29, నవంబర్ 2014, శనివారం

దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ

దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ ఈరోజు సచివాలయం లో ప్రభుత్వ సలహాదారు శ్రీ కే వీ రమణ గారు అవిశ్కరించారు. దానికి సంబంధించిన వార్తా స్టూడియో ఎన్ లో ప్రసారమయింది ఈ కథనాలకు గతం లో జీ 24 గంటలు చానల్ లో వీక్షకులు అదరించారు. తరువాత బ్లాగర్లు  అభిమనించారు. ఇప్పుడు పాఠకులు ఆదరించాలని ఆశిస్తున్నా. సభలో  శ్రీ కే వీ రమణ, మన కాలపు మార్గదర్శక పాత్రికేయులు శ్రీ రామచంద్రమూర్తి , శ్రీ శైలేష్ రెడ్డి, శ్రీ దేవులపల్లి అమర్, శ్రీ దిలీప్ రెడ్డి, ఉన్నారు.

దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ | Studio N

దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ ఈరోజు సచివాలయం లో ప్రభుత్వ సలహాదారు శ్రీ కే వీ రమణ గారు అవిశ్కరించరు. దానికి సంబంధించిన వార్తా స్టూడియో ఎన్ లో ప్రసారమయింది ఈ కథనాలకు గతం లో జీ 24 గంటలు చానల్ లో వీక్షకులు అదరించారు. తరువాత బ్లాగర్లు  అభిమనించారు. ఇప్పుడు పాఠకులు ఆదరించాలని ఆశిస్తున్నా

12, నవంబర్ 2014, బుధవారం

దేవరహస్యం తొలి కాపీ

పుస్తకం రాయడం ఒక ఎత్తు. ప్రచురణ కావడం ఒక ఎత్తు. అచ్చయిన తొలి పుస్తకాన్ని కౌగిట్లోకి తీసుకోవడం.. రచయితకు అతి అందమైన అనుభవం. తొలి కాపీని అదే సందర్భంలో.. అదే ఆనంద క్షణాల్లో.. రచయిత చేతుల మీదుగా పాఠకులు అందుకోవడం మరింత అరుదైన దృశ్యం. ఈ ఆనందమయ క్షణాలన్నీ.. నా కంటిముందు చకచకా జరిగిపోవడం.. నాకు కలిగిన యోగం.
తొలికాపీ అందుకోవడంకోసం శంషాబాద్ నుంచి రెక్కలు కట్టుకొని వచ్చిన అను చిరు గారికి, ఆ అరుదైన క్షణం నాదేనన్నట్టు నారపల్లినుంచి విచ్చేసిన Kovela Santoshkumar గారికి.. మరీ మరీ ధన్యవాదాలు.
—వాసిరెడ్డి వేణుగోపాల్ - వాసిరెడ్డి ప్రచురణలు

కినిగే లో ‘దేవ రహస్యం’.

ఇలాంటి పుస్తకం తెలుగులో ఇదే మొదటిసారి...
విశ్వంలో తొలి సర్జన్ ఎవరు?
 మహాభారత యుద్ధంలో భారీ పేలుళ్లు జరిగాయా?
 కైలాసంలో శివుడున్నాడా?
రామబాణంలో న్యూక్లియర్ పవర్ వుందా?
దేవతల కాలమానానికి, మన కాలమానానికి తేడా ఏమిటి?
 నాటి పుష్పక విమానమే.. ఇవాల్టి ఎగిరే పళ్లెమా?
శ్రీకృష్ణుడు నిజమా? అబద్ధమా?
శివుడికి కైలాసాలు ఎన్ని వున్నాయి?
కురుక్షేత్రంలో రేడియేషన్ ఆనవాళ్లు ఎక్కడివి?
 భూతాలకూ లిపి వుందా? బ్రహ్మాస్త్రం అణ్వస్త్రమేనా?
ఇలాంటి అనేకానేక సందేహాలకు సమాధానం ఇచ్చే పుస్తకం.. సీనియర్ జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్ రాసిన ‘దేవ రహస్యం’.
కినిగే లో చూడండి .. కొనండి

మా నాన్నగారి గురించి దేవరహస్యం పుస్తకం లో రాసుకున్న నాలుగు మాటలు.


ఆయన గురించి రాయాలంటే ఎంతో శక్తి కావాలి. అల్పుడిని నా వాళ్ళ అయ్యే పని కాదు. పుంభావ సరస్వతి కడుపున జన్మించటం ఎన్ని జన్మల పాటు తపస్సు చేస్తే మాత్రం సాధ్యం cheppandi? ఈ జీవితానికి ఆయన కడుపునా పుట్టినందుకు కొద్దో గొప్పో ఈ కాస్త నాలుగు మాటలు రాయగాలిగా. నా పాలిట నడిచే దేవుడు అయన.
.........................................................
నా పుట్టుకే పూర్వజన్మ సుకృతం. ఏమి తపస్సు చేసి జన్మించానో నాకైతే తెలియదు కానీ, సాక్షాత్తూ విద్యాసరస్వతి కడుపున పుట్టాను.
‘‘నిజమునకు భావుకుండని
సృజనన్ పదివేల మంది నెవ్వడొయొక్కం
డు జనించు, మెరయువానికి
రజనీపతి కాంతి భ్రూభరమ్మపుడపుడై’’
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విరచితమైన పద్యమిది. తెలుగుదేశంలో విశ్వనాథ సాహిత్యానికి ఈరోజు సాధికారత ఉన్న సారస్వత మూర్తి ఎవరైనా ఉన్నారంటే.. వారు మా నాన్నగారు.. ఆచార్య కోవెల సుపసన్నాచార్య.తెలుగు సాహిత్యంలో నవ్యసంప్రదాయవాదానికి నాంది పలికి, చేతనావర్తంతో అరాచక అధిక్షేపాన్ని నిరసించిన ఈ పుంభావ సరస్వతికి విశ్వనాథవారి ఈ పద్యం సంపూర్ణంగా వర్తిస్తుంది. సద్గురువులన్నట్లు సౌమ్య, గంభీర, మిత భాషాద్యనేక శుభలక్షణ సంపన్నులైన ఆ సరస్వతీ తీర్థులకు కుమారుడిగా పుట్టడం కంటే ఈ జన్మకు సార్థకత ఏముంటుంది? ఆయన సాహిత్య సాగరంలో నేను నీటిబొట్టునైనా కాలేకపోవచ్చు.. కానీ, సాహిత్యమైనా, సాంఘికమైనా రాయటమన్నదే వృత్తిగా మలచుకుని ఈషణ్మాత్రమైనా ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేయగలుగుతున్నానంటే ఆయన సంపూర్ణ కరుణా కటాక్షాలవల్లే.. నా జీవితంలోని ప్రతి మలుపులోనూ.. నా రాతలోని ప్రతి పదంలోనూ ఆయన ముద్ర తప్ప అన్యథా కనిపించదు. నాకు అస్తిత్వం.. ఉనికి.. మనుగడ.. అంతా ఆ ‘‘కోవెల’’నే.

నా దేవరహస్యం పుస్తకం లో అమ్మ కోసం ఉబికి వచ్చిన ఉద్వేగం ......

........................................................
అమ్మ .. వరంగల్లుకు కాకతి భద్రకాళి ఎలాగో.. మా కుటుంబానికి అమ్మే అమ్మలగన్నయమ్మ. జీవించి ఉన్నప్పుడు ఏమీ చేసిన వాడను

కాను. చేద్దామనుకున్నప్పుడు కంటిముందు లేకుండా పోయి కఠినంగా శిక్షిస్తోంది. 28 ఏళ్ల వయసులో ఊరొదిలి పెట్టి హైదరాబాద్

వచ్చి చేరినవాణ్ణి.. పెద్దవాడు తప్ప చిన్నవాణ్ణి... ఎప్పుడూ దగ్గర ఉన్నవాణ్ణి కాను. గత 20 ఏళ్లలో చుట్టపు చూపుగానే

వరంగల్లుకు వెళ్లి వచ్చిన వాణ్ణి.. అయినా ఆమె ముగురమ్మల మూలపుటమ్మ.. ఏనాడూ నన్ను వేరు చేయలేదు.. చేసి దూరం చేయలేదు.

వరంగల్లుకు వెళ్లి తిరిగి హైదరాబాద్ బయలుదేరేప్పుడు తప్పనిసరిగా ఆమె చేతులమీదుగా కొంత నగదు తీసుకొని రావలసిందే. అది పది

రూపాయలైనా కావచ్చు.. వంద రూపాయలైనా కావచ్చు. పెద్దవాడికైనా, నాకైనా తప్పనిసరిగా ఇచ్చి పంపించేది. ఆమె దిండుకింది నుంచి

తీసి ఇచ్చే ఆ డబ్బులు నాకు అషై్టశ్వర్యాలతో సమానం.. రెండేళ్లు దాటింది. ఇప్పుడూ వరంగల్లుకు వెళ్తున్నా.. వస్తున్నా..

కానీ.. వచ్చేప్పుడు ఎవరిని డబ్బులడగాలి.. ఏమని అడగాలి? వరంగల్లు నుంచి బయలుదేరిన ప్రతిసారీ శరీరంలోని కండరాలన్నీ

ఒక్కుదుటున కదిలిపోతాయి.. ఒళ్లు గగుర్పొడుస్తుంది. అమ్మ కనీసం మంచంపైనైనా సరే అలాగే ఉంటేె బాగుండుననిపిస్తుంది. ఆమె

పడుకున్న మంచం అమ్మ ఉన్నప్పటిలాగానే మౌనంగా పలకరిస్తుంది.. ఆమె కూర్చున్న కుర్చీ యథాతథ స్థానంలో అలాగే ఉండిపోయింది.

అందులో ఆమె మాత్రం లేదు. వాటి స్థానం మారిస్తే ఆమె జ్ఞాపకం మాసిపోతుంది. అందుకే వాటిని నాన్నగారు కదల్చలేదు..
జీ స్టోరీస్ కథనాల పరంపరలో ఒక ఎపిసోడ్ ‘‘మీరు మీ అమ్మతో మాట్లాడుతున్నారా’’ అన్న శీర్షికతో కార్యక్రమాన్ని ప్రసారం

చేస్తే.. అమ్మ ఆందోళన చెందింది. నన్ను దృష్టిలో ఉంచుకుని రాశావా అని నిలదీసింది. రోజూ ఒకసారి ఫోన్‌చేసి పలకరించకపోతే

నిష్ఠూరమాడింది. రెండేళ్లనుంచి ఆమె పలకరింపులు లేవు.. నిష్ఠూరాలు లేవు.. ఆప్యాయతలు లేవు.. కానీ, మౌనంగానే ఆమె సజీవమై నా

వెన్నంటే ఉండి, వెన్ను తట్టి నడిపిస్తోంది. ఇదేమీ భావోద్వేగం కాదు. వాస్తవం. జీవితంలో ఎవరికీ ఎదురుకాని అపూర్వ అనుభవం.

అమ్మ అస్తమించిన తరువాత అంత్యక్రియలలో భాగంగా కొత్త చీర, ఆకుపచ్చ గాజులు...పసుపు, కుంకుమలతో సాగనంపాము. రెండవరోజున

ఉత్తరక్రియలు నిర్వహించటానికి వెళ్లిన నాకు అమ్మ చేతి గాజు ఒకే ఒక్కటి.. పగుల కుండా, కరగకుండా చితాభస్మంలోంచి పునీతమై నా

చేతికి చిక్కింది. సాధారణంగా మట్టిగాజులు అంత వేడిలో కరిగిపోకుండా ఉండటం అసాధ్యం. కనీసం పగిలిపోవాలి. అన్ని గాజులూ అలాగే

కరిగిపోయాయి, కానీ, నేనున్నానంటూ నిండు ముత్తైవతనానికి ఆదర్శమైన గాజుగా అమ్మ మళ్లీ తిరిగి వచ్చింది. నన్ను సంపూర్ణంగా

కటాక్షిస్తోంది.. ఈ గ్రంథాన్ని ఆమెకు సభక్తికంగా అర్పించుకుంటున్నాను.