6, జనవరి 2011, గురువారం

హైదరాబాద్‌కు బ్రసెల్స్‌తో శ్రీకృష్ణ కమిటీ పోలిక

రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌ను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ బెల్జియంలోని బ్రసెల్స్‌తో పోల్చింది. ఇలా ఎందుకు పోల్చాల్సి వచ్చింది. కమిటీ విశ్లేషణ ప్రకారం 1968లో బెల్జియంలో బ్రసెల్స్ సిటీపై ఎవరికి హక్కులు ఉన్నాయన్న దానిపై వరుస అల్లర్లు జరిగాయి.. ఉత్తర ఫ్లామండ్ ప్రాంతం బ్రసెల్స్ సిటీ ఉంది. ఈ సమస్యను పరిష్కరించటానికి బెల్జియం రెండు సంస్కృతులు, మూడు ప్రాంతాలుగా ప్రకటించటం తప్ప మరో మార్గం కనిపించలేదు. బెల్జియంలో పది లక్షల జనాభా ఉంది. అందులో ఆరు లక్షల మంది ఫ్లెమిష్ మాట్లాడే ప్రజలు.. మిగతా నాలుగు లక్షల మంది ఫ్రెంచి మాట్లాడతారు.. చాలా తక్కువ మంది జర్మన్ మాట్లాడే వారు ఉన్నారు. ఈ రెండు వర్గాల కోసం రెండు భాషలకు సమాన రాజధాని ప్రాంతంగా, స్వతంత్ర ప్రతిపత్తి గల దేశంగా బ్రసెల్స్‌ను ప్రకటించారు.
ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా బ్రసెల్స్ మాదిరిగా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని శ్రీకృష్ణ కమిటీ పేర్కొంది.  హైదరాబాద్‌ను బ్రసెల్స్‌తో పోల్చటం అంటే ఇక్కడ కూడా ద్విభాష, ద్విజాతి సిద్ధాంతాలున్నాయని కమిటీ భావిస్తోందా? అంటే ఆంధ్ర, తెలంగాణా వాళ్లు మాట్లాడే భాషలు వేరని అనుకుందా? ఓ పక్క కామన్ కల్చర్ అంటూనే బ్రసెల్స్ ప్రస్తావన తీసుకురావటం వెనుక ఆంధ్ర, తెలంగాణ వేరు వేరని శ్రీకృష్ణ కమిటీ చెప్పటంలో ఆంతర్యం ఏమిటి?

1 కామెంట్‌:

తెలుగు చెప్పారు...

ఏహే ఆగక్కడ... ఒక పెగ్గు తక్కువయ్యి అలా అలా తప్పులుదొర్లినయంతే... మరీసారికి మాంఛి లోడ్లో రాస్తాం తీయవో...!!!