30, డిసెంబర్ 2010, గురువారం

జనవరి ఆరున ప్రజల ముందుకు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్‌

ఏడాది కాలంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్‌ను కమిటీ సభ్యులు ఈ రోజు మధ్యాహ్నం 2.3౦ గంటలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమర్పించారు. రెండు సంపుటాల్లో సుమారు ఆరు వందల పేజీల నివేదికను హోం మంత్రి చిదంబరం జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నుంచి స్వీకరించారు. అయితే నివేదికలో తెలంగాణ గురించి కానీ, రాష్ట్ర విభజన అంశం గురించి కానీ కమిటీ ఏం చర్చించిందన్నది మాత్రం హోం శాఖ వెల్లడి చేయలేదు. జనవరి 6న ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో నివేదిక గురించి చర్చిస్తామని చిదంబరం నివేదిక అందుకున్న తరువాత చెప్పారు. నివేదికల అంశాలను పార్టీలతో చర్చించిన తరువాత నివేదికను ప్రజల ముందుంచుతామన్నారు. అప్పటి వరకు సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. మొత్తం మీద నివేదికలో అంశాలు తేటతెల్లం కావటానికి మరో వారం రోజుల పాటు ఎదురుచూడాల్సిందే.
జాతీయ మీడియా అంచనా ప్రకారం రాష్ట్ర విభజనలో కీలక భూమిక వ్యవహరించనున్న హైదరాబాద్‌ విషయంలో శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేక సిఫార్సులు చేసిందని సమాచారం. భౌగోళికంగా చూస్తే హైదరాబాద్‌ను తెలంగాణా నుంచి విడదీయటం సాధ్యం కాకపోయినప్పటికీ, చండీగఢ్‌ మాదిరిగా కేంద్రపాలిత ప్రాంతంగా చేయటానికీ రాష్ట్ర ం మధ్యలో ఉన్న నగరానికి సాధ్యం కాకపోవచ్చు. అదే సమయంలో నాడు మద్రాసు మాదిరిగా హైదరాబాద్‌ను ఈరోజు వదులుకోవటానికి సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిపుణుల కమిటీని పంపించి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.

29, నవంబర్ 2010, సోమవారం

జగన్‌ రాజీనామా చేశారు

జగన్‌ రాజీనామా చేశారు.. పార్టీకి, పార్టీ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మరో  సంచలనానికి తెరతీశారు.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు కెసిఆర్‌ ఆమరణ దీక్ష సందర్భంగా రాష్ట్ర రాజకీయం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది.. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి మొదలైంది. జగన్‌  రాజీనామా పరిణామాలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తీవ్రమైన ఒత్తిడి తప్పదు..  అతి తక్కువ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్‌కు జగన్‌ రాజీనామా శరాఘాతమే. కాంగ్రెస్‌కు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న స్థానాలు157 మాత్రమే. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్ర  శాసనసభలో మ్యాజిక్‌ ఫిగర్‌ 147. అంటే పది మంది సభ్యులు రాజీనామా చేస్తే సర్కారు మైనారిటీలో పడిపోతుంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి మద్దతు తీసుకుంటే ఆ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. దీనికి తోడుగా ఎంఐఎం నుంచి 7 సీట్ల మద్దతు ఎలాగూ లభిస్తుంది. అంటే 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఈ రెండు పార్టీల నుంచి లభిస్తుందన్నమాట. అంటే సుమారు 35 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయటమో, జగన్‌ వర్గం వైపు వెళ్లటమో జరిగితే సర్కారు ఖచ్చితంగా మైనార్టీలో పడిపోతుంది. అంటే జగన్‌ కనీసం 40 మంది ఎమ్మెల్యేలను చీల్చగలిగితే స్పష్టంగా సర్కారు మైనార్టీలో పడిపోతుంది. జగన్‌ వర్గానికి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ప్రశ్న. కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన మరునాడు జగన్‌ ఇంట్లో 17 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. వీరిలో చివరి వరకు ఆయన వెంట ఎంతమంది కొనసాగుతారు.. కాంగ్రెస్‌లో మరెంత మంది ఆయన వెంట వస్తారనేది కొన్ని రోజుల్లో తేలిపోతుంది.. మొత్తానికి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రమాణం చేసిన మరునాటి నుంచే సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.. దీన్ని ఎలా అధిగమిస్తారో, ఏ విధంగా చక్రం తిప్పుతారో చూడాలి.

19, నవంబర్ 2010, శుక్రవారం

సీక్రెట్‌ ఆఫ్‌ గాడ్‌‌స పార్‌‌ట 1.. వీడియో

సీక్రెట్‌ ఆఫ్‌ గాడ్‌‌స పార్‌‌ట 1.. వీడియో
please click link to this post







వీడియోలో నా ప్రోగ్రామ్‌లు చూడండి

కొన్ని రోజులుగా నేను పోస్‌‌ట చేస్తున్న టపాలకు సంబంధించిన ఫీచర్‌  ప్రోగ్రామ్‌ క్లిప్‌‌సను బ్లాగ్‌లో ఉంచమని కొందరు కోరుతున్నారు. వారికి నా ధన్యవాదాలు. గత కొంతకాలంగా  జీ 24 గంటలులో చేసిన కొన్ని  ఎపిసోడ్‌‌సను ఇక నుంచి పోస్‌‌ట చేస్తాను.. చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

అఘోరా










ఎస్‌ఐ పరీక్షలు వాయిదా..

ఫ్రీజోన్‌ వివాదం ముదిరిన నేపథ్యంలో ఎస్‌ఐ పరీక్షల నియామకాలకు సంబంధించిన రాత పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. గత అయిదారు రోజులుగా హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఫ్రీజోన్‌ వివాదంపై చేస్తున్న ఆందోళనలకు మొదట ప్రతికూలంగా మాట్లాడినా, చివరకు అనుకూలంగా స్పందించింది. 14 ఎఫ్‌ వివాదం సమసేంత వరకూ అని చెప్పకపోయినా, ప్రస్తుతానికైతే ఎస్‌ఐ పరీక్షలను వాయిదా వేశారు.

15, నవంబర్ 2010, సోమవారం

కైలాసంపై శివుడున్నాడా?

మంచుకొండల్లో.. వెండి వెన్నెల
అతీంద్రియ మహాశక్తులు
అంతు పట్టని వెలుగు దివ్వెలు
సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో
సైన్‌‌సకు అందని అసాధారణ వ్యవస్థ
కైలాసం
పరమ శివుడి ఆవాసం
ఆదిశక్తి పార్వతి నివాసం
రావణుడు పది తలలతో ఎత్తిన కైలాసం
ఈ భూమిపైనే ఉంది..
మన కళ్ల ముందు ఉంది
మనకు కనిపిస్తోంది
భూమిపైనే దేవుడు కొలువై ఉన్నాడు
భక్తులకు
శివ అనుగ్రహం లభిస్తోంది..
సముద్ర మట్టానికి
21,778 అడుగుల ఎత్తులో
52 కిలోమీటర్ల విస్తీర్ణంలో
మంచుకొండల నడుమ
 కైలాస పర్వతం
ఈ కొండపైనే రుద్రతాండవం
లయకారుడి లయవిన్యాసం
త్రినేత్రుడి సాక్షాత్కారం
కైలాసంపై ఈశ్వరుడి ఉనికి నిజం
దైవత్వానికి మహాదేవుని నిర్వచనం
కైలాస పర్వతంపైభాగంలో ఏముంది?
ఎవరికీ తెలియని అంతులేని రహస్యం ఏమిటి?
భూమిపైనే ఈశ్వరుడి ఉనికి నిజమేనా? 

.............
నిజమే---- పరమేశ్వరుడు ఈ భూమిపైనే ఉన్నాడు.. మనముంటున్న ఈ నేలపైనే నివాసమున్నాడు.. అవును ఇది అక్షరాలా నిజం.. ఇక్కడే.. ఈ గాలిలో, ఈ నేలలో ఈ మట్టిపైనే ఆయన ఉన్నాడు.. భక్తులకు సాక్షాత్కరిస్తున్నాడు.. వారి మనోరథాల్ని నెరవేరుస్తున్నాడు.. శివుడి కైలాసం భూమిని దాటి మరెక్కడో లేదు. ఆయన కైలాసం ఇక్కడే ఉంది.. మన దేశానికి కూతవేటు దూరంలో ఉంది.. సిద్ధ పురుషులకు ఆవాసమైన మంచుకొండల నడుమ ఉంది. ఈ కైలాసంపైనే శివుడు ఉన్నాడు.. ఆయన ఉనికి అక్కడ స్పష్టంగా ఉంది.. సైన్‌‌సకు అంతుపట్టని అపురూప శక్తి ఏదో అక్కడ దాగి ఉంది.
....
సశరీరంతో కైలాసానికి  వెళ్లటం గురించి విన్నాం.. కానీ, ఇప్పుడు ఇది వాస్తవం.. కైలాసానికి మనం బొందితోనే వెళ్లవచ్చు.. తిరిగి రానూ వచ్చు. కాకపోతే కొద్దిగా ఫిట్‌నెస్‌ అవసరం. ఫిట్‌నెస్‌ ఉంటే కైలాసానికి వెళ్లి పరమ శివుని చూసి చక్కగా తిరిగి రావచ్చు.
కైలాసానికి శరీరంతో ఎలా వెళ్లగలమని ఆలోచించకండి.. కైలాసం మన భూమిపైనే ఉంది. హిమాలయ పర్వతాలలో ఉంది. సముద్ర మట్టానికి 22778 అడుగుల ఎత్తులో ఉంది.. టిబెట్‌ భూభాగంపై ఉన్నది. ఈ కైలాసంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు.. వేలాది భక్తులకు దర్శనమిస్తున్నారు..
  మౌంట్‌ కైలాస్‌ ప్రపంచంలో స్పిర్చు్యవాలిటీ  సంపూర్ణంగా  వ్యాపించిన ఏకైక  ప్రాంతం. ఇక్కడికి వెళ్లి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతోంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం జరుగుతోంది.
ఉమాశంకరులే కాదు.. శివపార్వతుల ఫ్యామిలీ అంతా ఇక్కడ కొలువై ఉన్నది. కైలాస పర్వతం చుట్టూ ట్రెకింగ్‌ చేస్తున్న కొద్దీ ఒక్కో రూపం మనకు దర్శనమిస్తుంది. నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఒక్కో చోట  ఒక్కో రూపంలో భక్తులకు కనిపిస్తారు..
మౌంట్‌ కైలాస్‌ ఎవరికీ తెలియని ఓ రహస్యమే. ఇది మామూలు పర్వతం కాదు.. హిమాలయ శ్రేణుల్లో ఏ పర్వతానికీ లేని ప్రత్యేకతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. అర్థం కాని రహస్యాలు అనేకం ఇక్కడ దాగున్నాయి. ఇది నాలుగు వైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది. నాలుగు రత్నాల్లో , నాలుగు రంగుల్లో దర్శనమిస్తుంది. ప్రపంచంలోని వండర్‌‌స అన్నింటికీ వండర్‌ మౌంట్‌ కైలాస్‌.   

-1-
దేవుణ్ణి దర్శించాలంటే కఠిన మైన నియమాలు పాటించాలి. తపస్సు చేయాలి. ఉపాసన చేయాలి. యజ్ఞ యాగాదులు చేయాలి.. ఇంకా ఏవేవో చెప్తారు మన పెద్దలు.. దేవుణ్ణి చూడటం అంటే అంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు..ఎంత కష్టపడితే తప్ప.. సాధ్యం కాదని చెప్పటమే వీటన్నింటి ఉద్దేశం..
కైలాస్‌ మానస్‌ సరోవర్‌ యాత్ర అచ్చంగా అలాంటిదే.. అన్ని కష్టాలకూ పరాకాష్ట.. ఊపిరి కూడా తీసుకోవటం కష్టమైన యాత్ర..సముద్ర మట్టానికి ఎన్నో వేల అడుగుల ఎత్తు... ఆక్సీజన్‌ అంతంత మాత్రం.. అసలు వేడి అంటే ఏమిటో మచ్చుకైనా తెలియని వాతావరణం.. శరీరం రాయిలా బిగుసుకుపోయేంత చలి.. ఇతర తీర్థయాత్రా స్థలాల్లో కనిపించే కనీస సౌకర్యాలు ఉండవు.. ఇలాంటి చోట 52 కిలోమీటర్లు ట్రెకింగ్‌  చేయాలి..
ఈ యాత్ర ఒక జీవిత కాలం తపస్సు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఖాట్మండు మీదుగా ప్రారంభమయ్యే యాత్ర తారాపీఠ్‌, గౌరీకుండం మీదుగా కైలాస్‌ చేరుకుంటారు.. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగానే ఫిట్‌నెస్‌ చెక్‌ చేయించుకోవలసి ఉంటుంది.. అన్ని విధాలా ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే కైలాస్‌ యాత్రకు అనుమతిస్తారు...
కైలాస్‌ పర్వతానికి చేరుకోవటం అంటే మృత్యువును ఎదిరించి ముందుకు పోయినంత సాహసమే..పర్వతాన్ని ఒకసారి చుట్టి రావటానికి కనీసం నాలుగు రోజుల సమయం పడుతుంది. ఆక్సీజన్‌ అతి తక్కువగా ఉన్న ప్రదేశంలో నాలుగు రోజుల పాటు నడవటం ఎంత కష్టమో వేరే చెప్పేదేముంది?
శరీర కష్టం కంటే మానసిక సై్థర్యంపైనే, ఆధ్యాత్మిక బలంపైనే కైలాస్‌ పర్యటన కొనసాగుతుంది. కైలాసం శివుడి పూర్ణస్వరూపమని విశ్వాసం. అక్కడకు వెళ్లిన అనేక మంది భక్తులకు పర్వతం ఆసాంతం శివరూపంగా దర్శనమిచ్చిన తార్కాణాలు ఉన్నాయి. విచిత్రమేమంటే కైలాస పర్వతం దగ్గరకు వెళ్లిన యాత్రికులు, పర్వతాన్ని మాత్రం అధిరోహించే ప్రయత్నం చేయరు.. పర్వత పాదాన్ని తాకే ప్రయత్నమైనా చేయరు.. వెళ్లేందుకు ఎవరు సాహసించినా అంతే సంగతులని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం.. ఎవరెస్టును సైతం అధిరోహించిన మనిషి  కైలాస పర్వతంపైకి మాత్రం ఎందుకు వెళ్లలేకపోతున్నాడు..
కైలాస పర్వతం పైకి అధిరోహించటం అంత తేలికైన సంగతేం కాదు.. పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేయటం తప్ప, దాన్ని తాకేందుకు కూడా ప్రజలు భయపడతారు..ఎవరెస్టు ఎక్కటానికి లేని భయం కైలాసం తాకటానికి ఎందుకు? కైలాసం ఉపరితలంపై ఏముంది.. కనీసం హెలికాప్టర్లు కూడా దీని పైభాగం నుంచి వెళ్లేందుకు సాహసించలేని పరిస్థితి వెనుక మర్మమేమిటి?

-2-
ఈ భూమిపై హిమాలయాలు ఏర్పడి సుమారు పది మిలియన్ల సంవత్సరాలు అయినట్లు సైంటిస్టులు చెప్తారు. కైలాస్‌ పర్వతం వయసు కూడా బహుశా అంతే అయి ఉండవచ్చు.  అయితే మిగతా హిమాలయ పర్వతాలకు, కైలాసానికి స్పష్టమైన తేడా ఉంటుంది. కైలాస్‌ పర్వతం ఒకప్పటి అఖండ భారతానికి సెంటర్‌ పాయింట్‌లో ఉంది. గురుత్వాకర్షణ శక్తికి గరిమనాభి ఎలాంటిదో.. అఖండభారతానికి సెంటర్‌ పాయింట్‌ కైలాసం..
ఆరు హిమాలయ పర్వత శ్రేణులకు మధ్యలో కైలాస పర్వతం ఉంది.. ఒక విధంగా చూస్తే కమలం ఆకారంలో కనిపిస్తుంది..
కైలాస్‌ పర్వతం నాలుగు వైపుల నాలుగు రంగుల్లో కనిపిస్తుంది. ఒక వైపు నుంచి చూస్తే పూర్తిగా స్ఫటికంలా కనిపిస్తుంది. ఇంకో వైపు నుంచి చూస్తే బంగారు వర్ణం గోచరిస్తుంది.. మూడో వైపు రూబీలాగా, నాలుగో వైపు నీలం రాయిగా గోచరిస్తుంది.
అంతే కాదు..  కైలాసానికి నాలుగు రూపాలూ ఉన్నాయి. ఒకవైపు గుర్రంగా, ఇంకోవైపు సింహంగా, మూడో వైపు ఏనుగుగా, నాలుగో వైపు నెమలిగా కనిపిస్తాయి.. ఇందులో  గుర్రం హయగ్రీవ రూపం కాగా, సింహం పార్వతీదేవి వాహనం, ఏనుగు విఘ్నేశ్వరుడికి ప్రతీక అయితే, నెమలి కుమారస్వామికి వాహనం.. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెప్తాయి.
కైలాస్‌ పర్వతంలో అత్యంత కీలకమైన విషయం దక్షిణ ఆసియాను సస్యశ్యామలం చేస్తున్న  నాలుగు పవిత్ర నదులు ఈ ప్రాంతం నుంచే ఉద్భవించటం..గంగ, సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్‌ నదులు ఇక్కడి నుంచే కిందకు ప్రవహిస్తాయి..
మంచు పూర్తిగా కప్పుకున్నప్పుడు వెండికొండలా మిలమిల మెరిసే కైలాస దర్శనం అద్భుతం. ఈ పర్వత పాదపీఠంలో బ్రహ్మమానస సరోవరం మరో అపురూపం.. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి ఉండదని చెప్పే సైన్‌‌స మాటను నిజం చేసే సరస్సు ఇది. నీటికి ఇంత స్వచ్ఛత ఈ భూమిపై కన్ను పొడుచుకుని చూసినా కనిపించదు. పరమేశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం..కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే.
కైలాసం పైకి అధిరోహించటం ఇప్పటికి ఎవరి వల్లా సాధ్యం కాలేదు. పదవ శతాబ్దంలో బౌద్ధ మతగురువు మిర్లెపా కైలాస పర్వతాన్ని ఎక్కినట్లు చెప్తారు. అంతకు ముందుకానీ, ఆ తరువాత కానీ, ఎవరూ దీన్ని స్పృశించేందుకు కూడా సాహసించలేదు.. సాహసించిన వారు కనిపించకుండా అదృశ్యమైపోయారని చెప్తారు.. 1954లో కైలాస్‌ యాత్రను నిషేధించిన చైనా కూడా  దీనిపై ప్రయోగం చేసి విఫలమైంది. రెండుసార్లు హెలికాప్టర్లు పంపిస్తే  అవి తిరిగి రాలేదు. ఆ తరువాత ఎవరూ సాహసించలేదు...
ఎన్నో ప్రయోగాలు జరిగాయి.. ఏమీ తేలలేదు.. ఇప్పటి వరకు కైలాస్‌ పర్వతం అవుటర్‌ సర్కిల్‌లో తిరిగిన వాళ్లే తప్ప ఇన్నర్‌ సర్కిల్‌లోకి ప్రవేశించిన వాళూ్ల లేరు.. 21సార్లు అవుటర్‌ సర్కిల్‌లో తిరిగిన తరువాత ఇన్నర్‌ సర్కిల్‌లోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. అది అంత తేలిక కాదు.. అఘోరాల్లాంటి వాళ్లకు కానీ సాధ్యం కాదు.. ఇంత క్లిష్టమైన పర్వతం ఉపరిభాగంపై ఏమున్నదన్నది సైన్‌‌సకు మాత్రం అందలేదు.. భక్తులకు మాత్రం కైలాసంపై శివుడు సాకారంగా సాక్షాత్కరిస్తున్నాడు.. ధ్యానముద్రలో కనిపిస్తున్నాడు. లింగరూపుడై దర్శనమిస్తున్నాడు. కోరిన కోరికలన్నీ తీరుస్తున్నాడు....ఇది విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు అతీతమైంది.. అంతు చిక్కనిది.
కైలాస్‌ దర్శనం భక్తులకు ఒక అపూర్వ అనుభూతి.. హిమాలయ సానువుల్లో సువర్ణభాండం.. పరమేశ్వరుడి దివ్యధామం.. పార్వతి దేవీ కొలువైన పవిత్ర క్షేత్రం. అణువణువులోనూ శివస్వరూపాన్ని నింపుకున్న ప్రాంతం. మాటల్లో వర్ణించలేని భావమది. పదాలకు అందని పవిత్రత అది. అందుకే భక్తులు మానస సరోవరాన్ని భూలోక కైలాసంగా పిలుచుకుంటారు.

12, నవంబర్ 2010, శుక్రవారం

మీ పిల్లల్ని మీరు చంపేస్తున్నారు

ఒక చిరు తిండి మీ చిన్నారి ప్రాణాల్ని హరించేస్తున్నది
అందంగా కనిపిస్తూనే అంతం చేస్తోంది
కమ్మకమ్మగా ఖతం చేస్తోంది
జ్యూసీగా జ్యూసీగా విషం లోపలికి ఇంజెక్ట్‌ అవుతోంది
రక్తంలో కలిసిపోతోంది
మీరే మీ పిల్లలకు విషాన్ని అందిస్తున్నారు
అన్నం బదులు రసాయనాలను తినిపిస్తున్నారు
పురుగుమందులను తాగిస్తున్నారు
పిజ్జాలు..
బర్గర్లు..
పావ్‌ బాజీలు..
కట్‌లెట్‌ రగడా..
హమ్‌బర్గర్స్‌
హాట్‌ డాగ్స్‌
ఐస్‌క్రీమ్‌
కేక్‌
ఫ్రెంచ్‌ ఫ్రైస్‌
ఆనియన్‌ రింగ్స్‌
డోనట్స్‌
సాఫ్ట్‌ డ్రింక్స్‌
-----------------------------------------------

1
హాలీడే వచ్చేసిందంటే చాలా మందికి జాలీడే.. పిల్లలతో షికార్లు.. మెక్‌డోనాల్డ్స్‌లో పిజ్జాలు.. బర్గర్‌లు.. ఐమాక్స్‌లో సినిమా.. వీడియో గేమ్స్‌తో హల్‌చల్‌.. గోకుల్‌ చాట్‌లో చాట్‌, పానీపురీ, పావ్‌బాజీ.. ఫుల్‌ హంగామా.. వారం రోజుల పాటు రోజూ పది, పన్నెండు గంటలు పని చేసి హాలీడే వచ్చిందంటే, పిల్లలతో హ్యాపీగా గడపడం, వాళ్లడిగింది కొనివ్వటం దగ్గరుండి రకరకాల ఫుడ్స్‌ తినిపించటం.. ఓ రిలాక్స్‌.. ఓ ఆనందం.. పిల్లలూ హ్యాపీ.. మనమూ హ్యాపీ..,..... ఈ హ్యాపీ హ్యాపీయేనా? మీ పిల్లలకు కోరిందల్లా కొనివ్వటమే హ్యాపీయా? కాదు.. మీకు తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని హరిస్తున్నారు.. కోరి కోరి మృత్యుముఖంలోకి నెట్టేస్తున్నారు.. పిల్లలను మృత్యువు దగ్గరకు మీరే పంపిస్తున్నారు.. ఇది పుక్కిటి పురాణం కాదు. పిట్టకథ కాదు.. మీకు ఓ హెచ్చరిక.
మీ పిల్లలకు అన్నీ ఇష్టమే.. మీకూ ఇష్టమే.. వాళ్లు అన్నం తినకపోయినా సరే.. పిజ్జా తింటే చాలు.. పసిపాపకు తిండి అంటే ఫ్రెంచ్‌ఫ్రై, డోనట్సే.. ఇక ఐస్‌క్రీమ్‌లకు, కూల్‌డ్రింక్‌లకూ కొరవేముంది... ఏదీ తిండికి అనర్హం కాదు.. ఏదీ తాగటానికి అనర్హం కాదు.. ఎక్సెప్ట్‌ అన్నం తప్ప..

ఇక్కడే ఓ ప్రశ్న ఉదయిస్తుంది. వీకెండ్స్‌లో కూడా ఇంట్లోనే తినాలా? అదీ అన్నం తినాలా? పిల్లల సూటి ప్రశ్న ఇది. అవును.. నిజమే.. రోజూ ఏదో అన్నం తింటున్నాం.. సరదాగా వీకెండ్స్‌లో మరేదైనా తినిపించవచ్చు కదా.. లాజిక్‌ బాగానే ఉంది. పిల్లల్ని హ్యాపీగా ఉంచటం ముఖ్యం వాళ్లకు ఇష్టమైంది తినిపించకపోతే మనమెందుకు అని పేరెంట్స్‌ ఫీల్‌ కావటమూ లాజిక్కే.  ఈ మాత్రం దానికి పిల్లలకు విషం తినిపిస్తున్నామని, వాళ్లను చంపేస్తున్నామని అడ్డగోలుగా వాదించటం, భయపెట్టడం సబబేనా?  అంటే నిజమే.. కానీ, దీని వెనుక కారణం ఏమిటన్నది ఒక్కసారి ఆలోచించాలి.
పిల్లలను తల్లిదండ్రులు బయటకు తీసుకువెళ్లేదే, ఫుడ్‌కోర్ట్‌కో, సినిమాకో, వీకెండ్‌ స్పాట్స్‌కో.. ఫుడ్‌ కోర్ట్‌కు వెళ్లినప్పుడు అక్కడ పులిహోరో, అన్నం పాయసమో అమ్మరు కదా.. అక్కడ అమ్మేదే ఫాస్ట్‌ ఫుడ్‌... అదీ పిజ్జా, బర్గర్లు, చాట్‌, పానీపూరీలు..రెస్టారెంట్‌  టైప్‌ అయితే బిర్యానీ, రుమాలీ రోటీ, చైనీస్‌ ఫుడ్‌.. అవే ఉంటాయి. అవే తినాలి. అవి తినేందుకే పేరెంట్స్‌ వెళ్తారు. పిల్లల్ని వెంటేసుకుని మరీ వెళ్తారు. వాళ్లు పిజ్జా తింటుంటే హ్యాపీగా ఫీలవుతారు..
ఇప్పుడు ఈ తిండే పెద్ద సమస్యగా మారింది. ప్రాణాంతకంగా మారింది. పిల్లలను మృత్యుముఖంలోకి నెట్టేస్తుంది. మీ పిల్లల ప్రాణాలను తోడేసేది ఎవరో కాదు.. పిజ్జా.. బర్గర్‌, పావ్‌, కురుకురే.. ఎస్‌.. వీటికి ముద్దు పేరు జంక్‌ ఫుడ్‌.. జస్ట్‌ అచ్చతెలుగులో అనువదిస్తే చెత్త ఆహారం అని అర్థం.. అలా అనడానికి మనసొప్పదు కాబట్టి చిరుతిండి అని కూల్‌గా పిలుచుకుంటాం...
మీ పిల్లలకు తినిపిస్తున్న పిజ్జా, బర్గర్‌, డోనట్‌.. వాళ్ల శరీరాల్లో చెత్తలా పేరుకుపోతోంది. ఎక్కడ పడితే అక్కడ చేరిపోతోంది. అది కొండలా పెరిగిపోతోంది. పిల్లకాయల్ని బెలూన్లా ఊరేలా చేస్తోంది. నాలుగేళ్ల వయసుకే వంద కిలోల బరువెక్కి, బతుకే భారంగా మారేట్లు చేస్తోంది.
రెండేళ్ల నుంచి ౧౯ఏళ్ల వరకు ఆడ, మగ తేడా లేకుండా అందరిలోనూ ఫుడ్‌ సెユ్టల్‌ మారిపోయింది. అన్నం అంటే సెユ్టల్‌గా పిలుచుకుంటే వైట్‌రైస్‌ అనేది లైట్‌గా తీసుకోవటం, సైడ్‌ ఫుడ్స్‌ తెగ మెక్కేయటం అలవాటుగా మారిపోయింది.

ఇది అంత ఆషామాషీగా తీసుకోవద్దు.. మీ పిల్లల్లో అవాంఛనీయమైన ఊబకాయానికి ఈ తిండ్లే కారణమని గ్రహించండి.. దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవి మీ పిల్లల్ని ఎదగనీయవు.. జీవన పరిమాణాన్ని అమాంతంగా తగ్గించేస్తాయి. మీ జనరేషన్‌  వాళ్లు కనీసం 60-70 ఏళ్లయినా బతుకుతున్నారు. మీ పిల్లల జనరేషన్‌ 40 ఏళ్లు దాటితే గొప్పే...
-----------------------------

3
ఎందుకింతగా భయపెడుతున్నారు? అని అందరికీ సందేహం కలుగుతుంది.. కానీ, ఇది భయపెట్టడం కాదు.. హెచ్చరించటం.. నిజంగా ఇది యంగ్‌ పేరెంట్స్‌కు ఓ హెచ్చరిక.. ఫాస్ట్‌ఫుడ్‌ మేనియాలో పడి కొట్టుకుపోకుండా జాగ్రత్త పడమని హంబుల్‌ రిక్వెస్ట్‌.  ఈ చిన్న కథలాంటి వాస్తవాన్ని ఒకసారి చదవండి..
జనవరి ౧, ౧౯౮౯ సాన్‌ఫ్రాన్సిస్కో అమెరికాలో మాట్‌ మామ్‌గ్రమ్‌ అనే యువకుడు ఓ పిజ్జా హట్‌లోకి వెళ్లాడు. రెండు బర్గర్లు తీసుకున్నాడు.  ఒక బర్గర్‌ తినేసి, మరో బర్గర్‌ను కోటు జేబులో  పెట్టుకున్నాడు. ఆ తరువాత దాని సంగతే మరిచిపోయాడు. ఏడాది పాటు ఆ కోటునే వేసుకోలేదు.  సరిగ్గా సంవత్సరం తరువాత మాట్‌ తన పాత కోటు తీశాడు. కోటు జేబులో ఏదో తగిలిందని చూస్తే, ఏడాది క్రితం నాటి బర్గర్‌
ఆశ్చర్యం వేసింది. తాను కొన్నప్పుడు ఎలా ఉందో.. ఎలాంటి వాసన వచ్చిందో అలాగే ఉంది..తాను కనుగొన్న ఈ డిస్కవరీని తన ఫ్రెండ్స్‌తో పంచుకున్నాడు. ఎవరూ అతణ్ణి నమ్మలేదు. కొత్త బర్గర్‌ కొని అబద్ధమాడావన్నారు. అప్పటి నుంచి మాట్‌ బర్గర్ల కలెక్షన్‌ ప్రారంభించాడు.  వాటిని టీపాయ్‌ కింద బేస్‌మెంట్‌లో దాచాడు. ఇదంతా జరిగి ౨౧ సంవత్సరాలు పూర్తయ్యాయి.  ఇవాళ మాట్‌ దగ్గర సూపర్‌ బర్గర్‌ కలెక్షన్‌ తయారైంది.
ఎప్పటికీ చెడిపోని బర్గర్లు.. డబుల్‌ చీజ్‌ బర్గర్లు.. హమ్‌బర్గర్లు.. ప్రపంచంలో కనీవినీ ఎరుగని కలెక్షన్‌ ఇది. ఇప్పుడాయన బర్గర్‌ మ్యూజియం నిర్వహిస్తున్నాడు.

ఒక ఆహార పదార్థం ఎన్నాళ్లయినా పాడు కాకుండా ఉండటం ఎలా సాధ్యం? వీటిలో ఏయే పదార్థాలు వాడారు.. ఎందుకలా చెడిపోకుండా ఉన్నాయి. ఇలాంటి పదార్థాలు తింటే, మీరు తినిపిస్తే.. మీ పిల్లలు ఏమై పోతారు.. ఒక్కసారి కూల్‌గా ఆలోచించండి..
అమెరికాలో మాట్‌  మామ్‌గ్రమ్‌ స్టోరీ కల్పితం కాదు. నిజం.. ఈ బర్గర్‌లలో వాడిన ఇన్‌గ్రెడెంట్స్‌ వింటే దిమ్మ తిరిగిపోతాయి.
ఆవుమాంసం
ట్రెユక్లోరోథిన్‌
క్లోరోఫామ్‌
డిడిటి
ఇథైల్‌ బెంజిన్‌
అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రసాయనాలు కనిపిస్తాయి. ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు, రుచికరంగా ఉండేందుకు, చాలా వస్తువులు ఇందులో కలుస్తాయి. ప్రపంచం అంతా ఇదే జరుగుతోంది. ఇందుకు మన దేశం మినహాయింపేమీ కాదు. ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు.. వీటివల్ల జంక్‌ఫుడ్‌ లోపలికి వెళ్లి పూర్తిగా జీర్ణం కాక రక్తనాళాల పక్కన కొలెస్ట్రాల్‌గా మారి నిలిచిపోతుంది. ఫలితం.. ఊబకాయం...
ప్రతి వందమంది పిల్లల్లో  ౩౫ శాతం మంది అండర్‌ వెయిట్‌ ఉంటే, ౫౫ శాతం మంది ఓవర్‌ వెయిట్‌ ఉన్నారు.. కేవలం పది శాతం మంది మాత్రమే వయసుకు తగ్గ బరువుతో ఆరోగ్యంగా ఉంటున్నారు. మిగతా వాళ్లందరికీ ఎప్పుడూ ఏదో సమస్యే... ఏ చిన్న ప్రతికూల వాతావరణాన్ని కూడా భరించలేని పరిస్థితి. ఎక్కువ వేడిని తట్టుకోలేరు.. ఎక్కువ చల్లదనాన్ని తట్టుకోలేరు.. చిన్న చిన్న వాటికే కిందామీదా పడిపోతారు.. మీరే ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి ఆలోచించండి.. నెలకు మీ పిల్లల మెడిసిన్స్‌ ఖర్చు ఎంతవుతోందో లెక్కలేసుకోండి.. మీకే అర్థమవుతుంది.. మీ పిల్లలెంత బాగా ఉన్నారో.. వారి ఆరోగ్యాన్ని మీరెంతగా చెడగొడుతున్నారో..

చెత్త తిండి, అదేనండి.. జంక్‌ ఫుడ్‌ తినిపిస్తే మీ పిల్లల్లో  ఒబెసిటీ పెరగడమే కాదు.. మామూలు భోజన అలవాట్లు పూర్తిగా మారిపోతాయి. తిండి సరిగా తినరు.. జంక్‌ఫుడ్‌పై చూపే మోజు, మామూలు అన్నంపై చూపించరు. తొందరగా అలిసిపోతారు. కాళ్ల నొప్పులంటారు... కడుపు నొప్పంటారు.. తరచూ ఇన్ఫెక్షన్స్‌ వస్తాయి. ప్రతి చిన్న దానికి భయపడిపోతుంటారు. నిద్ర సరిగా పట్టదు.. ఒకదాని వెంట ఒకటిగా ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.. డాక్టర్లను పేరెంట్స్‌ పోషిస్తూనే ఉంటారు. దటీజ్‌ ద ఇంపాక్ట్‌ ఆఫ్‌ జంక్‌ఫుడ్‌.

ఈ ఒబెసిటీ జాడ్యం కూడా పాశ్చాత్య దేశాల నుంచే మనకు పట్టుకుంది. అన్నింటా అమెరికాను ఆదర్శంగా తీసుకోవటం, అడ్డమైన ఫుడ్డూ తినటం, మన తరువాతి జనరేషన్‌ ఆయుర్దాయానికే ఎసరు తెచ్చిపెడ్తోంది. అసలు వాళ్ల లైఫ్‌సెユ్టల్‌నే అది పూర్తిగా మార్చేస్తోంది.    
ఇప్పుడు మన లైఫ్‌ అంతా అమెరికా సెユ్టల్‌.. లండన్‌ సెユ్టల్‌.. సిడ్నీ సెユ్టల్‌.. అంతే తప్ప.. హైదరాబాదీ సెユ్టల్‌ అనేది లేనే లేదు. నగరాల్లో కాలుష్యం ఓ నరకం అయితే, ఫాస్ట్‌ఫుడ్‌ డైరెక్ట్‌ పాయిజన్‌గా ఇంజెక్ట్‌ అవుతోంది. మన రాజధానిలో నెలకు రెండు  వందల కోట్ల రూపాయల వరకు రకరకాల రూపాల్లో ఫాస్ట్‌ఫుడ్‌ బిజినెస్‌ జరుగుతోందంటేనే, నగర ప్రజలు ఏ స్థాయిలో అడిక్ట్‌ అయ్యారో అర్థం చేసుకోవచ్చు.
అమ్మాయిల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటోంది.. ఇలాంటి జంక్‌ఫుడ్‌ కారణంగా అమ్మాయిల్లో హార్మోన్లు వ్యాకోచించి తొందరగా ఎదిగిపోతున్నారు.. చిన్న వయసులోనే రజస్వల అవుతున్నారు. పెద్ద వాళ్లలో ఉన్న లక్షణాలన్నీ ముందే వచ్చేస్తున్నాయి. ఇది పెద్ద సమస్యగా మారుతోంది.
ఈ సమస్యంతా నగరాల్లో ఉన్న పిల్లల విషయంలోనే జరుగతోంది. ఫాస్ట్‌ఫుడ్‌.. జంక్‌ఫుడ్‌.. చెత్త తిండి అంతా నగరాల్లోనే దొరుకుతోంది.. ఇంకా పల్లె సీమలకు ఎక్కువగా విస్తరించకపోవటం వల్ల అక్కడి పిల్లల్లో ఊబకాయం వంటి సమస్యలు అక్కడికి పాకలేదు. నగరాల్లోనే ఈ విషం పిల్లల రక్తనాళాల్లో వేగంగా వ్యాపిస్తోంది.  ఏ దశలోనూ  పిల్లలకు పోషకాహారం లభించటం లేదన్న వాస్తవాన్ని  తల్లిదండ్రులు గుర్తించటం లేదు. ఒకవేళ గుర్తించినా, ఆ పోషకాహారాన్ని అందించే పరిస్థితీ, వాతావరణం లేనే లేదు. ఇది ఇంతమందిలో ఉంది.. జంక్‌ఫుడ్‌ ప్రభావం ఇంతమందిలో లేదు అన్న లెక్కలు పత్రాలు అవసరం లేదు. ప్రతి ఇంట్లో, పిల్లలందరికీ విస్తరించిన జాడ్యం. దీన్ని నిర్మూలించటం ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్న వేయవచ్చు. దీన్ని ఇప్పుడు ఎలా ఆపగలం అని అడగవచ్చు. కానీ, దాన్ని కనీస స్థాయికి తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. పీజ్జాలతో చెలగాటం.. మీ పిల్లలకు ప్రాణసంకటం అని గ్రహించండి...జస్ట్‌ అవాయిడ్‌ జంక్‌ఫుడ్‌.. సేవ్‌ యువర్‌ కిడ్స్‌..

10, నవంబర్ 2010, బుధవారం

వైట్‌హౌస్‌ అలియాస్‌ రెసిడెన్సీ

కోఠీ రెసిడెన్సీ.. ఒకప్పుడు నిజాం వైభవానికి నిలువెత్తు నిదర్శనం... ఇప్పుడు అగ్రరాజ్యం అధిపతి నివాసంగా మారింది. మన రెసిడెన్సీని ప్రపంచ పోలీసు ఎత్తుకెళ్లిపోయాడు.. అక్కడి నుంచే అధికారాన్నంతా చెలాయిస్తున్నాడు.. ఒకప్పటి మన రెసిడెన్సీ.. బ్రిటిష్‌ వారి మెప్పు కోసం, మెహర్బానీ కోసం నిజాం నిర్మించి ఇచ్చిన గొప్ప ప్యాలెస్‌ ఇప్పుడు పేరు మార్చుకుని వాషింగ్టన్‌ డిసికి తరలిపోయింది.. అమెరికా అధ్యక్షుడి అధికార నివాసంగా మారిపోయింది. ఇది వింతవార్త కాదు.. పుకారు కాదు.. విచిత్రం కాదు.. నిజం..
1
ఇదేమీ కట్టుకథ కాదు.. ప్రపంచం మొత్తం నివ్వెరపోయే వాస్తవం.. మనకు తెలియకుండానే మన భవనం అమెరికా అధ్యక్షుడి నివాసమైపోయింది. ఇదెలా జరిగింది? ఇప్పుడు యావత్ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్న ప్రశ్న. హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న వాస్తవం.. రెసిడెన్సీ ఏ విధంగా తరలిపోయింది? ఎలా పేరు మార్చుకుంది? అంతటి అగ్రరాజ్యానికి మన రెసిడెన్సీయే ఎందుకు కావలసి వచ్చింది? వినడానికి విచిత్రంగానే ఉండొచ్చు.. కానీ, ఇది వాస్తవం..  
మనకు తెలిసిన అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్‌హౌస్‌.. రాజధాని వాషింగ్టన్‌ డిసిలో కొలువై ఉన్న శ్వేత సౌధం.. కనుసైగతో ప్రపంచాన్ని శాసించే అత్యంత శక్తిమంతమైన రాజ్యాధిపతి అధికార దర్పానికి నిలువుటద్దం. శ్వేతసౌధంలో అధికార లాంఛనాలతో రెడ్‌కార్పెట్‌ స్వాగతం స్వీకరించేందుకు ఉబలాటపడని ప్రపంచదేశాధి నేతలు ఉండరు.. మన మన్మోహన్‌ సింగ్‌ సైతం జార్జిబుష్‌ ఇచ్చిన విందుకు సంబరపడే అణు ఒప్పందంపై రాజీ లేకుండా సంతకం చేసేశారు..
ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నా మొట్టమొదటి సమాచారం వైట్‌హౌస్‌కు చేరుతుంది. ఏ దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చూసేందుకు వేలాది డేగకళ్లకు శ్వేతసౌధం నివాసం. ఒక్క మీట నొక్కితే మూడు వేల సార్లు భూమిని నాశనం చేసే అణ్వసా్తల్రను పేల్చే బ్లాక్‌ బాక్‌‌స భద్రంగా ఉన్న భవనం.
అమెరికా సంయుక్తరాషా్టల్ర అధ్యక్షుడి నివాసంతో పాటు ఆయన పరిపాలనా విభాగాలన్నీ వైట్‌హౌస్‌లోనే కొలువై ఉంటాయి. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఎలాంటి నిర్ణయమైనా ఈ భవనంలోనే రూపొందుతుంది.. ఇక్కడే అమలు జరుగుతుంది. తాను కావాలనుకుంటే యుద్ధం.. వద్దనుకుంటే శాంతి.. వార్‌కైనా, పీస్‌ కైనా ఇక్కడే నాంది పలుకుతుంది.. ఇక్కడి నుంచే ఆపరేషన్‌ స్టార్‌‌ట అవుతుంది..
అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఒకటిగా చెప్పుకునే నియంతృత్వ అమెరికాకు శ్వేతసౌధం కేంద్రకం. ఇందులో ఎవరికీ ఆక్షేపణ లేదు.. అభ్యంతరం అంతకంటే లేదు.. మరి ఎక్కడో భారత్‌లో ఓ మూలన హైదరాబాద్‌లో ఉన్న కోఠీ రెసిడెన్సీకి, వైట్‌హౌస్‌కి ఉన్న సంబంధం ఏమిటి? రెసిడెన్సీ వైట్‌హౌస్‌గా ఎలా మారిపోయింది? ఎవరు మార్చాల్సి వచ్చింది. వైట్‌హౌస్‌ను అలియాస్‌ రెసిడెన్సీగా ఎందుకు పిలవాలి? వాట్‌ ఈజ్‌ ది సీక్రెట్‌?

2
అంతా అయోమయంగా ఉందని అనుకోకండి.. ఇందులో విశేషమే ఉంది. మన కోఠీ రెసిడెన్సీని, అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను ఒక్కసారి నిశితంగా గమనించండి.. పరిశీలించండి.. అణువణువూ పరికించండి.. మర్మం ఏమిటో మీకే తెలుస్తుంది. కోఠీ రెసిడెన్సీకి, వైట్‌హౌస్‌కి అణువంతైనా తేడా లేదని.. అచ్చంగా మన రెసిడెన్సీకి కవల పిల్లలా ఉందని మీకే అర్థమవుతుంది.              
మనలో ఒక విచిత్రమైన అలవాటు ఉంది.. భారతీయులందరిలోనూ ఉన్న లక్షణమే అది.. ఏమంటే.. మనకు ఎలాంటి తెలివీ లేదని.. ఎవడో బయటివాడు వచ్చి మనకు నేర్పితే కొని తెచ్చుకున్న కొంచెపు తెలివే తప్ప.. మనకంటూ సహజంగా ఉన్నది సున్నాయేనని ఓ గట్టి నమ్మకం. అమెరికా వోడు ఆరోగ్యానికి పెరుగన్నం తినమంటే ఆహా, ఓహో అంటూ తినేస్తాం... వైట్‌హౌస్‌ నుంచి కూచోమని ఆదేశమొస్తే కూచుంటాం.. నిలుచోమంటే నిలుచుంటాం.. మన మంచి మనకంటే వాడికే ఎక్కువ తెలుసని మనమే దబాయించి వాదిస్తాం మరి..
కానీ, ఇదిగో ఒక్కసారి ఆలోచించండి.. మన వారికి ఉన్న తెలివేంటో తెలుసుకోండి.. మన వారిని మనం వదిలేసుకున్నాం.. కానీ, అదే అమెరికావోడు తెలివిగా పట్టేసుకున్నాడు.. మనకున్న నైపుణ్యాన్ని వాళు్ల నిస్సిగ్గుగా తమ దగ్గరకు తీసుకెళ్లిపోయారు.. అందుకు ఉదాహరణే హైదరాబాద్‌ కోఠీలోని ఒకప్పటి బ్రిటిష్‌ రెసిడెన్సీ.. ఇప్పటి వుమెన్‌‌స కాలేజి. జస్‌‌ట లుక్‌ ఇన్‌టు ఇట్‌..
కోఠీ రెసిడెన్సీ, వైట్‌హౌస్‌ అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉంటాయి.. ఉన్నాయి. ముఖద్వారం నుంచి, వెనుక ఉన్న ఫౌంటెన్‌ దాకా, స్తంభాల దగ్గరి నుంచి వాటిపై ఏర్పరిచిన అలంకారాల దాకా కోఠీ రెసిడెన్సీకి ఓ కార్బన్‌ కాపీలా వైట్‌హౌస్‌ ఉంటుంది.
కొద్దిగా కూడా తేడా కనిపించదు.. ఒకే ముఖం.. ఒకే ఎత్తు.. ఒకే శిల్పం.. ఒకే నిర్మాణ రీతి.. చూస్తుంటే ఒంట్లో ఒక రకమైన కదలిక వచ్చేస్తుంది.. ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. అదే సమయంలో అనేక ప్రశ్నలు ఉదయిస్తాయి.. ఇది ఎలా సాధ్యపడింది? కోఠీలో బ్రిటిష్‌ వారి రెసిడెన్సీ ఆర్కిటెక్చర్‌ను వైట్‌హౌస్‌ అనుకరించిందా? వైట్‌హౌస్‌ ఆర్కిటెక్చర్‌ను నాటి నిజాం అనుకరించాడా?
అవును.. మీ అనుమానం నిజమే.. మన నైపుణ్యాన్నే వైట్‌హౌస్‌ నిర్మాతలు తేలిగ్గా కొట్టేశారు.. హాలీవుడ్‌ సినిమాల్లో సీన్లను కాపీ కొట్టి తెలుగు సినిమాల్లో యథాతథంగా వాడుకున్నట్లే.. మన రెసిడెన్సీ నిర్మాణశైలిని ఉన్నది ఉన్నట్లుగా అగ్రరాజ్యం కాపీ కొట్టింది..
3
ఎక్కడి వైట్‌ హౌస్‌.. ఎక్కడి కోఠీ రెసిడెన్సీ.. రెండూ ఒకే లాగా ఎలా నిర్మించారు.. రెండింటి ఆర్కిటెక్‌‌ట ఒక్కరేనా? లేక ఒకదాని నమూనాతో మరొకటి నిర్మించారా? ఇన్నాళూ్ల బయటి ప్రపంచానికి తెలియని ఓ పెద్ద మిస్టరీ.. రెండూ ఒకే రీతిలో నిర్మాణం జరగడానికి వెనుక కారకులెవరైనా ఉన్నారా?
వైట్‌ హౌస్‌.. కోఠీ రెసిడెన్సీ.. ఒకటి అగ్రరాజ్యం అధినేత నివాసం.. మరొకటి ఒకనాటి బ్రిటిషర్లు, నిజాం నవాబు వైభవానికి నిదర్శనం.. ఒకటి తూర్పు.. మరొకటి పడమర.. రెండూ ఒకేలాగా ఉండటం ఎలా సాధ్యపడింది? ఒకటి కాదు.. రెండు కాదు.. రెంటికీ బోలెడు పోలికలు ఉన్నాయి...
రెండింటినీ దక్షిణాభిముఖంగానే నిర్మించారు.

రెండింటి ఫ్రంటల్‌ వూ్య ఒకే విధంగా ఉంటుంది.

రెండింటికీ సెమీ సర్కిల్‌ పోర్టికో ఉంది.

ఈ పోర్టికోలో నిలుచునే అమెరికా అధ్యక్షుడు ప్రసంగం చేసే సంప్రదాయం ఉంది. బ్రిటిష్‌ రెసిడెన్సీలోనూ గవర్నర్‌ జనరల్‌ ఇదే పోర్టికోలో నిలుచుని ప్రజలను అడ్రస్‌ చేసేవారు.

సెమిసర్కిల్‌ పోర్టికోలో ఉన్న స్తంభాలు రెండింటిలోనూ ఒకే ఎత్తులో ఉంటాయి

రెండింటి పునాది ఒకే ఎత్తులో ఉంది.

రెండింటికీ సెల్లార్‌లో నిర్మాణం జరిగింది.

వైట్‌ హౌస్‌లో మొత్తం సెల్లార్‌ నుంచి పై వరకు మొత్తం ఆరు అంతస్థులు ఉంటే, కోఠీ రెసిడెన్సీలో  సెల్లార్‌, గ్రౌండ్‌, ఫస్‌‌ట ఫ్లోర్లు ఉన్నాయి.

బయటినుంచి చూస్తే రెండు భవనాలు ఒకే విధంగా కనిపిస్తాయి.

భవనాలకు ఉత్తరాభిముఖంలో కనిపించే ట్రయాంగిల్‌  పోర్టికో కూడా ఒకే విధంగా ఉంటుంది.

స్తంభాల అంచుల్లో డిజైనింగ్‌ అచ్చుగుద్దినట్లే ఉంటుంది.

లోపల తలుపులపై వెంటిలేటర్ల నిర్మాణం కానీ, రూఫ్‌ డిజైనింగ్‌లో కూడా తేడా ఇసుమంతైనా కనిపించదు..

సీలింగ్‌, పిల్లర్లు మాత్రమే కాదు.. లోపల దర్బార్‌ హాల్‌ నిర్మాణం కూడా రెండింటిలోనూ ఒకే రకంగా కనిపిస్తుంది.

భవనం లోపలి భాగంలో పిల్లర్ల ఏర్పాటులో కూడా ఏక రూపత కనిపిస్తుంది. ఒక పిల్లర్‌ దాని తరువాత రెండు పిల్లర్లు ఆ తరువాత ఒక పిల్లర్లను ఏర్పాటు చేయటం రెట్టింపు ఎత్తులో ఉన్న సీలింగ్‌కు భద్రత కల్పించటం కోసం ఈ రకమైన స్తంభాల ఏర్పాటు చేశారు.
రెండు భవనాల్లోనూ ఉత్తరం వైపు పెద్ద గార్డెన్‌ ఉంది.. ఈ రెండు తోటల్లోనూ వలయాకారంలో ఉన్న ఫౌంటెన్‌లను చూడవచ్చు.
వైట్‌హౌస్‌లో మెట్లు బయటి నుంచి ఉంటే, కోఠీ రెసిడెన్సీలో మెట్లు లోపలి నుంచి కనిపిస్తాయి. రెయిలింగ్‌ డిజైనింగ్‌ ఒకే రకంగా ఉంటుంది.
రెండు భవనాలకు రెండువైపులా అదనపు నిర్మాణాలు జరిగాయి.
కిటికీల డిజైనింగ్‌ కానీ, బాల్కనీ అంచులపై ఉన్న డిజైనింగ్‌ కానీ రెండింటిలోనూ ఒకేరకంగా ఉంటుంది.
4
వైట్‌హౌస్‌, కోఠీ రెసిడెన్సీలు రెంటిలోనూ ఇన్ని కామన్‌ ఎలిమెంట్లు ఎలా సాధ్యమైందన్నది ఇప్పటివరకూ అంతుపట్టని విషయం.. కోఠీ రెసిడెన్సీని చూసి వైట్‌హౌస్‌ను నిర్మించారా? లేక సొంత డిజైనింగేనా? సొంతంగా అగ్రరాజ్యం డిజైన్‌ చేయించినట్లయితే ఇన్ని సిమిలారిటీస్‌ కనిపించటం అసాధ్యమైన పని. కానీ, ఎలా సాధ్యపడింది?
వైట్‌హౌస్‌ను మొట్టమొదట నిర్మించింది 1792లో.. అమెరికా అప్పటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ ఈ భవంతికి రూపకర్త.. ఐరిష్‌కు చెందిన జేమ్‌‌స హోబన్‌ ఈ భవనానికి డిజైన్‌ చేశాడు.. జాన్‌ ఆడమ్‌‌స అధ్యక్షుడిగా ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకు అందరు ప్రెసిడెంట్లకూ ఇది అధికార నివాసంగా ఉంటూ వచ్చింది. 1792లో ఈ బిల్డింగ్‌ను నిర్మించినప్పుడు ఆక్వా సాండ్‌ స్టోన్‌ వాడారు.. అప్పుడు దీన్ని వైట్‌ హౌస్‌ అని పిలవలేదు. ఎగ్గిక్యూటివ్‌ మాన్హన్‌ అని, మరి కొన్ని పేర్లతో దీన్ని పిలిచారు. 1801లో థామస్‌ జెఫర్‌సన్‌ ప్రెసిడెంట్‌ అయ్యాక దీని బయటి వైపు విస్తరించాడు.
1814లో బ్రిటిష్‌ ఆర్మీతో యుద్ధం జరిగిన సమయంలో ఈ భవంతి పూర్తిగా కాలిపోయింది. బ్రిటిష్‌ సైన్యం పూర్తిగా దీన్ని ధ్వంసం చేసింది.  ఆ తరువాత దీన్ని మళ్లీ నిర్మించారు.. పాత డిజైన్‌లోనే మళ్లీ నిర్మించినా, ఇంటీరియర్‌, ఎక్సీ్టరియర్‌ డిజైనింగ్‌లో మార్పు వచ్చింది. 1829 నాటికి సౌత్‌ పోర్టికో వచ్చేసింది. తూర్పు, పడమరల వైపు విస్తరణ జరిగింది. ఈ ఆల్టరేషన్‌‌స 1948 దాకా జరుగుతూనే వచ్చాయి.  అధ్యక్షుడు మారుతున్న కొద్దీ ఒక్కో మార్పు జరుగుతూ వచ్చింది. 1948 నాటికి కానీ, ఇవాళ మనం చూస్తున్న వైట్‌హౌస్‌ ఒక రూపానికి రాలేదు..

శాండ్‌స్టోన్‌ బిల్డింగ్‌కు 1829లో పునర్నిర్మాణం జరిగిన తరువాత వైట్‌పెయింట్‌ వేశారు. అప్పటి నుంచీ దీన్ని వైట్‌హౌస్‌గా పిలవటం ప్రారంభించారు.
ఇక కోఠీ రెసిడెన్సీ విషయానికి వస్తే, 1798లో హైదరాబాద్‌ కోఠీలో నిర్మించారు. ఇప్పటి వరకూ అందరికీ తెలిసినట్లుగా బ్రిటిష్‌ రెసిడెంట్‌ గవర్నర్‌ జేమ్‌‌స కిర్‌‌కపాట్రిక్‌ తన భార్య ఖైరున్నీసా కోసం నిర్మించారన్నది పచ్చి అబద్ధం.. నిజాం రాజు బ్రిటిష్‌ వాళ్ల దగ్గర తన ప్రాపకాన్ని పెంచుకునేందుకు, వారి నుంచి తన అధికారానికి ఎలాంటి ముప్పు రాకుండా ఉండేందుకు తానే భూమిని సమకూర్చి, తన నిధులతో, తన మనుషులతో  అద్భుతమైన రెసిడెన్సీని నిర్మించి ఇచ్చాడు. దీన్ని ఆ తరువాత బ్రిటిష్‌ రెసిడెన్సీగా పిలిచారు.
నిజానికి వైట్‌హౌస్‌ కోఠీ రెసిడెన్సీ కంటే  ముందే నిర్మించారు. కానీ, మొదట నిర్మించినప్పుడు వైట్‌హౌస్‌ డిజైన్‌ వేరు.. దాని నిర్మాణంలోని తీరు వేరు. 1814లో అది పూర్తిగా తగలబడిపోయిన తరువాత దాని డిజైన్‌ మారిపోయింది. మార్పులు, చేర్పులతో పూర్తిగా కోఠీ రెసిడెన్సీకి కవలగా రూపు మార్చుకుంది.

రెండు నిర్మాణాలకు ఎందుకింత సారూప్యం ఉందంటే అందుకు రీజన్‌ లేకపోలేదు.. మన నిర్మాణ రీతులను అప్పటికే ఐరోపా దేశాలు అనుకరిస్తూ వస్తున్నాయి. చాలా దేశాల్లో ప్రెసిడెన్షియల్‌ భవనాలు కానీ, ఇతర పెద్ద భవనాలు కానీ, భారతీయ నిర్మాణాన్ని పోలి ఉండటం గమనించవచ్చు. బ్రిటిష్‌ రెసిడెన్సీ దగ్గరకు వచ్చేసరికి దీని డిజైనింగ్‌ లండన్‌లో జరిగింది. విచిత్రమేమంటే, ఇక్కడి నిర్మాణశైలిని వంటబట్టించుకున్న తెల్లవాడు, అదే డిజైనింగ్‌ను మళ్లీ నిజాంకు ఇచ్చాడు. అదే శైలిలో రెసిడెన్సీ కట్టారు..

ఇదే సమయంలో వైట్‌హౌస్‌ నిర్మాణానికీ ఐరోపాకు చెందిన డిజైనరే, అంటే ఐరిష్‌ ఆర్కిటెక్‌‌ట హోబన్‌ ప్లాన్‌ వేశారు. దీని రూపురేఖలను మార్చిన థామస్‌ జెఫర్‌సన్‌ అంతకు ముందు ఫ్రాన్‌‌స మినిస్టర్‌గా పనిచేశారు కూడా.. అందుకే వారిపై భారతీయ నిర్మాణాల ప్రభావం ఎక్కువగా పడింది. వైట్‌హౌస్‌ ఆ ప్రభావానికి లోనైన నిర్మాణమే. అచ్చంగా మన రెసిడెన్సీకి కాపీయే. కాకపోతే మన రెసిడెన్సీ ఇవాళ ఓ మహిళా కళాశాలగా మాత్రమే అందరికీ తెలుసు.. సర్కార్లు కళు్ల తెరిస్తే, దాని గొప్పతనం జనం ముందుకు వస్తుంది.

28, అక్టోబర్ 2010, గురువారం

గుండె దిటవుగా ఉంటేనే ధైర్యం.. జారిపోతే...భయం.

అమ్మ కడుపులో ఆటలాడుకుంటున్నప్పుడు ఎంత ఆనందం...
ఆందోళన అంటే ఏమిటో తెలియని ఒక అద్భుతమైన లోకం అమ్మ కడుపు..

ఆ కడుపులోంచి బయట పడినప్పుడు
సడన్‌గా ఏదో శత్రులోకంలోకి వచ్చిన ఫీలింగ్‌
అప్పుడు శిశువు మొదలు పెట్టే ఏడుపు పేరు భయం..

అన్నం తిననంటూ మారాం చేస్తుంటే..
అమ్మ చూపించే బూచీ పేరు భయం..

స్కూలుకు ఎగ్గొట్టినప్పుడు
నాన్న కోపంగా చూసే చూపు పేరు భయం..

హోం వర్క్‌ చేయకపోతే..
మాస్టారు చూపే బెత్తం పేరు భయం..

ఇంటర్‌లో మార్కులు సరిగా రాకపోతే..
అంతా ఏమంటారో అన్న ఆందోళన పేరు భయం...

పెండింగ్‌ వర్క్‌ కంప్లీట్‌ చేయకపోతే
ఆఫీస్‌లో బాస్‌ ఇచ్చే వార్నింగ్‌ పేరు భయం..

అజ్ఞానం, అమాయకత్వం జతకడితే
వెంటాడే అతీంద్రియ శక్తుల పేరు భయం..

వెంటాడే జ్ఞాపకాల నీడ భయం..
చెట్టు భయం..
పుట్ట భయం..
పురుగు భయం..
నీడను చూసినా భయం..
మనిషి మనిషిని చూస్తే భయం...
ఒక నీలి నీడ మిమ్మల్ని అనుక్షణం వెంటాడుతోంది... స్థిమితంగా ఉండనివ్వకుండా కేకలు పెడుతోంది... ఏదో చేసేస్తానంటూ అరుస్తోంది.. నిలుచున్నా, నడుస్తున్నా, కూచున్నా, లేచినా, నిద్రపోతున్నా, కళ్లు తెరిచి ఉన్నా..  వేధిస్తూనే ఉంది.. దాన్ని చూస్తేనే ఉలికిపాటు.. తలుచుకుంటే గగుర్పాటు.. ఆలోచనల్లో అదురుపాటు.. శరీరం చెమటలు కక్కుతోంది.. ఒళ్లు వణికిపోతోంది.. గుండె తన వేగాన్ని పెంచేసింది.. ఊపిరి భారంగా మారిపోయింది.. ఆర్చేవారు లేరు.. తీర్చేవారు లేరు.. ఆ నీడను తరిమేసే వారు లేరు.. అది నీడ కాదు.. దాని పేరు భయం.. భయం...
మానవాళి నెత్తిపై ఇప్పుడు మరో శత్రువు రాజ్యమేలుతోంది... ఇది మానసిక శత్రువు.. ఈ తరాన్ని అదే పనిగా వేధిస్తున్న శత్రువు.. ధైర్యం, సాహసం, నమ్మకం లాంటి పదాలకు చోటు లేని లోకంలో మనుషుల్ని ఆమాంతంగా మింగేస్తోంది.. చిన్నతనంలోనే చిదిమేస్తోంది.. అర్థం లేని కారణాలతో జీవితాల్ని అనర్థంగా నాశనం చేసేస్తోంది...ఎవరీ శత్రువు.. ?

భయం అన్న పదాన్ని కొంత పాలిష్డ్‌గా వాడితే దానిపేరు ఫోబియా...  ప్రతి మనిషి మనసు లోపలి పొరల్లో ఈ ఫోబియా ఏదోరకంగా మనిషిని వెంటాడుతూనే ఉంది.. కారణాలు ఉండవు.. అర్థం ఉండదు.. ఏదో ఆలోచన.. ఏదో సంఘటన... ఒక ఓటమి.. ఈ ఫోబియాను సృష్టిస్తుంది.. పెను భూతంగా మార్చేస్తోంది.. ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది రకరకాల ఫోబియాలతో బాధపడుతున్నారట..
2
ఊహ తెలియని రోజుల్లో  ఏదో చిన్న ఘటన మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది..  పెరిగిన కొద్దీ  ఆ ఘటన మర్చిపోతాం.. ఏం జరిగిందో కూడా మనకు గుర్తుండదు.. కానీ దాని ఛాయలు మాత్రం వెంటాడుతూనే ఉంటుంది.. ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా రూపాల్లో వేటాడుతుంది..
కొందరికి కొన్ని రూపాలను చూస్తే భయం.. కొందరికి కొన్ని ప్రాంతాలకు వెళ్తే భయం.. కొందరికి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినా భయం కలుగుతుంది.. వీటన్నింటికీ కారణాలు ఏమిటి? మెదడులో జరిగే రసాయనిక ప్రక్రియలో సంతులనం తప్పితే వచ్చే అనర్థాలివి...
ప్రతి వాళ్లలోనూ భయం ఛాయలు ఉంటాయి.. ఎవరూ బయటపడరు.. ఎప్పుడూ అవి కనిపించవు.. ఇవి ఉన్నట్లు కూడా వారికి తెలియదు.. చిన్న విషయం పెద్దదై... చూస్తుండగానే భయంకరమైందిగా మారిపోతుంది..
పాలుగారే పిల్లవాడు పరుగులు పెట్టి డాలర్లు సంపాదించాలనే ట్రెండ్‌ ఉన్న సొసైటీ మనది.. ఈ ఒత్తిడి పిల్లలపై పడి.. నూటికి నూరుశాతం మార్కులు రాకపోతే ఏమవుతుందోనన్న టెన్షన్‌ భయంగా మారి డిప్రెషన్‌లోకి వెళ్లిన సందర్భాలు ఎన్నెన్నో.. సరదాగా చదువుకోవాల్సిన పిల్లలు భయంతో చదువుతున్నారు.. ఈ భయం వాళ్లను బలవన్మరణానికి పురికొల్పుతోంది..
నిజానికి ఈ భయం అనవసరమైంది.. కానీ, దీన్ని సృష్టించింది మన సొసైటీయే.. పసివాళ్ల లేత నరాలను చదువు పేరుతో పట్టి పిండేస్తున్నదీ సొసైటీ..

ఆడపిల్లల్లో ఈ ఫోబియా మరీ దారుణం.. చిన్నప్పుడు కుటుంబంలో.. పెద్దయిన కొద్దీ స్కూల్‌లో, ఉద్యోగంలో.. లైంగిక వేధింపులు వాళ్ల మానసిక పరిస్థితిని ఛిద్రం చేస్తుంది.. ఇది పెరుగుతున్న కొద్దీ డిప్రెషన్‌లోకి మారుతుంది.. అర్థంతరంగా జీవితాన్ని ముగించాలన్న భయంకరమైన నిర్ణయాన్ని తీసుకునే స్థితిని కలిపిస్తుంది...
భయం చిన్నగానే మొదలవుతుంది.. అది పెద్దగా మారుతున్నప్పుడే మెదడులో టెన్షన్‌ పెరుగుతుంది.. ఆ ఒత్తిడి నుంచి బయటపడటం అంత తేలికైన విషయం కాదు.
ఏ రకమైన భయం ఎందుకు కలుగుతుందో తెలియని పరిస్థితి... ఈ భయాలు ఎలా ఉంటాయంటే వినటానికి సిల్లీగా.. మనకే నవ్వు వచ్చేలా ఉంటాయి.. కానీ, భయపడుతున్న వ్యక్తికి మాత్రం అది ఒక పెను ముప్పుగా కనిపిస్తుంది.. ప్రపంచంలో ఎన్ని రకాల భయాలు జనాలను వేధిస్తున్నాయో మీకు తెలుసా.. పదివేల వరకూ ఉన్నాయిట..
3
ఫోబియా అనేది విచిత్రం.. దానికి ఎలాంటి కారణాలు ఉండవు.. ఎందుకు కలుగుతుందో తెలియదు.. దానికి చిన్నాపెద్దా తేడా ఉండదు.. ఊహ తెలియని రోజుల్లో ఎప్పుడో ఏదో రకంగా పుట్టిన భయం.. జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది..
మాడొన్నా.. ఆ వంపులు వయ్యారంగా సయ్యాటలాడుతుంటే,  కళ్లల్లో కసి రేపుతుంటే,  కనుగుడ్డు కదిలించకుండా చూడని వాడు ఈ తరంలో ఎవరుంటారు చెప్పండి...
ఇంతటి మడొన్నాకు ఓ ఫోబియా ఉంది.. పది కిలోమీటర్ల దూరంలో పిడుగు పడిన శబ్దం వినిపించినా ఇంతే సంగతులు.. బెడ్‌పై ఎగిరి గంతేసి భయంతో దుప్పటి కప్పేసుకుంటుంది..
నికొల్‌ కిడ్‌మాన్‌..... నాలుగేళ్ల క్రితం ఆస్కార్‌లో హల్‌చల్‌ సృష్టించిన లేడీ బాస్‌.. హాలీవుడ్‌ను ఒక ఊపేసిన బ్యూటీస్టార్‌...

ఈ హాలీవుడ్‌ బ్యూటీకి నేచర్‌లో ఈమెతో పోటీ పడుతున్న బ్యూటీ బటర్‌ఫ్లైస్‌ అంటే చాలా భయం..షూటింగ్‌ స్పాట్‌లో ఒక బటర్‌ఫ్లై కనిపించినా ప్యాకప్పే...
స్కార్లెట్‌ జాన్సన్‌... అమెరికన్‌ బ్యూటీ.. నటి.. సింగర్‌..  ఈ న్యూయార్క్‌ బేబీ అమెరికన్లనే కాదు.. ప్రపంచ ఇంగ్లీష్‌ మూవీ వ్యూయర్స్‌ మనసుల్ని ఇట్టే కొల్లగొట్టేసింది..
ఇంతటి పుత్తడి బొమ్మ దేన్ని చూస్తే భయపడుతుందో తెలుసా.. కాక్రోచెస్‌.. సింపుల్‌గా బొద్దింక.. అది ఏమీ చేయదని తెలుసు.. కానీ, అదంటే మాత్రం ఏదో తెలియని భయం..
బాలీవుడ్‌ సెక్సీగాళ్‌.. కంగనా రనౌత్‌ ... కళ్లతోనే కైపెక్కించే  ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే....
ఇంత గొప్ప స్టార్‌కు కార్‌ లేకుండా ఎలా ఉంటుంది? కానీ, ఆమెకు కారు నడపాలంటే భయం.. కనీసం ముంబైలోని తన ఫ్లాట్‌ ఆవరణలో నడపాలన్నా గువ్వలా వణికిపోతుంది..
బిపాషా బసు.. బాలీవుడ్‌లో సెక్సీలెగ్‌ సుందరి.. ఈ అమ్మడితో నటించేందుకు బాలీవుడ్‌ హీరోలు క్యూ కట్టేస్తారు..
ఈమెకు ఉన్న ఫోబియా ఏంటో తెలుసా... సెల్‌ఫోన్‌లో మాట్లాడటం.. సెల్‌ఫోన్‌ను ముట్టుకోవటం.. ఎవరైనా ఫోన్‌ చేస్తే.. ఎస్‌ఎంఎస్‌ ఇవ్వండి అంటుందిట.. ఆ ఎస్‌ఎంఎస్‌ను సెక్రటరీ చదివి చెప్తే.. అవసరమైతే, ల్యాండ్‌లైన్‌ నుంచి కాల్‌ చేసి జవాబిస్తుందిట..

4
అసలు ఇవన్నీ భయాలేనా? బొద్దింకల్ని, సీతాకోక చిలుకల్ని చూస్తే భయపడటం ఏమిటి? అదే విచిత్రం.. వీటినే ఫోబియాలంటారు... ఎవరికి, దేన్ని చూస్తే, ఎందుకు భయమో అర్థం కాదు.. వారికే తెలియదు.. కారణాలు ఉండవు.. మనసులో ఏదో మూలన నక్కి ఉన్న గుబులు.. ఒక్కసారిగా బయటపడుతుంది.. శరీరంలోని అన్ని నరాలను కుదిపేస్తుంది. బ్రెయిన్‌ను ఇన్‌బ్యాలెన్స్‌ చేస్తుంది.   
ఇరవై ఏళ్ల పాటు ఏ అలజడీ తెలియని ఓ అమ్మాయికి ఒక్కసారిగా ఉలికిపాటు మొదలవుతుంది.. టెలివిజన్‌లో మూవీ మసాలా వస్తోంది. అంతలోనే ఆందోళన.. తన వెనుక ఎవరో ఉన్నారన్న భ్రమ.. వెన్నుపూసలో వణుకు పుట్టిస్తుంది.
ప్రియుడితో సరదాగా కబుర్లు చెప్తుంటే ఏదో దయ్యం తననే చూస్తున్నదన్న ఆలోచన ప్రియురాలికి చెమటలు పట్టిస్తుంది..
.ఒకటి కాదు.. రెండు కాదు.. వేల రకాల భయాలు.. ఫోబియాలు ప్రజల్ని చిత్తడి చేస్తున్నాయి. తన భయానికి పరిష్కారమే లేదన్న ఆందోళన, జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది.. తమలో కలుగుతున్న ఆందోళన ఏమిటని విశ్లేషించుకోలేరు.. తాము ఊహించుకున్నదే కరెక్టని అనుకుంటారు.. ఎవరితోనూ తమ భయాన్ని పంచుకోరు.. ఒకవేళ ఎవరికైనా చెప్పినా.. వారు చెప్పే మంచి మాటలకు అంత తేలిగ్గా కన్విన్స్‌ కారు. ఆ క్షణం వరకు కాస్త కన్విన్స్‌ అయినట్లు కనిపించినా.. లోలోపల గుబులు వెంటాడుతూనే ఉంటుంది.

రకరకాల ఫోబియాలతో బాధ పడుతున్న వారి సంఖ్య మన దేశంలోనే దాదాపు ఆరు కోట్ల మంది దాకా ఉందంట.. అన్నీ ఉన్న అమెరికాలాంటి అగ్రదేశంలోనే ౫౦ లక్షల మంది ఈ ఫోబియాలతో అల్లాడిపోతుంటే ఇక మన దేశం సంగతి చెప్పేదేముంది?
ఆడపిల్లల్లో చిన్ననాట లైంగిక వేధింపులకు గురైతే.. దాని భయం.. పెద్దయ్యాక పడకగదిలో కూడా వెంటాడుతుంది..వింత వింతగా ప్రవర్తిస్తారు.. కారణాలు తెలియక, సరైన కౌన్సిలింగ్‌ చేయలేకపోవటం మహిళల పట్ల సమస్యాత్మకంగా మారుతోంది..
ఫోబియా.. భయం.. ఇదేమీ చిన్న విషయం కాదు.. అలా అని నిజంగా భయపడి పారిపోయేంత పెద్ద విషయమూ కాదు.. మనిషి లోపలి పొరల్లో దాక్కున్న దౌర్బల్యం అతణ్ణి ఫోబియా ఊబిలోకి కూరుకుపోయేలా చేస్తోంది.. అందుకే గుండె దిటవుగా ఉంటేనే ధైర్యం.. అది జారిపోతే....అదే భయం.

30, సెప్టెంబర్ 2010, గురువారం

వివాదాస్పద స్థలం రాముడిదే-ఇవిగో తీర్పు కాపీలు

రామజన్మభూమి పై అలహాబాద్‌ హైకోర్టు ఊహించిన తీర్పునే వెలువరించింది.. అన్ని పక్షాలను కొంత వరకు సంతృప్తి పరిచే విధంగా ఉండేలా న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. అత్యంత కీలకమైన అంశం ఏమంటే, రామ్‌లల్లా విగ్రహాలు ఉన్న వివాదాస్పద స్థలాన్ని రాముడు జన్మించిన భూమిగా న్యాయమూర్తులు ఏకగ్రీవంగా అంగీకరించటం. కోట్లాది హిందువుల విశ్వాసాన్ని అలహాబాద్‌ హైకోర్టు నిర్ద్వంద్వంగా బలపరిచింది. వివాదాస్పద స్థలంలో రామ్‌లల్లా విగ్రహాలను తొలగించకూడదంటూనే, వివాదంలో ఉన్న ౨ ఎకరాల ౭౨ గుంటల స్థలాన్ని మూడు భాగాలుగా విభజించాలంటూ తీర్పు చెప్పింది.. సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకోవటానికి మరో మూడు నెలలు గడువిచ్చింది. ఈ మూడు నెలలు అయోధ్యలో స్టేటస్‌కో ఉండాలని తీర్పు చెప్పింది.
ఇవిగో తీర్పు కాపీలు
అయోధ్య తీర్పు హైలైట్స్
బ్రీఫ్ జడ్జిమెంట్ కాపీ

10, ఆగస్టు 2010, మంగళవారం

సాగిపోయిన సంపద్విమర్శ..

ప్రముఖ సాహితీ వేత, కవి, విమర్శకుడు ఆచార్య కోవెల సంపత్కుమారా చార్య గత గురువారం కన్నుమూశారు.. ఈ వార్త ఆలస్యంగా చెప్తున్నందుకు మన్నించాలి.. కర్మ, ఇతర కార్యక్రమాల్లో ఉండటం వల్ల చెప్పలేకపోయాను.. నిన్నటి నుంచే రొటీన్‌ కార్యక్రమాల్లో పడ్డాను.. సంపత్కుమార వయస్సు ౭౭ సంవత్సరాలు.. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.. చిట్టిగూడూరు ప్రాచ్యకళాశాలలో, సంస్కృత ప్రాకృతాలను అధ్యయనం చేసి భాషాప్రవీణ సాధించిన సంపత్కుమార పలు కళాశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేశారు.. తరువాత కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు.. ౧౯౫౪లో తన అన్నగారి అబ్బాయి, సుప్రసన్నతో కలిసి హృద్గీత కావ్యాన్ని జంటకవులుగా ప్రచురించారు.. దీనికి కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ముందుమాట రాయటం విశేషం.. సుప్రసన్న శ్రీఅరవిందులు, వివేకానందులు, రామకృష్ణులు, రమణ మహర్షి వంటి తాత్త్వికుల కోవలో ముందుకు వెళ్తే.. సంపత్కుమార సంప్రదాయ ఉదార శ్రీవైష్ణవం ద్వారా ముందుకు వెళ్లారు.. అపర్ణ, ఆముక్త వంటి కావ్యాలు ఆయన రచనల్లో ప్రముఖమైనవి.౧౯౬౦లలో ఆంధ్ర సాహిత్య అకాడమీ చందస్సు మీద పోటీలు నిర్వహించింది. ఈ పోటీలకు మూడు గ్రంథాలు వచ్చాయి. అందులో సంపత్కుమార చందో వికాసం ఒకటి.. న్యాయ నిర్ణేతల్లో ఒకరైన అబ్బూరి రామకృష్ణారావుగారికి చందో వికాసం నచ్చినప్పటికీ, అప్పటికే ఈ రంగంలో అద్భుతమైన కృషి చేసిన, వయసులో పెద్దవారైన శ్రీ గిడుగు సీతాపతి గారికి బహుమతిని ఇచ్చారు. అయితే, సంపత్కుమార చందోవికాసాన్ని సాహిత్య అకాడమీ ఆర్థికసాయం చేసి అచ్చు వేయించింది. విశ్వనాథ సాన్నిహిత్యం వీరి సాహిత్యమార్గాన్ని విరిదారిగా మార్చింది.. ఆయన విమర్శ అపురూపం.. అన్ని ప్రక్రియలపైనా  సాధికారికంగా విమర్శించగలిగిన పండితుడు.. అలంకార శాస్త్రం, చందః శాస్త్రంపై సమకాలీనుల్లో  సంపత్కుమారది అగ్రస్థానం. గుప్తాఫౌండేషన్‌ అవార్డు, రాజీవ్‌ ప్రతిభా పురస్కారం, దాశరథి అవార్డు వంటివి ఎన్నెన్నో సంపత్కుమారను వరించాయి. విశ్వనాథ వారి అసంకలిత సాహిత్య రచనలను ఆరు సంపుటాలుగా వెలుగులోకి తీసుకురావటంలో సంపత్కుమార, సుప్రసన్నల కృషి ప్రధానమైంది.. వీరి ప్రయత్నం సాగకపోతే, అమూల్య సాహిత్య భాండాగారం వెలుగులోకి వచ్చేది కాదు..

26, జులై 2010, సోమవారం

గుండె దిటవుగా ఉంటేనే ధైర్యం.. అది జారిపోతే...

ఒక నీలి నీడ మిమ్మల్ని అనుక్షణం వెంటాడుతోంది... స్థిమితంగా ఉండనివ్వకుండా కేకలు పెడుతోంది... ఏదో చేసేస్తానంటూ అరుస్తోంది.. నిలుచున్నా, నడుస్తున్నా, కూచున్నా, లేచినా, నిద్రపోతున్నా, కళ్లు తెరిచి ఉన్నా.. వేధిస్తూనే ఉంది.. దాన్ని చూస్తేనే ఉలికిపాటు.. తలుచుకుంటే గగుర్పాటు.. ఆలోచనల్లో అదురుపాటు.. శరీరం చెమటలు కక్కుతోంది.. ఒళ్లు వణికిపోతోంది.. గుండె తన వేగాన్ని పెంచేసింది.. ఊపిరి భారంగా మారిపోయింది.. ఆర్చేవారు లేరు.. తీర్చేవారు లేరు.. ఆ నీడను తరిమేసే వారు లేరు.. అది నీడ కాదు.. దాని పేరు భయం..

మానవాళి నెత్తిపై ఇప్పుడు భయం మరో శత్రువుగా రాజ్యమేలుతోంది... ఇది మానసిక శత్రువు.. ఈ తరాన్ని అదే పనిగా వేధిస్తున్న శత్రువు.. ధైర్యం, సాహసం, నమ్మకం లాంటి పదాలకు చోటు లేని లోకంలో మనుషుల్ని ఆమాంతంగా మింగేస్తోంది.. చిన్నతనంలోనే చిదిమేస్తోంది.. అర్థం లేని కారణాలతో జీవితాల్ని అనర్థంగా నాశనం చేసేస్తోంది...
--------------1----------------
అమ్మ కడుపులో ఆటలాడుకుంటున్నప్పుడు ఎంత ఆనందం...
ఆందోళన అంటే ఏమిటో తెలియని ఒక అద్భుతమైన లోకం అమ్మ కడుపు..
ఆ కడుపులోంచి బయట పడినప్పుడు
సడన్‌గా ఏదో శత్రులోకంలోకి వచ్చిన ఫీలింగ్‌
అప్పుడు శిశువు మొదలు పెట్టే ఏడుపు పేరు భయం..

అన్నం తిననంటూ మారాం చేస్తుంటే..
అమ్మ చూపించే బూచీ పేరు భయం..

స్కూలుకు ఎగ్గొట్టినప్పుడు
నాన్న కోపంగా చూసే చూపు పేరు భయం..

హోం వర్క్‌ చేయకపోతే..
మాస్టారు చూపే బెత్తం పేరు భయం..

ఇంటర్‌లో మార్కులు సరిగా రాకపోతే..
అంతా ఏమంటారో అన్న ఆందోళన పేరు భయం...

పెండింగ్‌ వర్క్‌ కంప్లీట్‌ చేయకపోతే
ఆఫీస్‌లో బాస్‌ ఇచ్చే వార్నింగ్‌ పేరు భయం..

అజ్ఞానం, అమాయకత్వం జతకడితే
వెంటాడే అతీంద్రియ శక్తుల పేరు భయం..

వెంటాడే జ్ఞాపకాల నీడ భయం..
చెట్టు భయం..
పుట్ట భయం..
పురుగు భయం..
నీడను చూసినా భయం..
మనిషి మనిషిని చూస్తే భయం...
-----------2-----------
భయం అన్న పదాన్ని కొంత పాలిష్డ్‌గా వాడితే దానిపేరు ఫోబియా... ప్రతి మనిషి మనసు లోపలి పొరల్లో ఈ ఫోబియా ఏదోరకంగా మనిషిని వెంటాడుతూనే ఉంది.. కారణాలు ఉండవు.. అర్థం ఉండదు.. ఏదో ఆలోచన.. ఏదో సంఘటన... ఒక ఓటమి.. ఈ ఫోబియాను సృష్టిస్తుంది.. పెను భూతంగా మార్చేస్తోంది.. ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది రకరకాల ఫోబియాలతో బాధపడుతున్నారట.
ఊహ తెలియని రోజుల్లో ఏదో చిన్న ఘటన మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.. పెరిగిన కొద్దీ ఆ ఘటన మర్చిపోతాం.. ఏం జరిగిందో కూడా మనకు గుర్తుండదు.. కానీ దాని ఛాయలు మాత్రం వెంటాడుతూనే ఉంటుంది.. ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా రూపాల్లో వేటాడుతుంది..

కొందరికి కొన్ని రూపాలను చూస్తే భయం.. కొందరికి కొన్ని ప్రాంతాలకు వెళ్తే భయం.. కొందరికి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినా భయం కలుగుతుంది.. వీటన్నింటికీ కారణాలు ఏమిటి? మెదడులో జరిగే రసాయనిక ప్రక్రియలో సంతులనం తప్పితే వచ్చే అనర్థాలివి...

ప్రతి వాళ్లలోనూ భయం ఛాయలు ఉంటాయి.. ఎవరూ బయటపడరు.. ఎప్పుడూ అవి కనిపించవు.. ఇవి ఉన్నట్లు కూడా వారికి తెలియదు.. చిన్న విషయం పెద్దదై... చూస్తుండగానే భయంకరమైందిగా మారిపోతుంది..

పాలుగారే పిల్లవాడు పరుగులు పెట్టి డాలర్లు సంపాదించాలనే ట్రెండ్‌ ఉన్న సొసైటీ మనది.. ఈ ఒత్తిడి పిల్లలపై పడి.. నూటికి నూరుశాతం మార్కులు రాకపోతే ఏమవుతుందోనన్న టెన్షన్‌ భయంగా మారి డిప్రెషన్‌లోకి వెళ్లిన సందర్భాలు ఎన్నెన్నో.. సరదాగా చదువుకోవాల్సిన పిల్లలు భయంతో చదువుతున్నారు.. ఈ భయం వాళ్లను బలవన్మరణానికి పురికొల్పుతోంది..

నిజానికి ఈ భయం అనవసరమైంది.. కానీ, దీన్ని సృష్టించింది మన సొసైటీయే.. పసివాళ్ల లేత నరాలను చదువు పేరుతో పట్టి పిండేస్తున్నదీ సొసైటీ..

ఆడపిల్లల్లో ఈ ఫోబియా మరీ దారుణం.. చిన్నప్పుడు కుటుంబంలో.. పెద్దయిన కొద్దీ స్కూల్‌లో, ఉద్యోగంలో.. లైంగిక వేధింపులు వాళ్ల మానసిక పరిస్థితిని ఛిద్రం చేస్తుంది.. ఇది పెరుగుతున్న కొద్దీ డిప్రెషన్‌లోకి మారుతుంది.. అర్థంతరంగా జీవితాన్ని ముగించాలన్న భయంకరమైన నిర్ణయాన్ని తీసుకునే స్థితిని కలిపిస్తుంది...
భయం చిన్నగానే మొదలవుతుంది.. అది పెద్దగా మారుతున్నప్పుడే మెదడులో టెన్షన్‌ పెరుగుతుంది.. ఆ ఒత్తిడి నుంచి బయటపడటం అంత తేలికైన విషయం కాదు.
----------------3----------------------
ఏ రకమైన భయం ఎందుకు కలుగుతుందో తెలియని పరిస్థితి... ఈ భయాలు ఎలా ఉంటాయంటే వినటానికి సిల్లీగా.. మనకే నవ్వు వచ్చేలా ఉంటాయి.. కానీ, భయపడుతున్న వ్యక్తికి మాత్రం అది ఒక పెను ముప్పుగా కనిపిస్తుంది.. ప్రపంచంలో ఎన్ని రకాల భయాలు జనాలను వేధిస్తున్నాయో మీకు తెలుసా.. పదివేల వరకూ ఉన్నాయిట..
ఫోబియా అనేది విచిత్రం.. దానికి ఎలాంటి కారణాలు ఉండవు.. ఎందుకు కలుగుతుందో తెలియదు.. దానికి చిన్నాపెద్దా తేడా ఉండదు.. ఊహ తెలియని రోజుల్లో ఎప్పుడో ఏదో రకంగా పుట్టిన భయం.. జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది..
మాడొన్నా.. ఆ వంపులు వయ్యారంగా సయ్యాటలాడుతుంటే, కళ్లల్లో కసి రేపుతుంటే, కనుగుడ్డు కదిలించకుండా చూడని వాడు ఈ తరంలో ఎవరుంటారు చెప్పండి...
ఇంతటి మడొన్నాకు ఓ ఫోబియా ఉంది.. పది కిలోమీటర్ల దూరంలో పిడుగు పడిన శబ్దం వినిపించినా ఇంతే సంగతులు.. బెడ్‌పై ఎగిరి గంతేసి భయంతో దుప్పటి కప్పేసుకుంటుంది..
నికొల్‌ కిడ్‌మాన్‌..... నాలుగేళ్ల క్రితం ఆస్కార్‌లో హల్‌చల్‌ సృష్టించిన లేడీ బాస్‌.. హాలీవుడ్‌ను ఒక ఊపేసిన బ్యూటీస్టార్‌...
ఈ హాలీవుడ్‌ బ్యూటీకి నేచర్‌లో ఈమెతో పోటీ పడుతున్న బ్యూటీ బటర్‌ఫ్లైస్‌ అంటే చాలా భయం..షూటింగ్‌ స్పాట్‌లో ఒక బటర్‌ఫ్లై కనిపించినా ప్యాకప్పే...
స్కార్లెట్‌ జాన్సన్‌... అమెరికన్‌ బ్యూటీ.. నటి.. సింగర్‌.. ఈ న్యూయార్క్‌ బేబీ అమెరికన్లనే కాదు.. ప్రపంచ ఇంగ్లీష్‌ మూవీ వ్యూయర్స్‌ మనసుల్ని ఇట్టే కొల్లగొట్టేసింది..
ఇంతటి పుత్తడి బొమ్మ దేన్ని చూస్తే భయపడుతుందో తెలుసా.. కాక్రోచెస్‌.. సింపుల్‌గా బొద్దింక.. అది ఏమీ చేయదని తెలుసు.. కానీ, అదంటే మాత్రం ఏదో తెలియని భయం..
బాలీవుడ్‌ సెక్సీగాళ్‌.. కంగనా రనౌత్‌ ... కళ్లతోనే కైపెక్కించే ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే....
ఇంత గొప్ప స్టార్‌కు కార్‌ లేకుండా ఎలా ఉంటుంది? కానీ, ఆమెకు కారు నడపాలంటే భయం.. కనీసం ముంబైలోని తన ఫ్లాట్‌ ఆవరణలో నడపాలన్నా గువ్వలా వణికిపోతుంది..
బిపాషా బసు.. బాలీవుడ్‌లో సెక్సీలెగ్‌ సుందరి.. ఈ అమ్మడితో నటించేందుకు బాలీవుడ్‌ హీరోలు క్యూ కట్టేస్తారు..
ఈమెకు ఉన్న ఫోబియా ఏంటో తెలుసా... సెల్‌ఫోన్‌లో మాట్లాడటం.. సెల్‌ఫోన్‌ను ముట్టుకోవటం.. ఎవరైనా ఫోన్‌ చేస్తే.. ఎస్‌ఎంఎస్‌ ఇవ్వండి అంటుందిట.. ఆ ఎస్‌ఎంఎస్‌ను సెక్రటరీ చదివి చెప్తే.. అవసరమైతే, ల్యాండ్‌లైన్‌ నుంచి కాల్‌ చేసి జవాబిస్తుందిట..
----------------------4---------
అసలు ఇవన్నీ భయాలేనా? బొద్దింకల్ని, సీతాకోక చిలుకల్ని చూస్తే భయపడటం ఏమిటి? అదే విచిత్రం.. వీటినే ఫోబియాలంటారు... ఎవరికి, దేన్ని చూస్తే, ఎందుకు భయమో అర్థం కాదు.. వారికే తెలియదు.. కారణాలు ఉండవు.. మనసులో ఏదో మూలన నక్కి ఉన్న గుబులు.. ఒక్కసారిగా బయటపడుతుంది.. శరీరంలోని అన్ని నరాలను కుదిపేస్తుంది. బ్రెయిన్‌ను ఇన్‌బ్యాలెన్స్‌ చేస్తుంది.
ఇరవై ఏళ్ల పాటు ఏ అలజడీ తెలియని ఓ అమ్మాయికి ఒక్కసారిగా ఉలికిపాటు మొదలవుతుంది.. టెలివిజన్‌లో మూవీ మసాలా వస్తోంది. అంతలోనే ఆందోళన.. తన వెనుక ఎవరో ఉన్నారన్న భ్రమ.. వెన్నుపూసలో వణుకు పుట్టిస్తుంది.
ప్రియుడితో సరదాగా కబుర్లు చెప్తుంటే ఏదో దయ్యం తననే చూస్తున్నదన్న ఆలోచన ప్రియురాలికి చెమటలు పట్టిస్తుంది..
ఒకటి కాదు.. రెండు కాదు.. వేల రకాల భయాలు.. ఫోబియాలు ప్రజల్ని చిత్తడి చేస్తున్నాయి. తన భయానికి పరిష్కారమే లేదన్న ఆందోళన, జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది.. తమలో కలుగుతున్న ఆందోళన ఏమిటని విశ్లేషించుకోలేరు.. తాము ఊహించుకున్నదే కరెక్టని అనుకుంటారు.. ఎవరితోనూ తమ భయాన్ని పంచుకోరు.. ఒకవేళ ఎవరికైనా చెప్పినా.. వారు చెప్పే మంచి మాటలకు అంత తేలిగ్గా కన్విన్స్‌ కారు. ఆ క్షణం వరకు కాస్త కన్విన్స్‌ అయినట్లు కనిపించినా.. లోలోపల గుబులు వెంటాడుతూనే ఉంటుంది.రకరకాల ఫోబియాలతో బాధ పడుతున్న వారి సంఖ్య మన దేశంలోనే దాదాపు ఆరు కోట్ల మంది దాకా ఉందంట.. అన్నీ ఉన్న అమెరికాలాంటి అగ్రదేశంలోనే ౫౦ లక్షల మంది ఈ ఫోబియాలతో అల్లాడిపోతుంటే ఇక మన దేశం సంగతి చెప్పేదేముంది?
ఆడపిల్లల్లో చిన్ననాట లైంగిక వేధింపులకు గురైతే.. దాని భయం.. పెద్దయ్యాక పడకగదిలో కూడా వెంటాడుతుంది..వింత వింతగా ప్రవర్తిస్తారు.. కారణాలు తెలియక, సరైన కౌన్సిలింగ్‌ చేయలేకపోవటం మహిళల పట్ల సమస్యాత్మకంగా మారుతోంది..
ఫోబియా.. భయం.. ఇదేమీ చిన్న విషయం కాదు.. అలా అని నిజంగా భయపడి పారిపోయేంత పెద్ద విషయమూ కాదు.. మనిషి లోపలి పొరల్లో దాక్కున్న దౌర్బల్యం అతణ్ణి ఫోబియా ఊబిలోకి కూరుకుపోయేలా చేస్తోంది.. అందుకే గుండె దిటవుగా ఉంటేనే ధైర్యం.. అది జారిపోతే............అదే భయం..

3, జులై 2010, శనివారం

ఆ క్షణంలో ఏం జరుగుతుంది..?

జీవితం మీద విసుగు... లోకం మీద ఆగ్రహం.. అంతా ఉండి ఎవరూ లేనితనం.. చీకటి తప్ప వెలుతురు కనపడని భవిష్యత్తు.. ఒకే ఒక్క క్షణం.. నిస్సహాయత ఆవరిస్తుంది... వ్యక్తిత్వాన్ని నిర్వీర్యం చేస్తుంది.. ఆలోచనలని చంపేస్తుంది.. బలవంతంగా లోకం నుంచి వెళ్లిపోవాలన్న నిర్ణయానికి ఉసికొల్పుతుంది.. ఆ క్షణం ఎంత భయంకరం?


చేతికొచ్చిన పంట వరదల పాలైన క్షణం... ముప్పిరిగొన్న అప్పులు.. రైతు మెడకు ఉరిగా మారింది...

ప్రియుడి వంచనను తట్టుకోలేక ప్రేయసి మనసు నిస్తేజమైపోయింది..

కార్పొరేట్‌ చదువుల ఒత్తిడిని భరించలేని పసి హృదయం వికలమైపోయింది.

ఆర్థిక బాధలు కుటుంబ పెద్దను పిల్లలకు దూరం చేశాయి.

చుట్టూ సమస్యలు.. కనిపించని పరిష్కారం.. సాయం చేయని చేతులు.. జీవితాన్ని ఎలా గడపాలో తెలియదు.... భవిష్యత్తు ఏమిటో అంతుపట్టదు..ప్రపంచం అంత కుటుంబం ఉన్నా... ఒంటరితనం నీడలా వెంటాడుతుంది...నరాలు తెగిపోయేంత టెన్షన్‌... ఇక ఈ ప్రపంచంలో తనకేమీ మిగల్లేదు.. తాను బతికి ఉన్నా, లేకపోయినా ఒకటే... ఇక చావును ఆశ్రయించటమొక్కటే మార్గం... అదొక్కటే దారి.. చివరకు మిగిలేది ఈ చావే... చావే..

ఒక్క క్షణం, ఆ ఒక్క క్షణం జీవితంలో అత్యంత భయంకరమైన క్షణం. జీవితాన్ని నిలువునా దహించి వేసే క్షణం.. ఏం ఆలోచించినా చావే పరిష్కారంగా తోస్తుంది.. ఏ పని చేసినా నీరసం ఆవహిస్తుంది.. అనుక్షణం అదే ఆలోచన వెంటాడి వేధిస్తుంటుంది.. ఎవరితో ఏమీ చెప్పుకోలేని దారుణమైన నిశ్శబ్దం బలవన్మరణం వైపు లాక్కుపోతుంది...
ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి రావడం కోసం ఒకే ఒక్క క్షణం చాలు.. ఆ ఒక్క క్షణం ఆ ఒక్క ఆలోచన మెదడును పనిచేయకుండా అడ్డుకుంటుంది.. ముందుగా మెదడును చంపేస్తుంది.. ఆ తరువాత మనిషిని హతమారుస్తుంది...

మనిషిని శాశ్వతంగా మాయం చేసేది ఆ క్షణం.. ఆ ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చేందుకు తోడెవరూ ఉండరు.. ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత వ్యక్తి తనంత తానుగా ఒంటరితనంలోకి జారుకుంటాడు.. ఆ ఒంటరితనాన్నే నిరంతరం వెంటబెట్టుకుంటాడు.. నీడలా వెంటాడే ఆ ఒంటరితనం కొంత కాలానికి వ్యక్తిని పూర్తిగా కమ్మేస్తుంది.. చివరకు అదే డామినేట్‌ చేస్తుంది.. తన వెంటబెట్టుకుని కానరాని లోకాలకు తీసుకువెళ్తుంది..
-----2------
ఒక్కసారి ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచన వచ్చిన తరువాత మనిషి పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు.. ఎవరితోనూ మాట్లాడడు.. మనసులో చెలరేగుతున్న కల్లోలాన్ని ఏ ఒక్కరితోనూ పంచుకోడు.. చనిపోవాలన్న నిర్ణయానికి వచ్చినప్పటి నుంచి చనిపోవటానికి పూనుకునేంత వరకు మనసు అల్లకల్లోలంగా ఉంటుంది.. మానసిక వేదన అంతుపట్టని తీరులో ఊహకందదు... చివరకు ఉరి వేసుకోవటమో.. పురుగు మందు తాగిన తరువాతో ఒక్కుదుటున మనసులో మార్పు కనిపిస్తుంది.. అప్పుడు బతకాలన్నా బతకలేని పరిస్థితి.. ఎవరూ వచ్చి కాపాడలేని దుస్థితి.. ఆ క్షణంలో ఏం జరుగుతుంది..?
అదొక విచిత్రమైన పరిస్థితి... మానసికంగా కృంగిపోయిన మనిషి.. తనను తాను అంతం చేసుకుంటున్న దుస్థితి.. బలవన్మరణానికి పూనుకునేందుకు కొద్ది నిమిషాల ముందు మనిషి ఆలోచనలు చాలా ఆవేశంగా ఉంటాయి.. కూల్‌గా ఆలోచించే పరిస్థితి ఉండదు.. మెదడులోని అన్ని నరాలు ఎప్పుడు తెగిపోదామా అన్న స్థాయిలో కదిలిపోతుంటాయి.. బాధల్లోంచి కమ్ముకొచ్చిన డిప్రెషన్‌ కనీవినీ ఎరుగని దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది.. ఆ కొద్ది నిమిషాల్లో ఎన్నో ఆలోచనలు.. ఎంతో ఆవేదన.. ఎవరికీ ఏమీ చేయలేకపోయానన్న బాధ.. ఏమీ సాధించలేకపోయానన్న ఆందోళన.. అన్నీ కలిపి వ్యక్తిని చావు వైపు బలవంతంగా లాక్కుపోతుంది...

చనిపోదామని నిర్ణయించుకున్న తరువాత అందరికీ దూరంగా ఉండటం సహజంగానే జరుగుతుంది.. ఒంటరిగా, దూరంగా ఎవరికీ చెప్పకుండా బలవంతంగా మరణాన్ని కొని తెచ్చుకుంటారు.. ఆ క్షణంలో ఏం జరుగుతుంది..?

మెడకు ఉరి బిగుసుకుంది.. ఇక చావు ఎంతో దూరంలో లేదు.. అయిదు సెకన్లో.. ఆరో సెకన్లో... లేక పది సెకన్లు మాత్రమే మిగిలి ఉంది...
పురుగుల మందు, లేక విషం గొంతులోకి దిగింది.. ఒక్కో బొట్టు నరనరాల్లోకి పాకుతోంది.. ముందుగా మెదడులోకి ప్రసరిస్తుంది... చావు దగ్గర పడింది.. ముఫ్ఫై సెకన్లో, నలభై సెకన్లో మిగిలి ఉంది.. శరీరం దృఢమైంది అయితే, రెండు మూడు నిమిషాల సమయం మిగులుతుంది..

యాభై నిద్రమాత్రలు శరీరంలోకి ఒకేసారి వెళ్లిపోయాయి... ఒక్కో మాత్ర రక్తంలో కరిగిపోతోంది.. శరీరంపైకి నిద్ర కమ్ముకుంటూ వస్తోంది.. క్రమంగా మగతలోకి జారుకుంటున్న పరిస్థితి.. అయిదారు నిమిషాల్లో అంతా అయిపోతుంది....

ఆ కొద్ది క్షణాల్లో.. కొన్ని నిమిషాల్లో బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తి ఆలోచనల్లో ఒక్కసారిగా మార్పు వచ్చేస్తుంది.. తాను తొందరపడ్డానన్న భావన ఒంట్లో గగుర్పాటు కలిగిస్తుంది.. ఎన్నెన్ని ఆలోచనలు ఒక్కసారిగా కమ్ముకుంటూ వచ్చేస్తాయి.. తన కుటుంబం గుర్తుకు వస్తుంది.. బంధువులు గుర్తుకు వస్తారు.. మిత్రులు గుర్తుకువస్తారు..
ఎలా.. ఏం చేయాలి.. ఒకే ఒక్క క్షణంలో తాను బతకాలి.. బతికి తీరాలి...అన్న ఆలోచన వచ్చేస్తుంది.. కానీ, ఎవరు కాపాడగలరు? బతకాలన్నా బ్రతికేది ఎలా? తాను ఒంటరిగా ఉన్నాడు.. చుట్టూ ఎవరూ లేరు.. కొన్నే కొన్ని క్షణాలు.. వేగంగా గడిచిపోతుంటే శరీరం నిస్తేజమైపోతుంటే.. ఎవరైనా వచ్చి కాపాడితే బాగుండునన్న ఆలోచన కలచివేస్తూనే హృదయ స్పందన ఆగిపోతుంది..
ఎంత భయంకరమైన పరిస్థితి. శత్రువుకైనా రాకూడదనుకునే క్షణాలివి.. ఆ క్షణంలో బలవన్మరణానికి పూనుకోక ముందు ఒక్కరితో తన భావాలను ఒక్కసారి పంచుకున్నా, వ్యక్తిలో మార్పు వస్తుంది.. ఆ ఒక్క క్షణం కూల్‌గా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు..?
--------3--------
అవును ఎందుకు అలోచించలేకపోతున్నారు..? చనిపోవాలనుకున్నప్పుడు క్షణికంగా నిర్ణయం తీసుకున్న వాళ్లు విషం లోపలికి దిగుతున్నప్పటి నుంచి ఏదో తప్పు చేశామన్న భావనలో కుమిలిపోవటం ప్రారంభిస్తారు.. అదృష్టవశాత్తూ బతికి బట్టకడితే అప్పుడు వాళ్ల మానసిక పరిస్థితిని మాటల్లో చెప్పటం సాధ్యం కాదు.. ఇందుకు ఓ ఉదాహరణ చూడండి.. కడప జిల్లాలో రమేశ్‌ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు..అతని పరిస్థితి ఏమిటో చూడండి..

రమేశ్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్లు రాస్తాడు...

అప్పులు.. ఆర్థిక బాధలు అతన్ని చిత్రహింసలకు గురి చేశాయి..

చావు తప్ప గత్యంతరం కనిపించలేదు..

ఆలోచనలు మరిచాడు..

విషం తీసుకున్నాడు

ఒంట్లో నరనరాల్లో మంట రేగినప్పుడు మొదలైంది పశ్చాత్తాపం..

భార్యాపిల్లల కోసమైనా బతకాలని, ఎవరైనా బతికించాలని కోరుకున్నాడు..

ఆ బాధ అతనికి తప్ప మరెవరికీ అర్థంకానిది..చెప్పటానికి కూడా శక్యం కానిది..

అదృష్టవశాత్తూ సమయానికి వైద్యం అందడంతో బతికాడు..
దగ్గరకు తెచ్చుకున్న చావును దూరం తరిమాడు..

ఇతను కేవలం ఒక ఉదాహరణ.. ఇలాంటి వారిలో బతికి బట్టకట్టేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఆత్మహత్యకు పూనుకున్నప్పుడు ఉండే సమయం తక్కువ.. రక్షించే అవకాశాలు తక్కువ.. ఇలాంటి తక్కువ అవకాశాల్లో ప్రాణాలతో బయటపడిన వాళ్లు నిజంగా కోరుకునేది ఒక్కటే.. తనలాగా ఎవరికీ చావు రాకూడదని.. ఎవరూ తనలాగా బతికుండగానే నరకం అనుభవించరాదని...
------------4--------------
పురుగుల మందు తాగితే, విషం మింగితే, ఆ క్షణంలో ఏం జరుగుతుంది.. ఎలా ఉంటుంది.. పరిస్థితి తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చివరి నిమిషంలో ఎవరైనా గుర్తించి ఆసుపత్రికి తరలించి బతికించగలిగితే.. అప్పటికైతే బయటపడవచ్చు.. కానీ, ప్రాణాపాయం తప్పినట్లేనా? కాదు.. అపాయం నీడలా వెంటాడుతూనే ఉంటుంది.. స్లో పాయిజన్‌ మృత్యువును తోడు తీసుకుని కబళించేందుకు సిద్ధంగా ఉంటుంది..

గాఢమైన సాంద్రత కలిగిన రసాయనాలు కలిసిన పురుగుల మందులు, పేస్మాల్‌, హెయిర్‌ డై, ఇతర విష వస్తువులు తాగిన వారికి చాలా తక్కువ సమయం ఉంటుంది. శరీరంలో నరనరానా ప్రసరిస్తున్నప్పుడు వెయ్యి తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. ఎందుకు మందు తాగానురా అని అనిపిస్తుంది.. భయమేస్తుంది. దీన్నుంచి ఎలా బయటపడాలా అని ఆరాటం మొదలవుతుంది..

ఆ క్షణాల్లో పరిస్థితి చెప్పనలవి కానిది.. ఆవేశంగానో, అనాలోచితంగానో చావాలనే నిర్ణయం తీసకున్న అజ్ఞానులు విషపూరిత రసాయనాలు సేవిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.. పురుగు మందుల కంటే హెయిర్‌డై చాలా డేంజర్‌, దాని కంటే పెస్మాల్‌ చావక ముందే నరకాన్ని చూపిస్తుంది.

ఈ విష రసాయనాలు సేవించిన వాళ్లకు మొట్టమొదట గొంతువాపు వస్తుంది.
తరువాత నాలుక పిడచకట్టుకుపోతుంది.
క్రమంగా గొంతులోపలికి దిగిపోతుంది..
రక్తకణాల్లోకి ప్రసరిస్తుంది..
గుండెకు, కిడ్నీలను వెంటనే ప్రభావితం చేస్తుంది.
ఇంకేం.. ఊపిరి పీల్చుకోవటం కష్టంగా మారుతుంది..
వెంటనే ఆపరేషన్‌ చేయకపోతే అంతే సంగతులు..ఆసుపత్రిలో ట్యూబ్‌ ద్వారా కృత్రిమ శ్వాసను అందిస్తారు.. అయితే మోతాదుకు మించి పురుగుమందులు తాగినా, బలహీనమైన శరీరం ఉన్నా.. వైరస్‌ అటాక్‌ తప్పదు.
ఈ విష ప్రభావం వల్ల యూరిన్‌ రంగు మారుతుంది. తొందరగా చనిపోయే అవకాశం ఉంది.. విషం తీసుకున్న వెంటనే ఆసుపత్రికి తరలిస్తే బతికించేందుకు అవకాశాలు ఉండవచ్చు. వైద్యులు రకరకాల ప్రయత్నాలు చేసి తాగిన విషాన్ని కక్కిస్తారు.. ప్రాణాలను దక్కిస్తారు..
కానీ, అలా బతికినంత మాత్రాన ఆ తరువాత అంతా సవ్యంగా సాగుతుందా? అంటే అదీ లేదు.. ఒకసారి విషం శరీరంలోకి వెళ్లిన తరువాత దాన్ని ఎంత వెలుపలికి తీసినా, చివరలో ఒక్క కణమైనా శరీరంలో ఉండిపోతుంది.. దాని ప్రభావం జీవించి ఉన్నంత కాలం వెంటాడుతూనే ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో క్రమంగా విస్తరించి శరీరంలోని ఒక్కోభాగంపై ఎఫెక్ట్‌ చూపడం మొదలు పెడుతుంది.. చివరకు ప్రాణాంతకంగా మారుతుంది.. బతికున్నన్నాళ్లూ నరకయాతన పడాల్సి వస్తుంది..
---------------5-------------
చావాలని ఒకే ఒక్క క్షణంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయం కొన్నే కొన్ని క్షణాల్లో అంతులేని నరకాన్ని చూపిస్తుంది. అజ్ఞానంతో, మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని అంతం చేయటమే కాదు.. దానిపై ఆధారపడ్డ మరి కొన్ని జీవితాలకు అర్థమే లేకుండా చేస్తుంది.
చనిపోయే ఘడియల్లో అనుభవించే బాధ.. అంతకు ముందు ఆత్మహత్యకు పురికొల్పిన బాధల కంటే వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది.. ఇంత తీవ్రమైన బాధను అనుభవించటం, జీవితాన్ని అర్ధాంతరంగా ముగించటం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి..
ఆత్మహత్య అన్న ఆలోచన ఎందుకు వస్తుంది?
నిర్హేతుకమైన సుఖాల కోసం ఆలోచించినప్పుడు..
బాధ్యతలు భారంగా మారినప్పుడు..
అవసరం వేరు.. సుఖం వేరు..బాధ్యత వేరు.. బరువు వేరు..
సమస్యలు లేకుండా.. కష్టాలు రాకుండా.. జీవితం గడవాలంటే సాధ్యం కాదు..
ఒక సమస్య పరిష్కారమైతే.. దాడి చేసేందుకు మరో సమస్య ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. వాటి నుంచి పారిపోవాలనుకోవటం వెర్రితనం తప్ప ఇంకోటి కాదు. ఇలా పారిపోవాలనుకున్నప్పుడే, విరక్తి పెరిగిపోతుంది..
మనకు ఉన్నది ఒకే ఒక్క జీవితం.. ఇంకో జన్మ ఉన్నదనో.. వస్తుందనో ఆలోచించటం.. విశ్వసించటం కంటే, ఉన్న జీవితంలోనే ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నించటం అవసరం.. ఇప్పుడు చావాలని అనుకునే వాళ్లు, అదే క్షణంలో ఎందుకు చావాలి అని ఒక్కసారి ఆలోచిస్తే.. జీవితం సమూలంగా మారిపోతుంది.. ఆ ఒక్క క్షణమే.. జీవితాన్ని ముగించటానికో, కొనసాగించటానికో కారణమవుతుంది.
ఒక్కసారి ఆలోచించండి.. జీవితం ఒకేఒక్కసారి వస్తుంది.. ఆ జీవితాన్ని పూర్తిగా యుటిలైజ్‌ చేసుకోవటం ముఖ్యం.. సుఖంగా ఉండాలని కోరుకోవటం తప్పు కాదు.. ఆ సుఖాన్ని సాధించటం కోసం ప్రయత్నించాలి.. పోరాడాలి కానీ, సుఖం దక్కలేదని లోకం నుంచే మాయమైపోతానంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు..చావు కోసం మనల్ని నిర్వీర్యం చేసే క్షణాన్ని మనమే పూర్తిగా డామినేట్‌ చేయాలి.. అర్థం లేని ఆత్మహత్యలను దూరంగా తరిమికొట్టాలి..

19, జూన్ 2010, శనివారం

డెత్‌ డేట్‌

మరణం ఓ కామా అన్నాడు ఓ తెలుగు కవి.. మరణానికి కొద్దిసేపటికి ముందు.. మరణానికి తరువాత ఏం జరుగుతుంది? చనిపోయిన వాడు ఆత్మ అవుతాడా? స్వర్గానికి పోతాడా? నరకానికి పోతాడా? ఆత్మ అనేది ఉన్నదా? లేదా అన్న దానిపై అబ్బో బోలెడు డిస్కషన్సే జరిగాయి. చావు ఎలా వస్తుందన్న దానిపైనా ఎక్స్పరిమెంట్లు చేయని వాడు ప్రపంచంలో లేడు.. ఇక జ్యోతిష్యులు, కాలజ్ఞాన కర్తల గురించి చెప్పనే అక్కర్లేదు.. చావు గురించి కర్మ సిద్ధాంతాన్ని మాట్లాడే వారు ఒకరైతే.. శాస్త్ర వాదాన్ని వినిపించేవారు మరొకరు.. వీళ్లలో చాలా మంది చనిపోయారు.. కానీ వీళ్లలో ఎంతమంది తాము ఏరోజు, ఏ క్షణానికి చచ్చిపోతామో ఆక్యురేట్‌గా కనుక్కోగలిగారా?
వాళ్లకా అవకాశం ఉందో లేదో కానీ, ఇప్పుడా అవకాశం అందరికీ లభించింది.. మీరెప్పుడు చచ్చిపోతారు? తెలుసుకోవాలని ఉందా.. అదెలా సాధ్యం? డేట్‌తో సహా ఎలా చెప్పగలరు?

మనిషిగానో, జంతువుగానో పుట్టిన తరువాత చావు రాకుండా పోదు.. ఒకరు ముందు.. మరొకరు వెనుక.. కానీ, సరిగ్గా ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎలా తెలుస్తుంది? కంగారేమీ వద్దు.. సెకన్లతో సహా డెత్‌ డేట్‌లను ప్రొవైడ్‌ చేసే వాళ్లున్నారు.. పైసా ఖర్చు లేకుండా మీరెప్పుడు చనిపోతారో తెలుసుకోవచ్చు.. జ్యోతిష్యులకు కొన్ని వివరాలు అందించినట్లే... వీళ్లకూ మీ పర్సనల్‌ వివరాలు కొన్ని మాత్రం చెప్తే చాలు.. డెత్‌ డేట్‌ క్షణాల్లో మీ కళ్ల ముందు ప్రత్యక్ష మవుతుంది. ఎలాగంటారా? ఈ వెబ్‌సైట్‌ మీరే చూడండి..
ఇంటర్నెట్‌ ప్రపంచంలో చెప్పలేనన్ని హిట్లను అందుకుంటున్న ఒకానొక వెబ్‌సైట్‌ అందిస్తున్న ఫ్రీ సర్వీస్‌ ఇది... మతం, జ్యోతిష్యం పరంగానే కాక, అత్యంత శాస్త్రీయంగా కాలిక్యులేట్‌ చేసి మరీ డెత్‌ డేట్‌లను చెప్పేస్తున్నామంటోందీ వెబ్‌సైట్‌....
ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ డాట్‌ కామ్‌...

మనుషుల భవిష్యత్తుకు లెక్కలు కడుతున్న వెబ్‌సైట్‌... మీరెన్నాళ్లు జీవిస్తారో ఇట్టే చెప్పేస్తుంది.. కాకపోతే అంతకు ముందు మిమ్మల్ని చక్కగా ఇంటర్వ్యూ చేస్తుంది.. మీ వ్యక్తిగత విషయాలు, అలవాట్లు అందులో మంచివీ, చెడ్డవీ, ఆరోగ్యాన్ని చెడగొట్టేవీ అన్నింటి గురించీ సవివరంగా కనుక్కుంటుంది.. చివరకు మీ వ్యక్తిత్వాన్నీ ప్రశ్నిస్తుంది..
ఓ ఉద్యోగానికి వెళ్తే అప్లికేషన్‌ ఫాం నింపినట్లే మీ డెత్‌ డేట్‌ తెలుసుకోవటానికీ అప్లికేషన్‌ ఫాం నింపాల్సిందే... అప్పుడే అది చెకచెకా లెక్కలు కట్టేసి.. బాల్చీ ఎప్పుడు తన్నేస్తారో చెప్పేస్తుంది....
జీవిత కాలానికి కొలమానం అంటూ ఏదీ లేదన్నది ఇంతవరకూ మనకు తెలిసిన నిజం.. కానీ, ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ డాట్‌ కామ్‌ మాత్రం మనిషి ఆయుష్షును నిర్ణయించేస్తోంది. పోయేకాలం దగ్గర పడుతోందంటూ సెకన్లతో సహా డెత్‌క్లాక్‌ను కంప్యూటర్‌ స్క్రీన్‌పై చూపిస్తోంది..
మనిషికి తన జీవితంలో ఏం కానుంది.. అని తెలుసుకోవటంపై ఎక్కడ లేని ఆసక్తి ఉంటుంది. దాన్ని విశ్వసించటం విశ్వసించకపోవటం వేరే విషయం.. విశ్వసించకపోయినా.. తనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస మాత్రం ఉంటుంది. అదిగో అలాంటి వారికోసమే ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ డాట్‌ కామ్‌ లాంటి సైట్లు వచ్చాయి...
చాలామంది తేలిగ్గా తీసుకుంటారు.. చూస్తారు.. సరదాగా నవ్వుకుంటారు.. రెండు రోజుల తరువాత మరిచే పోతారు.. కొందరికి మాత్రం మనసులో ఎక్కడో గుబులు పుడుతుంది. అది ఆందోళనగా మారితే.. అది స్లోపాయిజన్‌గా మారుతుంది.. ఈ రకమైన ట్రెండ్‌ భవిష్యత్తులో ఆ వ్యక్తి జీవితంపైనే ప్రభావం చూపుతుంది..
మానసికంగా ఆందోళన చెందేవారి పరిస్థితి ఏమిటి? వీళ్లు చెప్తున్న లెక్కలు ఏ ప్రాతిపదికన చేశారన్నది వెబ్‌ నిర్వాహకులు ఎక్కడా వివరించటం లేదు.. ఏవేవో లెక్కల ప్రకారం డెత్‌డేట్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారా? లేక నిజంగా శాస్త్రీయత అన్నది ఏమైనా ఉన్నదా?

ఇన్ని రకాల వివరాలను తెలుసుకుని ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ వెబ్‌సైట్‌ చేసిన లెక్కలన్నీ తప్పులయ్యాయి... వీళ్లు చెప్తున్న డెత్‌ డేట్‌ అంతా ఒఠ్ఠిదేనని తేలిపోయింది.. ఎందుకంటే మనకందరికీ మనందరికీ బాగా, బహుబాగా తెలిసిన వాళ్ల వివరాలు ఇస్తే వారు చనిపోయిన తరువాత కూడా ఇంకా ఆయుష్షు ఉందని చూపిసున్నది. మైకెల్‌ జాక్సన్‌ ఇంకా ఇరవై ఏళ్లకు పైగా బతుకుతాడంది.. వైఎస్‌ఆర్‌ మరో పాతికేళ్లు ఉంటారని చెప్పింది.. రాజీవ్‌ గాంధీ ఇంకో పదహారేళ్లు జీవిస్తారని చెప్పింది... ఈ అంచనాలు.. గణాంకాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు..
భవిష్యత్తు గురించి, అదృష్టం గురించి, జాతకాల గురించి ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. ప్రపంచంలో జాతకాల పిచ్చి కాస్త ఎక్కువే.. జ్యోతిష్యాన్ని శాస్త్రమనే వాళ్లు కొందరు.. కాదనే వారు కొందరు.. జ్యోతిష్యం చెప్పేవాళ్లు ఇన్నేళ్లు బతుకుతారంటూ లెక్కలు చెప్పేవారు కొల్లలు.. కానీ, ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ మాదిరిగా క్షణాలతో సహా లెక్కలు కట్టి చెప్పిన వారు మాత్రం అరుదు.. లేరు..
మానసికంగా బలహీనుడికి నువ్వు ఫలానా అప్పుడు చనిపోతావని చెప్తే.. ఆ బాధతో అతను ఆ చెప్పిన రోజు దాకా కూడా బతకడు.. అదే ఆలోచనతో కుంగి కృశించిపోతాడు.. ఇలాంటి వెబ్‌సైట్లు ఇలాంటి అనర్థాలకే దారి తీస్తాయి.
సిగరెట్లు తాగితే ఇన్ని రోజులు ఆయుష్షు తగ్గిపోతుందనీ, మద్యం సేవిస్తే మరి కొన్ని రోజులు వయసు తగ్గుతుందని లెక్కలు కట్టిన వాళ్లూ ఉన్నారు.. వాటికీ మంచి ప్రచారమే వచ్చింది. కానీ, తక్కువ సిగరెట్లు, మద్యం తాగిన వాళ్లు చిన్నవయసులో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.. డబ్బాలకు డబ్బాలు చైన్‌ స్మోకింగ్‌ చేసిన వాళ్లు..ఎనభై ఏళ్లూ బతికిన సందర్భాలూ చూశాం.. అసలు ఎలాంటి అలవాట్లు లేని వాళ్లు సైతం చిన్నవయసులో హఠాత్తుగా కన్నుమూసిన సన్నివేశాలూ ఉన్నాయి.. అలాంటప్పుడు ఈ వెబ్‌సైట్లు, జ్యోతిష శాస్త్రాలు కట్టే లెక్కలకు హేతుబద్ధత ఎలా కట్టబెట్టగలం..
మనిషి శరీర తత్త్వాన్ని బట్టి.. అతని ఆరోగ్య స్థితిని బట్టి, రోగ నిరోధక శక్తిని బట్టి అతడి జీవిత కాలం ఆధారపడి ఉంటుంది.. అంతే కానీ, ఏవేవే లెక్కలు గట్టి.. పిచ్చి పిచ్చి సూత్రాలను చూపించి దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు చచ్చిపోతావంటే అంతకంటే పెద్ద జోక్‌ ఇంకోటి ఉండదు.. ఇలాంటి వెబ్‌సైట్‌లను చూస్తే సరదాగా చూసి నవ్వుకోవాలి.. అంతే కానీ, సీరియస్‌గా తీసుకుంటే దాని వల్ల మానసిక ఆందోళన తప్ప ఒరిగేదేమీ ఉండదు... సో.. బీ హ్యాపీ.. అండ్‌ ఎంజాయ్‌ యువర్‌ లైఫ్‌... బి కాజ్‌ వుయ్‌ హావ్‌ ఓన్లీ వన్‌ లైఫ్‌... జస్ట్‌ ఎంజాయ్‌.. నథింగ్‌ ఎల్స్‌..

పర్సులో ప్లాస్టిక్‌ బాంబ్‌

ప్లాస్టిక్‌ బాంబ్‌.. మీ పర్సులోనే ఉంది.. మీతో పాటు.. మీ వెంటనే నీడలా వస్తోంది.. తేనె పూసిన కత్తి లాంటిది.. మీకు తెలియకుండానే మీ గొంతు కోసేందుకు సిద్ధంగా ఉంది. మీకది ఓ సౌకర్యంగా కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే ఉపకరణంగా అగుపిస్తోంది.. మీ పాలిట అది ప్లాస్టిక్‌ మనీ.. కానీ, మీకే తెలియని ప్లాస్టిక్‌ బాంబ్‌....
ఏమిటీ గోల..? ఎందుకింత భయపడాలి..? ప్లాస్టిక్‌ బాంబ్‌ అంటే ఏమిటి? అది జేబులో ఉండటం ఏమిటి? ఆశ్చర్యం వద్దు.. విస్మయం అంతకంటే వద్దు.. మీ పర్సులో ఉన్న డెబిట్‌, క్రెడిట్‌ కార్డులే బాంబు ఘంటికలు మోగిస్తున్నాయి.. మీకే తెలియని కాస్తంత నిర్లక్ష్యం భారీ మూల్యానికి దారి తీస్తోంది..
క్రెడిట్‌ కార్డు.. ఇవాళ ఓ ఫ్యాషన్‌... ఓ స్టేటస్‌ సింబల్‌.. ఓ సరదా.. పర్సులో డబ్బులు పెట్టుకుని వెళ్లటం నామోషీ.. హోటల్లోనో, పబ్బుల్లోనో, షాపింగ్‌లోనో సెユ్టల్‌గా పర్స్‌ నుంచి కార్డు ఇచ్చి బిల్లు పే చేయటం స్టేటస్‌.. ఇవాళ్టి కల్చరే అది.. నోట్ల కట్టలు జేబులో పెట్టుకుని తిరగటం కంటే సింపుల్‌గా ఓ కార్డు పట్టుకుని వెళ్లటం సుఖం...
కార్డు ఉండటం అవసరమే కావచ్చు. ఇవాళ అది సహజమై ఉండవచ్చు. కానీ, కార్డు ఉంటే మీ డబ్బు సేఫ్‌గా ఉన్నట్లేనా? జస్ట్‌ థింక్‌ ఎబౌట్‌ ఇట్‌.. ఇంట్లో కంటే బ్యాంకులో డబ్బులు దాచుకోవటం ఒకప్పుడు చాలా సురక్షితం.. ఇప్పుడు కూడా అంతేనా? బ్యాంకులో సొమ్ములు ఎంత భద్రంగా ఉంటున్నాయి..?
లేదు.. మీ సొమ్ముల కోసం ఎవరో కాచుకుని ఉన్నారు.. ఎల్లవేళలా డబ్బులు అందుబాటులో ఉంచే సౌకర్యం కల్పించటం కోసం మీ సొమ్ముల్ని తమ దగ్గరుంచుకుని, వాటికి బదులుగా మీ జేబులోకి బదిలీ చేసిన ప్లాస్టిక్‌ మనీ.. అదే. బ్యాంకులు ఇచ్చిన క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు ఇప్పుడు మీ ఆర్థిక నిర్వహణతో చెలగాటమాడుతున్నాయి..మీకు తెలియకుండానే మీ కార్డు మీ చెంతనే ఉంటుంది.. మీకు తెలియకుండా దాని డేటా మరొకరి చేతిలోకీ వెళ్తుంది..
అదెలా సాధ్యం? కార్డు జేబులోనే ఉంది.. సీక్రెట్‌ పిన్‌ నెంబర్‌ ఉంది.. వెనుక మూడు నెంబర్ల సీక్రెట్‌ కోడ్‌ కూడా ఉంది.. గ్రిడ్‌ ఉంది.. ఇన్ని రకాల చెక్‌ అవుట్‌ ఉండి కూడా కార్డును చోరీ అదే డేటాను చోరీ చేయటం ఎలా వీలవుతుంది? ఈజిట్‌ పాజిబుల్‌.. ఎస్‌..ఇటీజ్‌ పాజిబుల్‌..
కార్డులోని డేటాను చోరీ చేయటం ఏ విధంగా కుదురుతుంది.. ఒకవేళ నెంబర్‌ చోరీ అయినా, పిన్‌ నెంబర్‌ ఉంటుంది కదా.. కానీ, అదే పొరపాటు.. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు.. ఎంత సాంకేతిక పరిజ్ఞానం డెవలప్‌ అయితే.. దొంగలకు దొంగతనాలు చేయటం అంత ఈజీ అవుతుంది.. టెక్నాలజీ అనేది వాళ్లు ఉపయోగించినంతగా ఎవరూ ఉపయోగించుకోలేరు..
మీ క్రెడిట్‌ కార్డులు క్లోనింగ్‌ అవుతున్నాయి. మీ చేతులతో మీరు స్వయంగా ఇచ్చిన కార్డులతోనే దర్జాగా క్లోనింగ్‌ ప్రక్రియ సాగిపోతోంది.. ఇప్పటిదాకా ఎక్కడో అమెరికాకే పరిమితమైన ఈ క్లోనింగ్‌ టెక్నాలజీ ఇప్పుడు మన దేశాన్ని కుదిపేస్తోంది...
పెద్ద ఫ్యాక్టరీ, భారీ యంత్రసామాగ్రి దగ్గరకు మన క్రెడిట్‌ కార్డు ఎలా వెళ్లింది.. ? అదే విచిత్రం.. మీ కార్డును అదే.... నమూనాను మీరే అందించారు.. ఎలాగంటారా? సింపుల్‌.. మీరు హోటల్‌కు వెళ్లినప్పుడు, పబ్‌కు వెళ్లినప్పుడు బిల్‌ పే చేసేందుకు బేరర్‌కు కార్డు ఇస్తారే.. అదిగో అక్కడే ట్విస్ట్‌ ఉంది.. మీ కార్డు బిల్లు కోసమే కాదు.. మరో దానికోసమూ స్వాప్‌ అయిపోతుంది.. స్కిమ్మర్‌ మీ కార్డులోని డేటాను ఒకే ఒక్క సెకన్‌లో కొట్టేస్తుంది.
చేతిలో పట్టే చిన్న మిషన్‌.. అరచేతిలో పట్టుకుంటే కనీసం కనిపించనైనా కనిపించని యంత్రం.. మోసం చేయాలనుకునే వారు ఎవరైనా సరే శరీరంలో ఎక్కడైనా దాచుకోవచ్చు. ఎదుటి వాళ్ల నుంచి ఒక్క క్షణం కార్డు చేతిలోకి వస్తే.. మరుక్షణంలో స్వాప్‌ చేసేయవచ్చు.. అంతే సంగతులు.. మీ కార్డు క్లోనింగ్‌ అయిపోయినట్లే..స్వాప్‌ చేసిన స్కిమ్మర్‌ నుంచి కార్డులోని డేటాను ఎంత సింపుల్‌గా క్లోన్‌ చేయవచ్చో చూడండి..

బయట షాపింగ్‌లోనో, హోటళ్లలోనో, ఇతర పబ్బుల్లోనో క్రెడిట్‌ కార్డులను స్వాప్‌ చేస్తే అవి క్లోనింగ్‌ అవుతాయి... ఇంతటితో అయిపోయిందా? లేదు... మీ కార్డు చోరీ కావటానికి సవాలక్ష అవకాశాలు పొంచి ఉన్నాయి..
అవసరానికి డబ్బులు డ్రా చేయటానికి ఇప్పుడు ఎటిఎం చాలా కీలకమైన సౌకర్యం... కానీ, ఇప్పుడు అదే ఏటిఎం మన కొంపలార్చటానికి సిద్ధంగా ఉంది.. డబ్బులు డ్రా చేసుకోవటానికి ఎటిఎం సెంటర్‌కు వెళ్లితే అక్కడా ప్రమాదం రెడీగా ఉంటుంది.. ఏటిఎంలో మీ కార్డు యాక్సెస్‌ చేసే ప్రాంతంలో ఎవరికీ తెలియకుండా దొంగ చిన్ని బాక్స్‌ను ఫిక్స్‌ చేసేయవచ్చు. ఓ గంట తరువాత తీరిగ్గా వచ్చి దాన్ని తీసుకుని వెళ్లిపోవచ్చు. కార్డ్‌ యాక్సెస్‌ ప్రాంతంలో మరో బాక్స్‌ ఉన్న సంగతి కూడా గుర్తించటం వీలు కాదు..

అంతే కాదు.. బ్రోచర్స్‌ బాక్స్‌లో సీక్రెట్‌ కెమెరాను ఉంచి దాని ద్వారానూ డేటాను సంపాదించేయవచ్చు..

ఒకటా, రెండా.. మీ కార్డు మీదగ్గరే ఉంచి డేటా దొంగిలించటానికి ఎన్ని అవకాశాలో... ఈ టెక్నాలజీని నిర్వీర్యం చేయటం పోలీసులకు సవాలుగా మారింది.. వీటి నుంచి తప్పించుకోవాలంటే కార్డు విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండటం తప్ప ప్రత్యామ్నాయం లేదు..

టెక్నాలజీ అంటారు.. ప్రపంచం ఓ కుగ్రామం అంటారు.. క్షణాల్లో కమ్యునికేషన్‌ చేర్చవచ్చంటారు.. కానీ, దేనికీ భద్రత లేదు.. ఎక్కడా ప్రెユవసీ లేదు..మరి టెక్నాలజీ వల్ల ఎవరికి ప్రయోజనం?
కార్డులు కొంప ముంచుతున్నాయి. ఫోన్లు ప్రెユవసీని కాజేస్తున్నాయి. ఆన్‌లైన్‌లోకి వెళ్దామంటే ఫిషింగ్‌ సిస్టమ్‌ వచ్చేసింది.. బ్యాంకుల వెబ్‌సైట్లను కూడా క్లోన్‌ చేసే వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. మన బ్యాంకు వెబ్‌సైట్‌లాగే ఉంటుంది.. కానీ, సదరు బ్యాంకు సైట్‌ కాదు.. అక్కడ ఐడి, పాస్‌వర్డ్‌ కొట్టారో ఇక అంతే..
అందుకే ముందు జాగ్రత్త పడటం చాలా మంచిదని సైబర్‌ క్రెユం పోలీసులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.
షాపులలో, హోటళ్లలో, పబ్‌లలో బిల్‌ పే చేసేందుకు కార్డులను ఎవరికీ ఇవ్వవద్దు.. మీ కళ్ల ముందే కార్డును స్వైప్‌ చేయించండి.. సంతకం చేయండి.. ఏదైనా అనుమానం వస్తే వెంటనే కస్టమర్‌కేర్‌ను సంప్రతించండి..

ఏటిఎంలో డబ్బులు డ్రా చేసే ముందు అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా అని పరికించండి.. ఏటిఎం కీపాడ్‌కు చుట్టుపక్కల వస్తువులను జాగ్రత్తగా చూసి డ్రా చేయండి..

కాల్‌సెంటర్ల నుంచి అపరిచిత కాల్స్‌ను అటెండ్‌ చేయవద్దు.. వాళ్లు లోతుగా మీ వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు.

మొబైల్‌ఫోన్‌లను ఎవరికీ ఇవ్వకండి.. బ్లూటూత్‌ ఆప్షన్‌ను అవసరమైనప్పుడు తప్ప ఆన్‌ చేయకండి.. అపరిచితులకు బ్లూటూత్‌ ద్వారా ప్రవేశించేందుకు అనుమతించవద్దు

ఆన్‌లైన్‌ లావాదేవీలను సైబర్‌ కేఫ్‌ల నుంచి చేయవద్దు .. కీలాగర్లు మీ సొమ్మును హారతికర్పూరం చేస్తాయి.

సెక్యూరిటీ ప్రమాదం లేదని ధృవీకరించుకున్నాకే ఆన్‌లైన్‌ లావాదేవీలకు పూనుకోండి..

జాగ్రత్త,, తస్మాత్‌ జాగ్రత్త.. మీకు కావలసింది అప్రమత్తత.. ఆందోళన వద్దు.. భయం వద్దు.. కించిత్‌ ఆలోచించండి.. ఇంకొంచెం జాగ్రత్త పడండి.. మీ సొమ్ముల్ని కాపాడుకోండి.

12, జూన్ 2010, శనివారం

నగ్న సత్యం అంటే నగ్నంగా చెప్పటమా?

పేరు సోషల్‌ సర్వీస్‌...
జంతువుల పరిరక్షణే ధ్యేయం..
పర్యావరణాన్ని రక్షించటమే తపన..
ప్రపంచశాంతి కోసం తెగ „పడి చస్తారు..
నిరసనల కోసం వలువలు విడుస్తారు..
నగ్నంగా ఆందోళనలు.. సమాజానికి సందేశాలు..
లాభసాటి వ్యాపారంగా సమాజ సేవ..
అంగడి సరుకు న్యూడిటీ..
పాపులారిటీ కోసం చీప్‌ ట్రిక్‌‌స
నిరసనలకు న్యూడిటీ అవసరమా?
నగ్న సత్యం అంటే నగ్నంగా చెప్పటమా?

ప్రపంచంలో అదో గొప్ప సంస్థ..పాపులారిటీలో దానికి సాటి లేదు.. యాడ్‌ కాంపెయిన్‌లో ఆ సంస్థ సిబ్బందిలో ఉన్న క్రియేటివిటీ అబ్బో ఎక్కడా కనిపించదు.. ఈ సంస్థ ఓ ఉద్యమ సంస్థ. అది చేసే ఉద్యమం సాదా సీదా ఉద్యమం కాదు.. ప్రపంచంలోని మనుషులందరినీ జంతు ప్రేమికులుగా మార్చేయటం.. అంతే కాదు.. వెజిటేరియన్‌లుగా మార్చేయటం.. ఇందుకోసం వారిలో చైతన్యం తీసుకురావటం కోసం ప్రచారం చేస్తుంటుంది..
దాని పేరు పెటా... పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనిమల్‌‌స...
అమెరికా లో జంతువుల హక్కుల కోసం పోరాడుతున్న ఓ సంస్థ..
పేరులో గొప్ప ఆశయం?
జంతువుల సంరక్షణ ధ్యేయం..
వాటిని ఉద్ధరించటమే పరమావధి..
జంతు సంరక్షణ గురించి ప్రపంచానికి సందేశాన్ని అందించటం,
ప్రజలను జంతు ప్రేమికులుగా మార్చటం అ సంస్థ టార్గెట్‌..
ఓకే.. జంతువులను ప్రేమించటాన్ని ఎవరు మాత్రం కాదంటారు? జంతువులను కాపాడటం.. వారి యోగక్షేమాలను చూసుకోవటంపై ఎవరికి మాత్రం ఏం అభ్యంతరం? జంతు సంరక్షణ కోసం ప్రచారం చేయటమూ గొప్ప సంగతే... కానీ, పెటా ఇందుకోసం ఏం చేస్తుందో తెలుసా? దాని రూటే సపరేటు మరి..
జంతువుల పరిరక్షణ కోసం ప్రచారానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ, పెటా మాత్రం అందుకు భిన్నంగా న్యూడిటీని ఎంచుకుంది. గొర్రెలను కాపాడాలంటూ ఓ నగ్న సుందరాంగి చేతిలో గొర్రెపిల్లను పెట్టి ఫోటో షూట్‌ చేస్తారు..
కోడిపిల్లలను కాపాడాలన్న ప్రకటనకు కూడా వలువలు లేని భామలే వారికి కావాలి..
జంతు చర్మాలతో తయారు చేసిన బట్టల వేసుకోవటం కంటే అసలు బట్టలే వేసుకోకుండా ఉండేందుకు ఇష్టపడతామంటూ నగ్న సుందరులను నిలబెడతారు..
ఈ సంస్థ తన ప్రచారాన్ని ఇంతటితో ఆపలేదు.. మనుషులంతా వెజిటేరియన్లుగా మారాలంటూ తెగ ఆరాటపడుతుంది.. దీనికి సంబంధించిన ప్రచారం విషయంలో పెటా మెంబర్లు కెమెరాకు ఇచ్చే పోజులే వేరు..
బాడీ పెయింటింగ్‌ వేసుకుంటారు.. రకరకాల వేషాలు వేసుకుంటారు.. ఆకులు కట్టుకుంటారు.. మాస్కులు వేసుకుంటారు.. అసలేమీ లేకుండా అడ్డగోలుగా ఫోటోషూట్‌లు చేసేసి ప్రపంచం మీదకు వదిలేస్తారు.. ఇంకేం ప్రచారానికి ప్రచారం... పాపులారిటీకి పాపులారిటీ...
2
వాళు్ల చేసేది సోషల్‌ సర్వీస్‌... ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై వాళు్ల ఉద్యమిస్తారు.. ఆందోళనలు చేస్తారు.. నిరసనలు వ్యక్తం చేస్తారు.. పక్కా ప్రొఫెషనల్‌‌స... కాకపోతే వాళ్ల ఆందోళనలు వినూత్నంగా ఉంటాయి.. క్షణాల్లో ప్రపంచమంతటా పాపులర్‌ అవుతాయి.. ఎందుకింత పాపులారిటీ వస్తుంది? అందులోనే ట్విస్‌‌ట ఉంది..
కొన్నాళు్లగా ప్రపంచంలో తీవ్రవాదుల మారణకాండ, మావోయిస్టుల హింసాకాండ, ఆకలి చావులు, జాతి వివక్షలు.. యుద్ధోన్మాదంతో ఊగిపోతున్న దేశాలు..ఈ ఉద్రిక్త వాతావరణంలో ప్రపంచ శాంతి సాధన కోసం ఆందోళన చెందుతున్న వారు ఎందరో ఉన్నారు.. కానీ, అదే ప్రపంచ శాంతిని కోరుకుంటున్న మరో జాతి ఉంది.. అందుకోసం ఆ జాతి చేసే ఫీట్లు స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఉంటాయి... ఈ ఆందోళనకారులు ఉద్యమించిన తీరును చూడండి...ప్రపంచ శాంతి కావాలంటే ప్లకార్డులు పట్టుకుని నగ్నంగా ప్రదర్శనలు చేయాలి... రకరకాల విన్యాసాలు చేయాలి.. ఇంగ్లీషు అక్షరాల ఆకారాల్లో పోజులివ్వాలి.. వావ్‌.. వీళ్లకు ఇంతకంటే మంచి ఆలోచన రాలేదు..
ప్రపంచ శాంతికి, నగ్న ప్రదర్శనకు లింకేమిటో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు..ఇలా చేస్తేనే శాంతి సాధ్యమని ఎవరి మెదడుకు తోచిందో కానీ, వారికి జోహారు.. కానీ, శాంతి కోసం వీళు్ల తెగ ఆరాటపడిపోతున్నారన్న పాపులారిటీ క్షణాల్లో విశ్వవ్యాప్తంగా వచ్చేస్తుంది..
ఇంతేనా.. మరో ప్రదర్శన ఉంది.. అది భూగోళాన్నే రక్షించటం కోసం.. గ్లోబల్‌ వార్మింగ్‌ నుంచి ప్రపంచాన్ని కాపాడాలంటూ ఆడా మగా కలిసి చల్లని మంచు ప్రదేశంలో నగ్నంగా ప్రదర్శన చేస్తారు.. దాన్ని ఫోటోలు తీసేసి ప్రచారం చేసేసుకుంటారు..
ఇక్కడితోనూ తృప్తి పడలేదు, నగ్నప్రియులు.. సందర్భం, సమయోచితం, విలువలు అన్న తేడా లేకుండా, ఇషూ్య ఏదైనా సరే, న్యూడ్‌గా పోజులివ్వటానికి ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తారు.. ఇదిగో బుల్‌ఫైట్‌ను నిషేధించాలంటూ ప్రదర్శన చేయటం ఇలాంటిదే...
నిస్సిగ్గుగా వీళు్ల చేసే ప్రదర్శనలకు, నిరసనలకూ అక్కడి సమాజాలూ అంగీకరిస్తాయి.. ప్రభుత్వాలూ పట్టించుకోవు.. నిర్వాహకులకు మాత్రం వారు చేసే ఈ సోషల్‌ సర్వీస్‌కు స్పాన్సరర్ల రూపంలో కాసులు మాత్రం సూపర్‌గా వచ్చిపడతాయి..
3
కాదేదీ వ్యాపారానికి అనర్హం.. కాసిన్ని సొము్మలు వచ్చి పడతాయంటే చాలు.. దేనికైనా బరితెగించే లోకంలో ఉన్నాం మనం.. డబ్బులతోనే అన్ని వ్యవహారాలు.. కాకపోతే ముసుగులే వేరు.. ఒకరు వ్యాపారం కోసం న్యూడిటీని అంగట్లో పెట్టి అము్మకుంటున్నారు.. మరొకరు సర్వీస్‌ ముసుగు వేసుకుని వ్యభిచారం చేస్తారు..

చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి వెకిలి చేష్టలు.. వీళ్ల పోస్టర్లపై చెప్పే మాటలు.. చేసే నినాదాలు.. ప్రతి మనిషికీ ఆదర్శంగా ఉంటాయి.. చూపించే బొమ్మలు మాత్రం జుగుప్స కలిగిస్తాయి.. గ్లోబల్‌ వార్మింగ్‌ కోసం, బుల్‌ఫైట్లను నిషేధించటం కోసం,
జంతు సంరక్షణ కోసం..విజిటేరియన్లుగా మార్చేయటం కోసం.. న్యూడిటీ అవసరమా? వలువలు లేని మనుషులతో ప్రచారం చేస్తే తప్ప ప్రపంచానికి సందేశం ఇచ్చే మార్గం ఇంకోటి లేదా?
వీళ్లంతా ఎందుకు న్యూడిటీనే ఆశ్రయిస్తున్నారు? వీళ్ల ప్రచారం కేవలం అడల్‌‌ట కోసమే కాదు కదా...జంతువుల సంరక్షణ గురించి, గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి, విజిటేరియనిజం గురించి చిన్న పిల్లలకు తెలియజెప్పాల్సిన అవసరం లేదా? లేక పిల్లలకు సైతం ఇలాంటి పోస్టర్లను, ప్రదర్శనలను చూపించటం వల్ల నష్టం లేదని వీళు్ల భావిస్తున్నారా?
టూమచ్‌ సెక్‌‌స ఆరోగ్యానికి హానికరం అని కూడా వీళు్ల తెగ ప్రచారం చేసేస్తుంటారు.. మరి వీళ్ల పోస్టర్లు దేనికి సంకేతాలు..? దేనికి ఉత్ప్రేరకాలు..?
తక్కువ డబ్బులకు ఎక్కువ అందాలు ఆరబోసే వాళ్లను తీసుకొచ్చి ఇలాంటి ఫోటోషూట్‌లు, ప్రదర్శనలు చేయిస్తారు... వీరికి చేంతాడంత స్పాన్సరర్ల లిస్‌‌ట ఉంటుంది.. పేరుకు చేసేది సేవ.. స్పాన్సరర్ల ద్వారా వచ్చేది సంపాదన... అది పెటా గానీ, మరేదైనా సంస్థ కానీ.. ఎవరైనా ఇంతే.. అందినకాడికి అందినంత దోచుకోవటమే వారికి కావలసింది.. చేసేదంతా వ్యాపారం.. పక్కా వ్యాపారం... చూపేది సర్వీస్‌.. సోషల్‌ సర్వీస్‌... కాదు కాదు.. న్యూడ్‌ సర్వీస్‌.. ఇప్పటికే జనం పర్వర్‌‌ట అయ్యే పరిస్థితి.. సర్వీసు చేయాలనుకుంటే దాని పద్ధతిలో అది చేయాలి.. కానీ, పాపులారిటీ కోసం న్యూడ్‌ ట్రిక్‌‌స ప్లే చేయటం దారుణం.. ఇప్పుడిప్పుడే ఇండియాలోకీ ఇది పాకింది.. షెర్లిన్‌ చోప్రా, నేహా దూఫియా వంటి వారు పాపులారిటీ కోసం దేనికైనా సిద్ధమేనని ప్రకటించేశారు.. న్యూడిటీయే అందమని, అదే గ్లామరనీ కూడా ప్రకటించారు.. దీన్ని విపరీత పోకడలంటే కొందరికి కోపం రావచ్చు... కానీ, ఇండియాలో.. ఇంతగా బరితెగించిన వాతావరణంలోనూ ఎక్కడో ఒక చోట కొంతైనా విలువలంటూ మిగిలి ఉన్నాయి. అందుకే ఈ దేశాన్ని, ఇక్కడి జన జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకుంటున్న వాళు్ల ఇంకా ఉన్నారు.. కాస్తో కూస్తో మిగిలి ఉన్న ఈ కాస్త విలువల వలువలు విప్పకుండా ఉంటే అదే పదివేలు.

1, జూన్ 2010, మంగళవారం

మహానటుడికి మహా పరాభవం...

తెలుగు సినిమా... ఈ పేరు చెప్పగానే ఇప్పటిదాకా మొట్టమొదట గుర్తుకు వచ్చే పేరు ఎన్టీరామారావు.. ఆయన్నే కొందరు అన్నగారు అని పిలుస్తారు.. పల్లెల్లో అభిమానులైతే ఎన్టోడు అని ముద్దుగా పిలుచుకుంటారు.. ఇదంతా ఇప్పటిదాకా ఉన్న మాట.. కానీ, ఇక ముందు ఈ మాట వినిపించదు.. ఆ బొమ్మ కనిపించదు.. ఆ పేరే మటుమాయం కానుంది.. ఎన్టీయార్‌ అంటే ఇప్పుడున్న కుర్ర ఎన్టీయార్‌ మాత్రమే కనిపిస్తాడు.. అతని మాటలే వినిపిస్తాయి.. సీనియర్‌ ఎన్టీరామారావు అంటే ఆయన అంటూ ఒకరున్నారా అన్న అనుమానమూ కలుగుతుంది...ఎందుకు? ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది?
తెలుగు చిత్రానికి ఆయన రారాజు.. 1949 దాకా తప్పటడుగులు వేస్తున్న తెలుగు సినిమా నడకను, నడతను తీర్చిదిద్ది స్వర్ణయుగాన్ని తెచ్చిపెట్టిన సినీ భోజుడు.. ఆయన పేరు నందమూరి తారక రామారావు.. మూడున్నర దశాబ్దాలు.. మూడు వందల ఇరవైకి పైగా సినిమాలు.. చలన చిత్ర సెల్యూలాయిడ్‌ కావ్యానికి అందమైన ముఖచిత్రం నుంచి చివరి పుట దాకా అంతా ఆయనే.. ఇవాళ సినీ పరిశ్రమలో ఆయన పేరు తలచే వారే లేరు.. మాట్లాడే వారే లేరు...

చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునే సంస్కృతి తెలుగు సినిమా వాళ్లకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదు. ఇదొక మాయా ప్రపంచం.. ఎవరికి ఎవరూ ఏమీ కారు.. అందరూ మొనగాళ్లకు మొనగాళ్లే.. కళామతల్లి ముద్దుబిడ్డలం అని చెప్పుకునే ప్రబుద్ధులంతా ఆ కళకు సేవలు అందించిన వారికి పంగనామాలు పెట్టడం కొత్తేమీ కాదు.. నాటి ఎన్టీయార్‌ నుంచి నేటి వేటూరి దాకా లివింగ్‌ లెజెండ్స్‌ పరిస్థితి అంతా ఇంతే..
ఒక మహోన్నత వ్యక్తికి జయంతి....వర్థంతి ఉత్సవాలు జరిగాయంటే... ఆ వ్యక్తిని జనం పది కాలల పాటు గుర్తు పెట్టుకున్నారని అర్థం.

తెలుగు సినిమాను, తెలుగు జాతి ఔనత్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన నటుడు, రాజకీయ వేత్త నందమూరి తారాకరామారావు జయంతి ఎప్పటిలాగే ఎన్‌టిఆర్‌ ఘాట్‌ వద్ద జరిగింది.

తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు రొటీన్‌గా వచ్చి నివాళులు అర్పించేసి వెళ్లిపోయారు..

పార్టీకి ఇంకా రామారావు పేరు అవసరం తీరిపోలేదు కాబట్టి వాళ్లు వచ్చారు.. కుటుంబసభ్యులకు తప్పదు కాబట్టి వారూ వచ్చారు..

కానీ, తెలుగు సినిమా పరిశ్రమ నెలకొని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా జరిగిందా? కనీసం ఆనవాలైనా కనిపించదు..
ఎన్టీయార్‌ జయంతిని జరుపుకోవలసిన అవసరం, బాధ్యత సినీ పరిశ్రమకు లేదు..
నందమూరి నట వారసులతో పాటు సినీ పరిశ్రమలో ఉన్న నందమూరి అభిమానులు కూడా పెద్ద ఎన్‌టిఆర్‌ను పూర్తిగా మరిచిపోయారు.. కాదు.. కావాలనే విస్మరించారు.. ఎందుకంటే ఇప్పుడు సినిరంగానికి చనిపోయిన ఎన్టీయార్‌తో అవసరం ఏముంది కనుక?
ఒక్క నాగేశ్వరరావు తప్ప ఒక్కరంటే ఒక్కరు సీనీపరిశ్రమకు చెందిన వాళ్లు ఎన్టీయార్‌ ఘాట్‌కు వచ్చిన పాపాన పోలేదు..ఫిలింనగర్‌ సంగతి సరేసరి..


సినిమా వాళ్లు వ్యక్తులను గుర్తు పెట్టుకుంటే ￧అదో విచిత్రం.. విశేషం.. మరచిపోవడం సహాజ లక్షణం. ఎన్టీయార్‌ దాకా ఎందుకు.. సినిమా పాటకు పల్లవి లాంటి వేటూరి సుందర రామ్మూర్తి మరణించి మూడు రోజులైనా కాలేదు.. ఆయన సంతాప సభ పెడ్తే ఆ సభలో సినీ పెద్దలెవరూ కనిపించని దుస్థితి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎప్పుడో వెళ్లిపోయిన ఎన్‌టిఆర్‌ జయంతిని మాత్రం సినిమా వాళ్లు ఏం గుర్తు పెట్టుకుంటారు లేండి.

తెలుగు సినిమాకు మోరల్స్‌ లేవా? ఇదీ ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న.. వేదికలపైన సినీపెద్దలు పోచికోలు కబుర్లు చెప్పటానికి ఎలాగైనా సిద్ధపడతారు కానీ, వేదికలు దిగగానే చెవులు దులుపుకుని వెళ్లిపోతారు.. అందుకే ఇప్పుడు ఎన్టీయార్‌ గతకాలపు స్మృతి కాదు.. ఎన్టీయార్‌ అంటే అదే సినీప్రముఖులకే అర్థం కాని మాట..

సినిమా రంగానికి మిగతా వారంతా అక్కర్లేక పోవచ్చు. కానీ ఎన్టీయార్‌ ఒక లెజెండ్‌ సినీపరిశ్రమకే కాదు.. తెలుగు వారికి, సాంస్కృతికంగా, రాజకీయంగా కూడా దిశ, దశ చూపించిన వాడు.. అలాంటి మహానేతకు సినీరంగం ఎందుకు మంగళం పాడుతోంది. దీని వెనుక సినీ ప్రముఖులకు వేరే ఉద్దేశ్యాలు వేరే ఏమైనా ఉన్నాయా? ఒక పథకం ప్రకారమే చేస్తున్నారా? సినిమా ఒక కళ.. ఇదో కళారంగం.. మేమంతా కళాకారులం.. కళాకారులకు కళే జాతి.. కళామతల్లి ముద్దుబిడ్డలం మేమంతా...
ఇవన్నీ.. సినీ ప్రముఖులు ఎప్పుడూ చెప్పుకునే మాట.. భుజాలు తడుముకునే చేత.. ఇది ఒక విచిత్రమైన వ్యవస్థ.. చిత్రమైన రంగం.. తెలుగు సినిమా ఒక కళారంగం అని చెప్పుకునే దశను ఎప్పుడో దాటిపోయింది.. వీళ్లకు లాభసాటి వ్యాపారం జరగాలి.. ప్రభుత్వాల నుంచి రాయితీలు రావాలి.. ప్రేక్షకుల నుంచి కోట్లు వచ్చిపడాలి. ఫక్తు వ్యాపారం.. ఎవరు డామినేట్‌ చేస్తే వాళ్లదే రాజ్యం.. వీళ్లు వల్లించేవన్నీ ఒఠ్ఠిమాటలే.. ఇక చనిపోయిన వారిని గుర్తుంచుకుని స్మరించేంత తీరిక, ఓపికా వారికెక్కడుంటుంది?

సినిమా వాళ్లు చెప్పేదంతా నిజం కాదని జనాలకు ఇప్పుడిప్పుడే బుర్రకెక్కుతున్నది. నిజంగానే సినిమా వాళ్లకు వేటూరి మీద అంతటి అభిమానం ఉండి ఉంటే...ఫిలించాంబర్‌లో జరిగిన సంతాప సభకు సినీ పెద్దలెందుకు రాలేదు? ఎన్‌టిఆర్‌ జయంతిని ఫిలింనగర్‌లో ఎందుకు జరుపుకోలేదు? ఒకనాడు లెజెండ్స్‌గా ఉన్న వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు వారి ఆలనాపాలనా పట్టించుకోవలసిన బాధ్యత సైతం సినీరంగానికి పట్టదు.. అప్పుడప్పుడూ పేద కళాకారులకోసం క్రికెట్టు మాత్రం తెగ ఆడేస్తారు.. డబ్బులు పోగేస్తారు.. కొందరికి పంచేస్తారు.. చిత్రమేమంటే ఈ హీరోలు, హీరోయిన్లు ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయలు పారితోషికంగా వసూలు చేస్తారు.. పేదకళాకారులకు సాయం చేసే విషయానికి వచ్చే సరికి మళ్లీ ప్రేక్షకుల దగ్గర నుంచే వసూలు చేస్తారు.. జేబులోనుంచి ఒక్క పైసా బయటకు తీయరు.. ఇలాంటి వ్యాపారులు ఇక ఎన్టీయార్‌ కోసం ఏం చేస్తారు? ఆయన్ను ఏం గుర్తుంచుకుంటారు?
ఎన్టీయార్‌ నట సార్వభౌముడు.. తెలుగు సినిమాకు ఒక ఐకాన్‌.. ఆయన నటించని పాత్ర లేదు.. జీవించని కేరెక్టర్‌ లేదు..ఇవాళ తెలుగు సినిమాలో ఎవరు ఎలాంటి కేరెక్టర్‌ చేయాలన్నా ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఎన్టీయార్‌ అంతకు ముందు చేసిన ఆ కేరెక్టర్‌ను ఒక్కసారి చూస్తే చాలు.. అన్ని రకాల కేరెక్టర్లు చేసిన వాడు ఎన్టీయార్‌. అలాంటి ఎన్టీయార్‌ నటించిన కేరెక్టర్లకు సంబంధించి ఉపయోగించిన ఆభరణాలు, ఆయుధాలు, ఇతర వస్తువులు, దుస్తులు మ్యూజియం పేరుతో ఉన్న ఒక బిల్డింగ్‌లో దుమ్ముపట్టుకుని పోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తిగొడవగా మారి కోర్టులో పెండింగ్‌ ఫైళ్ల మధ్య ఇరుక్కుపోయింది.. ఎన్టీయార్‌ మ్యూజియం అన్నది తెలుగు సినిమా ఆస్తి కనీసం దాన్నైనా పరిరక్షించేందుకు ప్రయత్నించిన పాపాన పోలేదు..
ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఎవరికీ ఎన్టీయార్‌ అక్కర్లేదు.. ఎందుకంటే ఇవాళ ఎన్టీయార్‌ వ్యాపార వస్తువు కాదు.. ఆయన పేరుతో కానీ, స్మరణతో కానీ పైసా లాభం రాదు.. ఆయన ఉన్నప్పుడు సినిమాపరంగా, రాజకీయ పరంగా ఆయన్ను ఉపయోగించుకున్నారు.. ఇప్పుడు ఆ అవసరం లేదు.. దానవీరశూర కర్ణలో ఎన్టీయారే చరిత మరువదు నీ చతురత అంటాడు.. కానీ, ఇప్పుడు అది రివర్స్‌ అయింది.. చరిత మరిచిన నీ నటనా చాతుర్యం..

29, మే 2010, శనివారం

కూలిందా? కూల్చారా? రాజగోపుర రహస్యం


శ్రీకాళహస్తిలో రాజగోపురం కూలిపోయింది. అయిదు శతాబ్దాల చరిత్ర అంతా చూస్తుండగానే నిట్టనిలువునా సమాధి అయిపోయింది. విజయనగర సామ్రాజ్య విజయ పతాక పతనమైపోయింది.. ఎందుకిలా జరిగింది? అత్యంత పురాతనమైన నిర్మాణం ఎలా కూలిపోయింది? అది సహజంగా కూలిపోయిందా? అసహజంగా కూల్చేశారా? రాజగోపురం కూలిపోవటానికి ముందు ఏం జరిగింది? అన్నీ అనుమానాలే.. అన్నీ సందేహాలే.. లోగుట్టు తెలిసేదెవరికి.. సాక్షాత్తూ వాయులింగేశ్వరునికైనా తెలుసా?

శ్రీకాళహస్తి రాజగోపురం ఎలా కూలిపోయింది?
కూలిందా? కూల్చేశారా?
ఒకవైపు మాత్రమే బీటలు వారిన గోపురం నిట్టనిలువునా ఎలా కూలింది?
గోపురం కూలిపోవటానికి పదిహేను నిమిషాలకు ముందు దానిపైకి ఎక్కిన ఇద్దరు ఎవరు?
గోపురం రెండో అంతస్థులోకి ప్రవేశించిన ఆ ఇద్దరు అక్కడ ఏం చేశారు?
గోపురం రెండో అంతస్థులో జరిగింది ఏమిటి?
గోపురం కూలేముందు ఎలాంటి శబ్దాలు వచ్చాయి?
గోపురంలో సౌండ్‌ప్రూఫ్‌ బాంబులు పెట్టి పేల్చారా?
శిథిలాల తొలగింపునకు అప్పటికప్పుడు చెనై్న నుంచి వాహనాలు ఎలా వచ్చాయి?
అంతా పథకం ప్రకారమే జరిగిందా?
కూల్చివేత పథకానికి సూత్రధారులు ఎవరు?

part-1
నిజం.. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని రాజగోపురం కూలిపోవటంపై అనుమానాలు తీవ్రమవుతూనే ఉన్నాయి.. దేవాలయ అధికారులు.. దేవాదాయశాఖ అధికారులు ప్రభుత్వం వ్యవహరించిన తీరు, అనుసరించిన విధానం గోపురాన్ని అసహజంగా కూల్చివేశారనే వాదనలకే బలం చేకూరుతోంది.. దీనికి ఎవరు బాధ్యులు.. ? ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బ తీసిందెవరు?

శ్రీకాళహస్తి పవిత్ర రాజగోపురం నిట్టనిలువునా కూలిపోవటానికి కారకులు ఎవరు? రాష్ర్టంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హిందూ భక్తులను తొలుస్తున్న ప్రశ్న.. రాజగోపురం ఒక్కసారిగా కుప్పకూలటం సంచలనం సృష్టించింది.. ఎందుకు, ఎలా కూలిపోయింది? పరిరక్షించే ప్రయత్నాలు ఎందుకు జరగలేదన్నది జవాబులు దొరకని ప్రశ్నలు...

1517 తొలినాళ్లలో విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణ దేవరాయలు గజపతులపై తన సమరాంగణ విజయ చిహ్నంగా కాళహస్తీశ్వరునికి కట్టిచ్చిన రాజగోపురం ఇది. ఇందులోని తొలి రెండు ప్రాకారాలు రాతితో నిర్మించినా.. మిగతా అయిదు ప్రాకారాలు ఇటుకతో నిర్మించారు.. 1979లోనే తొలిసారి రాజగోపురంపై పగుళ్లను గుర్తించారు.. దీన్ని పరిరక్షించే విషయంలో దేవాదాయ శాఖలో ఫైలు అటూ ఇటూ తెగ తిరిగింది.. 1990లలో మరోసారి దీనిపై పగుళ్లను పరిశీలించారు.. గోపురం కుడివైపు నెరల్రు వాచిన ప్రాంతంలో కొన్ని మరమ్మతులైతే చేశారు.. కానీ, గోపురాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ ఏనాడూ వహించలేదు..

గోపురం గురించి కొన్నాళ్ల క్రితం ప్రస్తుత ఇఓ ఎంతో గొప్పలు చెప్పారు.. పురాతన స్మృతి చిహ్నమైన కాళహస్తి రాజగోపురాన్ని కాపాడుకునేందుకు ఎంతో చేస్తున్నట్లు భుజాలు తడుముకున్నారు..
ఇదే పెద్ద మనిషి, వీర శివ భక్తుడు.. గోపురం కూలిన తరువాత వేదాంతం మాట్లాడటం మొదలు పెట్టారు..ఏ కట్టడానికైనా అంతం తప్పదంటున్నారు..కానీ, తమిళనాడులో వేల ఏళ్ల నాటి గుళు్ల, చారిత్రక ఆనవాళు్ల ఎలా పరిరక్షింపబడుతున్నాయో ఈయనగారికి కాస్తంతైనా తెలియదు..
ఇఓ మాటల్లో కనిపిస్తున్న నిర్లక్ష్యమే రాజగోపురం కూలిపోవటానికి కారణం. గోపురాన్ని ఎలా రక్షించాలో తెలియక, దాని గురించి ఆలోచించనైనా ఆలోచించక నిష్కర్షగా కూల్చివేశారా? ఇది ప్రజల భావోద్వేగంతో ఆడుకున్నట్లు కాదా?
part-2

రాజగోపురాన్ని కూలిపోకముందే కూల్చేశారన్న వాదన ఎందుకు పెరుగుతోంది? దీని వెనుక వాస్తవాలు ఏమిటి? కూలిపోవటానికి ముందు కాళహస్తిలో ఏం జరిగింది? కేవలం ఒక వైపు మాత్రమే నెరల్రు వాచిన గోపురం మొత్తంగా కుప్పకూలటం సహజంగా జరిగిందేనా?
మే 26 న రాత్రి సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి రాజగోపురం నిట్టనిలువునా కూలిపోయింది? అంతకు ముందు నాలుగు రోజుల నుంచి రాజగోపురం శిథిలావస్థపై కథనాలు వినవస్తూనే ఉన్నాయి. ఐఐటి నిపుణులు, పురావస్తుశాఖ నిపుణులు వచ్చి పరిశీలించి మరీ వెళ్లారు.. ఏ క్షణానై్ననా కూలే అవకాశం ఉందంటూ నిపుణులు అప్పుడే చెప్పారు.
నిపుణులు హెచ్చరించిన మర్నాడే రాజగోపురం కూలిపోయింది.. మట్టిదిబ్బలా మారిపోయింది.. ఎలా సాధ్యమైందన్నదే అంతుపట్టని ప్రశ్న.. ఇక్కడే అనుమానాలు మొదలయ్యాయి..
(అనుమానం నెం1)
రాజగోపురానికి కుడివైపున మూడు ఫీట్ల విస్తీర్ణంలో నిట్టనిలువునా పగులు ఏర్పడింది.. ఎడమ వైపున 75 శాతం గోపురం అంతా బాగానే ఉంది.. ఒకవేళ పగులు ఏర్పడిన భాగానికి ప్రధాన భాగానికి దూరం పెరిగితే కుడివైపు మొత్తం పడిపోవాలి. కానీ, గోపురం మొత్తం కూలిపోయింది.. ఇదెలా జరిగింది..?
కుడివైపున మాత్రమే పునాదులు కదిలినట్లు అధికారులే స్పష్టంగా చెప్తున్నారు..
(అనుమానం నెం2)
ఎడమ వైపు పటిష్ఠంగానే ఉందని చెప్పకనే చెప్తున్నారు.. అలాంటప్పుడు గోపురం మొత్తంగా నిట్టనిలువునా కూలే అవకాశాలు చాలా తక్కువని ఇంజనీర్లే అంటున్నారు.. కానీ, గోపురం పూర్తిగా పేకమేడలా ఎలా కూలిపోయింది?
(అనుమానం నెం.3)
రెండో అంతస్థు వరకు రాతికట్టడం ఉంది.. ఆ తరువాత ఇటుక కట్టడం ఉంది.. రెండో అంతస్థు పైనుంచి మిగతా గోపుర ప్రాకారాలన్నీ నిట్ట నిలువునా కూలిపోయింది...ఏం జరిగింది?
(అనుమానం నెం.4)
గోపురం కూలిపోవటానికి సరిగ్గా పదిహేను నిమిషాలకు ముందు ఇద్దరు వ్యక్తులు గోపురంలోని రెండో అంతస్థు లోకి వెళ్లి దాదాపు పదిహేను నిమిషాలు గడిపి వచ్చారు.. వారిద్దరు ఎవరు? రెండో అంతస్థులో వారేం చేశారు?

(అనుమానం నెం.5)
ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, సెక్యూరిటీ చీఫ్‌లు ఇద్దరే లోపలికి వెళ్లి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షు్యల వాదన.. వాళ్లిద్దరు కానీ, ఇతర అధికారులు కానీ, ఎందుకు మౌనంగా ఉన్నారు?

(అనుమానం నెం. 6)
గోపురం కూలిపోయిన తరువాత తెల్లవారి ఉదయం దాకా శిథిలాలను తొలగించేందుకు ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు.. దేవాదాయ శాఖ కమిషనర్‌ వచ్చాక కానీ, తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టేది లేదని అధికారులు చెప్పారు.. కమిషనర్‌ మధ్యాహ్నం రెండు గంటలకు కానీ రాలేదు.. కానీ, శిథిలాల తొలగింపును ఉదయం పదకొండు గంటలకు గుడి వెనుక వైపు నుంచి రహస్యంగా ప్రారంభించారు.. ఈ కార్యక్రమాన్ని కూడా రహస్యంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది..?

(అనుమానం నెం.7)

దేవాదాయ శాఖ కమిషనర్‌ వచ్చి వెళ్లిన కొద్ది సేపటికే చెనై్న నుంచి మూడు పొక్లయినర్లు, 12 ట్రక్కులు వచ్చేశాయి.. ఎలాంటి పక్కా ప్రణాళిక లేకుండా ఇవి కాళహస్తికి ఎలా చేరుకున్నాయి..
గోపురం కూలినప్పుడు పిడుగులాంటి శబ్దం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.. ఇది బాంబు పేల్చిన శబ్దమా? చారిత్రక ఆనవాలును ఎంతో అపురూపంగా కాపాడుకోవలసిన జాతి, బ్యూరోక్రసీ నిర్లక్ష్యానికి సమాధి అవుతున్న శిథిల చరిత్రను మౌనంగా చూసి రోదించాల్సిన స్థితి నెలకొంది..
part-3
శ్రీకాళహస్తి రాజగోపురం సహజంగా కూలిపోలేదనటానికి మరో బలమైన ఆధారం ఉంది.. గోపురం కూలిపోయిన నాటి నుంచి ముగ్గురు వ్యక్తుల జాడ తెలియటం లేదు.. శిథిలాల కింది నుంచి దుర్వాసన కూడా వస్తోంది.. ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఎవరి దగ్గరా లేదు.. దీని వెనుక మతలబు ఏమిటి? అధికారులు ఏదైనా వ్యవహారాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా?
శ్రీకాళహస్తి రాజగోపురానికి అతి దగ్గరలో న్యూ గణేశ్‌ హోటల్‌ ఉంది.. ఈ హోటల్‌లో ఉన్న పనిచేసే రాజా అనే కార్మికుడు గోపురం కూలిన రాత్రి నుంచి కనిపించటం లేదు. అన్న జాడ వెతుక్కుంటూ రాజా తము్మడు రమేశ్‌ నెల్లూరు నుంచి కాళహస్తికి వచ్చి వాకబు చేస్తే, హోటల్‌ యజమాని తనకేం తెలియదన్నాడు.. మధ్యాహ్నమే వెళ్లిపోయాడన్నాడు..

నిజానికి హోటల్‌ వెనుక భాగంలో ఒక రేకుల షెడ్డు ఉంది.. గోపురం కూలినప్పుడు అది కూడా పూర్తిగా నేలమట్టమైంది.. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి ముక్కు పుటాలు అదిరేలా దుర్గంధ వాసన బయటకు వస్తోంది.. ఈ శిథిలాల కింద ముగ్గురు వ్యక్తులు సమాధి అయినట్లు ప్రచారం జరిగింది.. అంతే కాదు.. అక్కడే ఉన్న స్టేట్‌బ్యాంక్‌ పరిసరాల నుంచి కూడా ఇదే రకమైన వాసన వస్తోంది. కానీ, అధికారులు మాత్రం ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.. కారణం మాత్రం తెలియదు.. జాడ తెలియకుండా పోయిన వారిలో ఆలయ సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నట్లు సమాచారం వస్తోంది.. వీరికి సంబంధించిన అన్ని రికార్డులనూ మాయం చేసినట్లు తెలుస్తోంది.. అధికారులు ఎందుకిలా చేశారు.? కారణం ఏమిటి? ఆలయ గోపురం ప్రమాద వశాత్తు కూలిపోవటం వాస్తవమే అయితే దుర్గంధం వస్తున్న చోట శిథిలాలను ఇంకా ఎందుకు తొలగించటం లేదు..? జాడ తెలియకుండా పోయిన వారి వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదు?

గోపుర శిథిలాల కింద ఎవరైనా చనిపోవటం అంటూ జరిగితే అందుకు ఎవరు బాధ్యులు..? గోపురాన్ని అధికారులు కావాలనే కూల్చి వేసినట్లయితే, చుట్టుపక్కల ఎవరూ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని తీరాలి... అలా కాకుండా అన్నీ చూసుకోకుండా తొందరపడి ఉంటే, ఎలాంటి అనర్థం జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.. ప్రజల నుంచి, మిస్సింగ్‌ అయిన వారి బంధువుల నుంచి వెల్లువెత్తుతున్న అనుమానాలకు, ఆరోపణలకు జవాబు ఇవ్వలేని అధికార గణం రాజగోపుర రహస్యాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది..