30, సెప్టెంబర్ 2020, బుధవారం

A scholar's journey for research? where is the destiny? (suprasanna's jo...

పీహెచ్ డీ.. విశ్వవిద్యాలయాల్లో పిహెచ్ డీ చేస్తున్న విద్యార్థులు తమ పరిశోధనను ఎలా చేస్తున్నారు? వారి గైడ్ లు వారికి ఎలాంటి మార్గదర్శనం చేస్తున్నారు? చాలా చోట్ల తూతూ మంత్రంగా పరిశోధనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రోజూ వింటున్నాం. కానీ 1959లో ఒక పరిశోధక విద్యార్థి తన పరిశోధనకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం విజయనగరం నుంచి చెన్నై వరకు సుదీర్ఘ ప్రయాణంచేసి అనేక పండితులను, సాహిత్యవేత్తలను కలిసి.. చర్చలు జరిపి.. తద్వారా పరిశోధనను పూర్తిచేయడం ఈ రోజుకు ఒక అద్భుతమే. ఆచార్య కోవెల సుప్రసన్న.. రామరాజభూషణుడి కృతులపై చేసిన పరిశోధన నిమిత్తం చేసిన పరిశోధన యాత్రా విశేషాలు ఆయన నోటివెంటే వినండి. నేటితరం పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు సైతం తప్పక విని అనుసరించి ఆచరించాల్సిన స్ఫూర్తి దాయక అనుభవం ఇది.

తెలుగు పద్యం చచ్చిపోయిందా? చర్చ.. తొలి ప్రసంగం ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యం

ఆధునిక తెలుగు సాహిత్యంలో తెలుగు పద్యం స్థానమేమిటి? ఈ నాటి అవసరాలకు తగినట్టుగా పద్యాన్ని రాయడం సాధ్యం కాదా? తెలుగుపద్యం పై ప్రముఖుల చర్చాగోష్టిలో ఇది తొలి ప్రసంగం. ఆచార్య జీవీ సుబ్రమహ్మణ్యం గారు చేసినది. వినండి.

28, సెప్టెంబర్ 2020, సోమవారం

discussion on kavi samrat vishwanatha satyanarayana.. by kovela sampatku...

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సమగ్ర సాహిత్యంపై ఆచార్య కోవెల సంపత్కుమార, శ్రీ జువ్వాడి గౌతమరావు చర్చాగోష్టి తప్పక వినండి.

23, సెప్టెంబర్ 2020, బుధవారం

prof suprasanna.. speech on intergrity between indian languages.. a vision

భారతీయ భాషల్లో సమన్వయ దృక్పథం - దార్శనికత అంశంపై ఆచార్య కోవెల సుప్రసన్న చేసిన ప్రసంగం... తప్పక వినండి. ఇది తెలుగు సాహిత్యలోకం చర్చించాల్సిన విషయం. స్వాధ్యాయ ఈ చర్చాగోష్టిని ఆహ్వానిస్తున్నది. దీనిపై తమ అభిప్రాయాలను వాట్సాప్ (9052116463) కి ఆడియో కానీ, వీడియో ద్వారా కానీ పంపించండి.. వాటిని మళ్లీ ఇదే చానల్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు