28, ఫిబ్రవరి 2023, మంగళవారం

సన్నన్నము సున్న సుమీ


తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముందు అంటే 1983 తెలంగాణలో ఇవాళ మిల్లెట్లు అని ప్రచారం చేస్తున్న జొన్నలు, రాగి, సజ్జలు ఇటువంటివి మాత్రమే తినేవారుట. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చి రెండు రూపాయలకు కిలో బియ్యం అమలు చేసిన తరువాతే తెలంగాణలో బియ్యం తినడం మొదలయిందిట. ఇదీ చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్య. నాలుగున్నర దశాబ్దాల రాజకీయంలో తలపండిన నాయకుడిగా, తెలివిగల నేతగా ప్రసిద్ధి చెందిన నాయకుడు చేయాల్సిన వ్యాఖ్య కాదు ఇది. పైగా మరో పది మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న రాష్ట్రంలో పార్టీకి కొన్ని స్థానాలైనా గెలిపించుకోవాలని భావించే నాయకుడు ఇంత పేలవంగా వ్యాఖ్యానాలు ఎలా చేశారో అర్థం కాని విషయం. 

కామెంట్‌లు లేవు: