29, జులై 2011, శుక్రవారం

విభజన'లో బహుజన హితం - కొత్త శివమూర్తి

 extracted from a facebook post
సీమాంధ్రలో ప్రత్యేకాంధ్ర అన్న వారిని శత్రువుగా చూస్తున్నారు. 1972లో రాయలసీమ నాయకుడు బి.వి.సుబ్బారెడ్డి, కోస్తా నేత కాకాని వెంకటరత్నం నాయకత్వంలో ప్రత్యేకాంధ్ర కావాలని సీమాంధ్ర ప్రజలు బ్రహ్మాండమైన ఉద్యమాన్ని చేశారు. ఇప్పుడు ప్రత్యేకాంధ్రను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర రాజకీయ నేతలు, ప్రజలు ఆ చరిత్రను మర్చిపోయినట్టున్నారు.

తెలంగాణలో సమైక్యాంధ్రవాదాన్ని ప్రచారం చేయకుండా ప్రత్యేక తెలంగాణ వాదులు అడ్డుకోవడం అప్రజాస్వామికం అని సీమాంధ్ర నేతలు విమర్శిస్తున్నారు కదా. మరి సీమాంధ్రలో ప్రత్యేకాంధ్రవాద ప్రచారానికి ఆటంకాలు కల్గించడం ప్రజాస్వామికమేనా? అసలు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు కోరుకొంటున్నారు? సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్ర అని ఎందుకంటున్నారు?

మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న సీమాంధ్రులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం చేసి మద్రాసులేని ఆంధ్రరాష్ట్రాన్ని 1953లో సాధించుకున్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రం 1956లో విలీనం కావడంతో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. ఇంతవరకు నాలుగు జిల్లాల రాయలసీమ నుంచి ఆరుగురు నాయకులు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులయ్యారు. తొమ్మిది జిల్లాల తెలంగాణ నుంచి నలుగురు ముఖ్యమంత్రులయ్యారు.

అయిదు కోస్తాంధ్ర జిల్లాల నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులయ్యారు. మూడు జిల్లాలు గల గల ఉత్తరాంధ్ర నుంచి ఒక్కరూ ముఖ్యమంత్రి కాలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు శాసిస్తున్నారని ఆ ప్రాం తాల నేతలు ముఖ్యమంత్రులై న విధానం స్పష్టం చేస్తుంది. ముఖ్యమంత్రులలో పదిమంది రెడ్లు, ముగ్గురు కమ్మలు, ఇద్దరు బ్రాహ్మిణ్స్ కాగా మాల, వైశ్య, వెలమ సామాజిక వర్గాల నుంచి ఒకొక్కరు చొప్పున ఉన్నారు.

ముఖ్యమంత్రుల పాలనా కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు శాసిస్తున్నాయని తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలుగా విభజిస్తే రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల రాజకీయ ఆధిపత్యం బలహీన పడుతుంది. కనుక రెడ్డి, కమ్మ వర్గాలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నందున సమైక్యాంధ్ర నినాదం ఉనికిలోకి వచ్చింది.

తెలంగాణ శాసనసభ్యులు 119 మంది కాగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు 175 మంది ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ ఎమ్మెల్యేలు మైనార్టీగా ఉండగా, సీమాంధ్ర వారు మెజారిటీగా ఉన్నారు. మెజార్టీ సభ్యల నిర్ణయానికి మైనార్టీ వారు కట్టుబడి ఉం డాలి అనేది ప్రజాస్వామిక సూత్రం. కనుక అన్ని సందర్భాలలోను తెలంగాణ వారిమీద సీమాంధ్రులే రాజకీయ ఆధిపత్యం చెలాయించగలుగుతున్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ నేత అయినా సీమా ంధ్ర ఎమ్మెల్యేలు బలపర్చకపోతే ముఖ్యమంత్రిగా ఉండలేడు.

దీంతో తెలంగాణ వారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో సీమాంధ్ర వా రి చెప్పుచేతల్లో ఉండే పరిస్థితి ఏర్పడింది. పదవుల కోసం తమ ప్రా ంత నాయకులు కేంద్ర పాలకులకు, సీమాంధ్ర నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తూ వెన్నెముక లేని నాయకులుగా రాజకీయ రంగంలో ఉన్నారని తెలంగాణ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. వెన్నెముక లేని తెలంగాణ నేతలు, సీమాంధ్ర నేతల రాజకీయాధిపత్యం వల్ల ఆంధ్రప్రదేశ్ ఏర్పడిననాటి నుంచీ అన్ని రంగాల్లో తమకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఈ కారణంగానే వారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకొంటున్నారు.

ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలపక ముందు అవి విడివిడిగా ఉన్నాయి. తెలంగాణ సుమారు ఐదు శతాబ్దాల కాలం ముస్లిం రాజుల పాలనలో ఉంది. సీమాంధ్ర రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వలసపాలనలో మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉంది. తెలంగాణలో ఉర్దూ పాలనా భాషగా ఉండగా, సీమాంధ్రలో ప్రభుత్వ పా లన ఇంగ్లీషు భాషలో కొనసాగింది. యూరోప్‌లో జరిగిన పారిశ్రామి క విప్లవాన్ని ఆధారం చేసుకొని మనదేశంలో బ్రిటిష్ వలసపాలన ఏర్పడింది.

యూరోప్‌లోని పారిశ్రామిక సమాజ దోపిడీ అవసరంలో భాగంగా సీమాంధ్రలో విద్యా, వ్యవసాయ, వ్యాపార రంగాలు అభివృద్ధి చేయబడ్డాయి. నిజాం నవాబుల పాలనలో ఉన్న తెలంగాణ అ న్ని రంగాలలో వెనుకబడిపోయింది. దీంతో పాటు ఆంధ్ర, తెలంగా ణ ప్రాంతాల ప్రజల్లో ఆచారాల వ్యవహారాలలోను, కట్టు బొట్టులలో ను, వేష భాషలలోను తేడా ఉంది. ఇలా ఆర్థిక, రాజకీయ, సామాజి క, సాంస్కృతిక రంగాల్లో వ్యత్యాసంగల ఆంధ్ర, తెలంగాణను భాషపేరుతో ఒకరాష్ట్రంగా ప్రకటించారు కేంద్ర కాంగ్రెస్ పాలకులు.

నిజానికి భాష పేరుతో ఆంధ్ర, తెలంగాణలను కలిపారనే ప్రచారం అసత్యం అని చెప్పవచ్చు. రాజకీయ పార్టీలు, నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలపబడ్డాయని భావించడానికి బలమైన ఆధారాలున్నాయి. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిస్తే తమ బలం పెరుగుతుందని భావించి కమ్యూనిస్టులు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే ప్రచారం చేసి ఉండవచ్చు.

ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిస్తే తమకు మంచి రాజధాని దక్కడంతో పాటు తమ దోపిడీ ఆధిపత్యానికి తెలంగాణ ప్రాంతం ఒక వనరుగా ఉంటుందని సీమాంధ్ర రాజకీయ నాయకులు భావించి ఉండవచ్చు. తెలంగాణలో ముస్లిం రాజుల పాలన కొనసాగినందున ఆ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కమ్యూనిస్టులు సాయుధపోరాటం చేసినందున ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపితే ఇస్లాం అతి వాదులను, కమ్యూనిస్టు అతివాదులను అణచివేయవచ్చు అని కేంద్ర పాలకులు భావించి ఉండవచ్చు. ఇటువంటి అనేక కారణాల వల్ల ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలపబడ్డాయి.

తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు ఆమోదించినందునే రెండు ప్రాంతాలు కలపబడ్డాయని సీమాంధ్ర నేతలు వాదిస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటి? ఫజులాలీ కమిషన్ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలపడానికి ఆమోదించలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం రెండు ప్రాంతాలను కలపాలని భావిస్తే 1962లో జరిగే ఎన్నికలలో తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో మూడు వంతుల మంది ఆమోదిస్తేనే రెండు ప్రాంతాలను కలపాలని సూచించింది. కానీ ఫజులాలీ కమిషన్ సూచనకు విలువ నివ్వకుండా కేంద్ర పాలకులు, 1956లోనే రెండు ప్రాంతాలను కలిపారు. ఇందుకు పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఆధారం చేసుకున్నారు.

ఈ ఒప్పందం ద్వారా రెండు ప్రాంతాలు కలపబడ్డాయి అంటే అర్థమేమిటి? తెలంగాణ ప్రజలు ఇష్టపూర్వకంగా కలవలేదని కొన్ని షరతులకు లోబడి కలిశారని పెద్దమనుషుల ఒప్పందం తెలియజేస్తుంది. అలాగే ఆనాటి ఆంధ్ర, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీలు కూడా తెలంగాణ ప్రజలు కొన్ని షరతులకు లోబడి కలవడానికి ఆమోదించారని తెలియజేస్తుంది. షరతుల ద్వారా కలిసిన వారికి షరతులను అమలు చేయనప్పుడు విడిపోయే హక్కు కూడా ఉంటుంది. దీనినే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. పెద్దమనుషుల ఒప్పందం అమలుచేయలేదు. ఆరు సూత్రాల పథకం అమలుచేయలేదు. జి.వో 610 అమలు చేయలేదు.

అంటే అర్థం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హా మీలను సీమాంధ్ర నాయకులు నెరవేర్చలేదు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరేవేర్చనందున వారు తమకు ఆంధ్రా నుం చి విడిపోయే హక్కు ఉందంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చనివారికి కలిసి ఉం డమని అడిగే హక్కు ఉండదు అంటున్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసి ఉన్నా, విడిపోయినా రెండు ప్రాంతాలలోని సామా న్య ప్రజలకు పెద్దగా లాభంకాని, నష్టంకాని ఉండదు. కానీ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు విడిపోతే అగ్రకులాల రాజకీయ గుత్తాధిపత్య ం బలహీనపడడంతో పాటు తెలంగాణ ప్రాంతం మీద సీమాంధ్ర నాయకుల దోపిడీ రాజకీయ ఆధిపత్యం అంతమవుతుంది. అందుకే సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్ర నినాదాన్ని చేపట్టారు.

సీమాంధ్ర ప్రాంతంలో వందలాది సంవత్సరాల నుంచి అణిచివేత, డోపిడీకి గురైన బహుజనులు సమైక్యాంధ్ర వాదాన్ని బలపరచడం అంటే, సీమాంధ్రలోని అగ్రకుల రాజకీయ నాయకుల స్వార్థానికి బలిపశువులు కావడమే. అందువల్ల సీమాంధ్రలోని బహుజనులు అగ్రకులాల రాజకీయ గుత్తాధిపత్యాన్ని బలహీనం చేయడం కోసం సమైక్యాంధ్ర నినాదానికి సమాధికట్టి జైఆంధ్ర నినాదానికి పట్టం కట్టాలి. అప్పుడే వారు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు న్యాయం చేసిన వారవుతారు.

అంంతేకాక జైఆంధ్ర ఉద్యమం ద్వారా సీమాంధ్ర ప్రాంతాలలో అగ్రకులాల రాజకీయ గుత్తాధిపత్యాన్ని ఎదిరించే బహుజనుల నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకున్నవారవుతారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో స్వార్థపరులైన రాజకీయ నాయకుల అనుసరిస్తున్న విధానాలకు బహుజన బిడ్డలు బలౌతున్నారు. ఈ విధానం అంతం కావడానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటే పరిష్కారం. అందువల్ల సీమాంధ్రలోని బహుజనులు సమైక్యాంధ్రను వ్యతిరేకిస్తూ జైఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టినప్పుడు రెండు ప్రాంతాల ప్రజల మధ్య సోదర భావం ఏర్పడుతుంది.

- కొత్త శివమూర్తి, ప్రత్యేకాంధ్రవాది, తూ.గో.జిల్లా

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Excellent... i am 100% agree with you. if most of the people think like this we will solve this is issue ASAP.

అజ్ఞాత చెప్పారు...

Excellent... i am 100% Agree with you. if most of the people think like this we will solve this issue ASAP. Thanks for your post