7, ఆగస్టు 2011, ఆదివారం

దగా పడ్డ తెలంగాణలో మరో నిశ్శబ్ద హత్య

దగా పడిన తెలంగాణలో మరో చావు! ఆత్మహత్య మాటున సర్కారీ హత్య! నాలుగు కోట్ల మంది ఆకాంక్షలను చులకన చేస్తున్న సమైక్యవాదం తీసిన ప్రాణం! మొన్న ఆజాద్ వ్యాఖ్యలతో కలత చెంది.. పార్లమెంటు సాక్షిగా యాదిడ్డి చేసిన బలిదానం స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే మరో ఆత్మత్యాగం! ఇప్పుడు దోషి చిదంబరం! యాదిరెడ్డి అమరత్వాన్ని ప్రశ్నించిన మంత్రి తెలంగాణ విద్యాకుసుమాన్ని తన కరకు వ్యాఖ్యలతో చిదిమేసిన వైనం! శుక్రవారం లోక్‌సభలో చిదంబరం వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన ఆర్ శ్రీకాంత్ పాతికేళ్లకే నూరేళ్లూ నింపుకొన్నాడు. తెలంగాణ చూడటానికి బతికుందామని ఉద్యమం మొత్తుకుంటున్నా.. జాతీయనేతలు ధైర్యం చెబుతున్నా, కుటిల నేతల కపట నాటకాలతో చిన్నబోయిన చిన్ని మనసు.. తీవ్ర నిర్ణయమే తీసుకుంది. చనిపోవడానికి కొద్దిసేపటి ముందు నమస్తే తెలంగాణకు ఈమెయిల్‌లో ఆత్మహత్య లేఖ పంపాడు శ్రీకాంత్. 

దాన్ని గమనించి, వెంటనే అతడికి ఫోన్ చేసేలోపే.. ఈ లోకం విడిచి బిడ్డ పోయిన దుఖఃంతో కన్నతల్లి కుమిలిపోతున్నది! ఇంకెన్ని బలిదానాలంటూ ఉద్యమం భోరుమంటున్నది! కావూరీ ఈ అమరత్వాన్ని ఎలా చులకన చేస్తావు? లగడపాటీ ఏమిటి నీ జవాబు? చిదంబరా... ఇప్పుడు నీ ప్రకటనేంటి? అంటూ తెలంగాణ గుండె నిగ్గదీస్తోంది! బతికి సాధిద్దాం.. మన తెలంగాణలో మనం బతుకుదాం.. అంటూ యువతకు కన్నీటితో విన్నవించుకుంటోంది!!


తెలంగాణ కోసం మరో యువకుడు ఆత్మత్యాగం చేసుకున్నాడు. ఢిల్లీలో పార్లమెంట్ సమీపంలో తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకున్న యాదిడ్డి విషాదంపై కేంద్ర హోంమంత్రి చిదంబరం పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు తనను తీవ్ర మనస్తాపానికి గురి చేశాయని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. తానూ తెలంగాణ ఉద్యమంలో భాగం కావాలనుకుంటున్నానని పేర్కొంటూ తన ఆత్మహత్యను మరోలా చిత్రీకరించవద్దని కోరాడు. తెలంగాణ కోసం తనదే చివరి ఆత్మహత్య కావాలని ఆకాంక్షించాడు. 

ఆత్మహత్యకు ముందు శ్రీకాంత్ ‘నమస్తే తెలంగాణ’ దినపవూతికకు ఈ మెయిల్‌లో ఎడిటర్‌ను ఉద్దేశించి లేఖ పంపించాడు. సబ్జెక్ట్‌లో.. మై సూసైడ్ నోట్ ఫర్ తెలంగాణ అని పేర్కొన్నాడు. లేఖ పాఠం..
నా పేరు శ్రీకాంత్. జేఎన్‌టీయూహెచ్ క్యాంపస్‌లో ఎంటెక్ చదువుతున్నాను. నా తల్లిదంవూడులకు నేను ఒక్కడినే కొడుకును. తెలంగాణ ఉద్యమంలో భాగం కావాలనుకుంటున్నాను. రెడ్డి ఆత్మహత్య గురించి పార్లమెంటులో చిదంబరం చేసిన ప్రకటన నాకు నిజంగా ఎంతో బాధ కలిగించింది. దయచేసి నా ఆత్మహత్యను తప్పుడు ఆత్మహత్యగా చేయొద్దు. నా సూసైడ్ నోట్‌ను ఇక్కడ జతపరుస్తున్నాను.
పాస్‌వర్డ్: జైతెలంగాణ.
ఆర్.శ్రీకాంత్
ఎంటెక్ మెకావూటానిక్స్ సీఆర్
జేఎన్‌టీయూ విద్యార్థి
హైదరాబాద్ ఏరియా, ఇండియా
+91-9052559413


తెలంగాణ కోసం తన ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ శ్రీకాంత్ 
ఈ-మెయిల్‌లో పంపించిన లేఖ (సూసైడ్ నోట్) పూర్తి పాఠం.. 
ప్రియమైన టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నేతలకు, తెలుగుదేశం పార్టీకి కాదు
నా తల్లిదంవూడులకు నేను ఏకైక మగబిడ్డను. నేనూ తెలంగాణ ఉద్యమంలో భాగం కావాలనుకుంటున్నాను. తెలంగాణ నిజమైన హీరోలు కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకులే. ఇప్పుడిప్పుడే తెలంగాణ టీ కాంగ్రెస్ నేతలు హీరోలుగా మారుతున్నారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ పదవులకు రాజీనామాలు చేయాలి. వాటిని ఆమోదింపజేసుకోవాలి. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ ఆ పార్టీ నుంచి బయటకు రావాలి. ప్రత్యేకంగా టీ-కాంక్షిగెస్ పార్టీని స్థాపించాలి లేదా టీఆర్‌ఎస్‌లో చేరాలి లేదా స్వతంత్ర అభ్యర్థులుగా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి. మేము తెలంగాణ ప్రజలము ఉప ఎన్నికల్లో మిమ్మల్ని మరోసారి గెలిపించుకుంటాము. కేంద్రానికి తెలంగాణ శక్తిని చూపుతాము. దయచేసి (నాయకులారా) తెలంగాణ కోసం పోరాడుతున్నట్టుగా నటించకండి. నిజమైన పోరాటంతో మీ శక్తిని హైకమాండ్‌కు తెలియచేయండి. 
జైపాల్‌డ్డి, దానం నాగేందర్.. తెలంగాణకు మద్దతు ఇవ్వని ఇతరుల వైఖరి చూస్తుంటే సిగ్గనిపిస్తోంది. ఒకవైపు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం చేస్తున్న పోరాటంతో తెలంగాణ మొత్తం భగ్గుమంటోంది. కాని ఈ తెలంగాణ వ్యతిరేక నాయకులు తమ పదవులకు అంటిపెట్టుకుని ఉన్నారు.

ప్రియమైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, గవర్నర్ నరసింహన్.. దయచేసి 14ఎఫ్ రద్దు చేసి పరీక్షలు నిర్వహించండి. తెలంగాణలోని వాస్తవ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి (సోనియాగాంధీకి) తెలియజేయండి. 
తెలంగాణ రాష్ట్రం కోసం మద్దతు తెలుపుతున్న ప్రియమైన టీఆర్‌ఎస్ (కేసీఆర్, కేటీఆర్, ఈటెల, హరీష్‌రావు), బీజేపీ (సుష్మాస్వరాజ్, ముండే, దత్తావూతేయ), సీపీఐ (గురుదాస్ దాస్ గుప్తా), కాంగ్రెస్ (కేకే, జూపల్లి, మధుతోపాటు అంతా), నాగం, గద్దర్, అన్ని జాక్‌ల నాయకులు.. పోరాటం ఆపొద్దు. మనం దాదాపు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుదాకా వచ్చాం. నా ప్రాణం మీ బలాన్ని పెంచుతుందని, తెలంగాణ ప్రజలు మరింతగా పోరాడేందుకు దోహదపడుతుందని ఆశిస్తున్నా. 

ప్రియమైన సుష్మాస్వరాజ్, గురుదాస్ దాస్‌గుప్తాగారు.. తెలంగాణపై మీరు పార్లమెంట్‌లో మాట్లాడిన తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. ఇక్కడ తెలంగాణలోని పరిస్థితులను సీమాంధ్ర ఎంపీలు అర్థం చేసుకోవటం లేదు. కాని బయటి ప్రజలు తెలంగాణ బాధను అర్థం చేసుకుంటున్నారు. మేడం, సర్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం దయతో మాకు మద్దతు ఇవ్వండి. 

ప్రియమైన కేసీఆర్‌గారు మీ బలాన్ని మరోసారి చూపించండి. ఈ చివరి పరిస్థితిలో నిశ్శబ్దంగా ఉండకండి. మీరు నిజమైన హీరో. తెలంగాణ రాష్ట్ర కలను వాస్తవం చేసింది మీరే. నేను మీ అభిమానిని. నేనూ, మా స్నేహితులమందరం మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రానికి మామయ్యా అని పిలుచుకుంటాం. ఐ లవ్ యు సర్ కేసీఆర్.. ప్రొఫెసర్ జయశంకర్‌గారి అస్తమయం ఎంతో బాధను కలిగించింది. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనమంతా పోరాటం కొనసాగించాలి. 

కోదండరాం సర్, టీ జాక్.. తెలంగాణ రాష్ట్రాన్ని త్వరగా తెచ్చేందుకు దయచేసి మంచి ఆలోచనలు, మార్గాలు చూడండి. సకల జనుల సమ్మెలాంటి సరికొత్త పద్దతులు అనుసరించాలి.
డియర్ కేకే సర్, టీ కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు నెలకొని ఉన్న పరిస్థితుల్లో మీరు ఏమాత్రం వెనక్కి తగ్గొద్దు, ప్రస్తుతం తెలంగాణ కోసం మీరు గొప్పగా పనిచేస్తున్నారు. మీ ప్రతిదాడుల ద్వారా హైకమాండ్‌కు ముచ్చెమటలు పట్టించండి. 

నాగం జనార్దన్‌డ్డిగారు, తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులారా.. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నారు. అయితే నాదో సలహా. ఒంటరిగా ఉండకండి. యుద్ధం చేయండి. టీఆర్‌ఎస్ లేదా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న మరేదైనా పార్టీతో జతకట్టి ఉద్యమాన్ని నడిపించండి. దేవేందర్‌గౌడ్‌లా మిగిలిపోకండి. 

గద్దర్‌గారు.. మీరు తెలంగాణ కోసం బాగా పనిచేస్తున్నారు. అయితే మీలో మరింత శక్తి ఉంది. దానిని మీరు కనబరచటం లేదనిపిస్తోంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర అవసరం కోసం రాష్ట్రానికి, కేంద్రానికి మీ శక్తిని ప్రదర్శించండి. నేను నా చిన్నప్పటి నుంచి మీ అద్భుత గళానిన వింటున్నాను.
సోనియాగాంధీ, యువ రాహుల్‌గాంధీ.. తెలంగాణలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోండి. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వండి. మరిన్ని ఆత్మహత్యలు జరగకుండా చూడండి. తెలంగాణ కోసం నాదే చివరి ఆత్మహత్య కావాలని కోరుకుంటున్నాను.

తెలంగాణ కోసం ఢిల్లీలో ప్రాణాలు తీసుకున్న యాదిడ్డి ఉదంతంపై కేంద్ర హోంమంత్రి చిదంబరం పార్లమెంట్‌లో మాట్లాడుతూ అది నిజమైన ఆత్మహత్యో? కాదో? అన్నట్టు వ్యాఖ్యానించారు. దొరికిన సూసైడ్ యాదిడ్డి రాసిందో? కాదో? అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది నన్నెంతో బాధించింది. మేం నిజంగా హృదయపూర్వకంగా తెలంగాణ కోసమే ప్రాణాలు తీసుకుంటున్నాం. దయచేసి నా ఆత్మహత్యను తప్పుగా చిత్రీకరించవద్దు. చిదంబరంగారూ నా ఆత్మహత్యతోనైనా స్పష్టత తెచ్చుకోండి. తెలంగాణ కోసమే ప్రాణాలు తీసుకుంటున్నానన్న విషయాన్ని అర్థం చేసుకోండి. 

తెలంగాణ ఏర్పడిన తరువాత దయచేసి ఇవి కల్పించండి:
1. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలి. 
2. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివినవారికి ఉపాధిని కల్పించాలి. వీలైనంత ఎక్కువమందికి ఉద్యోగాలు ఇవ్వాలి. 
3. అక్షరాస్యత, ఉపాధి, వనరుల వినియోగం, పరిక్షిశమలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలి. పర్యాటకపరంగా, చారివూతకంగా విశిష్టత చాటాలి. 
4. తెలంగాణను కుల రహిత రాష్ట్రంగా చేయండి. అందరినీ ఒకేలా చూడాలి. 
ఈ సమయంలో నేను చెబుతున్న మరో మాట సహేతుకమో? కాదో? తెలియదుగానీ ఈ చివరి క్షణాల్లో నాకు తెలియజేయడానికి వేరే దారి లేదు. 
అన్ని పార్టీల నాయకులు, ముఖ్యమంత్రి, సింగరేణి కాలరీస్ యాజమాన్యాన్ని ఉద్దేశించి చెబుతున్నాను.. గతంలో గనుల్లో పనిచేసే ప్రతీ ఉద్యోగి కుటుంబంలో ఒకరికి సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగం ఇవ్వాలన్న ఒప్పందం ఉండేది. అయితే, చంద్రబాబునాయుడు ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు. అప్పట్లో ఓ సింగరేణి కాలరీస్ కార్మికసంఘం దీనికి వంతపాడింది. దీనివల్ల సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయాయి. సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్టింగ్ విధానానికి పెద్దపీట వేస్తుండటంతో పర్యావరణానికి నష్టం కలగటంతోపాటు ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది. దయచేసి ఉద్యోగి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చేసుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించండి. ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపండి. 
నేను దీనికోసం ఆత్మహత్య చేసుకుంటున్నానని ఏమాత్రం అనుకోవద్దు. జేఎన్‌టీయూలో ఎంటెక్ చేస్తున్న నేను ఉద్యోగం సంపాదించుకోవటం పెద్ద కష్టం కాదు. 
తెలంగాణ ప్రజలు, నాయకులు అన్నాహజారే లోక్‌పాల్ బిల్లుకు మద్దతునివ్వాలి.

తెలంగాణ ఉద్యమం కోసం మరో విద్యా కుసుమం రాలిపోయింది. సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రి చిదంబరం శుక్రవారం నాడు పార్లమెంటులో చేసిన తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన గని కార్మికుని బిడ్డ శ్రీకాంత్ శనివారం సాయంత్రం తన ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా మందమపూరిలోని రామన్ కాలనీ నివాసి రామటెంకి చిన్న సమయ్య కాసిపేట గనిలో కార్మికుడు. ఆయన ఏకైక సంతానం శ్రీకాంత్. పాతికేళ్ల యువకుడు. ఇటీవలే బెంగళూరులో ఎంటెక్ పూర్తి చేశాడు. తెలంగాణ రాష్ట్రం పట్ల ఆకాంక్షతో ఉండేవాడు. గత నెల జూలై 30వ తేదీనే మరణశాసనం రాసుకున్నాడు.

ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌లో తాను మృత్యువుకు దగ్గరవుతున్నానని, బహుశా ఆగస్టు మొదటి వారంలో చనిపోతానని మెసేజ్ కూడా పెట్టాడు. కొందరు స్నేహితులు అతడిని వారించారు. అయితే.. చెప్పినట్లే ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకుంటాడని వారు కూడా ఊహించలేక పోయారు. చనిపోవడానికి కొద్ది సేపటి ముందు నమస్తే తెలంగాణ పత్రికకు తన ఆత్మహత్య లేఖను ఈమెయిల్ చేశాడు. తాను ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడో సవివరంగా ఆంగ్లంలో రాశాడు. తెలంగాణను అడ్డుకుంటున్నారంటూ చిదంబరంతో పాటు పలువురు సీమాంధ్ర నేతల కుటిల పన్నాగాలను నిరసించాడు. పలువురు తెలంగాణ నేతలకు సూచనలు చేశాడు. ఆ ఈమెయిల్ నమస్తే తెలంగాణకు అందిన వెంటనే కాపాడేందుకు వెంటనే ఫోన్ చేసినా.. అప్పటికే శ్రీకాంత్ ఇల్లు రోదనలతో నిండిపోయింది! 

రెండు రోజుల కిందటే ఇంటికి
రెండు రోజుల కిందటే ఇంటికి వచ్చిన శ్రీకాంత్, శుక్రవారం టీవీలో పార్లమెంటు సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను చూశాడు. ఆ తర్వాత చాలా నిరుత్సాహంగా కనిపించాడని తల్లిదంవూడులు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తన ల్యాప్‌టాప్ తీసుకొని ‘నేను చదువుకుంటాను. బ్యాంకు పరీక్షలకు సిద్ధం కావాలి’ అని చెప్పి, గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. సాయంత్రం వేళ కరెంట్ పోయినా బయటకు రాలేదు. తలుపు తట్టినా, సెల్‌కు ఫోన్ చేసినా స్పందన లేదు. ఆందోళనకు గురైన కుటుంబీకులు కిటికీ తొలగించి చూడగా చీరతో దూలానికి ఉరేసుకుని కనిపించాడు.
తండ్రి, కొడుకులు ఇద్దరు ఉత్తములే సింగరేణి కార్మికుడైన సమ్మయ్య 2009లో ఉత్తమ కార్మికుడిగా ఎంపికయ్యారు. శ్రీకాంత్ కూడా చదువులో ఉత్తముడే. సమ్మయ్యది ఖమ్మం జిల్లా కొత్తగూడెం. 1998లో మందమపూరికి బదిలీపై వచ్చాడు. ఎస్సెస్సీ, ఇంటర్ శ్రీకాంత్ కొత్తగూడెంలోనే చదివాడు. వరంగల్ వాగ్దేవి కాలేజీలో బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఎంటెక్ చదివాడు. అతనికి ముగ్గురు అక్కా, చెల్లెళ్లు. ఇద్దరికీ పెళ్లిళ్లయాయి.


DEAR SIR/MADAM,

THIS IS SRIKANTH PURSUING MTECH JNTUH CAMPUS , 
I AM THE ONLY SON TO MY PARENTS AND I WANT TO BECOME THE PART OF TELANGANA AGITATION.
I REALLY FEEL BAD FOR THE STATEMENT CHIDHAMBARAM IN PARLIAMENT REGARDING SUICIDE OF REDDY,
PLEASE DONT MAKE MY SUICIDE A FALSE SUICIDE . 
I AM ENCLOSING MY SUICIDE NOTE HERE, PASSWORD : jaitelangana 

R.srikanth,
Mtech Mechatronics CR
Student at Jawaharlal Nehru Technological University 
Hyderabad Area, India
AP : +91-9052559413
TAMILNADU : +91-7845361351
KARNATAKA :+91-8095069951



FROM 
R.SRIKANTH, MTECH MECHTRONICS, CITD + JNTUH, 
(srikanth.sooth@gmail.com, ramatenkkisrikanth@gmail.com)

TO 
DEAR PARTY LEADERS OF TRS, BJP, CPI AND CONGRESS, ALL JAC and NOT TO TDP.
I AM THE ONLY SON TO MY PARENTS AND I WANT TO BECOME PART OF TELANGANA AGITATION.THE REAL TELANGANA HEROS ARE KCR AND TRS LEADERS ONLY, NOW SLOWLY T-CONGRESS SOME LEADERS ALSO COMING INTO THE HEROS LIST.
ALL TELANGANA MPS, MLAS, MLCS MUST AND SHOULD RESIGN FROM THEIR POST AND MUST ACCEPT THEIR RESIGNATIలON AT RESPECTIVE SPEAKERS. IF NOTHING POSITIVE RESPONSE REGARDING T-STATE FORMING NOT COME FROM CENTRAL , THEN ALL CONGRESS PARTY LEADERS SHOULD COME OUT OF CONGRESS PARTY AND MAKE SEPARATE T-CONGRESS PARTY OR ALLIGN WITH TRS OR CONTEST AS INDEPENDENT IN BI-ELECTION , 
WE T-PEOPLE WILL DEFINETLY MAKE YOU WIN AGAIN IN BI-ELECTION AND SHOW THE T-POWER TO CENTRAL AND PLEASE (LEADERS) DONT ACT LIKE REALLY FIGHTING FOR T-STATE, SHOW YOURS POWER TO HIGH COMMAND.
JAIPAL REDDY, DANAM NAGENDER AND OTHER LEADERS WHO ARE NOT SUPPORTING TO STATE, I FEEL ASHAMED OF THEM. THE T-PEOPLE AND T-STATE BURNING WITH AGITATIONS BUT THESE ANTI T-STATE LEADERS ARE GLUED TO THEIR POSTS.
DEAR CM KIRAN KUMAR READY AND GOVERNER NARSHIMHAN PLEASE CANCEL 14F AND CONDUCT EXAMS AND EXPRESS, DELIVER REAL FACTS IN T-STATE TO CENTRAL (SONIA GANDHI).
DEAR TRS (KCR, KTR,ETALA,HARISH RAO),BJP(SUSHMA SWARAJ,MUNDE, DATHATREYA), CPI(GURDAS GUPTA) AND CONGRESS(KK,JUPALLI,MADHU AND ALL),NAGAM AND GADAR , ALL JAC , WHO ALL SUPPORTING FOR TELANGANA STATE , DONT STOP FIGHTING , WE ALMOST CAME TO SEPARATE T-STATE FORMING, I HOPE MY LIFE WILL LIGTHEN OR BOOST UP YOUR STRENGTH AND ALLOW OR RISE ALL T-PEOPLE TO FIGHT FOR T-STATE.
DEAR SUSHMA SWARAJ AND GURUDAS GUPTA GARU, I REALLY IMPRESSED WITH YOUR SPEECHS IN PARLIAMENT AND HERE SIMA ANDHRA MPS NOT UNDERSTADING THE SITUATIONS IN T-STATE BUT AP OUTSIDE PEOPLE UNDERSTANDING THE PAIN, MAM AND SIR KINDLY SUPPORT US FOR FORMING OF SEPARATE T-STATE. 
DEAR KCR GARU PLEASE SHOW YOUR STRENGTH AGAIN , DONT BE CLAM IN THIS LAST SITUATIONS ,,,,,,,YOURE THE REAL HERO WHO MADE THE T-STATE DREAM INTO REALITY.I AM FAN TO YOU AND WE FRIENDS CALL YOU AS MAMAYA TO T-STATE LOVE YOU SIR KCR AND I AM REALLY SORRY FOR PROFESSOR JAYA SHANKER SIR, WE ALL PEOPLE LIKE SIR VERY MUCH AND HIS LIFE IS MOTIVATION TO ALL
SIR KODANDA RAM GARU AND T-JAC PLEASE MAKE GOOD IDEAS OR WAYS, HOW TO GET T-STATE QUICKLY EVENTS LIKE SAKALA JANULA SAMME AND MORE
DEAR KK SIR AND T-CONGRESS PEOPLE DONT FALL BACK ,YOU LEADERS DOING GREAT JOB NOW AND RISE THE TEMPERATURE OF HIGH COMMAND MORE AND MORE WITH YOUR REVERSE ATTACKING.
NAGAM JANARDAN AND LEADERS WHO CAME OUT OF TDP FOR T-STATE , I AND WE T-STATE PEOPLE REALLY APPRECIATING YOU, BUT 1 SUGGESTION TO YOU SIR DONT BE SINGLE AND DO WAR AND JOIN IN TRS OR ANY PARTY OR OTHER SOURCE WHO REALLY FIGHTING FOR T-STATE..DONT MAKE YOUR CAREER LIKE DEVENDAR GOUD
GADAR SIR.YOUR REALLY DOING GOOD , YOU HAVE MUCH POWER TO SHOW THE THINKS TO HAPPEN AS MY KNOWLEDGE YOUR NOT SHOWING THAT MUCH EFFORT.. SO SIR KINDLY SHOW YOUR POWER TO STATE AND CENTRAL,THE NEED OF SEPARATE T-STATE. I FROM CHILDHOOD LISTING YOUR GREAT VOICE.
SONIA GANDHI AND YOUNG RAHUL GANDHI, PLEASE RECOGNISE THE REAL FACT IN TELANGANA STATE AND GIVE SEPARETE STATE AS EARLY AS POSSIBLE. DONT MAKE MORE PEOPLE TO DIE FOR T-STATE. I HOPE THIS IS MY LAST SUICIDE FOR T-STATE.
TODAY 5-8-11 CHIDAMBARAM TOLD IN PARLIAMENT THAT REDDY SUICDE IS NOT REAL OR HE ONLY WRITTEN SUICDE STATEMENT OR SOME OTHER, I FEEL BAD FOR THE STATEMENT; WE PEOPLE REALLY HEARTFULLY COMMITING SUICIDE AND PLEASE DONT MAKE MY DEATH AS FALSE SUICIDE ,CHIDAMBARAM GET CLARITY WITH MY SUICIDE ,THAT I AM COMMITING SUICIDE FOR T-STATE FORMATION ONLY. 
AFTER T-STATE FORMING PLEASE PROVIDE 
1. FREE EDUCATION TO ALL STUDENTS FROM KG TO PG.
2. PROVIDE MAXIMUM JOBS TO ALL STUDY COMPLETED STUDENTS (FROM XTH TO PG).
3. PLEASE MAKE T-STATE AS NUMBER 1 STATE IN WORLD IN MATTER OF LITERACY, JOBS, RESOURCES UTILIZING, INDUSTRIES, CORE AND SOFTWARE JOBS AND IN ALL OTHER EVENTS OR ACTIVITES LIKE TOURISM,HISTORICAL 
4. MAKE T-STATE AS CASTE FREE STATE AND GIVE ALL PEOPLE SAME IMPOTANCE. 
HERE I WOULD LIKE TO EXPRESS MY INNER FEELING, WHETHER THIS IS RIGHT TIME TO EXPRESS OR NOT .BUT IN LAST MOMENTS, I HAVE NO OTHER WAY TO DELIVER, SO.
TO
ALL PARTY LEADERS AND CM AND CHAIRMAN OF SCCL,
IN MY CHILDHOOD SINGARENI SCCL COMPANY HAVING 1 AGREEMENT THAT PEOPLE WORKING IN MINES THAT MAN 1 CHILD BOY OR GIRL CAN GET HIS JOB.
BUT THAT AGREEMENT WAS CANCELLED BY THE TDP CHANDRABABU NAIDU AND SOME SCCL UNION AT THAT TIME, WITH THAT ACTION MADE, MANY SCCL FAMILIES WENT TO DARKNESS AND STILL FACING LOT OF PROBLEMS.STILL UNDER GROUND MINING WORKERS FACING MANY PROBLEMS AND COMPANY GOING FOR OPENCAST MINING, WHICH EFFECT BAD ENVIRONMENT TO NATURE ,PEOPLE LIVING NEAR BY PLACES AND ALSO DECREASE MAN POWER,WHICH LEAD S TO LESS JOBS.
PLEASE AGAIN BRING THAT AGREEMENT TO EXISTENCE IN SCCL COMPANY AND MAKE MINE WORKERS FAMILY BRIGHTFULL FUTURE.THESE CAN HELP MANY WORKERS FAMILIES IN MINING REGION.
DONT CONSIDER ME, I AM SUICIDING FOR SCCL JOB SAKE, NO WITH MY QUALIFICATION FROM JNTU AND CITD CAMPUS, I WILL GET JOB WITH MY MTECH.
WE T-STATE PEOPLE AND LEADER SHOULD SUPPORT ANNA HAZARE LOKPALL BILL.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

meereppuDu telamgaaNiki praaNatyaagam cEstunnaaru?

Who Am i? చెప్పారు...

@ అజ్ఞాత

First u die for your so called Samkya Andra then other people will decide