ం చేకూర్చేదే తవ్ప, వినిెగదారులకు కాదు.
ఈ సంస్కృతి ఎవర ఆవినా ఆగనంతగా విస్తరించిపోయింది. మధ్యతరగతి వర్గంలోని దాదావు వ్రతి ఇంట్లో ఓ కుర్రాడు, ఓ కుర్రది సావ్‌వవేర్‌ ఇంజనీరో, ఎంబిబిఎస్‌ డాకవరుగానో వరుతున్నారు. ఏటా వేలాది యువతీయువకులు ఈ రెండు వృత్తివిద్యాకోర్సుల్లో వటవభ`ద్రులై కాలేజీ నుంచి బయటకు వసు్తన్నారు. కోర్సు చివరి సంవత్సరంలో ఉండగానే కార్పొరేట్‌ దుకాణాలు క్యాంవస్‌ ఇంటర్వ్యలంట నిర్వహించి తమకు వనికొచ్చే వారిని గద్దల్లా తన్నుకుపోతున్నాయి. తమ కంెవనీకి వనికొచ్చేవాళ్లను తమ ఉద్యోగులెవరైనా సిఫారసు చేస్తే వారికి ఇన్సెంటివ్‌లను కూడా సమర్పించుకుంటున్నాయి. ఒక్కసారిగా కళ్లెదుట కువ్పలు తెవ్పలుగా డబ్బులు కనవడుతుండేసరికి నెలకో కొత్త విలాస వసు్తవు ఇళ్లల్లోకి వచ్చి చేరుతున్నది. కార్డుల రవంలో కొంటే జరిగే అవ్పులకు అంతే లేదు. దీనికి తోడు విలిచి అవ్పులిచ్చేవాళు్ల కోకొల్లలు. వెనకట అవ్పు అంటే భ`యవడే వాళ్లకు ఇవ్పుడు తేరగా అవ్పులిస్తామని వచ్చేవాళ్లను చసు్తంటే కళు్ల బైర్లు కము్మతున్నాయి. దీంతో కార్డులను ఉవెగించి, `ావులకు వెళ్లి కొనే అవసరం లేకుండా ఇంటర్నెట్ల ద్వారా ఆర్డరిస్తే చాలు.. ఎంతటి ెవద్ద వసు్తవైనా ఇంటి ముంగిట క్షణాల మీద వాలాల్సిందే. విలాసాలకు తగ్గటువగా ఇంటి లోవలి అలంకారాలను వర్చుకోవలసి వసు్తన్నది. హైదరాబాద్‌ జంటనగరాల్లోనే మున్నెన్నడ లేని విధంగా వీధికో ఇంటీరియర్‌ డెకరేటర్‌లు త…రƒ్యిరంటే అతిశెక్తి కాదు. కిచెన్‌లో గ్యాస్‌ సవవ్‌ దగ్గర నుంచి గిన్నెలు కడిగే డిష్‌ వాషర్‌ దాకా వ్రతి దానికీ ఎలక్రావనిక్‌ వసు్తవులు వర్కెట్‌లో సిద్ధంగా దొరుకుతున్నాయి. మహిళలకు ఎలాంటి శ్రమలేకుండా అన్ని వనులు చేసిెవటేవందుకు తగిన సావగ్రి ఇళ్లల్లో చేరిపోయింది. ఇక విలాసానికైతే అంతే లేదు. టేవ్‌రికార్డర్లు పోయి విసిడిలు వచ్చాయి, విసిడిలు పోయి డివిడిలు వచ్చాయి. ఇవ్పుడు అవీ పోయి బ్లరేలు, హెచ్‌డి డివిడిలు వచ్చేశాయి. ఒకే డివిడిలో …భై సినివలు సోవర్‌ చేసుకుని చసుకునేందుకు వీలు కల్పిసు్తన్నాయి. ఇక టెలివిజన్ల స్థాయి హోం థియేటర్‌ దశకు చేరుకుంది. కొద్దో గొప్పో ఉన్నవాళు్ల హోం థియేటర్‌ను అద్భుతంగా త…రు చేసుకుంటున్నారు. రకరకాల డిజైన్లతో, అనుకూలమైన సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌తో, ఆడిె వ్యవస్థ ఏర్పాటుతో వినిెగదారుల అభిరుచుల మేరకు, అనుభ`తిని ఈ హోం థియేటర్లు కల్పిసు్తన్నాయి. స్థోమతను బటివ హోం థియేటర్లు రకరకాల రేంజిల్లో లభిసు్తన్నాయి. సంవన్నుల గృవల్లో సినివ వలు వదిరిగానే ఉంటున్న హోం థియేటర్లు మధ్యతరగతి స్థాయిలో వల్లోనే ఒక వ్రత్యేక ఏర్పాటుగా రపొందుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇల్లు వదిలి బయటకు పోకుండా వ్రవంచాన్నంతా మన ముంగిట్లోకి తెచ్చుకునే స్థాయికి ఈ నాటి యువత ఎదిగింది. మధ్యతరగతి వర్గం స్థాయి సంవన్న కుటుంబాల స్థాయికి చేరుకోవటం సంతోషించాల్సిన వరిణామమే. కానీ, దాని వెనుక కరివన వాస్తవం వత్రం వేరు. ఉటివ కెగరలేని మధ్యతరగతిని స్వర్గానికి ఎగరేస్తామంట వారి బలహీనతల్ని కార్పొరేట్‌ సవజం సొము్మ చేసుకుంటున్నది. ఈ రెండింటి మధ్య అసలైన ేవదవాడు దారుణంగా నలిగిపోతున్నాడు. సవజం నుంచి ఏకంగా కనుమరుగైపోతున్నాడు. ఈ వినిమయ సంస్కృతి వనవసంబంధాలెవ కూడా దారుణమైన వ్రభావాన్ని చవిసు్తన్నది. ఇది దేశ వ్రగతికి సంకేతవ? తిరోగమనానికి సూచికా? అన్నది అంతువటవని సంగతి.