1, ఏప్రిల్ 2020, బుధవారం

suprasanna's voice on vishwanathas controvercial poem

గత ఆదివారం (మార్చి 29)న స్వాధ్యాయ చానల్లో  పోస్ట్ చేసిన విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యాల వెనుక అత్యంత వివాదాస్పదమైన సన్నివేశం ఉన్నదని ఆచార్య సుప్రసన్నగారు తెలిపారు. విజయవాడలో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరి కవితలను కవితలు కావంటూ ఆశువుగా పద్యాలు చెప్పినట్టుగా వివరించారు. ఆ కవిసమ్మేళనంలో సుప్రసన్నగారు కూడా కవిత్వం చెప్పారట. ఆయన కవిత్వంలోనూ చివరి పంక్తులు చదివి ఇందులో చమత్కారమేమున్నదని అడిగారట. విశ్వనాథవారి పద్యం ఈ లింక్ తో పాటు ఇస్తున్నా.. సుప్రసన్నగారి అభిప్రాయమూ వినండి. తెలుగు సాహిత్య చరిత్రలో ఇదొక మరుపురాని సన్నివేశం. స్వాధ్యయలో మీరూ భాగస్వాములు కండి. పదిమందిని భాగస్వాములను చేయండి.

కామెంట్‌లు లేవు: