28, జులై 2011, గురువారం

ఆజాద్ ను అతిగా నమ్మితే....

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు అధిష్టానం పై మళ్లీ  నమ్మకం పెరుగుతోంది.ఆజాద్‌తో చర్చల తర్వాత రాష్ట్ర విభజన జరుగుతుందన్న ఆశలు చిగురించాయి...ఎన్నడూ లేనివిధంగా హై కమాండ్ శ్రద్దతో తమ వాదనలు విన్నదన్న భావనలో ఉన్న వారు....తెలంగాణ ఏర్పాటుకు బలమైన కారణాలు గుర్తించిందని వారు ఓ అంచనాకు వస్తున్నారు. నమ్మకం కుదిరింది.....రెండు నెళ్లు కాదు....నెల రోజుల్లోనే తెలంగాణకు పరిష్కారం...ఇదీ తెలంగాణ కాంగ్రెస్‌ నేతల అంతరంగం...
ఆజాద్‌ ను తిట్టిన నోళ్లే ఇపుడు పొగడుతున్నాయి. ఆంధ్రోళ్లకే ఆయన ఇంచార్జ్‌ అనే దాకా వెళ్లిన టీ కాంగ్రెస్‌ నేతల తీరు ఇపుడు మారుతోంది. ఆజాద్ తో మూడో భేటీ తర్వాత వారి స్వరాలు ఒక్క సారిగా వేరే రూపు తీసుకున్నాయి.తెలంగాణతో ముడిపడి ఉన్న హైదరాబాద్‌,నదీజలాల పంపిణీ అంశాలపై తాము వివరించిన తీరు ఆయన్ను ఆకట్టుకుందని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 2004 నుంచి ఎపీ వ్యవహారాలను దగ్గర నుంచి గమనిస్తున్న తనకు తెలంగాణ డిమాండ్‌లో ఇంత నిజాయితీ ఉందన్న సంగతి ఇప్పటి వరకు  తెలియదని ఆజాద్ ...వారితో చెప్పినట్టు సమాచారం.తెలంగాణ వ్యతిరేకించడానికి చూపుతున్న కారణాలు వాదనకు పెడితే నిలువవని ఆయన చెప్పడం టీ కాంగ్రెస్‌ నేతలకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. అందరూ చెబుతున్నట్టు రెండు నెలల్లో కాకుండా .. ముఫ్పై రోజుల్లోనే సమస్యకు పరిష్కారం దొరకొచ్చని ఆజాద్‌ భేటీలోఅన్నారని వారు ప్రచారం చేసుకుంటున్నారు.ఆజాద్ తీరు ఇలానే చివరి దాకా కొనసాగితే తెలంగాణ రాకుండా పోదని ఢిల్లీ భేటీలో పాల్గొన్న యువ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు....  ఢిల్లీ పెద్దల తీరును ఎంతో కాలం నుంచి గమనిస్తున్న కొందరు సీనియర్లు మాత్రం ఇంచార్జి వైఖరి పై తుది నిర్ణయానికి రావడానికి మరింత సమయం తీసుకోవాలనే భావనలో ఉన్నారు జాదూ గా పేరున్న ఆజాద్ సీమాంద్ర నేతలతో మాట్లాడిన తర్వాతే ఆయన తెలంగాణకు అనుకూలమా వ్యతిరేకమా అనే నిర్ధారనకు రావచ్చని అప్పటిదాకా ఓపిక పట్టాలనే భావన వారిలో కనిపిస్తోంది.  ఆజాద్ ను అతిగా నమ్మితే హై కమాండ్ ట్రాప్‌లో పడ్డట్టే అవుతుందని మరి కొంత మంది టీ కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారు.ఏమైనా ఆజాద్ పై మునుపటంత ఆగ్రహం ప్రదర్శంచకుండా తెలివిగా ఆయన్ను తెలంగాణ దారికి తెచ్చుకోవాలనే అభిప్రాయం మాత్రం అందరిలో వ్యక్తమవుతోంది....

కామెంట్‌లు లేవు: