22, డిసెంబర్ 2012, శనివారం

జనం గొంతు విచ్చుకుంటోంది.. టెన్ టీవీ ఆవిష్కారమవుతోంది


ఒక మహాయుగం పరిసమాప్తం కాబోతోంది. మరో మహా యుగం ప్రారంభం అవుతోంది. ఇది ప్రళయం కాదు. సునామీలు కాదు.. సమాచార ప్రసార విశ్వాన్ని ప్రళయకాల జర్ఝరులు అతలాకుతలం చేయనున్నాయి. తెలుగు ప్రజపై జర్నలిజం అనే ముసుగులో  సాగుతున్న నిరంకుశ సమాచార స్రవంతులు ఆగిపోనున్నాయి. ఇది డిసెంబర్ 21 కాదు. 2012 సినిమా అంతకంటే కాదు..  ఒక ప్రత్యామ్నాయ శకం ఆవిర్భావానికి నాంది. ఇంతకాలం వినిపించకుండా పోయిన అనేక గొంతుల వాణి.. ఇప్పటిదాకా కనిపించకుండా పోయిన అనేక యథార్థ చిత్రాల తెర . నిజం నిప్పై.. తనపై ఇన్నాళ్లూ కప్పి ఉంచిన నివురును తొలగించుకుంటూ మింటికెగసి పడే అపూర్వ సందర్భం. ప్రజలు తమకు తాముగా తమ నట్టింట్లో పెరిగిపోతున్న అంటువ్యాధికి చేస్తున్న అత్యాధునిక చికిత్స. దానికి పేరు 10టివీ.
సమతుల్యం లేకుండా ఎవరి కాడినో మోస్తున్న బరువు నుంచి విముక్తి ...10టివీ
నలుగురు కలిసి చూడలేని ఏ సర్టిఫికేట్ల మీడియాకు సెన్సార్... 10టివీ
నినాదాలతో.. ట్యాగ్ లైన్లతో ముంచెత్తే భ్రమల నుంచి ముక్తి... 10టివీ
నిజమైన వార్తా స్రవంతులపై కప్పిన ముసుగుల పాలిటి కత్తెర... 10టివీ
సకల జనుల సర్వతో ముఖ వికాసాన్ని కాంక్షించే అభిమానం.. 10టివీ
..................................................................................
10 టీవీ ఎందుకు వస్తోంది.. ఉన్న చానళ్లు చాలకనా.. ? అందుకు కారణం ఇది.
పత్రికాస్వేచ్ఛ పేరుతో మీడియా అనుభవిస్తున్న స్వాతంత్య్రానికి పరిమితులు లేకుండా పోయింది. వాస్తవానికి పత్రికా స్వేచ్ఛ అన్న పదానికి ఎక్కడా చట్టబద్ధత లేదు. భారత రాజ్యాంగంలో ఎక్కడా పత్రికాస్వేచ్ఛ గురించి పేర్కొనలేదు. 19వ అ`దికరణంలోని భావప్రకటనా స్వేచ్ఛనే పత్రికా స్వేచ్ఛగా పేర్కొంటూ మీడియా తన అస్తిత్వాన్ని కొనసాగిస్తున్నది.  సమాజంలో అది నిర్వహించే కీలక భూమికను దష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలూ దీన్ని పట్టించుకోవటం లేదు. స్వయం నిర్దేషిత స్వేచ్ఛను కూడా మీడియా దుర్వినియోగం చేయటం వల్ల ఎవరికీ మేలు జరగకపోగా, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళు్తన్నాయి. 
తెలుగు మీడియా పెడ పోకడలకు ఇవి కొన్ని ఉదాహరణలు..
'  నాలుగున్నర సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలోనే కరీంనగర్‌ జిల్లాలో ఒక ఘటన జరిగింది. ఒక వ్యక్తి ఓ భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆత్మహత్య చేసుకోవటానికి ముందే చానళు్ల అక్కడికి చేరుకున్నాయి. అతను భవంతి పైనుంచి డిమాండ్లు చేస్తున్నప్పటి నుంచి అతను పై నుంచి దూకి చనిపోయేంత వరకు కూడా ప్రతి క్షణం రికార్డు చేశాయి. ఆ తరువాత ఆ రోజంతా ఆ సన్నివేశాన్ని జూమ్‌ ఇన్‌లు, జూమ్‌ అవుట్‌లు, స్లో మోషన్‌.. ఇలా రక రకాలుగా ప్రసారం చేశారు. ఒళు్ల గగుర్పొడిచే, సున్నిత మనస్సులను తీవ్రంగా గాయపరిచే ఇలాంటి ఘటనలను ప్రసారం చేయటం వల్ల సమాజంలో ఎలాంటి మార్పును మీడియా కోరుకుందో అర్థం కాదు.. దీని తరువాత ఇలాంటి ఘటనలు మరో రెండు జరిగాయి. అంతే కాదు... సెల్‌ఫోన్‌ టవర్‌లపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ `ెదిరించిన ఘటనలూ ఆ తరువాత రొటీన్‌గా మారిపోయాయి. 
* '  ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఒక అమ్మాయిని గ్యాంగ్‌ రేప్‌ చేసిన వ్యవహారంలో పోలీసులు నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోకుండా ఆ వ్యవహారానికి సంబం`దించిన అశ్లీల సిడిలను లోపాయికారిగా మీడియాకు విడుదల చేయటం అనైతికం. పోలీసులు తాము విడుదల చేయలేదని చెప్తున్నా.. అక్కడి నుంచే లీకయిందన్న వార్తలు కొట్టిపారేయలేం. మీడియా అయినా సరిగ్గా వ్యవహరించిందా అంటే అదీ లేదు.. ``దితురాలి పేరు చెప్పకుండా  ముఖంపై మాస్‌‌క వేసినంత మాత్రాన గోప్యతను పాటించినట్లు ఎలా అవుతుంది? ఘటన జరిగిన స్థలాన్ని పేర్కొని, ``దితురాలి తల్లిదండ్రుల పేర్లు చెప్పటం ద్వారా అమ్మాయి అస్తిత్వాన్ని చెప్పకనే చెప్పారు. ఇలాంటి దశ్యాలను రోజంతా అటు తిప్పి, ఇటు తిప్పి చూపించటం వల్ల ఆ అమ్మాయి కుటుం`ానికి నష్టం చేసినట్లే కానీ, మేలు చేసిందేమీ లేదు... అదష్ట వశాత్తూ పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయకుండా, రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. 
 నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ వ్యవహారంలోనూ ప్రాంతీయ మీడియా అత్యుత్సాహం హద్దులు దాటిపోయింది. బాధితురాలి చిత్రాన్ని గ్రాఫిక్లో తయారు చేసి, ముఖానికి ముసుగు వేసి ఓ అరగంట పాటు తెగ హడావిడి చేశారు. విక్టిమ్ విషయంలో మొరాలిటీని పాటించాలన్న కనీస ఇంగితం కూడా ఆ చానల్ కు లేకుండా పోయింది.

ఇలాంటి పెడధోరణులకు ముగింపు పలకటానికి ముందుకు వస్తోంది 10టీవీ
దొంగ వ్యాఖ్యానాలను తిప్పి కొట్టడానికి జనం నాడై జీవం పోసుకుంటోంది 10 టీవీ
వార్తలకు వ్యాపారం కట్టిన సంకెళ్లను తెంచుకుని ప్రత్యామ్నాయంగా ఆవిష్కారమవుతోంది 10టీవీ

మనం చేసే ప్రతి పనినీ ప్రజలు గమనిస్తారు.. ఏ తెరపై ఏ తోలుబొమ్మలాట ఆడుతోందో తెలుసుకోలేనంత అమాయకులు కారు. ఏది సత్యమో.. అసత్యమో అర్థం చేసుకోలేనంత మూర్ఖులు కారు. అందుకే.. ఇప్పుడు వాళ్లే.. తమదైన చానల్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. వార్తలకు కొత్త ప్రాణం పోసుకుంటూ.. పదునెక్కేలా తామే వార్తల వెలుగు మొలకలవుతున్నారు. ఆకాశమంత విశాల వేదికపై ప్రజాస్వామికమైన ప్రతి ఆకాంక్షను అభివ్యక్తం చేయటానికి వారికి టెన్ టీవీ ఆసరా అవుతోంది. నిత్యం బతుకు సమరం సాగిస్తున్న జన శ్రేణులన్నిటినీ స్పర్శిస్తూ వారి బతుకు తెరను ఆవిష్కరించేందుకు సన్నద్ధమై ముందుకు వస్తోంది 10 టీవి.

3, డిసెంబర్ 2012, సోమవారం

పోతన పంచశతి ఉత్సవాల్లో పివి.. సుప్రసన్న

ముప్ఫై ఏళ్ల క్రితం. 1982 మార్చిలో వరంగల్లులో జరిగిన పోతన పంచశతి ఉత్పవాల్లో పివి నరసింహారావు, బెజవాడ గోపాలరెడ్డి, కోవెల సుప్రసన్నాచార్య

2, మే 2012, బుధవారం

పాత సామాన్ల సంఘం ఎన్నికల మేనిఫెస్టో

అఖిల భారత పాత సామాన్లు కొనే సంఘం అత్యవసర సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో వచ్చే ఉప ఎన్నికల గురించి తీవ్రంగా చర్చించారు. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయాల్సిందేనని ఇందులో ఎకగ్రీవంగా తీర్మానించారు. అసలు ఏ రాజకీయ పార్టీకి, నాయకులకు ఈ ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదని ఇందులో స్పష్టం చేశారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులంతా ఎన్నికల సమయంలో తప్ప మళ్లీ కనపడరని పాత సామాన్లు కొనే సంఘం నేతలు ఆరోపించారు. ఎన్నికలతో నిమిత్తం లేకుండా ప్రతి రోజూ ఇంటింటికీ తిరిగేది తామొక్కరమేనన్నారు. పాత సామాన్లను ఎలా వదిలించుకోవాలో తెలియక నానా పాట్లు పడే ఇళ్ల యజమానుల సమస్యను తాము మాత్రమే పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే కాలనీలలో రోజూ తిరుగుతూ సెక్యూరిటీ గార్డులు లేని కొరతను కూడా తామే తీరుస్తున్నామని అన్నారు. కష్టకాలంలో పాతసామాన్లకు బదులుగా ఉల్లిపాయలు, మామిడికాయలు, బఠానీలు, పల్లీలు ఇస్తూ ప్రజల ఆకలి తీరుస్తున్నామని అన్నారు.  ఇలా రోజూ ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న తమకు మాత్రమే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందని పాత సామాన్ల సంఘం నేతలు స్పష్టం చేశారు. ప్రజల కష్టాలను దగ్గరి నుంచి చూసేది తాము మాత్రమేనన్నారు. ప్రజలకు ఎల్లవేళ్లలా అందుబాటులో ఉండేది కూడా తామేనని చెప్పారు. రాజకీయ నాయకులు అయిదేళ్లకోసారి హామీలు ఇవ్వడమే తప్ప వాటిని అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి పాత సామాన్ల సంఘం ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది.
ఇందులో ప్రధానాంశాలు..
1. రోజుకు రెండుసార్లు పాత సామానర్లు కొనడం.
    దీని వల్ల ఇళ్లలో చెత్త తగ్గుతుంది.
2. రాత్రిపూట కూడా కొనే సదుపాయం కల్పించడం
     దీనివల్ల అదనపు గస్తీ ఏర్పాటవుతుంది.
3. పాత సామాన్లకు బదులుగా ఉల్లిపాయలతో పాటు, టీ, టిఫిన్‌,, మీల్స్‌ ఇచ్చే ఏర్పాటు
4. పాత సామాన్ల కొనుగోలుదారులు ఇంకా ఎక్కువగా తిరగడానికి వీలుగా సిమెంటు రోడ్లు వేయించటం
5. ప్రతి కాలనీలో ఒక పాత సామాన్ల దుకాణం ఏర్పాటు చేయటం. ఇది 24 గంటలూ తెరిచి ఉంటుంది.
6. పాత సామాన్లు ఎప్పుడు అమ్మాలన్నా ఫోన్‌ చేసి పిలిపించుకునే అవకాశం కల్పించటం. ఇందుకోసం టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయటం...

Report by sri venkat reddy, journalist

27, ఏప్రిల్ 2012, శుక్రవారం

కప్పలు కొట్టుకుంటున్నాయి


తక్కెడలో కప్పలు కొట్టుకుంటున్నాయి
ఒకదానిపై ఇంకొకటి కుట్ర చే సుకుంటున్నాయి.
అన్ని కప్పలూ ఒక్కసారే తక్కెడలోకి చేరినవే..
ఒక కప్ప మాట మరో కప్పకు సరిపడదు..
సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌లో ఉండేందుకే
అన్ని కప్పల ప్రయత్నం..
అన్నింటిపై ఆధిపత్యం కోసమే తాపత్రయం..
ఈ కొట్లాటల్లో  ఈ కప్పల తక్కెడ చిల్లుపడిపోయింది
తక్కెడ ముక్కలు ముక్కలవుతోంది..
అది ముక్కలైతే.. ఏ కప్పకూ నిలువ నీడ ఉండదు..
ఇప్పుడు తక్కెడను కాపాడటం ఎలా?
ఇంతకీ ఆ తక్కెడ ఏమిటో తెలుసా?
మన రాష్ట్ర కాంగ్రెస్‌....
ఈ కప్పలన్నీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు
ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవటం
నివేదికలిచ్చుకోవటం..
ఏసిబి విచారణలు జరిపించుకోవటం..
వెరసి కాంగ్రెస్‌ పరిస్థితి రాష్ట్రంలో గందరగోళానికి దారి తీసింది..
రాష్ట్రంలో ఏం జరుగుతోందో అధిష్ఠానానికి అంతుపట్టటం లేదు
ఒకరి తరువాత మరొక దూత వస్తున్నారు..
మంతనాలు జరుపుతున్నారు...
రిపోర్టుల మీద రిపోర్టులు సమర్పించుకుంటున్నారు..
కనీ వినీ ఎరుగని సంక్షోభం..
పార్టీ అస్తిత్వానికే ప్రమాదకరమైన పరిస్థితిలో కాంగ్రెస్‌
కర్ర విరగొద్దు.. పాము చావొద్దు...
పార్టీ నిలబడాలి.. ఏం చేయాలి?
ఎలా కాపాడుకోవాలి..?
నేతల మధ్య సమన్వయం సాధ్యమేనా?
జగన్‌ను, తెలంగాణాను సమన్వయం చేయటం కుదిరేపనేనా?
కాంగ్రెస్‌ రెంటికి చెడ్డ రేవడి అవుతుందా?
రెంటినీ బ్యాలెన్స్‌ చేస్తుందా?

ఒక శిశువు వయసు ఎంత?

ఒక పువ్వు వయస్సు కనీసం ఆరు గంటలు.. ఒక ఆకు వయస్సు రెండు మూడు రోజులు.. ఒక కాయ వయస్సు అది పండేంత వరకే.. ఆ పండు వయసు.. రాలి పడిపోయేంత వరకు..... మరి ఓ శిశువు వయసు ఎంత? అదేంటని ఆశ్చర్యపోవద్దు.. మన రాష్ట్రంలో ఇప్పుడు అన్ని చోట్లా వినిపిస్తున్న ప్రశ్న ఇది.. ఒక శిశువు వయసు ఎంత? రోజులా? వారాలా? నెలలా? అవును మన రాష్ట్రంలో  పుట్టిన శిశువుల్లో చాలా వరకు వ్యక్తులుగా ఎదగటం లేదు.. పరిపూర్ణంగా జీవితాన్ని పొందటం లేదు.. పొత్తిళ్లలోనే జీవితాలు అంతమవుతున్నాయి.. పుట్టినందుకు సంతోషించేంతలోగానే మట్టితో మమేకమైపోతున్నారు.. తామెందుకు పుట్టారో.. ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని జీవితాలు.. ఏటా ౮౦వేలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి..    .
ఎందుకు ఇలా అమ్మతనం చిన్నబోతోంది.. నవ మాసాలు మోసి.. ప్రేమగా కన్న కడుపు క్షోభిస్తోంది. తల్లి కడుపులో పెరుగుతున్నప్పుడు బయటి నుంచి అప్పుడప్పుడూ వినిపించే ధ్వనులు వినే శిశువు ఎన్నో కలలు కంటుంది.. ఆ కలలన్నీ సాకారం చేసుకునేందుకు ఎప్పుడెప్పుడు తల్లి గర్భం నుంచి బయటపడదామా అని ఆలోచిస్తుందిట.. కానీ, తొమ్మిది నెలల తరువాత.. భూమి స్పర్శ తొలిసారి తగిలినంతనే ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది.. ఆ శిశువు కన్న కలలు ఊహకు కూడా తెలియకుండానే ఆవిరైపోతున్నాయి.
メメメ

వింటే ఆశ్చర్యం వేస్తుంది.. అస్సలు నమ్మబుద్ది కాదు.. కానీ, ఇది నిప్పులాంటి నిజం.. కాకపోతే ఇంతకాలం దీనిపై నివురు కప్పేశారు.. మనకు తెలిసినంత వరకు కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో  వేలకు వేలు పోసి పురుడు పోసుకుంటున్న పిల్లలే పిల్లలు.. కానీ, కాణీ ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో .. పుడుతున్న శిశువుల గురించి మనకు పెద్దగా అవగాహన లేదు. ఉండదు కూడా.. ఎప్పుడో టీవీల్లో వార్తలు వచ్చినప్పుడో.. ఏదైనా గొడవ జరిగినప్పుడు మాత్రమే కాసేపు ప్రభుత్వ ఆసుపత్రుల్ని తిట్టుకుని ఆ మరుక్షణం మరచిపోతాం.. కానీ చాలా మందికి తెలియంది.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుతున్న డెలివరీలు ప్రెユవేటు ఆసుపత్రుల కంటే రెట్టింపు ఎక్కువన్న సంగతి..

రాష్ట్రంలో ఏడాదికి 13లక్షల మంది జన్మిస్తున్నారు.. వారిలో 60 శాతం మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పుడుతున్నారు.. అదీ పేదల ఇళ్లల్లో.. పౌష్టికాహారం అంటే ఏమిటో కూడా తెలియని కుటుంబాల్లోనే ఈ పరిస్థితి నెలకొని ఉంది.
మీకు తెలుసా? ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుడుతున్న వారిలో ప్రతి వెయ్యి మందిలో 49 మంది తొలి పుట్టిన రోజు జరుపుకోకుండానే చనిపోతున్నారు.. అంటే దాదాపు ౮౦ వేల మంది శిశువుల వయస్సు సరిగ్గా ఏడాది కూడా దాటటం లేదన్నమాట. 

ఎందుకిలా జరుగుతోంది..?
పేదరికం..
చదువులేమితనం..
పేదరికంలో పుట్టడమే వాళ్లు చేసుకున్న పాపం.. గర్భం తాల్చిన యువతులకు బెడ్‌రెస్ట్‌లు తీసుకోవటం తెలియదు.. రెగ్యులర్‌గా బీపీలు.. షుగర్‌లు.. చెకప్పులు చేసుకోవటం.. రోజూ మల్టీ విటమిన్లు తీసుకోవటం అంతకంటే తెలియదు. తొమ్మిది మాసాలు వచ్చే వరకూ శ్రమించటమే వారికి తెలిసింది.. ప్రత్యేక ఆహార నియమాలు పాటించరు. నొప్పులు వచ్చిన తరువాత కానీ, ఆసుపత్రి ముఖం చూడరు. అప్పటి వరకూ పెరటి వైద్యం తప్ప ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటంపై ఎలాంటి అవగాహన లేదు. 
అందుకే వాళ్ల సంతానానికి బతికే అవకాశాలు లేకుండా పోతున్నాయి. పుట్టిన నెలల్లోనే  వేలమంది శిశువులు తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చి వెళ్తున్నారు.

メメメ

రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల విషయంలో జరుగుతున్న పెను విషాదం మాత్రమే ఇది. కానీ ఈ పరిస్థితి మన రాష్ట్రానికే పరిమితం కాలేదు. దేశం మొత్తం మీద పేదరికంలో మగ్గుతున్న సమాజం తరచూ కడుపుకోతకు గురవుతోంది. దీన్ని నియంత్రించటానికి కేంద్ర ప్రభుత్వం ఓ సూపర్‌ పరిష్కారాన్ని కనుక్కొంది.. కనుక్కొన్నదే తడవుగా సొమ్ములూ ధారాళంగా రాష్ట్రాలకు పంచేసింది. కానీ, వాటిని ఖర్చు చేసే నాధుడే లేకుండా పోయాడు.. పేదవారికి మేలు చేసే దిక్కే లేకుండా పోయింది. ఇందుకు చాలా చాలా కారణాలు ఉన్నాయి. మన సొసైటీలోనే ఉన్న పెద్ద లోపాలివి..ఈ కారణాలేంటో ఒకసారి చూడండి..
   
చిన్న వయసులో  పెళ్లి కావటం
కనీస జ్ఞానం రాకుండానే తల్లి కావటం
సరైన ఆహారం తీసుకోకపోవటం
సరైన వైద్య సదుపాయాలు లేకపోవటం
వైద్య సదుపాయాల గురించి తెలియకపోవటం
ఇద్దరు పిల్లల మధ్య వ్యత్యాసం లేకపోవటం
నిపుణుల పర్యవేక్షణ లేని కాన్పులు కావటం
తల్లి పాలు ఇవ్వటంలో విపరీతమైన జాప్యం చేయటం
శిశువుల హెల్త్‌కేర్‌ విషయంలో తీరని అశ్రద్ధ చేయటం

ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష కారణాలు చెప్పుకుంటూ పోవచ్చు. పేద సమాజంలో ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత కూడా చైతన్యం లేని తనాన్ని ఈ శిశుమరణాలు చెప్పకనే చెప్తున్నాయి.
メメメ
వీటన్నింటినీ నియంత్రించేందుకే కేంద్రం ఓ బృహత్తరమైన పథకాన్ని ఆడంబరంగా ప్రారంభించింది.. గుర్తించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో  భారీగా మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది, నిపుణుల నియామకం చేసి, మందులను, ఉపకరణాలను అందుబాటులోకి తీసుకువచ్చి గర్భిణీస్త్రీలకు, శిశువులను కాపాడేందుకు డిసైడ్‌ అయింది. ఇందుకోసం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం అంటే జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం అన్న పేరుతో వేల కోట్ల రూపాయలను విడుదల చేసేసింది. మన రాష్ట్రానికీ ఓ 1556కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో 80 శాతం కేంద్రం భరించేట్లు.. 20శాతం రాష్ట్రం భరించేట్లు ఫిక్స్‌ చేసింది. శిశుమరణాల రేటును తగ్గించేందుకు సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వాలని నిర్ణయించారు.
అంతా బాగున్నా మహిళల నోట్లో శని ఉన్నట్లు అయిపోయింది.. కేంద్రం కేటాయించిన  నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. స్కీములు ప్రకటించటం వరకు కాగితాలపై బాగానే ఉంటుంది. కానీ, వాటిని అమలు చేయటం దగ్గరే అసలు కథంతా ముడిపడి ఉంటుంది. కార్పోరేట్‌ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులను మంజూరు చేయటంలో తెగ తాపత్రయ పడే అధికారులు.. పేదలకు ఉపయోగపడాల్సిన నిధులను సకాలంలో ఖర్చు చేయకపోవటంలో ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఇది మొదట్నుంచీ ప్రతి పేదవాడికీ అనుభవమవుతున్నదే. ఇక శిశుమరణాలను నియంత్రించటం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా జరిగే పనేనా?

26, ఏప్రిల్ 2012, గురువారం

భారత దేశంలో అతి పెద్ద వృద్ధాశ్రమం


మన రాష్ట్రపతి భవన్‌.. భారత దేశంలో అతి పెద్ద వృద్ధాశ్రమంగా మారిపోయింది. మొఘలుల కాలంలో నిర్మించిన అతి గొప్ప భవనం.. 320 గదుల విశాలమైన ప్రాంగణం.. పౌరాణిక సినిమాల్లో చూసినట్లు వనాలు.. కుడ్యాలు.. తోరణాలతో అద్భుతంగా అలరారే రాష్ట్రపతి  భవన్‌.. వృద్ధులకు పునరావాసకేంద్రంగా మారింది.. పేరుకు మాత్రం వయోపరిమితి 35.. రాష్ట్రపతి భవన్‌లోకి ఎంటర్‌ అవుతున్న ఒరిజినల్‌ ఏజ్‌ మాత్రం మినిమమ్‌ 68. దిసీజ్‌ అవర్‌ ఇండియా...  
యంగిస్థాన్‌.. యువతే దేశానికి వెన్నెముక.. లాంటి పోచికోలు కబుర్లు చెప్పటంలో మన దేశంలో ఏ ఒక్క రాజకీయ నేతా తక్కువ కాదు.. కానీ, ఏ ఒక్కరికీ చింత చచ్చినా.. పులుపు మాత్రం చావదు.. రాజకీయాల్లో రిటైర్‌మెంట్‌ గురించి ఉపన్యాసం చెప్పే వాళ్లెవరూ తాము మాత్రం రిటైర్‌ కారు.. ఒక వేళ ఖర్మకాలి.. రోగమో.. రొచ్చో వచ్చి రిటైర్‌ కావలసి వచ్చినా.. తమ వారసులను రెడీ చేసి మరీ తప్పుకుంటారు.. సర్పంచ్‌ గిరీ నుంచి రాష్ట్రపతి పదవి దాకా కూడా ఇదే సీన్‌.. ఇదే కల్చర్‌.. ఇదే ఒరవడి.. ఇదీ మన ఇండియా... మేరా భారత్‌ మహాన్‌..
మరో రెండు నెలల్లో రాష్ట్ర పతి పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి పోటీ పడుతున్నవాళ్లు కానీ, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న పేర్లు కానీ, ఎంత వయసున్నవారివో తెలుసా? మినిమమ్‌ 68.. మాగ్జిమమ్‌.. 81. వీళ్లలో అందరికంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్‌ కలాం. ఒకవేళ ఈయన మళ్లీ రాష్ట్రపతి భవన్‌లోకి అడుగుపెడితే.. ఆనాటికి ఆయన వయసు ఎంతుంటుందో తెలుసా? 80 సంవత్సరాల 9 నెలల 9రోజులు.

ఇక బాగా పేర్లు వినవస్తున్న మిగతా వాళ్ల విషయాన్ని చూద్దాం..

ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీకి 75 ఏళ్లు..
ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీకి 76సంవత్సరాలు.
జమ్ముకాశ్మీర్‌ మాజీముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాకు 74ఏళ్లు
బిజెపి నేత జస్వంతసింగ్‌కూ 74 సంవత్సరాలు
ఇక సమాజ్‌వాదీ అధ్యక్షుడు ములాయంకు 72 సంవత్సరాలు
టెలీకాం సంస్కర్త సాం పిట్రోడా వయసు 70
లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ వయసు 67ఏళ్లు కాగా
ఈ పదవికి తీవ్రంగా లాబీయింగ్‌ చేసుకుంటున్న ఇన్ఫోసిస్‌ మాజీ చైర్మన్‌ ఎన్‌ఆర్‌ నారాయణమూర్తికి 65 సంవత్సరాలు..
వీళ్లు కాకుండా.. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ జెఎం లింగ్డో లాంటి వారి వయసూ 70కి పైమాటే ఉంది.. అభ్యర్థిత్వం దగ్గరకు వచ్చేసరికి అకస్మాత్తుగా పైకి వచ్చే పేర్లు కొన్నుంటాయి. వాళ్ల వయసూ తక్కువ ఉంటుందనుకుంటే పొరపాటే..
ఇప్పటి వరకు దేశానికి 15మంది రాష్ట్రపతులుగా పనిచేశారు. వీళ్లలో యూత్‌ ఎవరో తెలుసా? మవ తెలుగువాడే. వరాహగిరి వెంకటగిరి.. అలియాస్‌ వివిగిరి.. రాష్ట్రపతి అయ్యేనాటికి ఆయన వయసు జస్ట్‌ 56 సంవత్సరాల 14 రోజులు. అంతే.. ఇప్పటి వరకు రాష్ట్రపతులుగా పనిచేసిన వారి సగటు వయసు 68.73 ఉంటే ఇక రాజ్యాంగంలో35 ఏళ్ల వయోపరిమితి విధించటం వల్ల ప్రయోజనం ఏమిటి? సిల్లీ కాకపోతే..

కొత్త రాష్ట్రపతిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారు?

దేశానికి కొత్త రాష్ట్రపతిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారు? ఇప్పుడిదొక బ్రహ్మపదార్థం.. ఎవరిని సెలెక్ట్‌ చేయాలి..? వివాదాలకు దూరంగా.. మరో  రెండేళ్ల పాటు అధికారంలో ఉండేవారికి.. ఆ తరువాత మూడేళ్ల పాటు అధికారంలోకి రాబోయే వారికి ఇబ్బంది లేకుండా.. ఇబ్బందులు కలిగించకుండా ఉండే వ్యక్తి ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకూ కావాలి. ఎవరి ఈక్వేషన్స్‌ వారివి.. ఎవరి ప్రయోజనాలు వారివి.. ఎవరి లాబీయింగ్‌ వారిది.. ఒక్క మాటలో  చెప్పాలంటే.. అయిదేళ్లకోసారి ఓ కొత్త రబ్బర్‌ స్టాంప్‌ను తయారు చేసే ప్రక్రియ మరోసారి మొదలైంది..
ఒక సామాజిక వర్గం ఓట్లు రావాలంటే.. ఆ వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతి చేయాలి..
ఒక మతం విశ్వాసాన్ని సంపాదించాలంటే.. ఆ మతానికి చెందిన వ్యక్తిని ప్రథమ పౌరుని చేయాలి..
అధికారంలో ఉన్నపార్టీకి విధేయుడు కావాలి..
అధికారంలోకి వచ్చే పార్టీకీ లాయలిస్ట్‌ కావాలి..
ఇక ఇండిపెండెంట్లకేమో లాబీయింగ్‌ చేసే సత్తా కావాలి..

ఇప్పుడు రాష్ట్ర పతి పదవికి దేశంలో అమలు అవుతున్న అర్హతలు. ఇలాంటి వారి కోసం అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. నాలుగు రోజులుగా ఒక్కో పార్టీ ఒక్కో వ్యక్తి పేరును తెరమీదకు తెస్తోంది.. ఒక్కో నాయకుడు ఒక్కొక్కరి పేరు చెప్తున్నాడు. ఒకరి ప్రతిపాదన ఇంకొకరికి నచ్చటం లేదు. అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం ఏ ఒక్కరిని కాదన్నా.. కోపం వస్తుందేమోనన్న తంటా..
ఎన్‌సిపి నేత శరద్‌పవార్‌ రాజకీయేతర వ్యక్తి రాష్ట్రపతి కావాలంటున్నారు. లేకుంటే తమ పార్టీకే చెందిన లోక్‌సభ మాజీ స్పీకర్‌ పిఎ సంగ్మా పేరును బరిలో వదిలి వచ్చారు. లాలూప్రసాద్‌కైతే ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ అయితే ఓకే.. ఎందుకంటే ఆయన ఇస్లాం కమ్యూనిటీ ఓట్‌బ్యాంక్‌ అవసరం చాలా ఉంది. ఇక సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ తానే ఆ పదవిని అధిష్ఠించాలని కోరుకుంటున్నారు. మాయావతికి ఈ ప్రతిపాదన ససేమిరా.. ఇక జయలలితకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అయితే సరే.. ఇటు భారతీయ జనతాపార్టీకీ ఆయనంటే ఇష్టమే. కానీ కాంగ్రెస్‌కు మాత్రం కలాం కంట్లో నలుసే. తమ పార్టీ అధినేత్రి సోనియాను ప్రధానమంత్రి పదవిలోకి రాకుండా సున్నితంగా అడ్డుకోవటం ఆ పార్టీ ఇంకా మర్చిపోలేదు.
కాంగ్రెస్‌లోని కొందరు కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ జెఎం లింగ్డో పేరునూ రంగం మీదకు తీసుకువస్తున్నారు. మరికొందరికి పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ పేరు సీన్‌లోకి తీసుకొచ్చేశారు. బిజెపిలోని ఒక వర్గానికి జస్వంత్‌సింగ్‌ కావాలి. మమతా దీదీకైతే సుభాష్‌చంద్రబోస్‌ కుటుంబ వారసులను రాష్ట్రపతి చేయాలని బలంగా ఉంది. రోజుకో పేరు తెరమీదకు వస్తోంది.. ఏ ఒక్కరూ ఏ ఒక్క పేరుపైనా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయటం లేదు.
అన్ని పార్టీల కంటే కాంగ్రెస్‌కే పెద్ద తంటా.. ఇంకా అధికారంలో ఉండాల్సిన .అన్నింటికంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు పెద్ద తంటా.. ఆ పార్టీ అధికారం ఇంకా రెండేళ్లు ఉంది. ఈ లోపు రాష్ట్రపతితో ఏ సమస్యా రాకూడదు.. అదే సమస్య మిత్రపక్షాలతోనూ తలెత్తకూడదు. మాయావతిని ఒప్పుకుంటే ములాయంకు కోపం.. వామపక్షాల మాట విందామంటే మమతకు మంట.. డిఎంకెను ఔనంటే అన్నాడిఎంకేకు కాదు.. అధిష్ఠానంలో మల్లగుల్లాలు మొదలయ్యాయి.
సందట్లో సడేమియా లాగా ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి లాంటి వారు వ్యక్తిగతంగా కూడా లాబీయింగ్‌ మొదలు పెట్టారు. వీళ్లలో ఎవరు చివరి వరకు మిగులుతారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. గత ఎన్నికల సమయంలో నామినేషన్ల గడువు ముగిసే సమయానికి అకస్మాత్తుగా ప్రతిభాపాటిల్‌  సీన్‌లోకి వచ్చారు. అప్పటిదాకా ఆమె ఎవరన్నది దేశంలో చాలా మందికి తెలియదు.. ఈసారీ అలాగే జరుగుతుందా? ఏమోమరి..

24, ఏప్రిల్ 2012, మంగళవారం

మరోసారి కామ్‌రాజ్‌ ప్లాన్‌

కాంగ్రెస్‌ పార్టీలో వణుకు మొదలైంది. రాబోయే రెండేళ్లలో ఏం జరగబోతోంది? అధికారం సంగతి దేవుడెరుగు.. కనీసం పార్టీ ఉనికి ఏం కానుంది? పార్టీ రాజకీయ అస్తిత్వమే ప్రమాదంలో పడిపోతోందా? పెద్ద రాష్ట్రాలన్నీ ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.  ఏ ప్లానూ వర్కవుట్‌ కావటం లేదు.. ఏ ఎత్తుగడా పనిచేయటం లేదు. ఏం చేసినా రివర్స్‌ అవుతోంది.. ౧౩౦ సంవత్సరాల చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని తీవ్రమైన సంక్షోభాన్ని కాంగ్రెస్‌ ఎదుర్కొంటోంది.. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మరోసారి కామ్‌రాజ్‌ ప్లాన్‌ను సోనియా అమలు చేస్తున్నారు.. ఈ ప్రాతిపదికనే భారీ మార్పులకు కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టింది... ఇదైనా పార్టీని గట్టెక్కిస్తుందా?

రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత  పెద్ద రాష్ట్రాలన్నీ కాంగెస్‌ చేజారిపోయాయి. యుపిలో ఘోరమైన పరాజయాన్నే మూటగట్టుకోవలసి వచ్చింది. అధినేత్రి సొంత నియోజక వర్గంలోనే ఒక్క సీటు కూడా గెలుచుకోలేని స్థితి.. బెంగాల్‌లో  మిత్రపక్షమే అయినా మమతాదీదీ గొడవ గొడవగానే ఉంది.. రాజస్థాన్‌లో గెలిచే పరిస్థితి లేదు. ఢిల్లీలో మొన్నటి లోకల్‌ బాడీ ఎన్నికల్లోనే ఢామ్మంది.. బీహార్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ ఇలా ఏ ఒక్క రాష్ట్రంలోనూ పరిస్థితి బాగా లేదు. మహారాష్ట్రలో మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేదు. ఇక దక్షిణాదిలో ఒకే ఒక్క ఆశ ఉన్న  ఆంధ్రప్రదేశ్‌పై పూర్తిగా నమ్మకం వదులుకోవలసిన దుస్థితి.. ఇప్పుడేం చేయాలి?.. కుంభకోణాలు... ఆర్థిక అస్తవ్యస్తం.. అవినీతి.. అసమర్థత...  కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా కాంగ్రెస్‌ను ముప్పిరిగొంటున్న సమస్యలు ౧౩౦ ఏళ్ల కాంగ్రెస్‌ను కనీవినీ ఎరుగని అయోమయంలోకి నెట్టేసాయి.. ఏ ఒక్క విషయంపైనైనా  స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి పార్టీ మనుగడనే ప్రమాదంలోకి నెట్టేసింది..
ఇందుకు ఉదాహరణ తెలంగాణాయే.. ఒక అంశంపై దూకుడుగా నిర్ణయం తీసుకోలేక నాన్చుతూ ఉండటం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ౨౦౧౪ మాత్రమే కాదు.. సమీప భవిష్యత్తు కూడా లేకుండా చేస్తోంది. వ్యూహకర్తలు ఏ ఒక్క అంశంలోనూ సక్సెస్‌ రేట్‌ సాధించలేకపోతున్నారు.. ట్రబుల్‌షూటర్స్‌ అనుకున్న మహామహులే హ్యాండ్స్‌ అప్‌ చేసేశారు.
అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే కాంగ్రెస్‌ కూడా ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా పార్టీ పరిస్థితి గురించి నిర్వహించిన సర్వేలు కూడా ఊహించని స్థాయిలో ప్రతికూలంగా రావటంతో ఇక అట్టడుగునుంచి ప్రక్షాళన చేయాల్సిన తప్పనిసరి అవసరం అధినేత్రికి ఏర్పడింది. ఇప్పుడు ఆమె ముందున్నది ఒకే ఒక్క ప్రత్యామ్నాయం కామ్‌రాజ్‌ప్లాన్‌.. ౧౯౬౩లో కాంగ్రెస్‌ ప్రజాదరణను కాపాడుకోవటానికి సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కామ్‌రాజ్‌ నాడార్‌ అమలుచేసిన ప్లాన్‌ ఇది. కేబినెట్‌లోని సీనియర్‌ మంత్రులంతా రాజీనామా చేసి.. పార్టీ పదవులు తీసుకుని, పార్టీ పటిష్ఠత కోసం పూర్తికాలం పనిచేయటం ఈ ప్లాన్‌ ఉద్దేశం.. ఈ ప్లాన్‌తో కామ్‌రాజ్‌  ది గ్రేట్‌ ట్రబుల్‌షూటర్‌గా కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు అదే ప్లాన్‌ను సోనియా అమలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే సీనియర్‌ మంత్రులు జైరాం రమేశ్‌, వాయలార్‌ రవి, గులాంనబీ ఆజాద్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌లు నలుగురూ తమను మంత్రి పదవుల నుంచి తప్పించాలంటూ సోనియాకు లేఖ రాశారు. వీరిలో జైరామ్‌ రమేశ్‌, గులాంనబీ ఆజాద్‌లు ఇద్దరూ మన రాష్ట్ర పార్టీ వ్యవహారాలతో సంబంధం ఉన్నవారే. గత మూడేళ్లలో తెలంగాణ అంశాన్ని సమర్థంగా డీల్‌ చేయటంలో ఆజాద్‌ పూర్తిగా ఫెయిలయ్యారనే అధిష్ఠానం భావిస్తోంది. అందుకే ఆయనకు ప్రత్యామ్నాయంగా వాయలార్‌ రవిని పంపించారు. ఈ అంశానికి పరిష్కారం చూపకపోవటం రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అగమ్యగోచరంలోకి నెట్టేసింది. ఇక సల్మాన్‌ఖుర్షీద్‌ కీలకమైన యుపి నేత. యుపిలో వైఫల్యానికి రాహుల్‌గాంధీని వెనక్కి నెట్టేసి బాధ్యతంతా తనమీద వేసుకోవలసి వచ్చింది. ఇప్పుడు వీరి బాటలో మరికొందరు సీనియర్‌ మంత్రులు కూడా రాజీనామా బాటలో ఉన్నట్లు సమాచారం. అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో కూడా భారీస్థాయిలో ప్రక్షాళన కార్యక్రమం జరుగుతోంది. ౧౯౬౩లో ఈ కామ్‌రాజ్‌  ప్లాన్‌ బాగా సక్సెస్‌ అయింది. కానీ, ఇప్పుడు సాధ్యమేనా?  ఆజాద్‌ లాంటి వారు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిలుగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు.. ఇప్పుడు ఫుల్‌టైమ్‌ వర్కర్లుగా  పార్టీని బతికించగలరా?

27, మార్చి 2012, మంగళవారం

వాళ్లు చెప్పరు..మేము ఇవ్వము..

ఏం చేయలేం.. మా చేతుల్లో ఏమీ లేదు.. ఎన్ని సార్లు చెప్పమంటారు? మళ్లీ మళ్లీ చెపుతున్నా.. మేం చేసేదేం లేదు.. ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు తమ వైఖరులు చెప్పనంత వరకు, సంప్రతింపుల ప్రక్రియకు సహకరించనంత వరకు చేసేది ఏమీ లేదు. నథింగ్‌ హాస్‌ టుబి డన్‌ ఆన్‌ దిస్‌ ఇష్యూ.. ది ఇష్యూ  ఈజ్‌ ఇన్‌ ది కోర్ట్స్‌ ఆఫ్‌ మెనీ పార్టీస్‌ ఆఫ్‌ దట్‌ స్టేట్‌ ... ఒక్క మాటలో చెప్పాలంటే.. వాళ్లు చెప్పరు. .మేము చేయము.. డోన్ట్‌ ఆస్క్‌ మి టూ మెనీ టైమ్స్‌.
.......................................................
అర్ధరాత్రి ప్రకటనతో రాష్ట్రాన్ని పెనం నుంచి కుంపట్లోకి నెట్టేసిన మహానుభావుడి లేటెస్ట్‌ కామెంట్‌ ఇది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి బాధ్యత గల దేశ వ్యవహారాలు అలియాస్‌ హోం మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న  చిదంబరం అప్రమేయ ప్రతిభాపాటవాలతో ప్రకటించిన పలుకులివి. .ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే.. గుంటూరు ఎంపి గారి లేటెస్టు కామెంట్‌కు కాస్త సాగతీత అంతే.. ఆయనేమో తెలంగాణా రాదు.. రాదు.. రాదు.. అంటూ బొబ్బిలిపులి డైలాగులతో అదరగొట్టేశారు.. అవే మాటలని కాస్త పాలిష్ట్‌గా ఎకనమిస్ట్‌ టర్న్‌ロ్డ హోం మినిష్టర్‌ గారి మితిమీరిపోయిన తెలివితేటల సారాంశం ఇది.
メメメ

 మేమూ చెప్పేదేమీ లేదు.. చెప్పాల్సింది ఎప్పుడో చెప్పేశాం.. నిర్ణయమో.. గిర్ణయమో.. తీసుకోవలసింది కేంద్రమే.. కేంద్రమే సాగదీస్తోంది. అది ఎన్ని సార్లు అడిగినా మేం మాత్రం  మా వైఖరి చెప్పేదేమీ లేదు. నిర్ణయం తీసుకోమనండి.. మేం కాదన్నామా? నిర్ణయం తీసేసుకున్నాక, మాకు చెప్పలేదంటూ యుటర్న్‌ ఎలాగూ తీసుకుంటాం.. ముందే తొందరపడటం ఎందుకు చెప్పండి..? టూ ఐ థియరీ టూమచ్‌గా అమలు చేసుకుంటున్న తరుణంలో ఇప్పుడు రిస్క్‌ తీసుకోవటం అవసరమా? ఒకటి రెండు డిపాజిట్లు పోయినంత మాత్రాన లాస్‌ ఏమీ లేదు. ఇవన్నీ జస్ట్‌ బై ఎలక్షన్స్‌ లోనే..  అసలు ఎన్నికలొచ్చినప్పుడు మహాకూటముల్లాంటివి మళ్లీ పుట్టినా ఆశ్చర్య పోనక్కర్లేదు.. అయినా మీ వెర్రి కానీ, తెలంగాణాకు అనుకూలమని చెప్పకపోయినా, వ్యతిరేకంగా మాట్లాడటం లేదని ఎన్ని సార్లు చెప్పాలి.. డెసిషన్‌ అంటూ తీసుకోవాలంటే సోనియమ్మే తీసుకోవాలి.. ఇక మీదట ఈ విషయంపై నన్నేమైనా అడిగారో ఖబడ్దార్‌.. దటీజ్‌ చంద్రబాబునాయుడు.. 35 ఇయర్స్‌ ఇండస్ట్రీ...
メメメ

నాదేముందయ్యా.. నేనే నామినేటెడ్‌ గాణ్ణి.. నా సీటు స్క్రూలే ఢిల్లీలో ఉన్నాయి. ఇక తెలంగాణా సంగతి నాకేం తెలుసు? ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమంటారా? జస్ట్‌ అదొక గేమ్‌ లాంటిది.. పరాయి దేశాల్లో టీమిండియా క్రికెట్‌లో ఎంత ఘోరంగా ఓడిపోతుందో తెలియదా? తెలంగాణా కూడా అంతే.. ప్రస్తుతానికి తెలంగాణా 2014 వరకు కాంగ్రెస్‌కు పరాయి ప్రాంతమే.. అందుకే సొంత గడ్డపై ఉప ఎన్నికల్లో తడాఖా చూపిస్తా. 2014 నాటికి మా అమ్మ నోటి నుంచి ముత్యాలు రాలకపోతాయా? అవి తెలంగాణాలో ఓట్లుగా మారకపోతాయా? అప్పటికి చూసుకుందాం లే.. నాకు ప్రాబ్లమ్‌ తెలంగాణా కాదు. అక్కడి కాంగ్రెస్‌ నాయకులే..  వాళ్లను మేనేజ్‌ చేయటం పెద్ద సమస్య కానే కాదు. తలా ఒక బొక్క పడేస్తే చాలు, విశ్వాసంగా పడి ఉంటాయి. కాబట్టి సమస్య పరిష్కారం కాకపోయినా నష్టం లేదు.. అసలు కానక్కర్లేదు. రెండేళ్ల తరువాత కదా ఎన్నికలు.. అప్పటికి ఏదో ఒక దారి దొరక్కపోదులే.. మా వాళ్లతోనే రాజీనామా చేయించి, మా వాళ్ల తోనే మమ్మల్ని తిట్టించుకుని, టిఆర్‌ఎస్‌లో చేర్పించి ఎంపిలుగా పోటీ చేయించి, గెలిపించుకుని.. ఎన్నికలయ్యాక భేషుగ్గా మళ్లీ పార్టీలోకి రెడ్‌కార్పెట్‌ పరచి మరీ తీసుకోమూ.. కాకుంటే రాష్ట్రంలో అధికారం పోతుంది.. ఎవడికి కావాలి.. పదేళ్లు చేశాం చాలదా...? కాస్త రిలాక్స్‌.. ఎలాగూ జగన్‌ గద్దలా తన్నుకుపోయే సీట్లూ... తెలంగాణా వాదంలో టిఆర్‌ఎస్‌వైపు కొట్టుకుపోయే సీట్లతో హంగ్‌ రావటం తథ్యం.. జగన్‌ మా వాడే కాబట్టి... బతిమాలో.. బెదిరించో తిప్పుకోవటం ఈజీ.. ఇక కెసిఆర్‌ అంటారా? తూచ్‌... ఆ పార్టీ నుంచి ఎంపిలుగా గెలిచేవాళ్లు మావాళ్లేగా.. నథింగ్‌టు వర్రీ.. మళ్లీ 40 ఎంపి సీట్లు మావే.. కాబట్టి సిఎం కుర్చీ ఉన్నా, లేకున్నా.. ఢిల్లీలో రాహుల్‌ బేటాను ప్రిన్స్‌ చేయటం మాత్రం గ్యారంటీ.. కాబట్టి.. ఎవరు చచ్చినా.. బతికినా.. క్యాంప్‌ ఆఫీస్‌లో ఫిడేల్‌ మాత్రం పాడవకుండా ఉంటే చాలు.. ఇవేవీ వినపడకుండా హాయిగా దాన్ని వాయించుకుంటూ ఉండవచ్చు. అసంతృప్తవాది డిఎల్‌ అన్నట్లు హైదరాబాద్‌ నుంచి వయా మద్రాసు, బెంగుళూరుల మీదుగా ఢిల్లీ వెళ్లి సూటుకేసులు మార్చి మంత్రి కూడా కాకుండానే సీల్డు కవరులో సిఎం సీటు తెచ్చుకున్న ది గ్రేట్‌ ఎన్‌కెఆర్‌ గారి అంతరంగమిది.. ఆయన అజరుద్దీన్‌కు బెస్ట్‌ ఫ్రెండ్‌.. క్రికెట్‌లో మ్యాచ్‌ఫిక్సింగ్‌ అజరుద్దీన్‌కు ఎంతగా తెలుసో.. రాజకీయాల్లో ఎన్‌కెఆర్‌కీ అంతగా తెలుసు...
...........................................................................
ఇంకా ఏం జరుగుతుందో.. ఏం జరుగబోతోందో విడమర్చి చెప్పాలా? 

26, మార్చి 2012, సోమవారం

దటీజ్‌ కేశవరావు..

ఆయన అంటే మీడియా నుంచి మేడమ్‌ దాకా అందరికీ హడల్‌.. కాంగ్రెస్‌లో ఆయన నిప్పు.. ముట్టుకోకుండానే మాటలతోనే కాల్చేసే పవర్‌ ఆఫ్‌ ఫైర్‌.. ఆయన ఇంగ్లీష్‌లో మాట్లాడారా? ఎంతటి వాళెユ్లనా డంగై పోవలసిందే..  సింపుల్‌గా చెప్పాలంటే కెకె.. పూర్తిగా చెప్పాలంటే కె.కేశవరావు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు.. మరి నాలుగు రోజుల్లో మాజీ ఎంపి.                                   
ఆయన ఒక్క మాట.. వేయి మెదళ్లను తొలిచేస్తుంది.
ఆయన ఆవేశం.. ఉద్యమానికి ఇంతకంటే గొప్ప నాయకుడెవరా అనిపిస్తుంది.
ఆయన వాగ్ధాటి మేడమ్‌ సోనియాను సైతం ముప్పుతిప్పలు పెడుతుంది.
దటీజ్‌ కేశవరావు..
కాంగ్రెస్‌లో తెలంగాణా  గురించి గత రెండేళ్లలో గట్టిగా గొంతు విప్పి ఎవరైనా మాట్లాడారా అని అడిగితే ఎవరైనా ఫస్ట్‌గా చెప్పే ఒకే ఒక్క పేరు కెకె. ఆయన మామూలుగా మాట్లాడితేనే ఆ సెユ్టల్‌కి.. ఆ ఒకాబులరీకి ఎవరైనా ఇట్టే పడిపోవలసిందే. చెప్పింది చెప్పకుండా.. చెప్పాల్సింది విప్పకుండా.. తనదైన శైలిలో మాట్లాడటం ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో కెకెకు మాత్రమే చెల్లింది.
తెలంగాణాలో మూడేళ్లుగా ఉద్యమం సాగిన రోజుల్లో బయటి సమావేశాల్లో కుప్పలు తెప్పలుగా ప్రసంగాలు చేసిన కెకె.. రాజ్యసభలో మాట్లాడింది పట్టుమని రెండు మూడు సార్లయినా లేదు.  మొన్నటి శీతాకాల సమావేశాల్లో ఒకసారి.. ఇప్పుడు బడ్జెట్‌ సమావేశాల్లో మరోసారి.. ఈసారి మరీ ఆవేశంగా తెలంగాణా ఇవ్వకుంటే చంపేయమంటూ మాట్లాడటం ఆశ్చర్యం..

కెకెలో ఈ ఆవేశం మునుపెన్నడూ కనిపించలేదు. తన పార్టీ పైనే.. తన అధినేత్రిపైనే.. తన వారి నాయకత్వంపైనే ఇంత ఆక్రోశం.. ఆందోళన ఎన్నడూ వ్యక్తం కాలేదు. ఇప్పుడు ఏకంగా తెలంగాణా ఇవ్వకుంటే చంపేసేయమంటూ తీవ్రంగా మాట్లాడిన కారణం ఏమిటి?
కెకె రాజ్యసభ సభ్యత్వం మరో నాలుగు రోజుల్లో ముగిసిపోతోంది. తిరిగి ఎంపిక చేయాలంటూ తెగ లాబీయింగ్‌ చేసినా ఆయన గోడును అధిష్ఠానం కానీ, అధినేత్రి కానీ కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు.. ముఖ్యమంత్రి కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ ఆయన వంకయినా చూడలేదు. తెలంగాణా ఎంపిలంతా మూకుమ్మడిగా మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదు.
ఇదే సమయంలో ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి అధిష్ఠానాన్ని విమర్శించటానికి మంచి అస్త్రాన్ని అందించింది. దీనికి తోడు వరంగల్‌లో ఆత్మహత్యలు.. ఆయనలోని ఆక్రోశానికి ఆజ్యం పోసింది. ఇంకేం.. రాజ్యసభలో ఆయన రెచ్చిపోయారు.. తన పార్టీ వైఖరిని కడిగిపారేశారు.. తెలంగాణా ఇవ్వకపోతే చంపేయమంటూ ఆవేశంతో అన్నారు.. అందుకే .. ఆయన.. దటీజ్‌ కేశవరావు.

ఆత్మహత్యలు చేసుకోవటం యుద్ధం నుంచి పారిపోవటమే..

rajamouli died on 26-3-2012 at warangal


bojyanaik died on 24-3-2012 at warangal
భావోద్వేగాలు మళ్లీ పెచ్చుమీరుతున్నాయి... మాటలు చెప్పేవాళ్లే తప్ప, ఎవరూ వాళ్లను ఆపేవాళ్లు లేరు..ఒకరి తరువాత ఒకరు పిట్టల్లా రాలిపోతున్నారు.. శరీరాన్ని సజీవంగా తగులబెట్టుకుని మరీ కాలిపోతున్నారు..రెండేళ్లలో ఏడు వందల ఆత్మాహుతులు తమ కుటుంబాలకు ఆత్మక్షోభను మిగల్చటం తప్ప సాధించింది ఏమీ లేదు.. మరి ఎవరిని ప్రేరేపించటానికీ బలిదానాలు?  దీని వల్ల ఒరిగిందేమిటి? ఎందుకు చేసుకోవాలి ఆత్మహత్యలు..    
రోజుకొకరు.. పూట కొకరు..పాతికేళ్లు నిండకుండానే.. బలవంతంగా ఉసురు తీసుకుంటున్నారు.. కారణాలు ఏవైనా సరే.. కాస్తో కూస్తో.. ఆత్మాహుతుల పరంపర ఆగిపోయిందనుకుంటున్న తరుణంలో  మళ్లీ  ఉద్వేగమరణాలు వరుసపట్టాయి... పిల్లల భావోద్వేగాలు, లోలోపల రేగుతున్న అలజడులు ఎంతమాత్రం చల్లారటం లేదు.. ప్రతిక్షణం ఒకే ఆలోచన.. ఏం జరుగుతుంది? తెలంగాణా  సాధ్యమేనా?.. తమ రాజకీయ నాయకుల వల్ల సాధించేదేమీ ఇక లేదన్న మానసిక ఆందోళనలను చల్లబరిచే ప్రయత్నం చేస్తున్న వాళ్లెవరూ లేరు..  సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యలు కాదంటూ ఎవరెన్ని ఉపన్యాసాలు చెప్తున్నా.. వీళ్లను కన్విన్స్‌ చేయలేకపోతున్నాయి.
రేపటి భవితకు పునాదులు వేసుకోవలసిన వయస్సు యువతరం ఇంతగా ఎమోషన్‌కు గురికావలసిన అవసరం ఏముంది..? ఎందుకింతగా జీవితాలను అర్ధంతరంగా ముగించుకుంటున్నారు. అసలు భవిష్యత్తే శూన్యంగా ఎందుకు కనిపిస్తోంది?విభజన జరుగుతుందో లేదో తెలియదు. ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవలసి వచ్చిన సందర్భంలో ఆ ప్రాంత రాజకీయ నాయకులు సమర్థంగా వ్యవహరించనంతకాలం.. ముక్తకంఠంతో, తపనతో ముందుకు సాగనంతకాలం లక్ష్యసాధన కుదరని పని. ఒకవేళ రాష్ట్ర సాధన సాధ్యమైనా, విభజన వల్లనే అంతా అయిపోతుందనుకోవటం  కూడా పొరపాటే. అన్ని ఆశలూ నెరవేరుతాయనుకోవటం భ్రమ.. మన పాలకుల చిత్తశుద్ధిపై మన ఆశలు.. ఆశయాలూ నెరవేరటం ఆధారపడి ఉంటాయి. ఏదైనా పోరాడి సాధించాల్సిందే.  అలాంటప్పుడు ఉన్న జీవితాల్ని సజీవ సమాధి చేయటం సమంజసమేనా?
బలవంతంగా మరణించినంత మాత్రాన్నే ఆశయం నెరవేరుతుందనుకుంటే ఇంతకు ముందు జరిగిన బలిదానాలకు ఫలితం కనిపించాలి కదా.. రెండేళ్లుగా సాగిన ఆత్మాహుతులకు సాకారం కాని లక్ష్యం.. ఇప్పుడు మాత్రం  ఉసురు తీసుకుంటే వస్తుందనుకుంటే పొరపాటు కాదా? మరణించిన తరువాత ఒక వేళ లక్ష్యం నెరవేరినా అది చూసేందుకు ప్రాణం ఉండదు..

మీరు ఎంత నిరాశతో మీ జీవితాన్ని ముగిస్తున్నారో.. మీ తల్లిదండ్రులు అంతకంటే వెయ్యి రెట్లు మీపై ఆశలు పెట్టుకున్నారు.. మీ నిరాశ వారి ఆశలను చంపేస్తోంది.. మీ నిరాశ ఎప్పుడైనా ఆశగా మారవచ్చు.. ఆశయంగా రూపొందవచ్చు. మీరు కోరుకున్న రీతిలో నెరవేరనూ వచ్చు. కానీ, మీ బలిదానం మీ తల్లిదండ్రుల ఆశల్ని ఎప్పటికీ నెరవేర్చవు. వారి కలల్ని శాశ్వతంగా కల్లలు చేస్తాయి. 
ఒక పరిష్కారాన్ని సాధించుకోవటానికి మార్గాలు అనేకం ఉన్నాయి. కానీ, వాటన్నింటినీ వదిలేసి ఆత్మహత్యలు చేసుకోవటం ద్వారా వాళ్లనుకున్న లక్ష్యం ఎలా సాధ్యమవుతుంది?  ఆత్మహత్యలు చేసుకోవటం యుద్ధం నుంచి పిరికివాళ్లలా పారిపోవటం లాంటిదే..మనం జీవించి ఉండి కలల్ని సాకారం చేసుకోవాలి కానీ, జీవితాన్ని అంతం చేసుకున్న తరువాత ఏం సాధించినా ఏం ఫలితం?

4, మార్చి 2012, ఆదివారం

గొల్ల రామవ్వ

A story written by Sri. pv narasimha rao, ex. prime minister of india in 1949


golla-ramavvaఢాం....ఢాం....ఢాం!.... బాంబుల ప్రేలుడుతో అర్ధరాత్రి ప్రశాంత వాతావరణం ఛిన్నాభిన్నమైంది. సర్వత్ర నిండుకున్న నిస్తబ్ధతను చీల్చి ఆ ధ్వని తరంగాలు ఒక విచిత్ర సంచలనం కలుగజేసి శూన్యంలో విలీనమైనవి. గాఢనివూదలో నిమగ్నమై యున్న గ్రామమంతా ఒక్క పెట్టున దద్దరిల్లి పోయింది. ఆబాలగోపాలం గొల్లుమన్నారు... నిద్ర మబ్బులో ఏమి జరిగిందో ఎవరికీ బోధ పడలేదు... ఏదో ఆవేదన. ఏదో చికాకు . ఏదో బెగడు. కాని అంతా అగమ్యగోచరమే! ఊరి వారికందరికి ఒకే సమయాన ఏదో మహా భయంకరమైన పీడకల వచ్చి హఠాత్తుగా నిద్ర నుండి త్రుళ్ళిపడి లేచారా అన్నంత అలజడి చెలరేగిందా రెండు నిమిషాల్లో...

ఇంత అలజడి చెలరేగినా బజార్లు మాత్రం నిర్మానుష్యంగానే ఉన్నవి. లోపలి నుండి వేసుకున్న తలుపుల గొళ్ళాలు తీసి బయటికి తొంగి చూతామనుకున్న వారి చేతులు కూడా గొళ్ళాల మీదికి పోగానే ఎక్కడివక్కడ జలదరించి నిలిచిపోయినవి. చికాకు వల్ల కీచుకీచుమని అరుస్తూ తత్తరపాటుతో అటూ ఇటూ లేచి పోయే పక్షులరవం, వాటి రెక్కల తటతట, ఊరిచుట్టు పెరండ్లలో నుండి కుక్కల అరుపు, దొడ్లలో నిశ్చింతగా నెమరువేస్తున్న పశువుల గిజగిజ, అక్కడక్కడ దొడ్లకంపను విరుగవూదొక్కి ఊళ్లో తోచిన దిక్కల్లా పరుగెత్తే దున్నపోతుల గిట్టలరాపిడి-ఇవి మాత్రమే ఆ తదుపరి వినిపించినవి. అంతేకాని, ఒక్కసారి గొల్లుమన్న గ్రామస్తులు మాత్రం అదేదో దివ్య జ్ఞానబోధ కలిగిందా అన్నట్లు మళ్ళీ కిమ్మనలేదు.... బొడ్డూడిన కూనపర్యంతం ఎవ్వరు నిద్ర కూడా పోలేదు... ఏవో గుసగుసలు... ఏవో సైగలు... ఏవో అసహాయ ధృక్కులు... ఏవో వినపడని మ్రొక్కులు.... తల్లులు తమ పిల్లలకు శ్రీరామరక్ష తీశారు. పిల్లల దడుపు పోవడానికి ఎడమ అరికాలు దుమ్ముతో నొసట బొట్టు పెట్టారు. వీపు చరిచారు. కాని పిల్లల దడుపుకుపాయాలు యోచించే తల్లులకు తమ దడుపుకే ఉపాయం దొరకలేదు. బొట్టు పెట్టుకున్న చేతుల గాజులు గలగలమంటునే ఉన్నవి. ఉన్న చోటనే ఉన్న కాళ్ళ పాజేబులు కూడా కించిత్తు ఝంకరిస్తునే ఉన్నవి.

అదొక విచిత్ర ప్రళయం... అదొక క్షణిక మృత్యు తాండవం.
అదొక అస్థిరోత్పాతం.ఒక గంట గడిచింది. ఎప్పటివపూనే నలువైపుల అంధకారం అలుముకున్నది. చిమ్మట్లు ఏకక్షిశుతితో అరుస్తున్నవి. అంతా మామూలే! కాని నిద్ర మాత్రం ఊరి దరి చేరలేదు.
గొల్ల రామమ్మ తన గుడిశెలో చీకటిలోనే కూర్చుని ఉంది. ఆమె కాళ్ళు చేతులు కూడా వణుకుతున్నవి, కొంత వృద్ధాప్యం వల్ల, కొంత భయం వల్ల. ఆమె ఒడిలో ఒక పదిహేనేండ్ల బాలిక తలదాచుకొని ఉంది...

‘‘అవ్వా! గిప్పుడిదేం చప్పుడే?’’ అని మెల్లగా ప్రశ్నించిందా బాలిక.
‘‘నీ కెందుకే మొద్దుముండా. గదేంది. గదేంది - ఎప్పటికి అడుగుడే! ఏదో మునిగి పోయినట్లు! అన్ని నీకే కావాలె!.....’’
బాలిక మళ్ళీ మాట్లాడ సాహసించ లేదు. కొన్ని నిముషాలకు ముసలవ్వ తనంత తనే మెల్లగా గొణగడం మొదలుపెట్టింది. ‘ఏమనుకున్నవే తల్లీఁ మా పాడు కాలమొచ్చిందే! మీరెట్ల బతుకుతారో ఏమో బిడ్డా! ఈ తురుకోల్ల తోటి చావొచ్చింది... మొన్ననే నలుగుర్ని తుపాకినేసి చంపింన్రు. ఇప్పుడు కూడా ఏదో గసోంటి అగాయిత్తమే చేసివూనేమో!.... ఏం పొగాలమో వీల్లకు!....’
మళ్ళీ నిశ్శబ్దం... రామమ్మ, మల్లమ్మ ఇద్దరు తమ తమ యోచనల్లో పడిపోయారు. నిద్రకు మాత్రం సంపూర్ణ బహిష్కారమే! డెభ్బైయేండ్లు దాటిన రామమ్మకు జాగరణే, కొత్తగా వయసు వచ్చిన మల్లమ్మకు జాగరణే..

హఠాత్తున కిటికీ నెవరో తట్టారు... కిటికీ అంటే దాని ప్రాణమెంత? - మంటి గోడలో వెల్తురు కొరకని ఉంచబడ్డ ఒక రంధ్రం. దానికి చెదలు పట్టిన ఏదో చెక్కతో చేయబడ్డ రెండు చిన్న తలుపులు. ఇదే ఆ గుడిసెకు కిటికీ.
ఆ చప్పుడుకు లోపలి వారిద్దరు ఉలికిపడ్డారు. కూర్చున్న చోటునుండి కదలక శ్వాసోచ్ఛ్వాసాలు బిగబట్టి జాగ్రత్తగా వినసాగారు. కిటికీ తలుపులు గాలికి కొట్టుకొన్నవో లేక పిల్లి వచ్చి కదిల్చిందో అని...!
మళ్ళీ అదే చప్పుడు. ఈసారి అనుమానం లేదు. ఎవరో కిటికీ తలుపులు తట్టుతున్న మాట నిజం. గాలి కాదు. పిల్లి అసలే కాదు.
ఏం చేయాలి? ఎటూ తోచలేదు...

మళ్ళీ చప్పుడు. ఈసారి పెద్దగా వినపడింది. ఏదో స్థిరసంకల్పంతోనే తట్టినట్లు....
ఇక లాభం లేదు. ముసలవ్వ మెల్లగా లేవసాగింది. మల్లమ్మ గుండె దడదడ మాత్రం మితిమీరింది. అవ్వను గట్టిగా పట్టుకొని కంపించే గుసగుసలో ‘‘నాకు బయమైతాందే అవ్వా!’’ అనగలిగింది.
‘‘అట్లుండు! ఏందో చూత్తాం’’ అని ముసలవ్వ దృఢ నిశ్చయంతో లేచింది. అలవాటు చొప్పున చీకటిలోనే కిటికీ వద్దకి చేరుకుంది. లోపల గొళ్ళెం తీస్తూ తీస్తూ ‘‘ఎవర్రా?’’ అంది.
ఆ ప్రశ్న పూర్తిగా ఉచ్చరించబడిందో లేదో ముసలవ్వ నోరు గట్టిగా మూయబడింది. వెంటనే ఒక వ్యక్తి అతికష్టం మీద ఆ ఇరుకు కిటికీ గుండా లోపలికి చొరబడ్డాడు. అతని పాదాలు లోపలి నేలకు ఆనినవో లేదో అతడే కిటికీ తలుపులు బిగించాడు. ముసలవ్వ బీరిపోయి నిలుచుంది....
ఇంకో మూలన మల్లమ్వ గట్టిగా కండ్లు మూసుకొని కత్తిపోటుకై ఎదిరి చూస్తున్నట్లు పడి ఉంది. చిమ్మన చీకట్లో ఏదీ కనబడడం లేదు. ముసలవ్వకు మాత్రం సందేహం లేదు. గతానుభవమే అంతా సూచించినది. పోలీసో, రజాకారు తురకవాడో ఇంట్లో దూరాడు... ఇంకేముంది? తనకు చావు తప్పదు. తానల్లారు ముద్దుగా పెంచి పెండ్లి చేసిన తన మనుమరాలికి మానభంగం తప్పదు... ఎవదిస్తారీ రాక్షసుల్ని. తాను గోల పెడితే మాత్రం పక్క ఇంటి వారైనా వినిపించుకుంటారా? ఉహుఁ! కలలోని మాట!.... వాళ్ళవి మాత్రం ప్రాణాలు కావా? వాళ్ళ యింట్లో మాత్రం పడచుపిల్లలు లేరా? ఆనాడు అంత పెద్ద కరణం గారి కూతుర్ని బలాత్కారం చేసి ఎత్తుకు పోయినప్పుడెవరేం చేయగలిగారు? ఎవరడ్డం వచ్చారు?.... ఇప్పుడు తనకు మాత్రం దిక్కెవ్వరౌతారు?...

ఒక్క నిమిషం లోపల ముసలవ్వ ఇదంతా యోచించింది. ఇక జరుగబోయేది ఆమెకు స్పష్టంగా, అద్దంలోలాగ కనిపించసాగింది.
తాను చచ్చినా సరే తల్లిదంవూడులు లేని మల్లికైనా మానభంగం తప్పితే... తానా పిల్లను సాది సంబాలించింది తుదకీ రాక్షసునికి ఒప్పగించడానికేనా.... ముసలవ్వ కన్నీరు నింపుతూ కొయ్యవలె నిలిచిపోయింది. వృద్ధాప్యపు కంపనం కూడా ఎందుకో తనంత తానే స్తంభించిపోయింది.
ముసలవ్వకు, ఆ వ్యక్తికి మధ్య దాదాపు రెండు గజాల దూరముంది. యోచనామధ్యంలోనే ఆ వ్యక్తి ఆమెవైపు రెండడుగులు వేశాడు. చీకటిలో కూడా సూటిగా సమీపిస్తున్నాడు...
ఆమెకు మిన్ను విరిగి మీద పడ్డట్లయింది. ఇంకొక్క అడుగులో తన బ్రతుకు కొనముట్టుతుంది... ఆ తరువాత పాపం మల్లి...!
అతి కష్టం మీద ఆమె మూతి మూయబడింది. ఆమె ఆ క్షణంలో తనకు తెలిసిన దేవుళ్ళందరినీ స్మరించింది... మల్లమ్మ కోసం...

ఇంతలో ఆ వ్యక్తి గుసగుస వినబడింది.
ముసలవ్వ చెవిలో... ‘‘చప్పుడు చేయకు, నేను దొంగను కాను, రజాకార్ను కాను. పోలీసును కాను. మిమ్మల్నేమి అనను. లొల్లి మాత్రం చేయకండి...’’
‘అబ్బా! ఏమి టక్కరి! నమ్మించి గొంతుకోయడానికి చూస్తునట్టున్నాడు! తీయని మాటలతోనే సంతోషపెట్టి పాపం మల్లిని...!
అబ్బ! ఎంతకైనా తగువారీ రాక్షసులు! ఔను! ముందుగా తీయని మాటలు - అవి సాగకపోతే అన్యోపాయాలు. అదే కదా క్షికమం’...
ఎందుకైనా మంచిదని ముసలవ్వ వెంటనే ఆ వ్యక్తి రెండు కాళ్ళు దొరికించుకుంది... ఎంతో దీనంగా వేడుకుంది... ‘‘నీ బాంచెను! చెప్పులు మోత్తా, నా తలకాయైనా తీసుకో. పోర్ని మాత్తరం ముట్టకు. అది నీ చెల్లలనుకో... నీ కాల్లు మొక్కుత!’’

‘‘లేదవ్వా! నమ్మవేం చెప్పుతుంటే? నేను దుష్టుణ్ణి కాదు. నేనూ మీ అందరివంటి తెలుగోణ్ణే!’’
శుద్ధ తెలుగులో మాట్లాడుతున్నాడు. ముసలవ్వ ఇదివరలో ఏ తురకవాణ్ణి ఇంత చక్కగా మాట్లాడగా వినలేదు. తొశ్శతొశ్శగా మాట్లాడే నైజాం తురకలనే చూచిందామె. కాబట్టి ఈ వ్యక్తి తురక కాడేమోనని తర్కించుకుంది.
కొన్ని నిమిషాలపాటైనా చావు, మానభంగం తప్పినవి! ముసలవ్వకదే ఇంద్రజాల మనిపించింది! మానవ హృదయంలో నిహితమైయుండే అజేయ ఆశావాద శక్తి ఆమెకు చేయూతనిచ్చింది. వచ్చిన వ్యక్తి ఎంత అపరిచితడైనా, అతడు వచ్చిన పరిస్థితుపూంత అనుమానాస్పదమైనవైనా ముసలవ్వకు మాత్రం అతణ్ణి విశ్వసించాలనిపించింది. ఇది విశ్వాసం కాదు; విశ్వాస్వేచ్ఛ. విపద్దశలో గోచరించిన ఏకైక తరుణాధారం. దాన్నెలా జార విడుస్తుంది?

వచ్చిన వ్యక్తి కాళ్ళు పట్టుకొన్న ముసలవ్వ మెల్లమెల్లగా లేస్తూ అతని మోకాళ్ళు, నడుము, వక్షస్థలం, వీపు, ముఖం, తల తడుమసాగింది. ఒకే ఒక చడ్డీ ఉంది. చొక్కాలేదు. దేహమంతటా పల్లేరుకాయలు. చిగురంత, జిట్టరేగు ముండ్లు అంటుకొని ఎండిపోయిన రేగటిమన్ను, ఆ మంటిలో చిక్కుకొనియున్న తుంగపోచలు, గడ్డిపోచలు, వెంపలాకులు, తాటిపీచు వగైరా - ఇవన్నీ ముసలవ్వ చేతులకు కండ్లున్నవా అన్నట్లు గోచరించినవి. ఆపాదమస్తకం ఎన్నో చోట్ల శరీరం కొట్టుకుపోయినట్లు చర్మమే చెబుతున్నది. కొన్ని చోట్ల గాయాల నుండి స్రవిస్తున్న రక్తపు తడి ముసలవ్వ చేతి కంటింది. మరికొన్ని చోట్ల గాయాల నుండి ఎప్పుడో స్రవించి ఎండిపోయి అట్టుకట్టిన రక్తపు ఆనవాళ్ళు తగులుతున్నవి. శరీరమంతా జ్వరంతో రొట్టె పెంకవలె మసలి పోతున్నది... ముఖం మీద ముచ్చెమటలు క్రమ్మినవి. శ్వాస అతికష్టం మీద నడుస్తున్నట్లున్నది... మధ్య మధ్య ఆపినా ఆగని మూల్గులు బయట పడుతున్నవి. గుండె వేగం విపరీతమై పోతున్నది.
స్పర్శతోనే ఈ స్థితినంతా గమనించింది ముసలవ్వ. ఆ వ్యక్తి నిస్సహాయుడు. అపాయస్థితిలో హఠాత్తుగా తటస్థించిన శరణాగతుడు.

ఇంత తెలుసుకోగానే ముసలవ్వ మనఃస్థితిలో కాయాకల్పమైంది. అనిర్వచనీయమైన భావ పరివర్తనం కలిగింది. ఐదు నిముషాలకు పూర్వం మనుమరాలి శీలరక్షణ కోసం ఆగంతకుని కాళ్ళు పట్టుకుని ‘‘బాంచెను, కాళ్ళు మొక్కుత’’ అని వేడుకున్న ముసలవ్వ ఇప్పుడు ఆశ్చర్య సహానుభూతుల సమ్మిక్షిశిత స్వరంతో ‘‘ఇదేం గతిరా నీకు? గిట్లెందుకైనవు కొడుకా?’’ అని ప్రశ్నించింది.
‘‘ఏదో అవ్వా! అదొక కథ... కొంతసేపు నన్నిక్కడ దాచు. తరువాత నా దారిన నేను పోతాలే...’’ అని అతికష్టం మీద అన్నడాగంతకుడు.
‘‘ఆ! మా పోతౌ, మా పోతౌ... ఒక్కటే పోకడ! చక్కంగ స్వర్గమే పోతౌ... మంచి బుద్ధిమంతుడౌ పా!... హు! పోతడట యాడికో!’’
ఆగంతకుడు మాటాడలేదు. ముసలవ్వ వెంటనే మనుమరాల్ని పిలిచింది. ‘‘మల్లీ! ఓ మల్లిముండా! దీపం ముట్టియ్యే జెప్పన. నిదురొచ్చినాదే పోరీ’’...
దీపం మాట వినగానే ఆగంతకుడు ఉలికిపడి అన్నాడు. ‘‘అబ్బో! వద్దవ్వా వద్దు... దీపం వెలిగించకు నీ పుణ్యం... పోలీసులు నా వెంట పడ్డారు. పట్టుకుంటారు...’’
‘‘ఇగ చాల్లే మాట్లాడకు! పోలీసులకన్న ముందల సావు దేవతే పట్టుకునేటట్టున్నది నిన్ను!’’ అని ముసలవ్వ గద్దించింది.

మల్లమ్మ దీపం వెలిగించింది. ముసలవ్వ ఒక మూలకొక గొంగడి పరిచింది. దీపపు వెలుతురులో ఆగంతకుణ్ణి కొంత తడవు పరీక్షించింది. బక్క పలుచని యువకుడు, పదునెనిమిదేండ్లకు మించని వయసు. నూనూగు మీసాలు - గంభీరతను సూచించే కండ్లు. సుకుమారమైనప్పటికీ చాపతీగ బెత్తం వలె వంగగల దేహం. సౌమ్య సౌజన్యాల నీనే ముఖమండలం...
ఆ యువకుణ్ణి చూచిందో లేదో ముసలవ్వ ఆశ్చర్యం మేరమీరింది.
‘‘రాజోలిగె ఉన్నవు కొడుకా! నీ కెందు కొచ్చెరా ఈ కట్టం? .... పండు పండు.... ఆ గొంగల్ల పండు. బీరి పోతావేందిరా? పండు. ఆఁ! గట్ల ఁ మల్లిపోరీ! కుంపటి మీద కడుముంతెడు నీళ్ళెక్కియ్యే... అబ్బ! మంజగరున్నోలిగె కదుల్తది మబ్బు ముండ! ఈడ పోరని పానం పోతాందంటే దీనికి నిర్దమబ్బే వదల్లేదు... ఊఁ! కానీ జెప్పున, ఎక్కిచ్చినవా కడుముంత? ఆ ఁ ! ఇగరా... దీపం పోరని దగ్గరకు తే... దీపానికి ఇంటి తలుపుకు నడుమ నా గడంచె నిలబెట్టు. దానికి నా గొంగడి ముసుగెయ్యి.... ఏసినవా? ఆఁ గట్ల. గిప్పుడు కొద్దిగ వుశారయింది పొల్ల! మొగుడు నాలుగు మల్కల పెయ్యి మెదిగబెడితే ఇంకా కుదుర్తది చురుకు!... కొద్దిగ సందుంచి ఓ కంచుడు బోర్లియ్యి దీపంతె మీద. ఆ పోరని మీద ఎలుగు పడాలె. కడుమ దిక్కుల్ల చీకటే ఉండాలె. గట్ల కావాలె ఉపాయం... ఆఁ! గంతె! ఉన్నదే ఒనరు నీ దగ్గెర! మా చేత్తవులే సంసారం!... ఇక కూకో వాని పక్కన. ముండ్లు తీసెయి ఉల్లుల్లుగ... అయొ! సిగ్గయి తాందా వాన్ని ముట్టుకుంటె? ఏం మానపతివి గదనే! నీ సిగ్గు అగ్గిలబడ! వాని పానం దీత్తవా యేం సిగ్గు సిగ్గనుకుంట? ఊఁ! చెయ్యి చెప్పిన పని! పాపం పీనుగోలె పడున్నడు గాదె! వాన్ని జూత్తె జాలి పుడుతలేదె నీకు దొమ్మరముండా?... ఆ! గట్ల! నొప్పిచ్చకు పాపం!...’’


మహా ప్రవాహం వలె సాగిపోతున్నది ముసలవ్వ గొణుగు ధోరణి. అందులోనే చివాట్లు, అందులోనే వినోదం, అందులోనే ఆజ్ఞలు - ముసలవ్వ ఆజ్ఞలన్ని చకచకా అమలౌతున్నవి. యువకుడు నిజంగా అర్ధశుద్ధావస్థలో పడియున్నాడు. మల్లమ్మ జిట్టరేగుముండ్లు ఒక్కొక్కటి తీస్తున్నది. యువకునికేదో క్రొత్త లోకంలోకి వచ్చినట్లుంది.

ముసలవ్వ మళ్ళీ ప్రారంభించింది.
‘‘వచ్చినాయె ముండ్లన్ని? - మా కట్ట పడుతున్నావే పొల్లా! పున్నెముంటుంది నీకు. మల్ల పెతరమాసకు తుంటకొక్కంత బుడ్డోన్ని కంటవులే! సరె. ఇగబటు... నీల్లెచ్చబడ్డయి... ఈ పేగు నీల్లల్ల ముంచి వాని గాయాలన్ని కాపు. ఆ రౌతం మరకలు, మంటి ముద్దలు తుడిచి పోరెయ్యి తానం జేసినట్టు కావాలె - పాపం! ఎంత సుకాశిపెయ్యే పొల్లంది! ముట్టుకుంటే దూదోలిగె తలుగుతాంది! ఎసోంటోని కెసొంటి గతొచ్చిందే!’’

చూస్తూ చూస్తూ మల్లమ్మ పరిచర్యవల్ల యువకుని గాయాల బాధ తక్కువయింది. దేహమంతా శుభ్రమైంది. మెల్లమెల్లగా తేరుకున్నాడు.
ఇంతలో ముసలవ్వ తలెలో ఏదో తెచ్చింది. యువకుని తలాపున కూర్చొని అతని తల నిమురుతూ గొణగసాగింది.

‘‘ఇగ లే కొడుకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లల పిసుక్కచ్చిన... గింత కడుపుల పడేసుకో. ఎన్నడన్న తాగినావు తాతా గట్క? వరిబువ్వ తినెటోనికి నీకే మెరుక? గొల్లరామి గట్కంటే ఏమనుకునౌ? పొయ్యే పానం మర్లుతది! చూడు మరి - కులం జెడిపోతవని భయపడుతున్నవా? నువ్వు బామనోడవైనా, జంగమోడవైనా, యేకులమోడవైనా సరే - మొదలు పానం దక్కిచ్చుకో. అంతకైతె నాలికెమీద బంగారి పుల్లతోటి సురుకుపెడితే పోయిన కులం మల్లత్తదట కాదు? - ఆఁ! ఇగ తాగి పాయ్యి గటగట!-’’

యువకుడు లేచి కూర్చున్నాడు. ముసలవ్వ మాటలకు కొద్దిగా నవ్వు వచ్చిందతనికి. చిరునవ్వు ముఖంతో ముసలవ్వను చూస్తూ తలె అందుకున్నాడు. అందులోది నవజీవన సర్వస్వ సారమన్నట్టు ప్రీతితో గటగట త్రాగాడు - ముసలవ్వ మాట అక్షలారా సత్యమైంది. సగం పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి. యువకుని ముఖం మెల్లమెల్లగా వికసించింది. కండ్లలో జీవనజ్యోతి వెలుగజొచ్చింది.
ముసలవ్వకు పూర్ణ సమాధానమైంది. యువకుని వైపు చూస్తూ, ముడుతలు పడ్డ ముఖంతో నవ్వుతుంటే ముడుతలన్ని అంతర్ధానమైనవా అనిపించింది. కొన్ని నిముషాల పాటలాగే ఉండిపోయారు ముగ్గురు...

యువకుని దేహాన్ని ప్రేమతో నిమురుతున్న ముసలవ్వ చేయి హఠాత్తుగా అతని చడ్డీ జేబు వద్ద ఆగిపోయింది. వెంటనే ‘‘గిదేందిరో?’’ అంటూ ముసలవ్వ ఆ జేబులో చేయి వేసి ఒక ఉక్కు వస్తువ తీసింది.

‘‘అది రివాల్వరవ్వా! తోటాల తుపాకి..’’ అన్నాడు యువకుడు.
‘‘ఎందుక్కొడుకో తుపాకి? మమ్ములగిట్ల చంపుదామనుకున్నావా, యేంది?’’ అన్నది ముసలవ్వ.
‘‘లేదవ్వా! మిమ్మల్ని చంపేవాళ్ళను చంపే అందుకది... ఈ రాత్రి ఇద్దరు పోలీసులను హత మార్చాను. మొన్న మీ గ్రామంలోని నలుగురు నిర్దోషుల్ని కాల్చి చంపిన పోలీసులే!’’
ముసలవ్వ ముఖ లక్షణాలు వర్ణణాతీతంగా మార్పు చెందినవి. మొదట కొద్దిగా భయం, ఆ తదుపరి తెగువ, ఆ తరువాత ఉత్సాహం, ఆ వెనక విజయోల్లాసం క్రమశః గోచరించినవి.
యువకుడు ముసలవ్వ ముఖాన్ని సూక్ష్మంగా పరీక్షిస్తున్నాడు. భావ పరివర్తన చూచినకొద్దీ అతని మానసం పరిపరి విధాల తర్కించుకుంటున్నది. ఆ విషయం ఎందుకు చెప్పానా అన్న పశ్చాత్తాప రేఖ కూడా అతని మనస్సును ఒకసారి స్పృశించి పోయింది. ఏమంటుందో ఈ వృద్ధురాలు? శతాబ్దాల దాస్యమనుభవించి దలితమైన ఈ అమాయక గ్రామీణ సమాజంలో తేజమెక్కడ శేషించింది. ఎలాగైనా ఆ గుడిశె ఆశ్రమం నుండి తనకుద్వాసన జరిగి తీరుతుందని అతనికి తోచింది. ఇద్దరు పోలీసులను చంపిన హంతకుణ్ణి ఎవరుండనిస్తారు? ఎంతమంది తన తోటి కార్యకర్తలు ఈ గ్రామస్థుల పిరికితనం వల్ల పట్టు పడలేదు? యువకుని మనస్సు ఎన్నెన్నో వితర్కాలకు లోనౌతున్నది.

కొంత సేపు యోచించి హృదయం ధడుక్కుమన్నది.
‘‘ఇద్దర్నా?... కాని ఇంకిద్దరు మిగిలిన్రు కొడుకా! సగం పనే చేసినవు...!’’
యువకుడు చకితుడైనాడు. అతని సుసంస్కృత మానసం గర్వోన్నతమై కల్పనాకాశంలో భ్రమణం సాగించింది. అతని తారుణ్యానురూప భావుకత్వం అతణ్ణి మైమరపించింది. శ్రీరామస్మరణ వల్ల ఉప్పొంగే హనుమంతుని దేహం వలే తన దేహం కూడా ఉప్పొంగి పోయినట్లనిపించింది. రివాల్వరు కొరకై చేయి చాస్తూ ‘‘తక్కినవాళ్ళను కూడా చూచుకొస్తా తే అవ్వా!’’ అనేశాడు.
ముసలవ్వ రివాల్వరు లాక్కొని ప్రారంభించింది.

‘‘చాల్లే చేశిన కాడికి! బాద్దురుగాడవు పా! బాగ తిని ఉండబుద్దిగాక పోలీస్ తోటే వైరం పెట్టుకుంటడట ఉచ్చిలిపోరడు! ఎందుకురా నీకు పోలీసోల్ల తోటి కైలాట్కం?’’
యువకుడన్నాడు ‘‘నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటియర్ను. నైజం రాజు తోటి కాంగ్రెస్ పోరాడుతున్నది. ప్రజలు పోరాడుతున్నారు.’’
యువకుడేదో రాజకీయ సిద్ధాంత బోధ ప్రారంభిస్తాడా అనిపించింది. కాని మధ్యలోనే ముసలవ్వ అందుకున్నది. ‘‘యాడున్నదిరా నీ కొట్లాట? ఈడనైతే పెద్ద పెద్దోల్లంత ఆ తురుక పోలీసోల్లనే ఇండ్లల్ల పండ బెట్టుకుంటాన్రు గాదు? ప్యాదోల్లు కొట్లాడితే ఏమైందిరా?’’
‘‘పేదవాళ్ళతోనే నడుస్తున్నదవ్వా కాంగ్రెస్ పోరాటం...’’ అన్నాడు యువకుడు.
‘‘మరైతే నీది కాంగిరిజో గీంగరిజో అండ్ల ఈడుపడ్డోల్లు లేరార? గడ్డాలు, మీసాలు నరిశినోల్లంతయాడ విరగడైపోయింన్రు?’’

‘‘వాళ్ళందరు పట్నంలో ఉంటారు. రాజుతో మాట్లాడుతారు. ప్రజల తరఫున వాదిస్తారు. అధికారాలు ఇప్పిస్తారు. నాయకత్వం చేస్తారు.’’
ముసలవ్వ విసుగుతో అందుకుంది. ‘‘ఏహే! గదంత నాకు మనసున పట్టది. పెద్ద పెద్దోల్లేమొ ముచ్చట్లు పెట్టుకుంట కూకుంట రట! పసి పోరగాల్లనేమొ పోలీసోల్ల మీదికి పొమ్మంటరట! ఇగ యీ పొల్లగాల్లేమొ చేసుకున్న పొల్లల ముండ మోపుటానికి తుపాకులు బుజానేసుకుని బైలెల్లుతురట! ఎంత పాడుదిన మొచ్చింది. అన్నాలం పాడుబడ!’’
అలాగే కొంతసేపు గొణిగి ముసలవ్వ ఆజ్ఞాపించింది. ‘‘అరేయ్! ఇగ కొద్దిగ కన్ను మలుపుకో. జాము నాత్తిరున్నదింక. ఇంత నిర్ద పట్టితే బతుకుతవు. వశేయ్ మల్లిపోరీ! మనిద్దరం తెల్లారేదాక కావాలుండాలే. నువ్వా కొనకు. నేని కొనకు. కూర్పాట్లు పడ్డవంటే యాదుంచుకో - ఒక్క చరుపుకు దయ్యం వదిలిపోవాలె మరీ - ఆఁ’’

పాలు పిండేవేళ అతిక్రమించి పోతున్నది. ఇండ్ల వెలుపల కట్టివేసి యున్న గేదెలు లోపలి దుడ్డెల కొరకు అరుస్తున్నవి. లోపలి నుండి దుడ్డెలు విలపిస్తున్నవి. పాల చేపుల ఆతురత ఒకవైపు. ఆకలి బాధ రెండవవైపు. కాని పాలు పిండబడడం లేదు. రోజు ఈ పాటికి ఎటువిన్నా జుంయి జుంయి మనే పయస్సంగీతం నేడు సంపూర్ణంగా నిలిచిపోయింది. భయం వల్ల గ్రామంలోని జీవ లక్షణాలన్నీ ఒక్కుమ్మడి లుప్తవూపాయమై పోయినవి. మృత్యు సమయపు అంతిమ సంచలమైనా లేదు.
స్మశానవాటికలోని కాటి చిటచిటలైనా లేవు. ఆ గ్రామంలో అనాది కాలం నుండి అంతా నిశ్శబ్దమే అన్నట్లనిపించింది.
రామమ్మ, మల్లమ్మ ఇద్దరు కావలి కాస్తున్నారు. యువకుడు సుఖనిద్ర పోతున్నాడు. చీమ చిటుక్కుమన్నా అదిరిపడే అంత నిదానంగా ఉన్నారు గ్రామ ప్రజలు. కాని చీమ కూడ చిటుక్కుమనడం లేదు. గత రాత్రి భయంకర సంఘటనకు కారకుడైన ఆ యువకుడొక్కడే నిద్రిస్తున్నాడు. తక్కిన గ్రామమంతా శ్వాస బిగబట్టి నిరీక్షిస్తున్నది.
దేనికో? ఎవరికోరకో? ఎందుకో? ఇదంతా... అంతరికీ తెలుసు. పాతకథే!...

రామమ్మ యోచిస్తున్నది. ఎవరో కాంగ్రెస్ వారు ఊరికి వచ్చారన్న నేరంపైన ఇదివరకే నలుగురు నిర్దోషులు కాల్చివేయబడ్డారు. ఇక ఈసారో, ప్రత్యక్షంగా ఇద్దరు పోలీసులే చంపబడ్డారు. ఠానా భగ్నం చేయబడింది. ఊరినంతా దగ్దం చేసి ఊరివారందరిని కాల్చివేసినా ఆశ్చర్యం లేదు. అదొక పండుగే! ఏ ఒక్క ఇంట్లోనో పోలీసులు చొచ్చి హత్యలు, మానభంగాలు సాగించడం, ప్రక్క ఇంటివారు కిమ్మన లేకపోవడం. ఈ విధంగా ఒక్కొక్క యింటి లెక్కన తుదకందరి కదేగతి పట్టడం. ఇంతకన్న ఊరి వారందరు ఒకేసారి చంపి వేయబడటం మేలు కదా? పదిమందితో చచ్చినా మంచిదే, బ్రతికినా మంచిదే కుక్కచావు కన్న!
నిద్రిస్తున్న యువకునికి తల నిమురుతూ రామమ్మ గొణిగింది. ‘‘అబ్బ! ఏం పోరడు! ఇసోంటోప్లూంత మంది చావాల్నో ఇంక!’’
అకస్మాత్తుగా బజారులో మోటార్ ట్రక్కు చప్పుడైంది. ఎటు విన్నా బూటు కాళ్ళ తటతటలే వినరాసాగినవి. ఏవో అరుపులు, తురకభాషలో తిట్లు - దుర్భాషలు ప్రగల్భాలు. ఛటేల్ ఛటేల్‌మని మధ్య మధ్య కొరడా దెబ్బలు.

‘‘చస్తి! చస్తి! నీ బాంచెన్.... నా కెరుకలేదు. అయ్యొ! వావ్వొ! వాయ్యో!!’’ అన్న అరుపులు.
మిన్ను ముట్టే ఆక్రోశాలు. అంతకు మించిన క్రూర నినాదాలు. ఒండొంటితో పోటీ చేస్తున్నవి. మనుష్యులు ఉన్న వారున్నట్లు బజార్లలో ఈడ్వ బడుతున్నరు. రెండు గడియల క్రితం స్మశానవాటికను మరపించిన గ్రామం ఇప్పుడు యమపురిని తలదన్నుతున్నది...
మల్లమ్మ గడగడలాడింది. యువకుడు దిగ్గున లేచి కూర్చున్నాడు. ఆ గాఢ నిద్ర క్షణంలో మటుమాయమైపోయింది. రివాల్వరు ముసలవ్వ చేతి నుండి తీసుకొని తోటా పూక్కించాడు. బయట జరుగుతున్న అలజడి రెండు నిముషాల వరకు విన్నాడో లేదో - అతన్నో మహావేశం ఆవరించింది.
ముసలవ్వ స్థితి మాత్రం చెప్పేటట్టు లేదు. అది భయం కాదు. వ్యాకులత కాదు. దుఃఖము అసలే కాదు. అపూర్వమైన నిశ్చలత్వం, గాంభీర్యం ఆమెలో ప్రవేశించినవి. బయటి హాహాకారం చెవి సోకిన కొద్ది ఆమెలో కూడా అదొక రకపు ఉద్వేగం బయలుదేరసాగింది.

రివాల్వరులో తోటాలు నింపుకుని యువకుడు దిగ్గున లేచాడు. తలుపు వద్దకి చకచకా నడిచాడు. గొళ్ళెం మీద చేయి పెట్టాడు. తీయబోయాడు కాని.. కాని వెంటనే అతిని చేయి మీద మరొక చేయి వచ్చి పడింది. అది ఉక్కుచేయి కాదుగదా అన్నంత దృఢతరంగా తగిలిందని చేతికి. అతడు మహాశ్చర్యంతో వెనకకు తిరిగి చూశాడు. ‘ఆఁ’ అన్నాడు.
ముసలవ్వదే ఆ ఉక్కు చేయి!

‘‘యాడికి?’’ అని ప్రశ్నించింది ముసలవ్వ. యువకుని మాట తడబడ్డది. తుపాకి గుండ్ల మధ్య విహరించే ఈ వీర యువకుడు, రాక్షసులనైనా నిర్భయుడై ఎదిరించే ఆ శూర శిరోమణి, దేశ కల్యాణానికై ప్రళయాన్నైన ధిక్కరించే తరుణ సింహం, నేడొక్క డ్బ్భైయేండ్ల ముసలవ్వ ప్రశ్నకు జంకాడు.
అతని గుండె జల్లుమన్నది. కాని వెంటనే గొంతు సవరించుకొని అన్నాడు. ‘‘ఎక్కడికేమిటవ్వా అటో ఇటో తేలిపోవాలి. హింస జరుగుతుంటే చేసినవాణ్ణి నేను దాగుకోవాలా? దాగడం మాత్రమెంతసేపు? ఈ యిల్లు సోదా తప్పుతుందా? పైగా నా వల్ల మీకు అపాయం కలుగుతుంది - నన్ను పోనీ అవ్వా!’’
ముసలవ్వ మాట్లాడలేదు - యువకుని చేయి పట్టి వెనకకు లాగింది. మంత్రముగ్దుని వలె అతడామెను అనుసరించాడు.

బయట అలజడి అధికమైంది. బూటుకాళ్ళ చప్పుడు గుడిసెను సమీపిస్తున్నది. ముగ్గురు నలుగురు వ్యక్తులు గుడిసె ముందు నుండి పక్క ఇంటి ముందటికి వెళ్ళారు. ఆ వెనక
‘‘రామ్‌ధన్ గడ్‌రీకీ గుడ్సీ యహీ హై’’ అన్న మాటలు వినిపించినవి.
మళ్ళీ ఒకసారి యువకుడు బయటి తలుపు వైపు పోబోయాడు. కాని ముసలవ్వ అతన్ని వెనక్కి నెట్టింది. రివాల్వరు అతని చేతి నుండి లాగుకుంది. మినుకు మినుకు మంటున్న దీపాన్ని పూర్తిగా ఆర్పింది. మల్లమ్మను పిలిచి చెప్పింది.
‘‘పొల్లా! నిన్న మర్రి కొంరడు కట్టుటానికియ్యలే? ఆ దుప్పటీన్ను కండువ తీస్కరా! యాడబెట్టినవోతే ఎల్లెం తెచ్చినవా? ఆఁ! పిల్లగా! ఆ దుప్పటి కట్టుకో కండువ నెత్తికి చుట్టుకో ఊఁ యేమాయే గింతసేపా? మల్లీ! నీ రెండు చేతుల దండకడ్యాలు వానికియ్యి... బక్కపల్చటోడు మా పట్టుతై... ఆఁ పట్టినయా? గంతే! ఒక్క కుర్మదారముంటే బాగుండు. ఇప్పుడేడ దొరుకుద్ది? ఊఁ లేకుంటే లేకపాయె. ఈ పోరని చడ్డి కూరాటి కుండ కింద దాచిపెట్టే పొల్లా! ఆఁ గొల్లేశ మేసినవా కొడుకా? అచ్చం ఎర్రగొల్లే నోలిగేనే ఉంటవు! ఎవడన్న మాట్లాడిత్తె గొల్లోనోలె మంచిగ మాట్లాడాలె...’’
‘‘ఆఁ’’ అన్నాడు యువకుడు.

దాగి తిరిగే కార్యకర్తలకు గొల్లవేషాలు మామూలే కనుక యువకుడు సంసిద్ధుడైనాడు. వేషం తయారయింది. ఇక ఏ త్రోవనో బయట పడడం మాత్రమే శేషించింది. ముసలవ్వ ఆజ్ఞకై నిరీక్షిస్తున్నాడు.
అకస్మాత్తుగా తలుపు మీద నాలుగైదు సార్లు దిబదిబమని దెబ్బలు పడ్డవి. ‘‘రామా ఓ రామీ! ఓ గొల్లరామీ! తల్పూకీ ఖోల్’’ అనే కర్కశ స్వరాలు వినిపించినవి. కొందరు బూట్లవాళ్ళు ఇంటి చుట్టు దగ్గర దగ్గరగా నిలుచుంటున్న అలికిడి వినవచ్చింది. ఇంకేముందీ? తప్పించుకునే వీలులేదు. ఈ గొల్ల వేషమంత వ్యర్థమైనట్లే. యువకుని చేయి రివాల్వరుకై వెదకసాగింది. కాని ముసల్వను అడిగే ధైర్యం రాలేదు.

ముసలవ్వ గుసగుస ప్రారంభించింది? ‘‘మల్లీ! ఆ మూలకు మంచం వాల్చి గొంగడెయ్యె. పిల్లగా! అండ్ల పండుకో. ఊఁ పండుకో.’’
యువకుని కెటూ తోచలేదు. ఇంతకూ తుదకు పట్టుపడటమే నొసట వ్రాసి యున్నట్లుంది. అలా మంచంలో పడుకోవడం వల్ల లాభమేమో అతనికి బోధ పడలేదు. విధి లేక పడుకున్నాడు.
మళ్ళీ తలుపుమీద దిబదిబ!
‘‘ఓ రామీ! తల్పూ తీస్తా లేదూ. తూ భిన్న హరాంజాదీ! మాట్లాడౌ! మాట్లాడౌ! నీకి తోడ్కల్ తీస్తం ఠైర్! ఫౌరన్ తీ తల్పు, లేకుంటే తోడాయిస్తం సూడు.’’
ముసలవ్వ ఇప్పుడిప్పుడే నిద్ర లేచిన దాని వలె ఆవలిస్తూ ఒళ్ళు విరిచిన చప్పుడు చేస్తూ అర్ధ స్పష్టంగా ప్రారంభించింది.
‘‘ఎవ్వర్రా పెద్ద దొంగనాత్తిరచ్చి తలుపు కొడ్తాన్రు? దొంగముండ కొడుకులున్నట్లున్నరు! మీ ఇల్లు పాడుబడ. పోలీసోల్లు రాత్రి గత్తుకత్తె మీ యీపులు పెట్న బలుగుతయ్.’’
బయటి వాళ్ళు ‘‘మేం పోలీసోళ్లం’’ అని ఇంకా ఏమేమో చెప్పబోయారు. కాని ముసలవ్వ ఒక్క అక్షరం కూడా వినిపించుకోలేదు. బిగ్గర బిగ్గరగా అరుపులు, మధ్య మధ్యన రెండు మాటల గుసగుస.
‘‘కాలం పాడుగాను! ఎవ్వల కొంపలవాళ్లను పడుండనీయరు. నాత్తరనక పగలనక చంపుతాంటరు.’’
‘‘పొల్లా! పోరని మంచానికి నా గడెంచే అడ్డం పెట్టు.’’

‘‘నన్నేం దోసుకుంటర్రా? ముసలి ముండ దగ్గరేమున్నది? దొంగలైతే ఉన్నోన్ని దోచుకోండి, లేవలేం దాన్నెందుకు చంపుక తింటరు. అబ్బబ్బ! తలుపు పలగొ ఉన్నది. ఆగరాదుండి? కట్టెత్తె తప్పా గుర్రాన్ని? లేవలేని ముండను. చెంగుచెంగున గంతుపూయ్యాల్నా మీ తొందరకు.’’ ‘‘మల్లీ! మాట్లాడక ఆ పోరని పక్కల పండు ఊఁ నడూ!...’’
‘‘ఇగ పగులగొట్టండ్రి! లేచి తలుపు తీసేదాక గూడా ఒపిక లేకపోతే పగులగ్గొట్టండ్రి. ఇంట్లజొచ్చి నా దగ్గరున్న రావన వరాలు తలిన్ని దోసుకోన్రి... దీపమన్న ముట్టిత్తామంటే కుంపట్ల అగ్గి లేదు. ఈ మల్లి ముండకు ఎన్నిసార్లు చెప్పిన మాపటాల్ల కుంపటి కప్పదు. ముదనట్టం ముండ! ఇగ నిన్న మొగడచ్చిండేమొ, దానికి పట్టపగ్గాల్లేకుంటున్నది. ఏ పని చెప్పినా యినుపించుకోదు. నడుమనే ఆగమైతాంది. మొగన్ని చూచి మురిసిపోతాంతి. వగలముండ!...’’
‘‘చెయ్యేసి పండుకో పోరడా దానిమీద! చూసెటోని కనుమానం రావద్దు.’’
‘‘ఇగ నా చాతాగాదురా తండ్రీ ఈ మల్లి ముండ లేవలేదు. ఓ మల్లీ! ఓరి మల్లిగా! ఉహూఁ వీల్లు లేవరు నీకు దీపప్పంతె దొరకదు చీకట్ల! వీల్ల వైస్సు వక్కలుగాను, బజార్ల గంత లొల్లయితాంటె మా రాజుగ గుర్రుకొడుతాన్రు...ఈ అంగడప్పోరి నేంజేతు?... నా ముంగట్నే కొడుకు కోడలు రుచ్చాలోలె పడిపోయిన్రు. ఈ పోర్ని నా నెత్తిన పడేశిన్రు. దెబ్బకొడ్తెనేమొ రద్ది. కొట్టకుంటే బుద్ధిరాదు. ఎక్కడి పీడ తెచ్చి పెడితివిరా నా పానానికి! యాడున్నవురో కొడుకా! నా కొడుకా! ముసలిముండకు చెరబెట్టి పోయినావు కొడుకా! నా కొడుకా! నేనేం జేతురో కొడుకో! నా కొడుకా’’!

ముసలవ్వ మహార్భాటంతో రాగం పెట్టి ఏడువసాగింది. బయటివాళ్ళు నానావిధాల మాట్లాడుతున్నరు. ‘‘పాపం పోనీ’’ అని ఒకరు. ‘‘అబ్బో ఈ ముసలిది చాలా బద్మాష్’’ అని మరొకరు. మొత్తానికి సోదా జరిగి తీరాలని అందరూ నిశ్చయించారు.
లోపలి నుండి గొణుగు సాగుతూనే ఉంది. ‘‘అవ్వల్ల! అయ్యల్ల! ఆగున్రి తలుపు తీశేదాక అవ్వల్ల! అయ్యల్ల!’’
‘‘తోడ్ దేవొరే దర్వాజా’’ అని బయట ఆజ్ఞ ఇవ్వబడుతుండగనే ముసలవ్వ తలుపు గొళ్లెం తీసింది. ఇద్దరు పోలీసులు ఒక్కుమ్మడి తలుపు నెట్టి తలుపు తెరువబడడంతోనే అమాంతం ఒకరి మీద ఒకరు పడ్డారు.
వాళ్ళు పడడంతోనే ముసలమ్మ పెద్దకేక వేసింది. వాళ్ళు లేవడంతోనే వాళ్ళ క్రిందనే పడ్డట్టుపడి ఏడవసాగింది.
‘‘చంపతిర్రా! నీ దౌడలుబడ - ముసల్దాని పానం తీత్తిర్రా! ఇగ చూసుకోండి ఆ పడుచు పోరగాండ్లాడ మంచంల పడున్నరు. ఈడ నేనున్న, కుండలటున్నయి. గురుగులున్నయి. తలెముంతలున్నయి. పోరి మెడల గంటెపుత్తలున్నయి. పోరగానికి రెండు దండి కడియాలున్నయి. ఇగేం కావాల్నో తీసుకోండి, చంపాల్నంటే చంపుండి. నన్ను చంపండి. పొల్ల ముండమొయ్యక ముందు దాన్ని గూడ తుపాకి నెయ్యండి. ఇద్దర్నొక్కసారే చంపుండి. అప్పట్నుంచి నన్ను చంపుక తింటాన్రు. ఇగ జుర్రుకోండి ఏం జుర్రుకుంటరో!...’’

మల్లమ్మ మెల్లగా కండ్లు నులుముకుంటు మంచం దిగి వ్యాకుల దృష్టితో అటూ ఇటూ చూడసాగింది. యువకుడు కూడా ఆవులిస్తూ లేచి మంచం మీదనే కూర్చున్నాడు.
పోలీసు వారందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. ముసలవ్వ ధోరణి నడుస్తూనే ఉంది.
‘‘ఇంకేం చేత్తరో చెయ్యరాదుండి... తుపాకులున్నై గద... చంపరాదుండి నన్ను. ఇగ బతికినన్నోద్దులు బతుకుతనా?....’’
యువకుని వైపు చూపిస్తూ పోలీసు జమాదారు ప్రశ్నించాడు. ‘‘వాడు యెవడున్నడ్ చెప్పు! కాంగ్రెసోడాయేం?....’’

ముసలవ్వ నెత్తిన నోరు పెట్టుకొని అరవసాగింది.
‘‘వాడెవ్వడా? ఎవ్వడు పడితే వాడు మా పక్కల్ల పండుటానికి మేమేం బోగమోల్లమనుకున్నావా? నిన్నెవడన్న గట్టనే అడుగుతె ఎట్టుంటది? ఆ మాటత్తోటి మానం దీసుడెందుకు? పానం తియ్యరాదుండి! నా బుద్దెరిగిన కాన్నుంచి నేనైతే గింత బేఇజ్జతి మాట యెవ్వల్లనోట్నుంచి యినలే. ముసల్తనానికి ఇయ్యాల మానం పోయింది. ఇగ యాన్నన్న ఉరిబెట్టుకుని చస్తేంది. ఇలాంటి బతుకు బతికిందానికన్న?.... వాడు మా మల్లడైతడా కాడా ఊరోల్లందర్ని తెలుసుకోన్రి. వెలగచ్చినంక బాగ పరిచ్చవట్టి చూస్కోండి. కాని గిసొంటి బే కంగాలు కూతపూందుకు. మేమసంటోల్లం కాదు బాంచెను! ఏదో మీ పాదాలకింద బతుకుతాన్నం. బైటోడు గొల్లరామి గుడిశెలకొచ్చి తప్పిచ్చుకుంటాడు? పానం పట్టుకచ్చి అప్పచెప్పవయ్య? గొల్లరామెసోంటిదో ఊరోల్లనడుగుండి!’’
అప్పటి తీవ్రతకు, ఇప్పటి విధేయతకు పోలీసులు చకితులైనారు. ఏమనుకోవాలో, ఏం చెయ్యాలో వారికి తోచలేదు.

‘‘పోన్రి బాంచెను! ఈడేం లేదు. నా మాట అబద్దమైతే తలకాయ కోశిత్త. నేనేడికి ఉరికిపోను. ఈడ్నే ఉంట. నా మాట డాకల చూడుండి. ఇగ తిప్పల బెట్టకుండి!’’
పోలీసు జమాదారు కొంతసేపు యోచించి లేస్తూ అన్నడు. ‘‘అచ్ఛా! నేన్ పంచనామా చేస్క్రోనీ వస్తా. నీ బయాన్ని తీస్కుంటా. వీన్కి హాజర్ చెయ్యాలె. లేకుంటే నీకీ షూట్ చేస్తా, తెల్సిందీ.’’
జమాదారు బయలుదేరాడు. ముసలవ్వ మంచం మీద కూర్చుంది. ఒక వైపు యువకుడు మరోవైపు మల్లమ్మ అదొక అపూర్వ సమ్మేళమనిపించింది యువకునికి.
‘‘అవ్వా! నీవు సామాన్యురాలవు కావు సాక్షాత్ భారతమాతవే’’ అన్నాడు యువకుడు భావలీనతలో కండ్లు మూసి.
దోడ్త్! కొంటె పోరడా! నాకే పేర్ల బెడుతున్నావు?... నా పేరు గొల్లరామి! గంతే... ఇగ నువ్వెల్లు... మల్లిని అత్తోరింటికి తోలుకపోత, పొద్దెక్కుతాంది... ఊఁ యెల్లు...’’
ముసలవ్వ ఆజ్ఞ అనుల్లంఘ్యుమైందని యువకుడది వరకే తెలుసుకున్నాడు.
(కాకతీయ పత్రిక; 15-10-1949)