16, జనవరి 2012, సోమవారం

రాష్ట్రం వణికిపోతోంది

కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రం వణికిపోతోంది.. ఒక చోట కాదు..  అన్ని జిల్లాల్లో అతి భయంకరంగా చలి గడ్డకట్టిస్తోంది. ఉదయం ౯ గంటలైనా బయటకు రాని పరిస్థితి. పండుగ లేదు.. పబ్బం లేదు.. పగలు తగ్గిపోయింది.. రాత్రి పెరిగి పోయింది.. చలికాలం తగ్గిపోవలసిన సమయంలో  గత వందేళ్లలో ఎన్నడూ లేని వణుకు అల్లాడిస్తోంది..
                                  
మైనస్‌ 1 డిగ్రీ...

ఎప్పుడైనా విన్నారా? ఎక్కడో కాశ్మీరులోనో.. లేక ఉత్తర భారతంలోనో అలాంటి ఉష్ణోగ్రతల గురించి విని ఉంటారు.. కానీ మన రాష్త్రంలో.. ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చింది.. ఒరిస్సా సరిహద్దులోని లంబసింగిలో టెంపరేచర్‌ మైనస్‌లోకి పడిపోయింది.

ఆదిలాబాద్‌ జాల్లా మొత్తం గజగజలాడుతోంది.. గత నూరేళ్లలో ఎప్పుడూ లేని టెంపరేచర్‌ జిల్లాను పీడిస్తోంది.. ౪ డిగ్రీల టెంపరేచర్‌ నమోదు కావటం ఇక్కడ రికార్డు.

రాష్త్రంలో ఏ జిల్లాలో కూడా టెంపరేచర్‌ ౧౦ డిగ్రీలను మించి ఉండటం లేదు..
రామగుండం , మెదక్‌లలో ౭
హైదరాబాద్‌లో ౮
నిజామాబాద్‌, నల్గొండలలో 10
విశాఖ, రెంటచింతల, అనంతపురం, బాపట్లలో 12
మిగతా జిల్లాల్లో 12 నుంచి 14 డిగ్రీల టెంపరేచర్‌ నమోదయింది...

చలికి తట్టుకోలేక ఏజెన్సీ గ్రామాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లేవారు కదలటమే గగనమైపోయింది.
౯గంటల తరువాత కూడా బయటకు రావాలంటే భయపడిపోతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

తూర్పు నుంచి వీస్తున్న ఈదురుగాలుల బాధ మరి కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.

కామెంట్‌లు లేవు: