4, మార్చి 2023, శనివారం

ఈ దూరం తగ్గేదే లే..


తెలంగాణ ప్రభుత్వం,గవర్నర్ ల మధ్య వివాదం అలాంటిదే. దాదాపు రెండేళ్లుగా ఏదో ఒక అంశంపై రెండు వ్యవస్థల మధ్య దూరం పెరుగుతూనే ఉంది. ఎవరి పట్టు వారిదే..ఇప్పుడు మళ్లీ రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య పంచాయితీ మొదటికొచ్చింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తమిళి సై పెండింగ్ లో ఉంచడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, ఆ వెంటనే గవర్నర్ స్పందించడం చూస్తుంటే ఈ వివాదం మరింత ముదిరేట్టు కనిపిస్తోంది. 

కామెంట్‌లు లేవు: