29, నవంబర్ 2014, శనివారం

దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ

దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ ఈరోజు సచివాలయం లో ప్రభుత్వ సలహాదారు శ్రీ కే వీ రమణ గారు అవిశ్కరించారు. దానికి సంబంధించిన వార్తా స్టూడియో ఎన్ లో ప్రసారమయింది ఈ కథనాలకు గతం లో జీ 24 గంటలు చానల్ లో వీక్షకులు అదరించారు. తరువాత బ్లాగర్లు  అభిమనించారు. ఇప్పుడు పాఠకులు ఆదరించాలని ఆశిస్తున్నా. సభలో  శ్రీ కే వీ రమణ, మన కాలపు మార్గదర్శక పాత్రికేయులు శ్రీ రామచంద్రమూర్తి , శ్రీ శైలేష్ రెడ్డి, శ్రీ దేవులపల్లి అమర్, శ్రీ దిలీప్ రెడ్డి, ఉన్నారు.

దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ | Studio N

దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ ఈరోజు సచివాలయం లో ప్రభుత్వ సలహాదారు శ్రీ కే వీ రమణ గారు అవిశ్కరించరు. దానికి సంబంధించిన వార్తా స్టూడియో ఎన్ లో ప్రసారమయింది ఈ కథనాలకు గతం లో జీ 24 గంటలు చానల్ లో వీక్షకులు అదరించారు. తరువాత బ్లాగర్లు  అభిమనించారు. ఇప్పుడు పాఠకులు ఆదరించాలని ఆశిస్తున్నా

12, నవంబర్ 2014, బుధవారం

దేవరహస్యం తొలి కాపీ

పుస్తకం రాయడం ఒక ఎత్తు. ప్రచురణ కావడం ఒక ఎత్తు. అచ్చయిన తొలి పుస్తకాన్ని కౌగిట్లోకి తీసుకోవడం.. రచయితకు అతి అందమైన అనుభవం. తొలి కాపీని అదే సందర్భంలో.. అదే ఆనంద క్షణాల్లో.. రచయిత చేతుల మీదుగా పాఠకులు అందుకోవడం మరింత అరుదైన దృశ్యం. ఈ ఆనందమయ క్షణాలన్నీ.. నా కంటిముందు చకచకా జరిగిపోవడం.. నాకు కలిగిన యోగం.
తొలికాపీ అందుకోవడంకోసం శంషాబాద్ నుంచి రెక్కలు కట్టుకొని వచ్చిన అను చిరు గారికి, ఆ అరుదైన క్షణం నాదేనన్నట్టు నారపల్లినుంచి విచ్చేసిన Kovela Santoshkumar గారికి.. మరీ మరీ ధన్యవాదాలు.
—వాసిరెడ్డి వేణుగోపాల్ - వాసిరెడ్డి ప్రచురణలు

కినిగే లో ‘దేవ రహస్యం’.

ఇలాంటి పుస్తకం తెలుగులో ఇదే మొదటిసారి...
విశ్వంలో తొలి సర్జన్ ఎవరు?
 మహాభారత యుద్ధంలో భారీ పేలుళ్లు జరిగాయా?
 కైలాసంలో శివుడున్నాడా?
రామబాణంలో న్యూక్లియర్ పవర్ వుందా?
దేవతల కాలమానానికి, మన కాలమానానికి తేడా ఏమిటి?
 నాటి పుష్పక విమానమే.. ఇవాల్టి ఎగిరే పళ్లెమా?
శ్రీకృష్ణుడు నిజమా? అబద్ధమా?
శివుడికి కైలాసాలు ఎన్ని వున్నాయి?
కురుక్షేత్రంలో రేడియేషన్ ఆనవాళ్లు ఎక్కడివి?
 భూతాలకూ లిపి వుందా? బ్రహ్మాస్త్రం అణ్వస్త్రమేనా?
ఇలాంటి అనేకానేక సందేహాలకు సమాధానం ఇచ్చే పుస్తకం.. సీనియర్ జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్ రాసిన ‘దేవ రహస్యం’.
కినిగే లో చూడండి .. కొనండి

మా నాన్నగారి గురించి దేవరహస్యం పుస్తకం లో రాసుకున్న నాలుగు మాటలు.


ఆయన గురించి రాయాలంటే ఎంతో శక్తి కావాలి. అల్పుడిని నా వాళ్ళ అయ్యే పని కాదు. పుంభావ సరస్వతి కడుపున జన్మించటం ఎన్ని జన్మల పాటు తపస్సు చేస్తే మాత్రం సాధ్యం cheppandi? ఈ జీవితానికి ఆయన కడుపునా పుట్టినందుకు కొద్దో గొప్పో ఈ కాస్త నాలుగు మాటలు రాయగాలిగా. నా పాలిట నడిచే దేవుడు అయన.
.........................................................
నా పుట్టుకే పూర్వజన్మ సుకృతం. ఏమి తపస్సు చేసి జన్మించానో నాకైతే తెలియదు కానీ, సాక్షాత్తూ విద్యాసరస్వతి కడుపున పుట్టాను.
‘‘నిజమునకు భావుకుండని
సృజనన్ పదివేల మంది నెవ్వడొయొక్కం
డు జనించు, మెరయువానికి
రజనీపతి కాంతి భ్రూభరమ్మపుడపుడై’’
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విరచితమైన పద్యమిది. తెలుగుదేశంలో విశ్వనాథ సాహిత్యానికి ఈరోజు సాధికారత ఉన్న సారస్వత మూర్తి ఎవరైనా ఉన్నారంటే.. వారు మా నాన్నగారు.. ఆచార్య కోవెల సుపసన్నాచార్య.తెలుగు సాహిత్యంలో నవ్యసంప్రదాయవాదానికి నాంది పలికి, చేతనావర్తంతో అరాచక అధిక్షేపాన్ని నిరసించిన ఈ పుంభావ సరస్వతికి విశ్వనాథవారి ఈ పద్యం సంపూర్ణంగా వర్తిస్తుంది. సద్గురువులన్నట్లు సౌమ్య, గంభీర, మిత భాషాద్యనేక శుభలక్షణ సంపన్నులైన ఆ సరస్వతీ తీర్థులకు కుమారుడిగా పుట్టడం కంటే ఈ జన్మకు సార్థకత ఏముంటుంది? ఆయన సాహిత్య సాగరంలో నేను నీటిబొట్టునైనా కాలేకపోవచ్చు.. కానీ, సాహిత్యమైనా, సాంఘికమైనా రాయటమన్నదే వృత్తిగా మలచుకుని ఈషణ్మాత్రమైనా ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేయగలుగుతున్నానంటే ఆయన సంపూర్ణ కరుణా కటాక్షాలవల్లే.. నా జీవితంలోని ప్రతి మలుపులోనూ.. నా రాతలోని ప్రతి పదంలోనూ ఆయన ముద్ర తప్ప అన్యథా కనిపించదు. నాకు అస్తిత్వం.. ఉనికి.. మనుగడ.. అంతా ఆ ‘‘కోవెల’’నే.

నా దేవరహస్యం పుస్తకం లో అమ్మ కోసం ఉబికి వచ్చిన ఉద్వేగం ......

........................................................
అమ్మ .. వరంగల్లుకు కాకతి భద్రకాళి ఎలాగో.. మా కుటుంబానికి అమ్మే అమ్మలగన్నయమ్మ. జీవించి ఉన్నప్పుడు ఏమీ చేసిన వాడను

కాను. చేద్దామనుకున్నప్పుడు కంటిముందు లేకుండా పోయి కఠినంగా శిక్షిస్తోంది. 28 ఏళ్ల వయసులో ఊరొదిలి పెట్టి హైదరాబాద్

వచ్చి చేరినవాణ్ణి.. పెద్దవాడు తప్ప చిన్నవాణ్ణి... ఎప్పుడూ దగ్గర ఉన్నవాణ్ణి కాను. గత 20 ఏళ్లలో చుట్టపు చూపుగానే

వరంగల్లుకు వెళ్లి వచ్చిన వాణ్ణి.. అయినా ఆమె ముగురమ్మల మూలపుటమ్మ.. ఏనాడూ నన్ను వేరు చేయలేదు.. చేసి దూరం చేయలేదు.

వరంగల్లుకు వెళ్లి తిరిగి హైదరాబాద్ బయలుదేరేప్పుడు తప్పనిసరిగా ఆమె చేతులమీదుగా కొంత నగదు తీసుకొని రావలసిందే. అది పది

రూపాయలైనా కావచ్చు.. వంద రూపాయలైనా కావచ్చు. పెద్దవాడికైనా, నాకైనా తప్పనిసరిగా ఇచ్చి పంపించేది. ఆమె దిండుకింది నుంచి

తీసి ఇచ్చే ఆ డబ్బులు నాకు అషై్టశ్వర్యాలతో సమానం.. రెండేళ్లు దాటింది. ఇప్పుడూ వరంగల్లుకు వెళ్తున్నా.. వస్తున్నా..

కానీ.. వచ్చేప్పుడు ఎవరిని డబ్బులడగాలి.. ఏమని అడగాలి? వరంగల్లు నుంచి బయలుదేరిన ప్రతిసారీ శరీరంలోని కండరాలన్నీ

ఒక్కుదుటున కదిలిపోతాయి.. ఒళ్లు గగుర్పొడుస్తుంది. అమ్మ కనీసం మంచంపైనైనా సరే అలాగే ఉంటేె బాగుండుననిపిస్తుంది. ఆమె

పడుకున్న మంచం అమ్మ ఉన్నప్పటిలాగానే మౌనంగా పలకరిస్తుంది.. ఆమె కూర్చున్న కుర్చీ యథాతథ స్థానంలో అలాగే ఉండిపోయింది.

అందులో ఆమె మాత్రం లేదు. వాటి స్థానం మారిస్తే ఆమె జ్ఞాపకం మాసిపోతుంది. అందుకే వాటిని నాన్నగారు కదల్చలేదు..
జీ స్టోరీస్ కథనాల పరంపరలో ఒక ఎపిసోడ్ ‘‘మీరు మీ అమ్మతో మాట్లాడుతున్నారా’’ అన్న శీర్షికతో కార్యక్రమాన్ని ప్రసారం

చేస్తే.. అమ్మ ఆందోళన చెందింది. నన్ను దృష్టిలో ఉంచుకుని రాశావా అని నిలదీసింది. రోజూ ఒకసారి ఫోన్‌చేసి పలకరించకపోతే

నిష్ఠూరమాడింది. రెండేళ్లనుంచి ఆమె పలకరింపులు లేవు.. నిష్ఠూరాలు లేవు.. ఆప్యాయతలు లేవు.. కానీ, మౌనంగానే ఆమె సజీవమై నా

వెన్నంటే ఉండి, వెన్ను తట్టి నడిపిస్తోంది. ఇదేమీ భావోద్వేగం కాదు. వాస్తవం. జీవితంలో ఎవరికీ ఎదురుకాని అపూర్వ అనుభవం.

అమ్మ అస్తమించిన తరువాత అంత్యక్రియలలో భాగంగా కొత్త చీర, ఆకుపచ్చ గాజులు...పసుపు, కుంకుమలతో సాగనంపాము. రెండవరోజున

ఉత్తరక్రియలు నిర్వహించటానికి వెళ్లిన నాకు అమ్మ చేతి గాజు ఒకే ఒక్కటి.. పగుల కుండా, కరగకుండా చితాభస్మంలోంచి పునీతమై నా

చేతికి చిక్కింది. సాధారణంగా మట్టిగాజులు అంత వేడిలో కరిగిపోకుండా ఉండటం అసాధ్యం. కనీసం పగిలిపోవాలి. అన్ని గాజులూ అలాగే

కరిగిపోయాయి, కానీ, నేనున్నానంటూ నిండు ముత్తైవతనానికి ఆదర్శమైన గాజుగా అమ్మ మళ్లీ తిరిగి వచ్చింది. నన్ను సంపూర్ణంగా

కటాక్షిస్తోంది.. ఈ గ్రంథాన్ని ఆమెకు సభక్తికంగా అర్పించుకుంటున్నాను.

13, మే 2014, మంగళవారం

పుస్తక రూపంలో దేవరహస్యం

గత నాలుగున్నర సంవత్సరాలుగా జీ 24 గంటలు.. ఇతర చానళ్ల లో ఇండియన్ మైథాలజీ పై  ఒక సహేతుకమైన విశ్లేషణతో చేసిన అనేకానేక కథనాలు అటు ప్రేక్షకుల ఆదరణను పొందటంతో పాటు.. బ్లాగు ద్వారా నెటిజన్ల ఆదరణను కూడా విశేషంగా పొందటం అదృష్టం. తెలుగు న్యూస్ చానళ్ల చరిత్రలోనే సంచలనాలకు పేరు మోసిన ఈ కథనాల పరంపర ఇప్పుడు పుస్తక రూపంలో త్వరలోనే రాబోతోంది.. ఈ తరానికి భారతీయ ఆధ్యాత్మిక భావభూమికలను.. వాళ్ల స్టైల్లో.. అవగాహన కలిగించే విధంగా.. క్యూరియాసిటీ పెంచే విధంగా ఈ పుస్తకాన్ని తీసుకువస్తున్నాం. స్నేహితుల సహకారంతో సచిత్ర కథన పుస్తకం గా వస్తోంది.. దీని పేరు "దేవ రహస్యం" (description and interpretation of Indian mythology) ఇప్పటికే ఈ పుస్తకానికి సద్గురువులు శ్రీ శివానందమూర్తిగారి సంపూర్ణ ఆశీస్సులు లభించాయి.

 పూర్తి వివరాలకోసం సంప్రదించండి.. kovelas@gmail.com

                                                   +91 9052116463

22, ఫిబ్రవరి 2014, శనివారం

మైలురాళ్ల మొగసాల..!

courtesy-టీమీడియా ప్రతినిధి-వరంగల్
తెలంగాణ మహోజ్వల ఉద్యమ చరిత్రలో వరంగల్‌ది ప్రత్యేక ముద్ర. ఆది నుంచి ధిక్కారానికి దివిటి పట్టిన నేల. తెలంగాణ ఉద్యమంలో అణువణువూ అనిర్వచనీయమైన సన్నివేశమే. ప్రతీ మజిలీలో పోరుసంతకమే. ఉద్యమం ఆటుపోట్లకు ఎదురైన ప్రతీసారి ఓరుగల్లు తన ధిక్కార స్వభావాన్ని ప్రదర్శించింది. తెలంగాణ ఉద్యమాన్ని చుక్కానీయై నడిపించింది. తెలంగాణ అంటే వరంగల్. వరంగల్ అంటే తెలంగాణ ఈ మాటల్ని పదేపదే వల్లించిన వైతాళికుడు, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. వేరు తెలంగాణ కాదు వీరతెలంగాణ అని నిరూపించిన గడ్డ వరంగల్. దాశరథి మొదలు కాళోజీ దాకా, రుద్రమ మొదలు సమ్మక్క దాకా, జయశంకర్ మొదలు విద్యార్థి కెరటం దాకా ఒకటా రెండా క్షణమొక యుద్ధంగా సమరశీల పోరాటాలు జరిపిన ఏకశిలా నగరం ఎగిరి దుంకిన జ్ఞాపకం. వరంగల్ డిక్లరేషన్ నుంచి టీఆర్‌ఎస్ మహాగర్జన దాకా సభల నిర్వహణకు పు ట్టిల్లుగా ఓరుగల్లు పోరుజెండాలెత్తింది. ఉద్యమ నెగళ్లు మం డించింది. ఉద్యమం కాటగలుస్తుందా అని బుద్ధిజీవులు గాబరా పడుతున్న సందర్భంలో పిడికిలై లేచి పిడుగుల వాన కురిపించింది. సమైక్యాంధ్ర కుట్ర కుత్తికలను శాంతికత్తులతో తెగ్గోసింది వరంగల్ నేల. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మైలురాళ్లుగా నిలిచిన కొన్ని సంఘటనల్ని మరికొన్ని ఉదంతాలను దశ్యమానం చేసే కథనమే ఇది.

చంద్రబాబుకు చుక్కలు చూపిన మాన్యుడు
2008లో తనకిక ఎదురేలేదని విర్రవీగుతూ తెలంగాణ ఉద్యమాన్ని కాటగలపాలని మీకోసంఅంటూ యాత్ర మొదలుపెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుకు రాయపర్తిలో అతిసామాన్య రైతుకూలీ ఫణికర మల్లయ్య, పార్టీలోపల కానీ, బయట కానీ చంద్రబాబుకు ఎవరూ ఎదురుచెప్పని సందర్భంలో చంద్రబాబు ముక్కుమీద గుద్దినట్టు మా తెలంగాణ మాకు కావాలె. మీరే ఆపుతాండ్లట కదా..! అని నిలదీసి తెలంగాణ ఓరుగల్లు పౌరుశాన్ని చాటి మాన్యుడిగా నిలిచారు.

మహిమగళ్ల మానుకోట..
పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డును ప్రదర్శించి సమైక్య రాగం వినిపించిన వైఎస్ జగన్ ఓదార్పు పేరుతో మే 28, 2010న మానుకోటలో అడుగు పెట్టే ప్రయత్నం చేసిండు. మానుకోట కాదుకదా జగన్‌ను జిల్లాలోనే అడుగు పెట్టనివ్వలేదు. మానుకోట రైల్వేస్టేషన్ వద్దకు వేలాది మంది విద్యార్థులు,తెలంగాణవాదులు,టీఆర్‌ఎస్ శ్రేణులు చేరుకొని సమైక్యవాద పార్టీకి మద్దతు పలికిన వారిపై రాళ్లతో తిరగబడ్డరు. మానుకోట పౌరుషాన్ని చాటిచెప్పారు.
జగన్ రాక సందర్భంగా ప్రజల్లో ధైర్యం నూరిపోయడం కోసం న్యాయవాదులు మానుకోట పురవీధుల్లో కవాతు చేశారు. సమైక్యవాదులకు చుక్కలు చూపించారు. రాళ్లతో దాడిచేసి బతుకుజీవుడాఅన్నట్లుగా సమైక్యవాదులను పరుగులు పెట్టించి తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపిరిని అందించారు.

రాయినిగూడెంలో సీఎంకు ముచ్చెమటలు..
తెలంగాణ ఉద్యమం ఉధతంగా సాగుతున్న తరుణంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో ఫిబ్రవరి, 2011న రచ్చబండ కార్యక్రమానికి ముందుకొచ్చారు. ములుగు నియోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామాన్ని ఎంచుకున్నారు. అన్నిదారుల్లో పోలీసు బలగాలను దింపారు. సీఎం సభకు ఎవరినీ చెప్పులు వేసుకోకుండా అడ్డుకున్నారు. విద్యార్థులను, యువకులను రాకుండా జాగ్రత్త పడ్డారు. రాయినిగూడెం సభలో ముందుగా జర్నలిస్టులు జై తెలంగాణ నినాదాలతో నిరసన ప్రారంభించారు. సామాన్య మహిళల నడుమ వచ్చిన కాకతీయ విశ్వవిద్యాలయం పోరుబిడ్డలు కష్ణలత, గుర్రం కవిత, గుగులోతు జ్యోతి, సావిత్రి ముఖ్యమంత్రిపై చెప్పులు విసిరారు. ఓరుగల్లు పౌరుషాన్ని సీఎంకు రుచిచూపించారు. రాయినిగూడెంలో ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించారు.

బాబు పాలకుర్తి రైతుయాత్రపై తిరుగుబాటు
రైతాంగ సమస్యలపై చంద్రబాబు చేపట్టిన రైతు యాత్రపై తిరుగుబాటు చేశారు. రైతులకు అండగ ఉంటామంటూ చంద్రదండుతో పాలకుర్తికి వచ్చిన చంద్రబాబు కాన్వాయిపై జనగామ వద్దనే తెలంగాణ వాదులు తిరుగుబాటు చేసి రాళ్ల వర్షం కురిపించారు. అప్పటికే తెలంగాణవాదులను అరెస్టును చేయించి సాగించిన రైతు యాత్రపై పాలకుర్తి సభలో చంద్రబాబు మాట్లాడుతుండగా తెలంగాణవాదులు, కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు, టీఆర్‌ఎస్ యూత్ కార్యకర్తలు ఆయనపై చెప్పులు, బూట్లు విసిరి నిరసన తెలిపారు. చంద్రదండుపై తిరుగుబాటు చేసి పాలకుర్తి చాకలి ఐలమ్మ ధీరత్వాన్ని చాటుకున్నారు.
తొలి వెతుకులాట..
యాకూబ్‌రెడ్డి ఉదంతం, చంద్రదండు దండయాత్రకు ముందు అరెస్టుచేసిన తెలంగాణ వాదుల్ని విడిపించాలని, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన ముందు అరెస్టు చేసిన తెలంగాణ విద్యార్థి యువకుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు కోర్టును ఆశ్రయిస్తే (సెర్చ్‌పిటిషన్) ఆ తదనంతరం జరిగిన పరిణామాలు రాష్ట్ర చరిత్రల్లో సంచలన ఘటనలు. ఒకదశలో పోలీసులపై కూడా కేసులు నమోదైన అరుదైన సంచలన సన్నివేశాలకు వరంగల్లే వేదికైంది.

పార్లమెంట్‌ను ముట్టడించిన న్యాయవాదులు...
తెలంగాణ ఉద్యమకేతనాన్ని ఢిల్లీ నడివీధుల్లో ఆవిష్కరించిన న్యాయవాదులు ఏకంగా పార్లమెంట్‌నే ముట్టడించి స్వరాష్ట్ర ఆకాంక్షను విశ్వవ్యాప్తం చేశారు. 2010సంవత్సరంలో బార్ అసోసియేషన్ అధ్యక్షు డు బూజుగుండ్ల రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక రైలులో ఢిల్లీ వెళ్లిన న్యాయవాదులు జంతర్‌మంతర్ వద్ద సమావేశమై భద్రతాదళాల కల్లుగప్పి మెరుపువేగంతో 6కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్లమెంట్‌ను ముట్టడించి తొలిసారి పార్లమెంట్‌ను ము ట్టడించిన ఘనత దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు న్యాయవాదులు తీవ్రంగా గాయపడ్డారు.

కదనరంగాన యూనిఫాం ఉద్యోగులు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్నివర్గాల ప్రజలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులూ చురుగ్గా పాల్గొన్నారు. సకలజనుల సమ్మె ఉధతంగా కొనసాగుతున్న సంయమనంలో వరంగల్ కేంద్రంగా ఎక్సైజ్‌శాఖ, ఫారెస్టు అధికారులు, సిబ్బంది సైతం కదనరంగాన దూకారు. జిల్లా కేంద్రంలో, డివిజన్, మండల కేంద్రాల్లో ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. తెలంగాణ పోరులో భాగమై ముందుకుకదిలారు.

కేయూలో విద్యార్థి గర్జన..
తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటన చేయడానికి వారం రోజుల ముందు వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో 2009 నవంబర్ 23న జరిగిన విద్యార్థి గర్జనకు కేసీఆర్ హాజరయ్యారు. విద్యార్థుల్లో ఉద్యమ స్ఫూర్తిని నిం పాడు. ఆతరువాత డిసెంబర్‌లో మంద కష్ణ నాయకత్వంలో చేపట్టిన కేయూ విద్యార్థి పొలికేక కొంత గందరగోళానికి దారి తీసింది. కానీ ఉద్యమంలో విద్యార్థులు ముందుంటారని కేయూ నిరూపించింది. ఆ సందర్భంలోనే కేయూ వేదికగా విద్యార్థి జాక్ పురుడుపోసుకొని ఉద్యమాన్ని ముందుకు నడిపింది.

తొలి న్యాయపోరాటం
1996 అంకురార్పన జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ సంఘీభావం ప్రకటించిన చట్టబద్ధ సంస్థ వరంగల్ బార్ అసోసియేషన్. 2001 సంవత్సరంలో అప్పటి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణాకర్‌రాజు అధ్యక్షతన జరిగిన బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేసి అన్ని రాజకీయ పక్షాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు.

తెలంగాణ మహాగర్జన
కేసీఆర్ ఆమరణ దీక్షతో దిగొచ్చిన కేంద్రం 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసింది. సీమాంధ్రుల ఒత్తిళ్లకు తలొగ్గిన కేంద్రం తిరిగి తెలంగాణకు వ్యతిరేకంగా డిసెంబర్ 23న మరో ప్రకటన చేసి అనంతరం శ్రీకష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రకటన చేసి సంవత్సరం గడిచినా ఏటూ తేల్చకపోవడంతో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని 2010 డిసెంబర్ 9న వరంగల్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాలు పడడంతో వారం రోజులపాటు వాయిదా వేసి డిసెంబర్ 16న కనీవినీ ఎరుగని రీతిలో టీఆర్‌ఎస్ పార్టీ వరంగల్ వేదికగా 25 లక్షలమందితో మహాగర్జనను నిర్వహించింది. తెలంగాణ ఉద్యమం చల్లబడలేదని నిరూపించారు. ప్రపంచస్థాయిలోనే అతి పెద్ద జన సమూహాల జాబితాలో ఈ మహాగర్జన చేరింది.