తెలుగువాళ్లంతా ఒకటే.. ఒకటే జాతి.. ఒకే భాష.. ఒకే సంస్కృతి.. అని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నాం.. ఆత్మగౌరవం అంటూ మాట్లాడుకుంటున్నాం.. కానీ, ఇది ఒక జాతి కాదని.. రెండు జాతులనీ, మహాభారత కాలం నాటి నుంచీ విడివిడి రాజ్యాలని కూడా స్పష్టంగా తెలుస్తున్నది. కృష్ణానదికి దిగువ భాగాన ఆంధ్రక పేరుతో ట్రెユబల్ రాజ్యమున్నట్లుగా, కృష్ణానదికి ఎగువన, దండకారణ్యాన్ని ఆనుకుని గోదావరి తీరంలో తెలింగ రాజ్యమున్నట్లుగా తెలుస్తోంది. తెలింగకు పైభాగాన కళింగ రాజ్యం వేరే ఉంది. దక్షిణ భారతాన్ని గెలిచేందుకు పాండవ కనిష్ఠుడు సహదేవుడు కళింగానికి దక్షిణాన ఉన్న తలవానలనే ట్రైబ్లను గెలిచినట్లుగా మహాభారతంలో ప్రస్తావన ఉంది. తెలింగ రాజ్యంలోని ఉన్నవారే తలవానలని వాళ్ల భాష తెలుంగు అని చెప్పబడింది. కౌరవ సైన్యంలో తుషార, యవన, ఖాస, దర్వాభిసర, శక, కమత, రమత, ఆంధ్రక, పుళింద, ద్రవిడ, కంచి, కిరాట తదితర రాజ్యాలు భాగస్వామ్యం పంచుకున్నట్లుగా భారతంలోనే ప్రస్తావన ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)











2 comments:
Thank you for the map.
ee map lo chala rajyalunnattunnai, anni rashtralu ga vidadiste sari.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి