7, డిసెంబర్ 2008, ఆదివారం

ఇవీ మన దేశంపై జరిగిన దాడులు

మన దేశంలో టెరర్రిజం 1970వ దశకంలో మొదట కళు్ల తెరిచింది. అప్పటి నుంచి నాలుగేళ్ల క్రితం అంటే 2004 వరకు 4100 టెరర్రిస్టు దాడులు భారత మంతటా రకరకాల స్థాయిల్లో జరిగాయి. ప్రపంచ టెరర్రిజం డేటాబేస్‌ ఈ సమాచారాన్ని ధృవీకరించింది. ఈ డేటాబేస్‌ను అమెరికాలోని మేరీలాండ్‌ యూనివర్సిటీలోని స్టడీ ఆఫ్‌ టెరర్రిజం, రెస్పాన్సెస్‌ టు టెరర్రిజం విభాగాలు నిర్వహిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం 1970 నుంచి 2004 వరకు జరిగిన దాడుల్లో దాదాపు 12540మంది మృత్యువాత పడ్డారు.  దాదాపు సగటున ఏడాదికి 360 మంది చనిపోతున్నారు. 1991, 1992లలో భారత్‌లో ఉగ్రవాదం పరాకాష్టకు చేరుకుంది. ఆ రెండేళ్లలో వరుసగా 1184, 1132 మంది తీవ్రవాదుల ముష్కర చర్యలకు చనిపోయారు. దేశంలో జరుగుతున్న టెరర్రిస్టు దాడుల్లో 38.7శాతం ఫిదాయూలు ఇతర రూపాల్లో నేరుగా దాడులు జరపడం కాగా, 29.7శాతం బాంబు పేలుళ్ల రూపంలో జరుగుతున్నాయి. 25.5 శాతం హత్యల రూపంలో కొనసాగుతున్నాయి. 
దేశంలో 1993 నుంచి చోటు చేసుకున్న ప్రధాన టెరర్రిస్టు దాడుల వివరాలు...
12 మార్చి 1993.. బొంబాయిలో బాంబు పేలుళు్ల.. 257 మంది మృతి
14 ఫిబ్రవరి 1998..కోయంబత్తూరు బాంబు పేలుళు్ల.. 46మంది మృతి
1 అక్టోబర్‌, 2001.. శ్రీనగర్‌ అసెంబ్లీపై ఉగ్రవాదుల దాడి.. 35 మంది మరణం
13 డిసెంబర్‌, 2001.. పార్లమెంటు భవనంపై ఉగ్రవాదుల దాడి.. 7గురు మృతి..
21 డిసెంబర్‌ 2001.. కర్నూలు ట్రైన్‌ క్రాష్‌.. 20 మంది మృతి
10 సెప్టెంబర్‌, 2002.. రఫీగంజ్‌ రైలు దుర్ఘటన.. 130 మంది మృతి
27, ఫిబ్రవరి, 2002.. గుజరాత్‌లో గోధ్రా దహనం.. 55మంది మృతి
24 సెప్టెంబర్‌, 2002.. గుజరాత్‌ అక్షరధామ్‌ గుడిపై టెరర్రిస్టుల దాడి. 31 మంది మృతి 
13, మార్చి, 2003.. ముంబై రైల్లో బాంబు దాడి.. 11 మంది మృతి
14 మే, 2003 జము్మ ఆర్మీ క్యాంప్‌పై టెరర్రిస్టుల దాడి.. 30మంది మృతి 
25 ఆగస్టు, 2003.. ముంబయిలో రెండు కారు బాంబు పేలుళు్ల.. 60 మంది మృతి
15 ఆగస్టు, 2004.. అసోంలో బాంబు పేలుడు.. 16 మంది స్కూలు పిల్లల మరణం
5, జూలై, 2005.. అయోధ్యలో రామజన్మభూమిపై టెరర్రిస్టుల దాడి..
29 అక్టోబర్‌, 2005.. న్యూఢిల్లీలోని మూడు మార్కెట్లలో పేలుళు్ల.. 70 మంది దుర్మరణం
7, మార్చి, 2006..వారణాసిలోన సంకట్‌ మోచన్‌ మందిర్‌లో పేలుళు్ల..21మంది మృతి
11 జూలై  2006.. ముంబై లోకల్‌ రైళ్లలో ఏడు బాంబుల పేలుళు్ల.. 209 మంది మృతి
8 సెప్టెంబర్‌ 2006..ముంబై సమీపంలోని మాలేగావ్‌లో వరుస పేలుళు్ల.. 32 మంది మృతి
19 ఫిబ్రవరి, 2007.. సంఝోతా ఎక్‌‌సప్రెస్‌లో పేలుళు్ళ.. 66మంది సజీవ దహనం
18 మే, 2007.. హైదరాబాద్‌ మక్కా మసీద్‌లో పేలుడు..11 మంది మృతి
25ఆగస్టు, 2007..హైదరాబాద్‌ లుంబినీపార్‌‌క, గోకుల్‌చాట్‌లలో పేలుళు్ల.. 42మంది మృతి
11 అక్టోబర్‌, 2007..ఆజ్మీర్‌లో బాంబు పేలుడు.. ముగ్గురి మృతి
14 అక్టోబర్‌, 2007.. లూథియానా సినిమాహాల్‌లో పేలుడు.. ఆర్గురు మృతి.
24 నవంబర్‌ 2007.. లక్నో, వారణాసి, ఫైజాబాద్‌లలో పేలుళు్ల...16మంది మృతి
13 మే, 2008.. జైపూర్‌లో తొమ్మిది చోట్ల వరుస పేలుళ్లు 63మంది దుర్మరణం...
25 జూలై 2008..బెంగళూరులో ఎనిమిది చోట్ల చిన్న చిన్న బాంబుపేలుళ్లు.. ఇద్దరు మృతి
26జూలై, 2008.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 17చోట్ల వరుస బాంబు పేలుళు్ల.. 45 మంది మృతి..
13 సెప్టెంబర్‌, 2008.. న్యూఢిల్లీ మార్కెట్లలో అయిదు చోట్ల పేలుళు్ల..21 మంది మృతి
27 సెప్టెంబర్‌, 2008.. ఢిల్లీ పూల మార్కెట్‌లో రెండు బాంబు పేలుళు్ల.. ఒకరి మృతి
29 సప్టెంబర్‌, 2008 మహారాష్ట్ర, గుజరాత్‌లలో పేలుళు్ల.. 10 మంది మృతి
29 సెప్టెంబర్‌, 2008.. మాలేగావ్‌లో మళ్లీ పేలుళు్ల.. 7గురు బలి
1 అక్టోబర్‌, 2008... అగర్తలాలో బాంబు పేలుడు.. నలుగురు మృతి
21 అక్టోబర్‌ 2008.. ఇంఫాల్‌లో బాంబు పేలు.. 17 మంది మృతి
30 అక్టోబర్‌ 2008, అసోంలో 11 బాంబు పేలుళు్ల.. 77మంది మృతి
26 నవంబర్‌, 2008, ముంబయిలో  ఉగ్రవాదుల దాడి.. 183 మంది మృతి

2 కామెంట్‌లు:

శ్రీ చెప్పారు...

"1970 నుంచి 2004 వరకు జరిగిన దాడుల్లో దాదాపు 12540మంది మృత్యువాత పడ్డారు. దాదాపు సగటున ఏడాదికి 360 మంది చనిపోతున్నారు."

ప్రభుత్వం ఉగ్రవాదం మీద ఉక్కుపాదంతో తొక్కక్కరలేదు, కనీసం ఉత్త పాదంతో తొక్కినా చాలా ప్రాణాలు కాపాడి ఉండచ్చు.

మన దేశం పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాల మీద ఎందుకు దాడులు జరపకూడదు?

సెప్టెంబరు 11 నాడు చనిపోయిన వెయ్యి మందికి ప్రతీకారంగా ఆఫ్గనిస్థాన్ మీద అమెరికా దాడులు జరిపింది. ఇన్ని వేల ప్రాణాలు పోయినా మనకి ప్రతీకార జ్వాలలు రగలడంలేదా?

వయసు పైబడి బీ.పీ,షుగర్ ఎక్కువయి ఉప్పు,కారం తినడం మానేసిన శరీరాలకి చలనం ఎపుడు కలుగుతుందో?

అజ్ఞాత చెప్పారు...

metrama mana rajakiyanayakulu terrarist kanna danger. mundu vella pani pattali. desam gurinchi think cheyyani chettanayallu. mundu mana guri veella meeda pettali.