22, డిసెంబర్ 2012, శనివారం

జనం గొంతు విచ్చుకుంటోంది.. టెన్ టీవీ ఆవిష్కారమవుతోంది


ఒక మహాయుగం పరిసమాప్తం కాబోతోంది. మరో మహా యుగం ప్రారంభం అవుతోంది. ఇది ప్రళయం కాదు. సునామీలు కాదు.. సమాచార ప్రసార విశ్వాన్ని ప్రళయకాల జర్ఝరులు అతలాకుతలం చేయనున్నాయి. తెలుగు ప్రజపై జర్నలిజం అనే ముసుగులో  సాగుతున్న నిరంకుశ సమాచార స్రవంతులు ఆగిపోనున్నాయి. ఇది డిసెంబర్ 21 కాదు. 2012 సినిమా అంతకంటే కాదు..  ఒక ప్రత్యామ్నాయ శకం ఆవిర్భావానికి నాంది. ఇంతకాలం వినిపించకుండా పోయిన అనేక గొంతుల వాణి.. ఇప్పటిదాకా కనిపించకుండా పోయిన అనేక యథార్థ చిత్రాల తెర . నిజం నిప్పై.. తనపై ఇన్నాళ్లూ కప్పి ఉంచిన నివురును తొలగించుకుంటూ మింటికెగసి పడే అపూర్వ సందర్భం. ప్రజలు తమకు తాముగా తమ నట్టింట్లో పెరిగిపోతున్న అంటువ్యాధికి చేస్తున్న అత్యాధునిక చికిత్స. దానికి పేరు 10టివీ.
సమతుల్యం లేకుండా ఎవరి కాడినో మోస్తున్న బరువు నుంచి విముక్తి ...10టివీ
నలుగురు కలిసి చూడలేని ఏ సర్టిఫికేట్ల మీడియాకు సెన్సార్... 10టివీ
నినాదాలతో.. ట్యాగ్ లైన్లతో ముంచెత్తే భ్రమల నుంచి ముక్తి... 10టివీ
నిజమైన వార్తా స్రవంతులపై కప్పిన ముసుగుల పాలిటి కత్తెర... 10టివీ
సకల జనుల సర్వతో ముఖ వికాసాన్ని కాంక్షించే అభిమానం.. 10టివీ
..................................................................................
10 టీవీ ఎందుకు వస్తోంది.. ఉన్న చానళ్లు చాలకనా.. ? అందుకు కారణం ఇది.
పత్రికాస్వేచ్ఛ పేరుతో మీడియా అనుభవిస్తున్న స్వాతంత్య్రానికి పరిమితులు లేకుండా పోయింది. వాస్తవానికి పత్రికా స్వేచ్ఛ అన్న పదానికి ఎక్కడా చట్టబద్ధత లేదు. భారత రాజ్యాంగంలో ఎక్కడా పత్రికాస్వేచ్ఛ గురించి పేర్కొనలేదు. 19వ అ`దికరణంలోని భావప్రకటనా స్వేచ్ఛనే పత్రికా స్వేచ్ఛగా పేర్కొంటూ మీడియా తన అస్తిత్వాన్ని కొనసాగిస్తున్నది.  సమాజంలో అది నిర్వహించే కీలక భూమికను దష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలూ దీన్ని పట్టించుకోవటం లేదు. స్వయం నిర్దేషిత స్వేచ్ఛను కూడా మీడియా దుర్వినియోగం చేయటం వల్ల ఎవరికీ మేలు జరగకపోగా, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళు్తన్నాయి. 
తెలుగు మీడియా పెడ పోకడలకు ఇవి కొన్ని ఉదాహరణలు..
'  నాలుగున్నర సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలోనే కరీంనగర్‌ జిల్లాలో ఒక ఘటన జరిగింది. ఒక వ్యక్తి ఓ భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆత్మహత్య చేసుకోవటానికి ముందే చానళు్ల అక్కడికి చేరుకున్నాయి. అతను భవంతి పైనుంచి డిమాండ్లు చేస్తున్నప్పటి నుంచి అతను పై నుంచి దూకి చనిపోయేంత వరకు కూడా ప్రతి క్షణం రికార్డు చేశాయి. ఆ తరువాత ఆ రోజంతా ఆ సన్నివేశాన్ని జూమ్‌ ఇన్‌లు, జూమ్‌ అవుట్‌లు, స్లో మోషన్‌.. ఇలా రక రకాలుగా ప్రసారం చేశారు. ఒళు్ల గగుర్పొడిచే, సున్నిత మనస్సులను తీవ్రంగా గాయపరిచే ఇలాంటి ఘటనలను ప్రసారం చేయటం వల్ల సమాజంలో ఎలాంటి మార్పును మీడియా కోరుకుందో అర్థం కాదు.. దీని తరువాత ఇలాంటి ఘటనలు మరో రెండు జరిగాయి. అంతే కాదు... సెల్‌ఫోన్‌ టవర్‌లపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ `ెదిరించిన ఘటనలూ ఆ తరువాత రొటీన్‌గా మారిపోయాయి. 
* '  ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఒక అమ్మాయిని గ్యాంగ్‌ రేప్‌ చేసిన వ్యవహారంలో పోలీసులు నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోకుండా ఆ వ్యవహారానికి సంబం`దించిన అశ్లీల సిడిలను లోపాయికారిగా మీడియాకు విడుదల చేయటం అనైతికం. పోలీసులు తాము విడుదల చేయలేదని చెప్తున్నా.. అక్కడి నుంచే లీకయిందన్న వార్తలు కొట్టిపారేయలేం. మీడియా అయినా సరిగ్గా వ్యవహరించిందా అంటే అదీ లేదు.. ``దితురాలి పేరు చెప్పకుండా  ముఖంపై మాస్‌‌క వేసినంత మాత్రాన గోప్యతను పాటించినట్లు ఎలా అవుతుంది? ఘటన జరిగిన స్థలాన్ని పేర్కొని, ``దితురాలి తల్లిదండ్రుల పేర్లు చెప్పటం ద్వారా అమ్మాయి అస్తిత్వాన్ని చెప్పకనే చెప్పారు. ఇలాంటి దశ్యాలను రోజంతా అటు తిప్పి, ఇటు తిప్పి చూపించటం వల్ల ఆ అమ్మాయి కుటుం`ానికి నష్టం చేసినట్లే కానీ, మేలు చేసిందేమీ లేదు... అదష్ట వశాత్తూ పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయకుండా, రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. 
 నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ వ్యవహారంలోనూ ప్రాంతీయ మీడియా అత్యుత్సాహం హద్దులు దాటిపోయింది. బాధితురాలి చిత్రాన్ని గ్రాఫిక్లో తయారు చేసి, ముఖానికి ముసుగు వేసి ఓ అరగంట పాటు తెగ హడావిడి చేశారు. విక్టిమ్ విషయంలో మొరాలిటీని పాటించాలన్న కనీస ఇంగితం కూడా ఆ చానల్ కు లేకుండా పోయింది.

ఇలాంటి పెడధోరణులకు ముగింపు పలకటానికి ముందుకు వస్తోంది 10టీవీ
దొంగ వ్యాఖ్యానాలను తిప్పి కొట్టడానికి జనం నాడై జీవం పోసుకుంటోంది 10 టీవీ
వార్తలకు వ్యాపారం కట్టిన సంకెళ్లను తెంచుకుని ప్రత్యామ్నాయంగా ఆవిష్కారమవుతోంది 10టీవీ

మనం చేసే ప్రతి పనినీ ప్రజలు గమనిస్తారు.. ఏ తెరపై ఏ తోలుబొమ్మలాట ఆడుతోందో తెలుసుకోలేనంత అమాయకులు కారు. ఏది సత్యమో.. అసత్యమో అర్థం చేసుకోలేనంత మూర్ఖులు కారు. అందుకే.. ఇప్పుడు వాళ్లే.. తమదైన చానల్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. వార్తలకు కొత్త ప్రాణం పోసుకుంటూ.. పదునెక్కేలా తామే వార్తల వెలుగు మొలకలవుతున్నారు. ఆకాశమంత విశాల వేదికపై ప్రజాస్వామికమైన ప్రతి ఆకాంక్షను అభివ్యక్తం చేయటానికి వారికి టెన్ టీవీ ఆసరా అవుతోంది. నిత్యం బతుకు సమరం సాగిస్తున్న జన శ్రేణులన్నిటినీ స్పర్శిస్తూ వారి బతుకు తెరను ఆవిష్కరించేందుకు సన్నద్ధమై ముందుకు వస్తోంది 10 టీవి.

4 కామెంట్‌లు:

పూర్వ ఫల్గుణి (poorva phalguni) చెప్పారు...

నిజంగా నిజమేనా?లేకపోతె ఎలాగు ఈ వెర్రి జనం గొర్రెల మందకాబట్టి తలాడించి సర్దుకు పోతరులే అనే అలసత్వం మా?కసాయి మనస్తత్వమా? అలా అయతే ఒక్కసారి దృష్టి సారించి ఢిల్లీ వైపు చూడమనండి.మహాప్రభంజనంలా వుంది. జనాన్ని తక్కువ అంచనా వేయవద్దు, సహనానికి కూడాహద్దువుంటుంది.
మంచి ప్రయత్నంనానికి ఎప్పుడు ఎదురు వుండదు.
చక్కటి విఙ్ఞానదాయక ప్రోగ్రాములతో ప్రజలను చైతన్యం వంతంగా చేసే కార్యక్రమాలతో ప్రజలముందుకువస్తారని
శుభాసిస్సులతో

srini చెప్పారు...

but yours is communist channel kada?!

Unknown చెప్పారు...

Best of Luck 10TV. Hope you stand on your WORDS and we will get clean journalism.

kiran kumar చెప్పారు...

10tv idi oka pratyamnayam.e vishayam 3 nelalo mere cheputharu...
prajala kosame puttuku vastunna maha prabanjanam...telugu media rangam lo kachithamaiana samacharanni prajalaku chervayademe pradana lakshyam.