29, జులై 2011, శుక్రవారం

విభజన'లో బహుజన హితం - కొత్త శివమూర్తి

 extracted from a facebook post
సీమాంధ్రలో ప్రత్యేకాంధ్ర అన్న వారిని శత్రువుగా చూస్తున్నారు. 1972లో రాయలసీమ నాయకుడు బి.వి.సుబ్బారెడ్డి, కోస్తా నేత కాకాని వెంకటరత్నం నాయకత్వంలో ప్రత్యేకాంధ్ర కావాలని సీమాంధ్ర ప్రజలు బ్రహ్మాండమైన ఉద్యమాన్ని చేశారు. ఇప్పుడు ప్రత్యేకాంధ్రను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర రాజకీయ నేతలు, ప్రజలు ఆ చరిత్రను మర్చిపోయినట్టున్నారు.

తెలంగాణలో సమైక్యాంధ్రవాదాన్ని ప్రచారం చేయకుండా ప్రత్యేక తెలంగాణ వాదులు అడ్డుకోవడం అప్రజాస్వామికం అని సీమాంధ్ర నేతలు విమర్శిస్తున్నారు కదా. మరి సీమాంధ్రలో ప్రత్యేకాంధ్రవాద ప్రచారానికి ఆటంకాలు కల్గించడం ప్రజాస్వామికమేనా? అసలు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు కోరుకొంటున్నారు? సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్ర అని ఎందుకంటున్నారు?

మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న సీమాంధ్రులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం చేసి మద్రాసులేని ఆంధ్రరాష్ట్రాన్ని 1953లో సాధించుకున్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రం 1956లో విలీనం కావడంతో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. ఇంతవరకు నాలుగు జిల్లాల రాయలసీమ నుంచి ఆరుగురు నాయకులు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులయ్యారు. తొమ్మిది జిల్లాల తెలంగాణ నుంచి నలుగురు ముఖ్యమంత్రులయ్యారు.

అయిదు కోస్తాంధ్ర జిల్లాల నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులయ్యారు. మూడు జిల్లాలు గల గల ఉత్తరాంధ్ర నుంచి ఒక్కరూ ముఖ్యమంత్రి కాలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు శాసిస్తున్నారని ఆ ప్రాం తాల నేతలు ముఖ్యమంత్రులై న విధానం స్పష్టం చేస్తుంది. ముఖ్యమంత్రులలో పదిమంది రెడ్లు, ముగ్గురు కమ్మలు, ఇద్దరు బ్రాహ్మిణ్స్ కాగా మాల, వైశ్య, వెలమ సామాజిక వర్గాల నుంచి ఒకొక్కరు చొప్పున ఉన్నారు.

ముఖ్యమంత్రుల పాలనా కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు శాసిస్తున్నాయని తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలుగా విభజిస్తే రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల రాజకీయ ఆధిపత్యం బలహీన పడుతుంది. కనుక రెడ్డి, కమ్మ వర్గాలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నందున సమైక్యాంధ్ర నినాదం ఉనికిలోకి వచ్చింది.

తెలంగాణ శాసనసభ్యులు 119 మంది కాగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు 175 మంది ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ ఎమ్మెల్యేలు మైనార్టీగా ఉండగా, సీమాంధ్ర వారు మెజారిటీగా ఉన్నారు. మెజార్టీ సభ్యల నిర్ణయానికి మైనార్టీ వారు కట్టుబడి ఉం డాలి అనేది ప్రజాస్వామిక సూత్రం. కనుక అన్ని సందర్భాలలోను తెలంగాణ వారిమీద సీమాంధ్రులే రాజకీయ ఆధిపత్యం చెలాయించగలుగుతున్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ నేత అయినా సీమా ంధ్ర ఎమ్మెల్యేలు బలపర్చకపోతే ముఖ్యమంత్రిగా ఉండలేడు.

దీంతో తెలంగాణ వారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో సీమాంధ్ర వా రి చెప్పుచేతల్లో ఉండే పరిస్థితి ఏర్పడింది. పదవుల కోసం తమ ప్రా ంత నాయకులు కేంద్ర పాలకులకు, సీమాంధ్ర నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తూ వెన్నెముక లేని నాయకులుగా రాజకీయ రంగంలో ఉన్నారని తెలంగాణ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. వెన్నెముక లేని తెలంగాణ నేతలు, సీమాంధ్ర నేతల రాజకీయాధిపత్యం వల్ల ఆంధ్రప్రదేశ్ ఏర్పడిననాటి నుంచీ అన్ని రంగాల్లో తమకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఈ కారణంగానే వారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకొంటున్నారు.

ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలపక ముందు అవి విడివిడిగా ఉన్నాయి. తెలంగాణ సుమారు ఐదు శతాబ్దాల కాలం ముస్లిం రాజుల పాలనలో ఉంది. సీమాంధ్ర రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వలసపాలనలో మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉంది. తెలంగాణలో ఉర్దూ పాలనా భాషగా ఉండగా, సీమాంధ్రలో ప్రభుత్వ పా లన ఇంగ్లీషు భాషలో కొనసాగింది. యూరోప్‌లో జరిగిన పారిశ్రామి క విప్లవాన్ని ఆధారం చేసుకొని మనదేశంలో బ్రిటిష్ వలసపాలన ఏర్పడింది.

యూరోప్‌లోని పారిశ్రామిక సమాజ దోపిడీ అవసరంలో భాగంగా సీమాంధ్రలో విద్యా, వ్యవసాయ, వ్యాపార రంగాలు అభివృద్ధి చేయబడ్డాయి. నిజాం నవాబుల పాలనలో ఉన్న తెలంగాణ అ న్ని రంగాలలో వెనుకబడిపోయింది. దీంతో పాటు ఆంధ్ర, తెలంగా ణ ప్రాంతాల ప్రజల్లో ఆచారాల వ్యవహారాలలోను, కట్టు బొట్టులలో ను, వేష భాషలలోను తేడా ఉంది. ఇలా ఆర్థిక, రాజకీయ, సామాజి క, సాంస్కృతిక రంగాల్లో వ్యత్యాసంగల ఆంధ్ర, తెలంగాణను భాషపేరుతో ఒకరాష్ట్రంగా ప్రకటించారు కేంద్ర కాంగ్రెస్ పాలకులు.

నిజానికి భాష పేరుతో ఆంధ్ర, తెలంగాణలను కలిపారనే ప్రచారం అసత్యం అని చెప్పవచ్చు. రాజకీయ పార్టీలు, నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలపబడ్డాయని భావించడానికి బలమైన ఆధారాలున్నాయి. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిస్తే తమ బలం పెరుగుతుందని భావించి కమ్యూనిస్టులు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే ప్రచారం చేసి ఉండవచ్చు.

ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిస్తే తమకు మంచి రాజధాని దక్కడంతో పాటు తమ దోపిడీ ఆధిపత్యానికి తెలంగాణ ప్రాంతం ఒక వనరుగా ఉంటుందని సీమాంధ్ర రాజకీయ నాయకులు భావించి ఉండవచ్చు. తెలంగాణలో ముస్లిం రాజుల పాలన కొనసాగినందున ఆ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కమ్యూనిస్టులు సాయుధపోరాటం చేసినందున ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపితే ఇస్లాం అతి వాదులను, కమ్యూనిస్టు అతివాదులను అణచివేయవచ్చు అని కేంద్ర పాలకులు భావించి ఉండవచ్చు. ఇటువంటి అనేక కారణాల వల్ల ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలపబడ్డాయి.

తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు ఆమోదించినందునే రెండు ప్రాంతాలు కలపబడ్డాయని సీమాంధ్ర నేతలు వాదిస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటి? ఫజులాలీ కమిషన్ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలపడానికి ఆమోదించలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం రెండు ప్రాంతాలను కలపాలని భావిస్తే 1962లో జరిగే ఎన్నికలలో తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో మూడు వంతుల మంది ఆమోదిస్తేనే రెండు ప్రాంతాలను కలపాలని సూచించింది. కానీ ఫజులాలీ కమిషన్ సూచనకు విలువ నివ్వకుండా కేంద్ర పాలకులు, 1956లోనే రెండు ప్రాంతాలను కలిపారు. ఇందుకు పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఆధారం చేసుకున్నారు.

ఈ ఒప్పందం ద్వారా రెండు ప్రాంతాలు కలపబడ్డాయి అంటే అర్థమేమిటి? తెలంగాణ ప్రజలు ఇష్టపూర్వకంగా కలవలేదని కొన్ని షరతులకు లోబడి కలిశారని పెద్దమనుషుల ఒప్పందం తెలియజేస్తుంది. అలాగే ఆనాటి ఆంధ్ర, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీలు కూడా తెలంగాణ ప్రజలు కొన్ని షరతులకు లోబడి కలవడానికి ఆమోదించారని తెలియజేస్తుంది. షరతుల ద్వారా కలిసిన వారికి షరతులను అమలు చేయనప్పుడు విడిపోయే హక్కు కూడా ఉంటుంది. దీనినే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. పెద్దమనుషుల ఒప్పందం అమలుచేయలేదు. ఆరు సూత్రాల పథకం అమలుచేయలేదు. జి.వో 610 అమలు చేయలేదు.

అంటే అర్థం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హా మీలను సీమాంధ్ర నాయకులు నెరవేర్చలేదు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరేవేర్చనందున వారు తమకు ఆంధ్రా నుం చి విడిపోయే హక్కు ఉందంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చనివారికి కలిసి ఉం డమని అడిగే హక్కు ఉండదు అంటున్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసి ఉన్నా, విడిపోయినా రెండు ప్రాంతాలలోని సామా న్య ప్రజలకు పెద్దగా లాభంకాని, నష్టంకాని ఉండదు. కానీ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు విడిపోతే అగ్రకులాల రాజకీయ గుత్తాధిపత్య ం బలహీనపడడంతో పాటు తెలంగాణ ప్రాంతం మీద సీమాంధ్ర నాయకుల దోపిడీ రాజకీయ ఆధిపత్యం అంతమవుతుంది. అందుకే సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్ర నినాదాన్ని చేపట్టారు.

సీమాంధ్ర ప్రాంతంలో వందలాది సంవత్సరాల నుంచి అణిచివేత, డోపిడీకి గురైన బహుజనులు సమైక్యాంధ్ర వాదాన్ని బలపరచడం అంటే, సీమాంధ్రలోని అగ్రకుల రాజకీయ నాయకుల స్వార్థానికి బలిపశువులు కావడమే. అందువల్ల సీమాంధ్రలోని బహుజనులు అగ్రకులాల రాజకీయ గుత్తాధిపత్యాన్ని బలహీనం చేయడం కోసం సమైక్యాంధ్ర నినాదానికి సమాధికట్టి జైఆంధ్ర నినాదానికి పట్టం కట్టాలి. అప్పుడే వారు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు న్యాయం చేసిన వారవుతారు.

అంంతేకాక జైఆంధ్ర ఉద్యమం ద్వారా సీమాంధ్ర ప్రాంతాలలో అగ్రకులాల రాజకీయ గుత్తాధిపత్యాన్ని ఎదిరించే బహుజనుల నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకున్నవారవుతారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో స్వార్థపరులైన రాజకీయ నాయకుల అనుసరిస్తున్న విధానాలకు బహుజన బిడ్డలు బలౌతున్నారు. ఈ విధానం అంతం కావడానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటే పరిష్కారం. అందువల్ల సీమాంధ్రలోని బహుజనులు సమైక్యాంధ్రను వ్యతిరేకిస్తూ జైఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టినప్పుడు రెండు ప్రాంతాల ప్రజల మధ్య సోదర భావం ఏర్పడుతుంది.

- కొత్త శివమూర్తి, ప్రత్యేకాంధ్రవాది, తూ.గో.జిల్లా

కిరణ్‌ బాధను కాంగ్రెస్‌‌ హైకమాండే అర్థం చేసుకోవాలి

కరవమంటే కప్పకు కోపం...విడవమంటే పాముకు కోపం...ఇప్పుడు సీఎం కిరణ్ పరిస్థితి ఇలాగే ఉంది...
సకల జనుల సమ్మె...ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యోగులు సందించిన బ్రహ్యాస్త్రం....ఈపదం వింటేనే సిఎం గుండెగుబేల్‌ మంటోంది...పొలిటికల్‌ క్రైసెస్‌ను పొలిటికల్‌గా ఎదుర్కొంటున్న ఆయన ఉద్యోగుల విషయంలో ఎలా స్పందించాలో అర్థంకాక తల పట్టుకొంటున్నారు....పీఆర్సీ జీతభత్యాల వ్యత్యాసాలను సరిదిద్దాలని ఉద్యోగ సంఘాల జాక్‌ సందించిన సమ్మె అస్త్రాన్ని కిరణ్‌ సర్కార్‌ రెండురోజుల్లోనే తేల్చింది. వారిచ్చిన డిమాండ్లన్నింటికి క్యాబినెట్‌ ఓకే చెప్పింది. ఇక ఆతరువాత తెలంగాణ ఉద్యోగులు చేసిన  సహయ నిరాకరణను కూడా ..కిరణ్ సమర్థంగానే ఎదుర్కొన్నారు. తాత్కాలికంగా గండం గడిచినా...ఇపుడు  తాజాగా సకల జన సమ్మె సర్కార్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది..పైకి ఎస్మా విధిస్తామని ఉద్యోగులను  మానసికంగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నా... అది సాధ్యపడదని సర్కార్‌కు ఇప్పటికే బోధపడింది. పోనీ ఉద్యోగులు ఏకరువు పెట్టిన
డిమాండ్లన్నింటికి అంగీకరిద్దామంటే....మరోప్రాంత నాయకులు అడ్డుతగులుతారన్న బెంగపట్టుకుంది.. జనాభా ప్రాతిపదికన తెలంగాణ ఉద్యోగులకు రావాల్సిన 42 శాతం ఉద్యోగాలకు రిటన్‌ గ్యారంటీ ఇద్దామని సిఎం ప్రయత్నిస్తే కొంత మంది మంత్రులు అడ్డుతగిలినట్లు సమాచారం. 610 ఉత్తర్వుల అమలుకు జ్యుడీషియల్‌ కమీషన్‌  వేద్దామన్నా ఇదే పరిస్థితి. ఇక 14 F వివాదం కూడా  ఇప్పట్లో తేలేలా లేదు...పోనీ గతంలోహామీ  ఇచ్చిన GHMC స్థానికేతర ఉద్యోగులను పంపిద్దామన్నా తేనె తుట్టను కదిపినట్లవుతుందన్నది కిరణ్‌ భావిస్తున్నారు... ఇక కిరణ్‌ దగ్గరున్న రెండో  వ్యూహం సమ్మె అణిచివేత.  ఈనిర్ణయం తీసుకొంటే తెలంగాణ ప్రాంతంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసు బాసులు విశ్లేషిస్తున్నారు. అదే గనక జరిగితే ఇప్పటికే అధిష్టానం దగ్గర అంతంత మాత్రంగానే ఉన్న తన పరువు పూర్తి గా మంటగలుస్తుందని కిరణ్ ఆందోళన చెందుతున్నారు....ఎలాంటి నిర్ణయాలు తీసుకోక పోయినా పర్వాలేదు ...కనీసం లా అండ్‌ ఆర్డర్‌ అయినా...సక్రమంగా నిర్వహించలేడనే అపవాదు వస్తుందన్నది ఆయన అంతరంగం. సమ్మె గనక జరిగితే ...వ్యవస్థ స్తంబించి పోవడం ఖాయం....మొత్తం మీద సకల జనసమ్మె కిరణ్‌  మెడకు పడ్డ పాములా తయారైంది. తెలంగాణ ఉద్యోగుల డిమాండ్లకు తలొగ్గితే...సీమాంద్ర నేతలకు గిట్టటం లేదు. అణిచివేద్దామంటే...తెలంగాణ నేతలు  -ఉద్యోగులు ఒంటి కాలుపై లేస్తున్నారు. పాపం కిరణ్‌.....కిరణ్‌ బాధను కాంగ్రెస్‌‌ హైకమాండే అర్థం చేసుకోవాలి మరి.....

బాబు స్పందించాలి

తెలంగాణ,సమైక్యాంద్ర సెంటిమెంట్లు రెంటిని గౌరవిస్తానంటున్న చంద్రబాబుకు... టిడిపి లో ఏకాభిప్రాయం సాధించే దిశగా చర్చలు ప్రారంభించడానికి సమయం ఆసన్నమైంది.
అధికారంలో ఉండగా ఎన్నో సమస్యలు అవలీలగా పరిష్కరించి చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న బాబు తెలంగాణ పై పార్టీనేతలను ఒకే మాట మీదకు తీసుకురావాలనే డిమాండ్ నానాటికీ పెరుగుతోంది.
తెలంగాణ పై కాంగ్రెస్‌ తరహాలోనే టిడిపిలో అంతర్గత చర్చలు ప్రారంభించి జటిల సమస్యకు ముగింపు పలకాల్సిన బాధ్యత బాబుకు ఉన్నదన్న వాదనలూ రోజురోజుకు పెరుగుతున్నాయి....2009 ఎన్నికలకు ముందు తెలంగాణ పై వైఖరి చెప్పడానికి ఇరు ప్రాంతాల నేతలతో కమిటి వేసిన చంద్రబాబు పార్టీ విధానాన్ని మెనిఫెస్టో లో కుండబద్దలు కొట్టారు.
తెలంగాణ పై కాంగ్రెస్‌ ఇవ్వని స్పష్టత టిడిపి ఇచ్చిందని బాబు అప్పట్లో ప్రశంసలందుకున్నారు కూడా...అయితే డిసెంబర్‌ తొమ్మిది తర్వాత ఆయన రెండు కళ్ల సిద్దాంతాన్ని తెరపైకి తెచ్చి  తెలంగాణలో టీడీపీని అగ్నిపరీక్షకు నిలిపారు...
 ఇప్పటికే పలువురు సీనియర్లు ,వేల సంఖ్యలో కార్యకర్తలు ఆ ప్రాంతంలో పార్టీని వీడారు.తెలంగాణ లో పార్టీ నేతలు చనిపోయినా వారి అంత్యక్రియలకు హాజరుకాని స్థితికి చంద్రబాబు చేరుకున్నారంటే ఆ తీవ్రత ఎక్కడికి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు.
 ఇలాంటి వాతావరణంలోనూ తెలంగాణ పై చెప్పాల్సింది చెప్పాం ...ఇక చెప్పేదేమీలేదు అని బాబు మాట్లాడుతుండడం టిడిపి నేతలకే కాక రాజకీయ విశ్లేషకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అధికారంలో ఉండగా విజన్‌ 2020 అని అన్ని అంశాలపై ఓ విధానాన్ని ప్రకటించిన మాజీ సీఎం కనీసం కొత్త రాష్ట్రాల ఏర్పాటు పై తన మనోగతాన్నెనా చెబితే బాగుంటుందనే వాదన వినిపిస్తోంది.రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఓ పెద్ద సమస్యపై ప్రేక్షక పాత్ర వహిస్తున్న తీరు బాబు ఇమేజ్‌ ని ఇబ్బందుల్లోకి నెడుతోంది.
 తెలంగాణ పై తనకో వైఖరి లేక పోవడంతో కాంగ్రెస్‌ తప్పటడుగులను ప్రశ్నించ లేని స్థితికి ఆయన చేరారు..ఏ ప్రాంతానికి దగ్గట్టు ఆ ప్రాంత పార్టీ నేతలు వ్యవహరించాలని దిశానిర్దేశం చేస్తున్న బాబు సమస్య అలాగే ఉండాలని కోరుకుంటున్నారా అనే అనుమానాలకు దారితీస్తున్నాయి...
తెలంగాణ నిర్ణయాన్ని కేంద్రానికే వదిలేస్తామంటున్న టిడిపి అధినేత ఉద్యమాల విషయంలోనూ తటస్థ వైఖరి తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
 కాంగ్రెస్ ఇపుడిపుడే తెలంగాణ పై ఏకాభిప్రాయం కోసం చర్చలు జరుపుతుంటే టిడిపిలో మాత్రం ఆప్రయత్నమే జరగడం లేదు...డిసెంబర్‌ తొమ్మిది తర్వాత వైఖరి మారడానికి కారణాలు వివరించకుండా కేవలం రెండు కళ్ల సిద్దాంతామంటూ ఇంకా చెబితే... చంద్రబాబుకు ఇరు ప్రాంతాల్లో నష్టం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 తన వైఖరితో తెలంగాణలో పట్టు కోల్పోయిన బాబు ఆంధ్రాలో అదనంగా పొందిన లాభం కూడా ఎదీ లేదని కడప ఉప ఎన్నికలు కూడా రుజువు చేశాయి.
 రాజకీయ నాయకులు సాహోసోపేతంగా వ్యవహరించకుండా ఎపుడూ లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ గడిపితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గతంలో అనేక ఉదంతాలు రుజువు చేశాయి.
 చంద్రబాబు ఆ జాబితాలో చేరకూడదంటే ఆయన కూడా టిడిపిలో తెలంగాణ పై చర్చను పారదర్శకంగా మొదలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఎంత అవునన్నా..కాదన్నా చిదంబరం చేసిన సూచనపై బాబు స్పందించాలి....పార్టీలో తెలంగాణ పై చర్చించాలి...ఓ పరిష్కారం చూపాలి...

28, జులై 2011, గురువారం

ఆజాద్ ను అతిగా నమ్మితే....

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు అధిష్టానం పై మళ్లీ  నమ్మకం పెరుగుతోంది.ఆజాద్‌తో చర్చల తర్వాత రాష్ట్ర విభజన జరుగుతుందన్న ఆశలు చిగురించాయి...ఎన్నడూ లేనివిధంగా హై కమాండ్ శ్రద్దతో తమ వాదనలు విన్నదన్న భావనలో ఉన్న వారు....తెలంగాణ ఏర్పాటుకు బలమైన కారణాలు గుర్తించిందని వారు ఓ అంచనాకు వస్తున్నారు. నమ్మకం కుదిరింది.....రెండు నెళ్లు కాదు....నెల రోజుల్లోనే తెలంగాణకు పరిష్కారం...ఇదీ తెలంగాణ కాంగ్రెస్‌ నేతల అంతరంగం...
ఆజాద్‌ ను తిట్టిన నోళ్లే ఇపుడు పొగడుతున్నాయి. ఆంధ్రోళ్లకే ఆయన ఇంచార్జ్‌ అనే దాకా వెళ్లిన టీ కాంగ్రెస్‌ నేతల తీరు ఇపుడు మారుతోంది. ఆజాద్ తో మూడో భేటీ తర్వాత వారి స్వరాలు ఒక్క సారిగా వేరే రూపు తీసుకున్నాయి.తెలంగాణతో ముడిపడి ఉన్న హైదరాబాద్‌,నదీజలాల పంపిణీ అంశాలపై తాము వివరించిన తీరు ఆయన్ను ఆకట్టుకుందని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 2004 నుంచి ఎపీ వ్యవహారాలను దగ్గర నుంచి గమనిస్తున్న తనకు తెలంగాణ డిమాండ్‌లో ఇంత నిజాయితీ ఉందన్న సంగతి ఇప్పటి వరకు  తెలియదని ఆజాద్ ...వారితో చెప్పినట్టు సమాచారం.తెలంగాణ వ్యతిరేకించడానికి చూపుతున్న కారణాలు వాదనకు పెడితే నిలువవని ఆయన చెప్పడం టీ కాంగ్రెస్‌ నేతలకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. అందరూ చెబుతున్నట్టు రెండు నెలల్లో కాకుండా .. ముఫ్పై రోజుల్లోనే సమస్యకు పరిష్కారం దొరకొచ్చని ఆజాద్‌ భేటీలోఅన్నారని వారు ప్రచారం చేసుకుంటున్నారు.ఆజాద్ తీరు ఇలానే చివరి దాకా కొనసాగితే తెలంగాణ రాకుండా పోదని ఢిల్లీ భేటీలో పాల్గొన్న యువ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు....  ఢిల్లీ పెద్దల తీరును ఎంతో కాలం నుంచి గమనిస్తున్న కొందరు సీనియర్లు మాత్రం ఇంచార్జి వైఖరి పై తుది నిర్ణయానికి రావడానికి మరింత సమయం తీసుకోవాలనే భావనలో ఉన్నారు జాదూ గా పేరున్న ఆజాద్ సీమాంద్ర నేతలతో మాట్లాడిన తర్వాతే ఆయన తెలంగాణకు అనుకూలమా వ్యతిరేకమా అనే నిర్ధారనకు రావచ్చని అప్పటిదాకా ఓపిక పట్టాలనే భావన వారిలో కనిపిస్తోంది.  ఆజాద్ ను అతిగా నమ్మితే హై కమాండ్ ట్రాప్‌లో పడ్డట్టే అవుతుందని మరి కొంత మంది టీ కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారు.ఏమైనా ఆజాద్ పై మునుపటంత ఆగ్రహం ప్రదర్శంచకుండా తెలివిగా ఆయన్ను తెలంగాణ దారికి తెచ్చుకోవాలనే అభిప్రాయం మాత్రం అందరిలో వ్యక్తమవుతోంది....

27, జులై 2011, బుధవారం

మీకు మీరే మాకు మేమే.....

మీకు మీరే మాకు మేమే.....ఇదీ ఇప్పుడు సీమ,ఆంధ్ర నేతల్లో వినిపిస్తోన్న కొత్త స్వరం....సీమాంధ్ర నేతల్లో సమైక్యవాద ఉధృతిని తగ్గించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం వేసిన తొలి అడుగులో భాగమే ఈ కొత్త స్వరం...
ఇంతకాలం ఒకే ప్రతినిధి బృందంగా సీమాంధ్ర అభిప్రాయాలు విన్న హైకమాండ్... ఇప్పుడు ఆరెండు ప్రాంతాల నేతలతో విడివిడిగా చర్చించడానికి రంగం సిద్దం చేస్తోంది....పీసీసీ చీఫ్ సత్తిబాబు ఆపనిలో బిజీబిజీగా ఉన్నారు..
రాష్ట్రాన్ని కలిపి ఉంచినా,విభజించినా తనకొచ్చే రాజకీయ ప్రయోజనాలపైనే కాంగ్రెస్ పార్టీ ప్రదానంగా దృష్టి సారించింది.తెలంగాణ ఇస్తే లాభ నష్టాలను ఇప్పటికే తెలంగాణ నేతలతో చర్చించిన ఆజాద్‌ ఇక సీమాంధ్ర నాయకులతో చర్చలపై దృష్టిపెట్టారు.

 సీమాంద్ర నేతలు ఓ బృందంగా రావడం వల్ల ఆ రెండు ప్రాంతాల్లో విభజన కోరుకుంటున్న వారి వాదనకు అవకాశముండడం లేదన్న అభిప్రాయానికి వచ్చిన ఆయన.... సీమ,ఆంధ్రా ల నుంచి వేర్వేరు బృందాలను చర్చలకు ఆహ్వానించారు.  ఇదే అంశంపై బొత్స రాయలసీమ కు చెందిన శైలజానాధ్‌,కోస్తా నేత కావూరిలతో కసరత్తు జరిపి విడివిడిగా వెళ్లేందుకు ఒప్పించారు. దీంతో సమైక్యవాదం పలుచబడేందుకు మార్గం ఏర్పడిందనే వాదన కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది. కొందరి మెప్పుకోసం పెదవుల పైనే సమైక్యరాగం వినిపిస్తున్న నేతలు ....వేర్వేరుగా ఢిల్లీ వెళితే నిజంగా మనసులో ఏముందో తెలిసే అవకాశం కూడా ఢిల్లీకి కలుగనుంది. మంత్రులు టీజీ వెంకటేష్,ఏరాసు ప్రతాప రెడ్డి ఇప్పటికే గ్రేటర్‌ రాయలసీమ వాదన వినిపిస్తుండగా .. బొత్స తో భేటీ తర్వాత మరో మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి కూడా అదే వైఖరిని చాటారు. తెలంగాణ రాష్ట్రానికి మొగ్గు చూపినా.. భవిష్యత్‌లో సీమాంధ్ర ఒక్క రాష్ట్రంగా ఉండలేదన్న భావన చాలా మంది కాంగ్రెస్ నేతల్లో ఉంది.అందుకే ఒకే సారి మూడు రాష్ట్రాల ఏర్పాటు సూత్రం కాంగ్రెస్ లో తెరపైకి వస్తోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన చంద్రబాబు,జగన్‌ లకు చెక్‌ పెట్టాలంటే త్రీ స్టేట్స్‌ థియరీయే కరెక్ట్‌ అని కొందరు పాలక పక్ష నేతలు కూడా భావిస్తున్నారు.ఈ వాదనకు బొత్స ఆశీస్సులు కూడా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సత్తిబాబు పిసిసి చీఫ్ గా ఉండడంతో అధిష్టానానికి సమైక్య వాదుల్లో చీలిక తేవడం తేలిక అనే అభిప్రాయం వినిపిస్తోంది.ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీమాంద్ర నేతల బృందంలో తన ప్రాంతానికి చెందిన నేతలు పాల్గొనకుండా బొత్స గట్టిగా ప్రయత్నించారన్న వాదనలు జోరుగానే వినిపించాయి...
 అంతేకాదు ..భవిష్యత్‌ లో అవసరమైతే జై ఆంధ్రా వాదన వినిపించేందుకు తన వెంట వచ్చే నేతల చిట్టాను కూడా ఆయన సిద్దం చేసుకుంటున్నారని కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దగ్గుబాటి లాంటి నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే గట్టిగా సమైక్యవాదాన్ని వినిపించే నేతల సంఖ్యను వీలైనంత తగ్గించాలనే హై కమాండ్ యత్నాలకు బొత్స తనవంతు సహకరిస్తున్నారు.
తెలంగాణ పై హై కమాండ్ తమను అవమానిస్తోందన్న అభిప్రాయంతో ఉన్న టీ కాంగ్రెస్ నేతలకు తాజా పరిణామాలు కొంతలో కొంత ఉపశమనివ్వక మానవు.

మన జంట నగరాలు

హైదరాబాద్‌-సికిందరాబాద్‌ జంటనగరాల్లో అనిర్వచనీయమైన ఆకర్షణ ఉంది. ఇక్కడ బతికిన వాళ్లు.. బతుకుతున్న వారందరికీ ఇది అనుభవమైనదే. జంటనగరాల ఆశ్రయాన్ని ఒకసారి పొందిన వారు తిరిగి ఆ ప్రాంతం నుంచి కదిలేందుకు ఇష్టపడరు...

మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు కాలం వరకు హైదరాబాద్‌  గోలకొండ ప్రాంతం నుంచే నగర పరిపాలన సాగింది.


జంటనగరాల్లో ఈనాటికీ నికార్సైన తెలుగుదనం కనిపించదు. తెలంగాణ జిల్లాల ప్రజల భాష. ఆంధ్ర తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ, తమిళ, ఇరానియన్‌ తదితర భాషలతో భాగ్యనగరం బహుభాషా నిలయంగా రూపుదిద్దుకుంది.
హైదరాబాద్‌లో విలసిల్లిన సంస్కృతి దక్కనీ సంస్కృతి. తెలుగు, మరాఠీ, కన్నడ భాషల ప్రజలు.. ఇరానియన్‌ దక్కన్‌ ప్రవాసుల భాషలతో కలగలిసిన భాషగా దక్కనీ భాష పుట్టుకొచ్చింది. ఇవాళ ఇది నిర్లక్ష్యానికి గురైంది.


19వ శతాబ్దంలోనే భాగ్యనగరానికి వలసలు ఆరంభమయ్యాయి. ఉత్తర భారతం నుంచి కాయస్థులు, ముస్లింలు తరలివచ్చారు. నిజాం సర్కారులో ఉన్నతోద్యోగాలు సంపాదించారు. రాజస్థానీ మార్వాడీలు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకున్నారు. 1948 తరువాత ఆంధ్రప్రాంతం నుంచి వలసలు మొదలయ్యాయి. 1956 తరువాత ఉద్ధృతమయ్యాయి. గుంటూరు పల్లెలు అప్పుడు ఏర్పడినవే.


1938 దాకా హైదరాబాద్‌ నగరంలో చిన్నస్థాయి మతకల్లోలం కూడా జరగలేదు.. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సామరస్యంతో జీవించారు.

హైదరాబాద్‌ నగర పాలన విషయంలో నిజాం రాజ్యవ్యవస్థ అపరిమితమైన ఆసక్తిని చూపించింది. దేశం మొత్తం మీద తొలి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఘనత హైదరాబాద్‌దే.


ఇవాళ నగరం నడిబొడ్డులో ఉన్న పంజగుట్ట ప్రాంతం ఒకనాడు నగరానికి నాలుగుమైళ్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతం అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి విద్యానగర్‌ ప్రాంతం కూడా అడవే.. అక్కడ పశువులను మేతకు తీసుకువెళ్లేవారట...


మహానగరిలో అడవిని నిర్మించిన ఘనత కూడా ఆనాటి పరిపాలకుల ఖాతాలోకే  చేరుతుంది. నాంపల్లిలో కృత్రిమ అటవీ నిర్మాణం జరిగింది. అదే ఇవాళ్టి పబ్లిక్‌ గార్డెన్స్‌... దీన్ని ఆ కాలంలో ‘బాగే ఆమ్‌’ అని పిలిచేవారు. ఇందులోనే ఓ మూల జూ ఉండేది. బాగ్‌ అంటే తోట అని అర్థం. 


 ఒకనాటి భాగ్యనగరం కాలుష్యానికి ఆమడ దూరంలో ఉండేది. పటాన్‌ చెరువు, జీడిమెట్ల, సనత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో చాలాకాలం క్రితమే భారీ పరిశ్రమలు విస్తరించాయి. అయినా ఆనాడు అవి నగర శివార్లలో ఉన్నవే. నగరం నగరం నలువైపులా చమన్లు, తోటలు పెంచటంతో కాలుష్యానికి తావే లేకుండాపోయింది.


1922నాటికే హైదరాబాద్‌లో వస్త్ర పరిశ్రమకు పునాదులు పడ్డాయి. దివాన్‌ బహదూర్‌ రాంగోపాల్‌ మిల్లుల్లో ౧౩౦౦ మంది కార్మికులు పనిచేసేవారు.. 

 జంటనగరాల్లో 20వ శతాబ్ది తొలినాళ్ల వరకు మోటర్‌ కారు అంటే తెలియదు. ఎక్బాలుద్దౌలా అనే ఆయన మొట్టమొదటిసారి మోటారు కారును హైదరాబాద్‌ వీధుల్లో  నడిపించారు. ఆయన వాడింది ఆనాటికే పాతబడిన మోటారు కారు..  ఆ తరువాత ముసల్లింజంగ్‌, కమాల్‌యార్‌జంగ్‌, రాజారామ్‌రాయన్‌, లక్ష్మణ్‌రాజ్‌లు కొత్త తరహా మోటారు కార్లు కొన్నారు.. వీరంతా ఆనాటి హైదరాబాద్‌ ప్రముఖులు.


 1911 సంవత్సరంలో హైదరాబాద్‌లో ఉన్న మోటారు కార్ల సంఖ్య 118 అని నిజాం ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. 1934లో గాంధీజీ హైదరాబాద్‌ వచ్చినప్పుడు సంపన్నుడైన ధన్‌రాజ్‌ గిర్‌జీ తన రోల్స్‌రాయిస్‌ కారును ఆయన కోసం అందుబాటులో ఉంచారు. అప్పటికే రోల్స్‌రాయిస్‌ కారు హైదరాబాద్‌ వీధుల్లో తిరిగింది.


 1920 నాటికి హైదరాబాద్‌ జనాభా నాలుగు లక్షలు. మోటారు కార్ల సంఖ్య తక్కువ. అప్పుడు రిక్షాలు లేవు. ఆటోరిక్షాలు అంతకంటే లేవు. సంపన్నులకు బగ్గీలు ఉండేవి. అద్దె టాంగాలు ఉండేవి. సైకిళ్ల సంఖ్య మాత్రం వేల సంఖ్యలో ఉండేవి. మోటారు వాహనం వస్తుందంటే ట్రాఫిక్‌ పోలీసు సీటీ ఊదేవాడు..ప్రజలంతా ఆ మోటారును విచిత్రంగా చూసేవారు.


 1930వ దశకంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ తీవ్రత తక్కువైనా పూర్తిస్థాయి ట్రాఫిక్‌ క్రమశిక్షణను పాటించేవారు. రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉండేవి.. టాంగాలు ఎక్కువ. రోడ్ల మీద కొంత కొంత దూరాలకు రేకులు, తట్టలు పట్టుకుని కొందరు మనుష్యులు ఉండేవారు. గుర్రం లద్ది పెట్టినా, చెత్త పడినా వెంటనే తీసేవారు. 


 హైదరాబాద్‌ నగరంలో  దేవిడీల సంస్కృతి ఎక్కువ. ఢిల్లీ, లక్నో, కాశీ వంటి నగరాల మాదిరిగానే ఇక్కడా దేవిడీలు ఎక్కువగానే ఉన్నాయి. ఆనాటి నవాబులు, జమీందారులు దేవిడీలు నిర్మించుకుని అందులో దర్జాగా నివసించేవారు. ఇప్పటికీ కొన్ని దేవిడీలు నేటికీ నగరంలో కనిపిస్తాయి.



20వ శతాబ్దం ప్రారంభం కావటానికి ముందువరకు హైదరాబాద్‌లో హోటళ్లు, వసతి గృహాలు లేవు. ధర్మశాలలే ఉండేవి. హైదరాబాద్‌కు వచ్చిన వారు ధర్మశాలలో వండుకుని తినే వారు. ఉచితంగా అన్నదానం కూడా చేసేవారు.
1943లో ఉస్మానియా ఆసుపత్రి ఎదురుగా చింతల నర్సమ్మ భోజనశాల ఉండేది. అన్నం, పప్పు, రెండు కూరలు, ఊరగాయ, కాచిన నెయ్యి, గడ్డ పెరుగుతో భోజనం లభించేది. రెండుపూటల భోజనానికి రెండు రూపాయలు, వసతికి మరో రెండురూపాయలు తీసుకునేవారు. 


  హైదరాబాద్‌లో హోటళ్లు ప్రారంభమైన తొలినాళ్లలో విచిత్రమైన పరిస్థితి ఉండేది. జనం హోటళ్లకు వెళడానికి మొహమాటపడేవారు.. ఆనాడు హోటళ్లను చాయ్‌ఖానా అని పిలిచేవారు.. చాయ్‌ఖానాకు వెళ్లడం అంటే సారాయి దుకాణానికి వెళ్లినట్లు భయపడేవారు.. 


1920 నాటికి కానీ హైదరాబాద్‌లో హోటళ్లు రాలేదు. టీ, కాఫీలతో పాటు ఉప్మా, వడ,దోశ వంటి టిఫిన్లు ఎక్కడో అరుదుగా లభించేవి. గౌలిగూడ రామమందిరం ప్రాంతంలో సుబ్బారావు హోటల్‌ అనేది తొలి హోటళ్లలో ఒకటి. 


 1920లలో హైదరాబాద్‌లో నాష్తాలు ఖాజీ పకోడా, పూరీసాగ్‌, పూరీచూన్‌లు.. మాంసాహారంలో మేక కాళ్ల ముక్కల పులుసు(పాయ), బన్ను రొట్టెలు ఆనాటి టిఫిన్లు..


 హైదరాబాద్‌లో ఇరానీచాయ్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉంది. 1920లలో గౌలిగూడెంలోని శంకర్‌షేర్‌ అనే హోటల్‌లో మలాయ్‌దార్‌(మీగడతో కూడిన) చాయ్‌ ఆనాడు ఫేమస్‌.. మూడు పైసలకు చాయ్‌.. ఒక పైసకు లవంగం గుచ్చిన పాన్‌.. ఒక పైసకు నాలుగు చార్మినార్‌ సిగరెట్లు.. ఇవీ ఆనాటి హైదరాబాద్‌ ధరలు..



హైదరాబాద్‌ ప్రజలకు టీ ని అలవాటు చేసేందుకు టీ కంపెనీలు చాలా కష్టపడాల్సి వచ్చింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో బహిరంగంగా స్టౌ వెలిగించి అందరిముందే టీని తయారు చేసేవారు. ఒకరు టీ వల్ల వచ్చే లాభాలను గురించి చెప్పేవారు.. మరొకరు తయారు చేసిన టీని ఉచితంగా అందరికీ పంచేవారు.. టీ గొప్పతనాన్ని గురించి ఇంకొకరు ప్రసంగించేవారు.. తరువాత ఇంటింటికీ తిరిగి టీని పంపిణీ చేసేవారు. మొత్తం మీద టీ ని జనానికి అలవాటు చేసి కానీ కంపెనీలు విడిచిపెట్టలేదు..

 గండిపేట్‌కీ పానీ, మదీనాకీ బిర్యానీ హైదరాబాద్‌ ప్రత్యేకతలు.. గండిపేట నీటిలో  తేటదనం ఎక్కువగా ఉంటుంది. మదీనా బిర్యానీలో నిర్వచనాలకే అందని రుచి ఉంటుంది.

 1950 వదశకంలోనే హైదరాబాద్‌లో సినిమాలు వచ్చాయి. ఆనాడు ఆబిడ్స్‌లో సాగర్‌ టాకీస్‌ ప్రసిద్ధమైంది. నాంపల్లిలో మోతీమహల్‌ టాకీసులో హిందీ సినిమాలు వచ్చేవి. 1956లో ఈ మోతీమహల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కొంతకాలం తరువాత దిల్‌షాద్‌ అని పేరు మార్చుకుని తిరిగి ప్రారంభమైంది.

 1908 సెప్టెంబర్‌లో రెండు రోజుల్లో 19 అంగుళాల వర్షం కురిసింది. మూసీ నది కట్టలు తెంచుకుంది. 221 చెరువులు తెగిపోయాయి. నాలుగు వంతెనలు మునిగిపోయాయి. 15వేల మంది మరణించారు. 20వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి.

  మూసీ వరదలకు దానిపై నిర్మించిన మూడు వంతెనలు చాదర్‌ఘాట్‌, పురానాపూల్‌, నయాపూల్‌లు పూర్తిగా మునిగిపోయాయి. చెన్నరాయని గుట్ట(నేటి చాంద్రాయణ గుట్ట) నుంచి షాలిబండ వరకు నగరం పూర్తిగా మునిగిపోయింది.

 మూసీ వరదలు నిజాం సర్కారుకు నేర్పిన గుణపాఠాలు అనేకం ఉన్నాయి. ప్రసిద్ధ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నగరానికి పిలిచి ఆయన సారథ్యంలో హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌(గండిపేట)లు నిర్మించారు. భూగర్భ డ్రెనేజీ వ్యవస్థను నెలకొల్పారు. మురికివాడల స్థానంలో పక్కా ఇళ్లను నిర్మించారు.. భారీ ప్రకృతి విపత్తుల నుంచి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రదర్శించిన చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.


1911లో హైదరాబాద్‌లో ప్లేగు రోగం విస్తరించింది. ప్లేగు గత్తరల వల్ల 15 వేల మంది మృత్యువాత పడ్డారు. చలికాలంలో హైదరాబాద్‌ రావాలంటేనే జనం భయపడేవారు.

1919లో  ఇన్‌ఫ్లూయెంజా తీవ్రంగా వ్యాపించింది. భాగ్యనగరంలో రోజూ కనీసం 500 మంది మరణించేవారని నిజాం సర్కారు రికార్డులు చెప్తున్నాయి.

 1936లో నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పరిపాలనా రజతోత్సవాలను నిర్వహించారు. జూబ్లీహాల్‌ అప్పడు కట్టిందే. జూబ్లీహిల్స్‌, జూబ్లీ క్లబ్‌, జూబ్లీ బజార్‌ వంటివన్నీ అప్పుడు పెట్టిన పేర్లే.

 మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ గోలకొండపై దండెత్తి కుతుబ్‌షాహీల చివరి రాజు తానీషాను జయించాడు. అప్పుడు మొగలాᅣూ సైనికులు నిలిచిన చోటును ఫతే మైదాన్‌ అని పిలిచారు.. ఇదే ఇప్పుడు లాల్‌బహదూర్‌ స్టేడియంగా మారింది.

 తానీషాను ఓడించిన తరువాత ఫతేమైదాన్‌ పక్కనే ఉన్న కొండపైన ఔరంగజేబ్‌ సైనికులు నగారా మోగించారు. అదే నౌబత్‌పహాడ్‌... ఇప్పుడు నగరం సిగలో మల్లెపూవులా వెలిగిపోతున్న బిర్లామందిర్‌ ఉన్న కొండ అదే.
 హైదరాబాద్‌లో రెసిడెన్సీ ప్రాంతం బ్రిటిష్‌ పాలనలో ఉండేది. ఈ ప్రాంతంలో నిజాం చట్టాలు అమలు కాలేదు.. పోలీస్‌ చర్య తరువాత కోఠీలోని రెసిడెన్సీ భవనాన్ని పోలీసు కేంద్ర కార్యాలయానికి ఇవ్వాలని ఆనాటి సైనిక అధికారి జె.ఎన్‌.చౌదరి ప్రభుత్వాన్ని కోరారు.. కానీ, దాన్ని మహిళా కళాశాలకు ఇచ్చారు.. అదే ఇవాళ్టి కోఠీ మహిళా కళాశాల.

 కోఠీలో మొదట రెసిడెన్సీరోడ్డుగా పిలిచిన ప్రాంతం ఆ తరువాత తుర్రేబాజ్‌ఖాన్‌ రోడ్డుగా మారింది. ౧౮౫౭లో తొలి స్వాతంత్య్ర సంగ్రామంలో తుర్రెబాజ్‌ఖాన్‌ బలమైన తిరుగుబాటుదారు.. అతని స్మృతి చిహ్నంగానే తుర్రెబాజ్‌ఖాన్‌ రోడ్డు ఏర్పడింది.

 హైదరాబాద్‌-సికిందరాబాద్‌ల మధ్య ప్రజల వ్యవహారంలో చాలా తేడాలు ఉండేవి. హైదరాబాద్‌ను పట్నం అని పిలిచేవారు.. సికిందరాబాద్‌ను లష్కర్‌ అని పిలిచేవారు. నాడు సికిందరాబాద్‌ ముందు బెజవాడ చిన్న పల్లెలా కనిపించేది.



వేములవాడ భీమకవిని అణగదొక్కిన నన్నయ

by- వి.ఆర్.తూములూరి
courtesy.. namasthe telangana e-paper
రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఉన్న నన్నయ తన సమకాలీనులైన కవును అణగదొక్కి పైకి వచ్చాడు, చివరికి వారి గ్రంథాలు చించి వేయడం, తగుల పెట్టటం చేశాడు.

ఆధునిక , సమకాలీన తెలంగాణ సాహిత్య చరిత్ర మొత్తం అణిచివేతల లేదంటే అవహేళనల మయం. ఇందుకు ప్రాచీన సాహిత్య చరిత్ర మినహాయింపేమి కాదన్నది వెలుగులోకి వస్తోన్న వాస్తవం. ఇందుకు బీజాలు ఆదికవిగా ప్రచారం చేయబడిన నన్నయ చేతనే నాటబడడం గమనార్హం. క్రీ. శ 11 వ శతాబ్దిలో రాజమహేంద్ర వరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన తూర్పు చాణుక్య రాజైన రాజరాజ నరేంవూదుని ఆస్థాన కవిగా ఉన్న నన్నయ తన సమకాలీనులైన కవులను అణగదొక్కి పైకి వచ్చాడని, చివరికి వారి గంథ్రాలు చించివేయడం, తగుల పెట్టటం చేశాడని ఆధునిక యుగ సంస్కర్తగా పేరొందిన కందుకూరి వీరేశ లింగం తన ‘ఆంధ్ర కవుల చరిత్ర’ లో విస్పష్టంగా రాశాడు.

తెలంగాణలోని వేములవాడకు చెందిన భీమ కవి, నన్నయ కన్నా ముందుగానే’ రాఘవ పాండవీయము అనే గ్రంథం రాసి, దానిని రాజైన రాజరాజనరేంవూదునికి చూపించి రాజ సన్మానం పొందడం కోసం రాజమహేంవూదవరం చేరాడు. విష్ణు వర్ధనుడిగా పేరొందిన రాజరాజ నరేంవూదుని ఆస్థాన కవి నన్నయ. రాజసన్మానం పొందకోరిన ఏ కవి అయినా నన్నయ ద్వారా రాజుకు పరిచయం కావలసిందే. దానితో వేములవాడ భీమకవి తన రచన అయిన ‘రాఘవ పాండవీయము’ ను నన్నయకు అప్పగించారు. ఆది చదివిన నన్నయ భీమకవి కవిత్వం అమోఘంగా ఉండటం, అది వెలుగులోకి వస్తే తన ప్రాభవం తగ్గుతుందని భావించి ఆ గ్రంథాన్ని తగుల బెట్టించాడని వీరేశ లింగం వివరించాడు.కందుకూరి వీరేశ లింగం రాసిన ‘ ఆంధ్ర కవుల చరిత్ర’ నుండి ఈ ఉటంకింపును చూడండి.


‘‘నన్నయ భట్టారకుడు తాను రచియింప నారంభించిన శ్రీ మహాభారతమును సంపూర్ణముగా నాంధ్రీకరింపలేక పోవుటకు కారణములు పలువురు పలు విధముగా చెప్పుదురు. కొందరు వేములవాడ భీమకవి శాపము చేత గలిగిన మరణము కారణమందురు. మరి కొందరు యధర్వాణాచార్యులు తెలిగించుచుండిన భారతమును తగుల బెట్టించుట చేత గలిగిన చిత్త చాంచల్యము కారణమందురు. ఈ రెండు కారణములో నేది నిజమైనను ఈ కవి పరోత్కర్షమును సహింపజాలని దుస్స్వభావము కలవాడయినట్టూ హింపదగియున్నది.

ఈయన తోడి సమకాలినుడైన వేముల వాడ భీమకవి రాఘవపాండవీయమును కవిజనాక్షిశయములో జేర్చి యొక్క వ్యాకరణ మును చేసి రాజసన్మానమును బొందుటకయి రాజమహేంవూదపురమునకు దెచ్చి విష్ణువర్ధనుని యాస్థాన పండితుండయి యున్న నన్నయ భట్టునకు జూపగా నతడా కవిత్వ ము మిక్కిలి శ్లాఘ పాత్రముగా నుండుట చూచి యోర్వలేక యా పుస్తకములు లోకములో వ్యాపించిన యెడల దన పుస్తకములకు బ్రసిద్ధి రానేరదని యెంచి వానిని తగులబెట్టించినట్లును, అటు మీదట నతడింట లేనప్పుడు భీమకవి వచ్చి అతని భార్యను నీ భర్త ఏమి చేయుచున్నాడని యడిగి యామె తన భర్త రహస్య స్థలమున ఉండి యరణ్య పర్వం రచించుచున్నాడని చెప్పిన మీదట యతనింకను నరణ్యములోనే ఉన్నాడా యట్లే యుండునుగాక అని శపించి తన పుస్తకముల నణగదొక్కేనన్న కోపము చేత నన్నయభట్టు రచించిన ఛందస్సును వ్యాకరణమును భార్య నడిగి పుచ్చుకొని దానిని చించి గోదావరి లో గలిపివేసి తాను చిరకాలము కష్టపడి చేసిన గ్రంథములు పోయినవన్న దుఃఖము చేత బెంగపెట్టుకొని కాలధర్మము నొందినట్లును, అతని శాపము తగిలి నన్నయ భట్టు వనములో మృతి నొందినట్లును, అట్లు నశించిన వ్యాకరణము సిద్ధులలో గలిసిన సారంగధరుడు తన చిన్నతనములో నేర్చుకొని యుండుట చేత మల బాల సరస్వతి యను బ్రహ్మణునకు జెప్పి నట్లును లోక ప్రవాదము కలిగి యున్నది.

తన కాలం నాటికి బహుళ ప్రచారంలో ఉన్న విషయాన్ని కందుకూరి వీరేశలింగం తన ‘ ఆంధ్ర కవుల చరిత్ర’ లో ఉటంకించారు. ఈ కథనం మీద చారివూతక చర్చ జరగవలసి ఉంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి ప్రసిద్ధి పొందకుండా, తొలి గ్రంథంగా భావించబడిన తన రచన మహాభారత ఆంధ్రీకరణ కన్నా మరో రచన ముందు వెలుగు చూడకుండా చేసిన కుట్ర ఇందులో దాగి ఉంది. ఆంధ్రుల ఆధిపత్య అభిజాత్యం ఆది కవిగా పిలవబడిన నన్నయ నుంచే ఆరంభమైందని ఈ ఘటన రుజువు చేస్తోంది

21, జులై 2011, గురువారం

బంద్ అంటే ఇదేనా..?

పార్లమెంటులో తెలంగాణ బిల్లును డిమాండ్ చేస్తూ కొన్ని రోజుల క్రితం రెండురోజుల పాటు బంద్ నిర్వహించారు. ఇప్పుడు సమైక్యరాష్ట్రాన్నే కొనసాగించాలంటూ కడప జిల్లాలో గురువారం (20/07/11)న బంద్ కు జేఏసీ పిలుపు నిచ్చింది. అంతా స్వచ్ఛంధంగా బంద్ లో పాల్గొనాలని కోరింది. అంతా బాగానే ఉన్నా, బంద్ పాటించని కొంతమందిపై దాడులు జరగడమే ఆందోళనను కలిగిస్తోంది. సీమాంధ్రలో సాగుతోంది ప్రజా ఉద్యమమని అక్కడి నేతలు చెబుతున్నారు. కానీ, కడప జిల్లాలో ఈ రోజు ఉదయం విచారకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీ నేతలు బలవంతంగా బంద్ ను నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లలో వీరంగం సృష్టించారు. బస్సుల టైర్లలో నుంచి గాలి తీసేశారు. అద్దాలు పగలగొట్టారు. ఉదయాన్నే షాపులు తెరిచిన చిన్న చిన్న వ్యాపారులపై దాడులు చేశారు. బలవంతంగా దుకాణాలు మూయించారు. పెట్రోల్ బంకులపై దాడులు చేశారు. పెట్రోల్ నింపుకుంటున్న వారిని బెదిరించారు. బాటిల్ లో పెట్రోల్ పట్టుకుంటున్ ఓ వ్యక్తి చేతిలో నుంచి దాన్ని లాక్కొని విసిరి పారేశారు. ఆటో డ్రైవర్లను కొట్టారు. చిన్న చిన్న వారిపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఇదేనా స్వచ్ఛంద బంద్..? ఇదేనా ప్రజా ఉద్యమం..?