8, జనవరి 2011, శనివారం

లగడపాటి శ్రీకృష్ణ..,

శ్రీకృష్ణ ఇంటిపేరు లగడపాటి అని మార్చుకుంటే బాగుంటుందేమో.. సర్కారీ లెక్కలు.. ఓ పక్క.. లగడపాటి వారి తొమ్మిది భాగాల రిపోర్టు ఒక పక్క రెండూ జత చేస్తే.. శ్రీకృష్ణవారి నివేదిక.. శ్రీకృష్ణ నివేదికలో మొత్తం తొమ్మిది చాప్టర్లు ఉన్నాయి.  ఆంధ్రులతో తెలంగాణా వాళ్లు బలవంతంగా విలీనం అయినప్పటి నుంచి అనేక అంశాలపై లగడపాటి వారు విడివిడిగా చాప్టర్ల వారిగా శ్రీకృష్ణుడు ఇబ్బంది పడకుండా అందించారు.

రాష్ట్ర ఏర్పాటు.. పెద్ద మనుషుల ఒప్పందం
హైదరాబాద్
నిధుల కేటాయింపు అభివృద్ధి
సామాజిక, సాంస్కృతిక, భాష అంశాలు
కోస్తాంధ్ర, రాయలసీమ వెనుకబాటు..
శాంతి భద్రతలు
ఉద్యోగాలు- నియామకాలు,
రాష్ర్ట విభజన..
విద్యాసంస్థలు, వైద్య విద్యలు
ఇలా లగడ పాటి వారు చాప్టర్ల విభజన చేసి మరీ శ్రీకృష్ణకు అందించారు.

మొన్న రిలీజ్ అయిన శ్రీకృష్ణ నివేదికలోని చాప్టర్లను గమనించండి...
1. రాష్ట్రంలో పరిణామాలు, చారిత్రక నేపథ్యం
2. ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, సమతౌల్యత
3. విద్య, వైద్యం
4. నీటి వనరులు, సాగునీటి అభివృద్ధి
5. ఉద్యోగాలు
6. హైదరాబాద్
7. సామాజిక, సాంస్కృతిక అంశాలు
8. శాంతి భద్రతలు, అంతర్గత భద్రత
9. భవిష్యత్తుకు సూచనలు

ఇంక మిగతావాళ్లు ఇచ్చిన నివేదికలను, రిపోర్టులను, సిడిలను పరిశీలించే అవసరమే కమిటీకి లేకుండా పోయింది. తొమ్మిది నెలల్లో దాదాపు పది సార్లు రాష్ట్రంలో తిరగడానికే సరిపోయింది. ఇక లక్షలాదిగా తమ చేతికి వచ్చిన రిపోర్టులను పరిశీలించే సమయం, తీరిక, ఓపిక ఎక్కడుంటుంది? ఆ కాగితాల కట్టలు, సీడీల ముక్కలు రీసైక్లింగ్‌కి పంపించి ఉంటారు. ఇన్ని రిపోర్టులను పరిశీలించి, సమగ్రంగా వాస్తవాలను గ్రహించటానికి కనీసం అయిదారేళ్లయినా కమిటీకి పట్టి ఉండాలి.. ఎంత గొప్ప కమిటీ అయినా, ఎంత టెక్నాలజీ ఉన్నా సరే.. కేవలం తొమ్మిది మాసాల్లో వీటన్నింటినీ క్రోడీకరించటం అంత సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే విజ్ఞాన్‌భవన్‌లో వారికిచ్చిన ఆఫీసు కానీ, కంప్యూటర్లు కానీ, జీతభత్యాలు కానీ, రానుపోను ఖర్చులు కానీ, అన్నీ కలిపితే పదిహేను కోట్ల రూపాయల ఖర్చయిందని శ్రీకృష్ణ కమిటీ లెక్కలు చెప్తున్నాయి. అయిదుగురు సభ్యులతో పాటు వారి దగ్గర ఉన్నది 28 మంది అధికారులు, ఇతర సిబ్బంది.. మిగతా టెక్నికల్‌సపోర్ట్.. అవసరమైన డాక్యుమెంట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేకరించింది. ఫిబ్రవరి 3 2010న కమిటీ ఏర్పాటైంది. ప్రజల నుంచి విన్నపాల కోసం అదేనెల 20న తొలి నోటిఫికేషన్‌ను 32 పత్రికల్లో ప్రచురించారు. అప్పటికి కమిటీకి పూర్తి స్థాయిలో సిబ్బందిని ఇవ్వలేదు. మార్చి 22న రెండో నోటిఫికేషన్‌ను పబ్లిష్ చేశారు. ఏప్రిల్ 10 చివరి తేదీగా నిర్ణయించారు. ఆ తరువాత జూన్ చివరి దాకా వివిధపార్టీలతో సమావేశమయ్యారు. 23 జిల్లాలను వంతుల వారిగా తిరిగి వచ్చారు. ఇక మిగిలింది జూలై నుంచి డిసెంబర్ దాకా సుమారు 34 సార్లు కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ ఆరు నెలల్లోనే ఇన్ని లక్షల విన్నపాలను చదవటం సాధ్యమైందా? కేవలం 28 మంది సిబ్బందితో ఇన్ని విన్నపాలను క్రోడీకరించటం సాధ్యపడిందా? అన్ని వైపుల నుంచి విన్నపాలను పరిశీలించి ఎక్కువ మందికి సంతృప్తిని కలిగించే రిపోర్టును ఇచ్చామని చెప్పారు. అన్నింటినీ పరిశీలించి ఉంటే ఫుట్‌నోట్ మొత్తం కేవలం ప్రభుత్వం నుంచి తీసుకున్న రిపోర్టుల ఆధారంగానే నివేదికను రూపొందించినట్లు స్పష్టంగా చెప్పింది. మరి మిగతా వారి నివేదికల్లో వాస్తవాలను నిర్ధారించేదెవరు? అవన్నీ తప్పుల తడకలనీ, చెత్త కాగితాలనీ అర్థమా? ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదన్న ఆరోపణపైనే కదా ఉద్యమం మొదలైంది..ఇంత ఆందోళన.. ఇన్ని మరణాలు.. సర్కారు నుంచి తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదనే కదా...  మరి అలాంటప్పుడు ప్రభుత్వం ఇచ్చిన లెక్కలను వాస్తవాలతో సరిపోల్చి చూసుకుని నిజాల్ని నిర్ధారించాల్సిన బాధ్యత కమిటీపై లేదా?  వాస్తవాలను నిర్థారించకుండా రెడ్డొచ్చె మొదలాడే అన్నట్లు ఎవరో ఇచ్చిన ఏకపక్ష నివేదికను కార్బన్ కాపీ చేసి ప్రచురించేసి ఓ పని అయిపోయిందనిపించుకుంది. ఇంతోటి దానికి ఇన్ని నెలలు వారికి జీతభత్యాలు.. బుగ్గకార్లు.. సెక్యూరిటీలు.. అన్నింటికీ మించి తెగ హడావుడి.. ఆ కమిటీలో లగడపాటినే మెంబర్‌ను చేస్తే ఒకే ఒక్కరోజులో నివేదిక ఇచ్చేవాడు కదా... సోనియమ్మకు కావూరి ఆ అయిడియా ఇవ్వలేదేమో.. పాపం ఆయనకు సూట్‌కేస్‌లు మోయటం తప్ప ఐయిడియాలు ఇవ్వటం తెలియదు కావచ్చు...
కొసమెరుపు..
ఒక చట్టబద్ధమైన కమిటీ తాను చర్చించాల్సి వారితో చర్చించి సమాచారాన్ని సేకరించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి. ఇంతవరకే దాని బాధ్యత. దేశంలో గతంలో వేసిన కమిటీల చైర్మన్లది కొంచెం తెలివైతే.. శ్రీకృష్ణది అతి తెలివి. ఆయన చేసినంత హడావుడి అంతా ఇంతా కాదు..మీడియాతో ప్రెస్ కాన్ఫరెన్స్‌లు... వారికి విందుభోజనాలు.. బహుమతి ప్రదానాలు.. వావ్.. సూపర్.. హైదరాబాద్‌లో, ఢిల్లీలో చివరిసారిగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్సుల్లో విలేఖరులకు ఒక్కొక్కరికి టైటాన్ గడియారాలు దొరికాయి. వాటి విలువ ఎంతో తెలుసా.. ఒక్కొక్కటి సుమారు ఎనిమిది వేల రూపాయలు.
 ఇక దుగ్గల్  దొరవారు.. తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి వారు పిలవగానే వారి ఇంటికి వెళ్లి తెగ మంతనాలు జరిపి వచ్చారు.. ఇదేం నైతికత అంటే అబ్బే అదేం లేదు లేదు.. మీరు మమ్మల్ని అనుమానించనే అక్కర్లేదు.. తెలంగాణ ఎంపి పిలినిచా వెళ్తానన్నారు.. కానీ, సూట్‌కేస్‌లు ఇవ్వటానికి తెలంగాణ ఎంపిలకు ఏమీ లేదు.. అంత దమ్మూ ధైర్యమూ లేదు.. అమ్మగారు.. బెంగాలీ బాబుగారి దగ్గర జీహుజూర్ అనటానికి తప్ప ఎందుకూ పనికిరారు. పైన విలేఖరులకు గడియారాలిచ్చారని చెప్పానే... వాటి స్పాన్సరర్ ఎవరో తెలుసా... ఇంకెవరు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి.. బుర్ర ఉన్న ప్రబుద్ధాంధ్రులు  ఎలాగూ తిడతారు.. కనీసం తెలంగాణా వాళ్లైనా వాస్తవాలు తెలుసుకుని చైతన్యవంతులైతే సంతోషం.

15 కామెంట్‌లు:

satya చెప్పారు...

కమిటీ ఏర్పరిచినప్పుడు 10 నెలలు ఎందుకు కమిటీకి? ఇవ్వాలనుకుంటే పది రోజుల్లో ఇవ్వొచ్చు అన్నప్పుడు తెలీలేదా వాస్తవాలు క్రోడీకరించాలంటే ఎన్ని రోజులు పడుతుందో? ఈ రోజు ఎందుకొచ్చినై ఈ అనుమానాలు? మీరు అప్పనంగా సాగించిన కట్టుకధలు బయట పెట్టినందుకా?

అజ్ఞాత చెప్పారు...

Sour grapes! Instead of indulging in below the belt allegations--try read the report, analyze and substantiate your grievances with proof.

అజ్ఞాత చెప్పారు...

shame on you to throw mud on such a integral person. they is a way to express displeasure and discontent. come up with rational and logical reason before throwing allegation on committee members

kovela santosh kumar చెప్పారు...

its not shame.. i am not throwing mud on any body.. it is on record.. mr. duggal has gone to tsr house for dinner at the end of tennure. it is an unethical for any body. giving gifts for delhi journalists are very very un ethical. it is a shame for like mr. srikrishna. through out in his life i think he never given this type of contradictory report.. in which his recommendations dismissed by him self only.. it is a shame for indian judishiary. i hava logical reason. you have to comment rational,and impartial.. but you cant do that.. you are looking through one eye.. i am sorry.

satya చెప్పారు...

If I say the samething, that KCR met Chidambaram on 20th Jan after all party meeting and discussed with him privately. Does it show there is a private agreement between them?

Can you show proof where they have given Titan watches and these watches were gifts of TSR?

kovela santosh kumar చెప్పారు...

mr satya.. you are saying some things only... mr duggal gone tsr's house. duggal him self admitted that. iam saying it is un ethical.. duggal playing keyroll inthe committee.. he can not to do like that. he is the member secretery of commeettee.. if kcr invites mr. duggal to his house to dinner it is also unethical. u did not want to agree this.. then nothing to say with you.

అజ్ఞాత చెప్పారు...

Mr Santosh how did you forgot the fact Mr Duggal had visited earlier to the houses of Tenlangana Leaders too. It silly that with Titan watches as gifts a report has came in the favor of United andhra.

అజ్ఞాత చెప్పారు...

ఒరే పనికిమాలిన అజ్ఞాతా!
"how did you forgot"; "report has came" ...
నీ ఇంగ్లిష్ తగలడ! ముందు ఇంగ్లిష్ నేర్చుకోరా వెధవ!

అజ్ఞాత చెప్పారు...

ఎవరండి, ఆ బ్లాగుల్లో ఇగ్లీసు చెప్పించే కాంట్రాక్ట్ తీసుకున్న అజ్ఞాత? ఏదీ ఓ సారి ఫేసు టర్నింగిచ్చుకోండి. ఆయ్నట్లానే మాట్లాడుతాడు, అర్థమైందా లేదా అని మాత్రమే చెప్పు. ఆయనకి మీరు ఇంగ్లీసు క్లాసులు పీకాల్సిన పనిలేదు.

satya చెప్పారు...

I asked for the proof but u brushed it away by saying nothing to say with you. Typical seperatists attitude.

అజ్ఞాత చెప్పారు...

కాస్త లేచి మొహం కడుక్కుని కమిటీ ఇచ్చిన రిపోర్టు చదివి వాళ్ళు ఇచ్చిన లెక్కల్లో ఏమైనా తప్పుంటే బ్లాగులో రాసుకోండి.అనవసరమైన చెత్త రాసి మీ సమయం మా సమయం ఎందుకు వ్రుధా చేస్తారు.

అజ్ఞాత చెప్పారు...

BN శ్రీక్రిష్ణ, లగడపాటి శ్రీక్రిష్ణ చింతలపాటి శ్రీక్రిష్ణ అందరొకళ్ళేనేమో

kovela santosh kumar చెప్పారు...

ajnata... tappulu emi unnayo rasina angikarinche dammu meeku ledu.. a tappulemito already ee blog lo unnai.. kallu baga terichi chudandi.. tappunu oppukovataniki dhairyam kavali.. ante kani.. guddi ga panikimalina vimarshalu chesi.. telangana vaallapaina burada challite tappu oppu kadu.. meeru rastunnadi chetta antu o ninda vesi pabbam gaduputunnaru.. memu cheppede nijam.. memu cheppede nijam antoo intakalam lokanni nammistunnnaru. mee chetta vimarshalu munduga manukondi.. concreetga vimarshinche dammunte cheyandi.. adi meeku cheta kadu.. saruku leni pettelu mee burralu.. deeni paina marinta burada challatam tappa inkem cheta kadu..

అజ్ఞాత చెప్పారు...

We all know how Lagadapati keeps forgetting his family members. Maybe he asked Duggal to become his second brother :)

JustHonest చెప్పారు...

You are right Santosh.

aa durmargudiki Lagadapati kaadu entha percentage ichado.

this is the first time in Indian history to give a confidential report.

Why the bugger SK is not commenting anything on sri. Justice Narasimha Reddy's judgement ?