25, మార్చి 2020, బుధవారం

voice of telugu poet ajanta

స్వప్నలిపికారుడు అజంతా (పెనుమర్తి విశ్వనాథశాస్త్రి). 1997లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా ఆకాశవాణి చేసిన ఇంటర్వ్యూ ఇది. ఆయన అవార్డు స్వీకరించిన సమయంలో నేను ఢిల్లీలోనే ఉన్నాను. ఆయన్ను కలిసే అవకాశం నాకు అలా లభించింది. ఆ సమావేశంలో ఆయన అనారోగ్యంతో మాట్లాడలేకపోతే శ్రీ ఏల్చూరి మురళీధర్ రావు గారు ఆయన తరపున ప్రసంగించారు. ఆయన అప్పటికే అనారోగ్యంతో ఉన్నారు. ఈ ఇంటర్వ్యూలో సైతం ఆయన ప్రసంగం ఆయాసంతో కొనసాగింది. అవార్డు లభించిన తర్వాత కొన్నాళ్లకే 1999లో అజంతా కన్నుమూశారు. ఆడియో కొంత నాయిసీగా ఉన్నప్పటికీ.. ఆయన అపూర్వ స్వరాన్ని పదిలపరచడం కోసం స్వాధ్యాయ చేసిన ప్రయత్నమిది. ఆయన సాహిత్య ప్రస్థానాన్ని తప్పక వినండి. స్వాధ్యాయలో భాగస్వాములు కండి. చేతులు కలపండి. చేరండి. పదిమందికి సాహితీ ఆణిముత్యాలను పంచండి.

కామెంట్‌లు లేవు: