7, డిసెంబర్ 2008, ఆదివారం

మొబైల్ నెట్వర్క్ నూ హైజాక్ చేసిన పాక్

భారత్‌పై జరుగుతున్న టెరర్రిస్టు దాడులతో తమకు ఎలాంటి సంబంధాలు లేవంటూ పాకిస్తాన్‌ ఎప్పటికప్పుడు పతివ్రత మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. ముంబై దాడుల తరువాత కూడా అదే పనిగా పాత పాటే పాడుతూ వస్తున్నది. అధికారంలో ముషారఫ్‌ ఉన్నా, జర్దారీ ఉన్నా అదే తంతు.. దాడుల్లో అరెస్టు అయిన అజ్మల్‌ కసావ్‌ భారత్‌పై టెరర్‌ దాడులకు సంబంధించి ఒక్కో అంశాన్ని బయటపెడుతున్న కొద్దీ విస్మయం కలుగుతోంది. ముంబయికి సముద్ర మార్గంలో ఉగ్రవాదులను పంపించే కార్యక్రమాన్ని పాక్‌ నౌకాదళం స్వయంగా పర్యవేక్షించింది. మరోవైపు పాకిస్తాన్‌ స్థల సేన కాశ్మీర్‌ సరిహద్దుల్లో పాకిస్తాన్‌  సరికొత్త ముప్పును తెచ్చి పెట్టింది.  సరిహద్దుకు ఆవలివైపున తన భూభాగంలో  తొమ్మిది మొబైల్‌ టవర్లను నెలకొల్పడంతో  మన దేశ అంతర్గత భద్రతకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ పెను ప్రమాదాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే గమనించింది. అయినా కొట్టడానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. భారత్‌ పాకిస్తాన్‌ సరిహద్దు లోని మునబావ్‌ దగ్గర హద్దుకు ఆవలి వైపున పాకిస్తాన్‌ భూభాగంలో ఒకదాని వెంట ఒకటిగా కనిపిస్తున్న మొబైల్‌ టవర్లు ఏర్పాటు చేసింది. వీటిని చూస్తేనే చాలు.. మన భూభాగంలోని గ్రామాల ప్రజల గుండెల్లో రైళు్ల పరిగెత్తిస్తున్నాయి. ఈ టవర్ల వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లనుందో సామాన్యుడికి సైతం అర్థమవుతున్నా, మన ప్రభుత్వానికి మాత్రం ఇంకా ఈ విషయం పట్టనే లేదు. ఈ మొబైల్‌ టవర్ల వల్ల రాజస్థాన్‌లోని మొత్తం మొబైల్‌ నెట్‌వర్‌‌క పాకిస్తాన్‌ చేతుల్లోకి వెళ్లినట్లయింది. ఈ ప్రమాదం ఏ స్థాయికి వెళ్లిందంటే పాకిస్తాన్‌ గూఢచారులు స్వేచ్ఛగా సరిహద్దుకు ఆవలి వైపున ఉన్న తమ సహచరులతో స్వేచ్ఛగా లోకల్‌ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు మాట్లాడుకోవచ్చు. పాకిస్తాన్‌లోని ఏదైనా నెట్‌వర్‌‌క ఫ్రీకాల్‌ ఆఫర్‌ ఇచ్చిందంటే ఇక అడ్డేముంటుంది. ఇంత ఫ్రీగా గూఢచర్యం నిర్వహించే వ్యవస్థ ప్రపంచంలోనే మరొకటి ఉండదేమో. సరిహద్దు గ్రామాల్లో మన లోకల్‌ టవర్లు పనిచేయవు.. కానీ, పాకిస్తాన్‌ టవర్ల నుంచి మాత్రం స్పష్టమైన సిగ్నల్‌‌స వస్తాయి. అంటే ఈ ప్రాంతం నుంచి సైనికులు మాట్లాడే ప్రతి మాటా పాకిస్తాన్‌లోని కాల్‌ సెంటర్లలో రికార్డు అవుతుందన్నమాట. పాకిస్తాన్‌ మొబైల్‌ నెట్‌వర్‌‌క గురించి సరిహద్దుల్లో కీలకమైన 46 ప్రాంతాల్లో మన ప్రభుత్వం దర్యాప్తు చేసింది. అందులో  39 ప్రాంతాల్లో పాక్‌ మొబైల్‌ నెట్‌వర్‌‌క బ్రహ్మాండంగా పని చేస్తున్నట్లు తేలింది.  అంటే దాదాపు సరిహద్దు అంతటా పాక్‌ మొబైల్‌ నెట్‌వర్‌‌క పనిచేస్తున్నది. సరిహద్దుల్లో మొబైల్‌ టవర్లు ఏర్పాటు చేయటం అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకం. పాకిస్తాన్‌ అన్ని అంతర్జాతీయ నిబంధనలకు అతీతమని భావిస్తుంది కాబట్టే ఈ ఆగడాలకు పాల్పడుతోంది. అన్నింటికీ మించి మునబావ్‌ఖోక్రాపార్‌ రహదారిలో రాకపోకలు ప్రారంభమైన తరువాత పాకిస్తాన్‌కు చెందిన సిమ్‌ కార్డులు మన దేశంలోకి యథేచ్ఛగా వచ్చేస్తున్నాయి. కనీసం వాటిని దేశంలోకి రాకుండా అడ్డుకునే అవకాశం కూడా లేకపోయింది. ప్రభుత్వం దీనిపై దష్టి కూడా పెట్టలేదు. ఈ సమస్య తీవ్రత తెలిసి కూడా ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించటం లేదు. సరిహద్దు గ్రామాల ప్రజలకు సమాచార వ్యవస్థ ఎంత అవసరమో, అంతకంటే మించి దేశ భద్రత ముఖ్యం. ఇందుకోసం సరిహద్దుల్లో మొబైల్‌ నెట్‌వర్‌‌క పని చేయకుండా జామర్లు ఏర్పాటు చేయటం అత్యవసరం. పాకిస్తాన్‌ విషయంలో మన ప్రభుత్వాలు ఇప్పటికే దారుణమైన అలసత్వాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాయి. దాని ఫలితాన్ని ముంబయిలో నాలుగుసార్లు.. మిగతా చోట్ల పలుమార్లు  అనుభవించాం. ఇప్పటికైనా నేతలు కళు్ల తెరిస్తే ఈ దేశ ప్రజలు గుండె నిండా నిద్ర పోతారు.


కామెంట్‌లు లేవు: