15, ఫిబ్రవరి 2010, సోమవారం

డయ్యర్‌ వారసులు...


రక్తతర్పణం జరిగింది.. విద్యార్థులతో పాటు... ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా చెప్పుకునే మీడియా ప్రతినిధుల రక్తమూ ఏరులై పారింది... ఆ రుధిర ధారల్లో భద్రతాబలగాల బూట్లు తడిసి సంబరపడ్డాయి. పోలీసులు పదఘట్టనల హోరులో విలేఖరులు, విద్యార్థుల రోదనలు రోదసిలో కలిసిపోయాయి.. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసింది ఎవరు?

ప్రశాంతంగా ఉన్న తెలంగాణాలో అగ్గి రాజేసింది ఎవరు?
ఓయులో రక్త చరిత్రను రచించిందెవరు?
కెమెరా కళ్లకు గంతలు కట్టే సాహసం చేసిందెవరు?
మీడియా ప్రాథమిక హక్కులను కాలరాసిందెవరు?
ఓయు నిషేధిత ప్రాంతమా?
మనం ఏ సమాజంలో ఉన్నాం...?
ఏమిటీ దారుణం?

ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాలో చదువుల చెట్టుకు పోలీసు చెద పట్టింది.. ఈ చెదలు ఇప్పుడప్పుడే వదిలేట్టు లేదు.. ప్రశాంతంగా ఎదుగుతున్న విద్యాఫలాలను పూర్తిగా నాశనం చేసేంత వరకు ఈ చీడ విరగడ అయ్యేట్టు కనిపించటం లేదు.. ఇంతకాలం విద్యార్థులనే పీడించిన ఈ పీడ.. ఇప్పుడు మీడియాకూ పాకింది... విచ్చలవిడిగా తాము సాగించే పాశవికత్వానికి సాక్షీభూతంగా నిలిచిన మీడియాను తొలగించటానికి మూకుమ్మడిగా విరుచుకుపడ్డ తీరు గతంలో బ్రిటిష్‌ పోలీసులకు కూడా తెలిసి ఉండదు.. జలియన్‌ వాలాబాగ్‌లో ప్రజల్ని ఊచకోత కోసిన జనరల్‌ డయ్యర్‌కు కూడా ఈపాటి తెలివి తేటలు ఉండకపోవచ్చు..

ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరుగుతున్న సందర్భంలోనైనా దానికి సంబంధించిన వార్తల్ని కవర్‌ చేసేందుకు మీడియాను అనుమతిస్తారు.. కార్గిల్‌ లోనైనా, ఆఫ్గనిస్తాన్‌లోనైనా, ఇరాక్‌లోనైనా, ప్రపంచానికి ఆ యుద్ధాల వార్తలని ప్రపంచానికి అందజేసింది మీడియానే... ప్రభుత్వానికి, ప్రజలకు ఒక వారధిలా వ్యవహరించేది మీడియా... అలాంటి మీడియా కాళ్లూ చేతులూ కట్టేసి కూర్చోబెట్టడం సాధ్యమేనా?
ఉస్మానియాను ప్రభుత్వం నిషేధ ప్రాంతంగా ప్రకటించలేదు.. ఉస్మానియా ఓ విశ్వవిద్యాలయం... రెండు నెలలుగా ఓయు కేంద్రంగా విద్యార్థులు తెలంగాణా రాష్ట్రం కావాలంటూ ఉద్యమాలు చేస్తున్నారు... వాటిని కవర్‌ చేయటం, అక్కడ చోటు చేసుకుంటున్న ఘటనలను ప్రసారం చేయటం మీడియా విధి.. వార్తలను సేకరించటం, ప్రసారం చేయటం మీడియా ప్రాథమిక హక్కు... దీన్ని కాదనే అధికారం ఎవరికీ లేదు..కానీ ఈ హక్కుపై ఇవాళ పోలీసు ఉక్కుపాదం పడింది...

ఎందుకు మీడియాను పోలీసులు టార్గెట్‌ చేసుకోవలసి వచ్చింది..? కేవలం శాంతిభద్రతలను పరిరక్షించటం కోసమే పోలీసులు బాధ్యతాయుతంగా పని చేస్తుంటే...మీడియా కవరేజి వల్ల జరిగే నష్టం ఏమిటి? అంటే, మరింకేదో చేసేందుకు పోలీసులు పూనుకున్నారు కాబట్టే... మీడియాను అక్కడి నుంచి తప్పించేందుకు పూనుకున్నారు.. వాళ్లపై లాఠీలు ఝళిపించటమే ప్రత్యామ్నాయంగా కనిపించింది... ఇంకేం.. ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయలేదు.. పది మందిపై వందల మంది ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.. కనపడ్డవారిని కనపడ్డట్టుగా చితకబాదారు..
అంతా అయ్యాక తీరిగ్గా.. అయ్యో దురదృష్టం.. సారీ... తప్పయింది.. చూసుకోలేదు.. కావాలని కొట్టలేదు.. అంటూ మాటలు చెప్పుకొచ్చారు.. ఓ పక్క సారీలు చెప్తూనే.. మరోపక్క చితక్కొట్టారు.. ఈ పరిణామం.... ఓ అరాచక వ్యవస్థను...నియంతల పరిపాలనను తలపించింది...రెండో ప్రపంచయుద్ధ కాలంలో మీడియాను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, తాను కోరుకున్న వార్తలు మాత్రమే ప్రచురితమయ్యేలా చేసుకున్న హిట్లర్‌ వ్యవస్థలో ఉన్నామా మనం?

ఉస్మానియాలో ఈ దాడి ఓ పథకం ప్రకారం జరిగిందన్నది నిర్ద్వంద్వం.. లాఠీచార్జీకి విద్యార్థులే బాధ్యులని ఇవాళ తీరిగ్గా కథలు చెప్పటం సర్కారు వారికి వెన్నెతో పెట్టిన విద్యే... వాస్తవానికి విద్యార్థులు రెండు నెలలుగా అక్కడ నిరసనలు, ప్రదర్శనలు చేస్తున్నారు.. దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు.. క్యాంపస్‌లో ఇటు సీఫెల్‌ వరకు, అటు తెలుగు విశ్వవిద్యాలయం హాస్టల్‌ వరకు ప్రదర్శనలు చేస్తారు.. నినాదాలు చేస్తారు.. ఈలోగా అక్కడ విధ్వంసం చేసేందుకు ఏమీ లేవు.. ధ్వంసం చేసుకుంటే వారి కాలేజీలను వారే ధ్వంసం చేసుకోవాలి.. వారి పుస్తకాలను వారే తగులబెట్టుకోవాలి.. అలా జరిగే అవకాశం ఎలాగూ లేదు.. అలాంటప్పుడు క్యాంపస్‌లోకి వెళ్లి అక్కడ టెంట్‌ వేయాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చింది...? క్యాంపస్‌ దాటి బయటకు వస్తే వారిని అడ్డుకోవచ్చు... అంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే క్యాంపస్‌లోపల క్యాంప్‌ పెట్టారా?
విద్యార్థులే కవ్వించారని పోలీసులు అంటున్నారు.. రెండు నెలలుగా లేని కవ్వింపు.. నిన్నటి ప్రదర్శనలోనే ఉన్నట్టుండి చోటుచేసుకుందా? ఒక వేళ విద్యార్థులు కవ్విస్తే.. ఇంత పైశాచికంగా కొడ్తారా? అది కవర్‌ చేసిన పాపానికి మీడియాపై దురాగతానికి పాల్పడతారా? ఈ ఘటనతో మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు బలగాలు చాలా చక్కని నిర్వచనం ఇచ్చాయి...ఇలాంటి పోలీసులను మనం రక్షక భటులని పిలుస్తున్నాం.. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంటుంది?
జమ్ము కాశ్మీర్‌ సరిహద్దుల్లో నిత్యం ఘర్షణలతో దద్దరిల్లిపోయే ప్రాంతాన్ని పిఓకే.. పాక్‌ ఆక్యుపైడ్‌ కాశ్మీర్‌ అని పిలుస్తారు.. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి ప్రాంతంగా పిఓయు తయారైంది.. అంటే పోలీస్‌ ఆక్యుపైడ్‌ ఉస్మానియా...

16 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

pakistani varasula meeda dayyar varasula dadi....

అజ్ఞాత చెప్పారు...

నువ్వు రాసినంత రక్త ధారలేవి కారలేదమ్మా అక్కడ....గోరంతని కొండంత చేసి రాయటంలో మన పత్రికలకి మించి పొయావు....

అజ్ఞాత చెప్పారు...

మీరు ఇలా రాస్తారని ఊహించ లేదు. గత కొని నెలలు గా పోలీసులు ఎంత ఒత్తిడి కి గురి అవుతున్నారో తెలుసా? ఈ ఉద్యమం మొదలైనది మొదలు కొని పగలు రాత్రి వాళ్లు కంటి మీద కునుకు లేకుందా ఈ ఊరూ, ఆ ఊరు తిరుగుతూ పనులు చేస్తున్నారు. నిద్ర లేచిన మొదలుకొని విద్యార్దులు <20సం|| సందులలో, గొందులలో దూరి, గోడలెక్కి పరిగెత్తూ రూల్స్ ని అతిక్రమిస్తుంటె మధ్య వయసులో ఉన్న పోలిసులు ఈ పిల్లల వెనక పరిగెత్తుతూ ఎంత కష్ట పడుతున్నరో ఈ రోజు అజాం జాహి మార్కేట్ లో గొడవ చూస్తె అర్థ మైంది. ఇంట్లొ చిన్న రెండు సం|| పిల్లలు పదే పదే బయటకి పరిగెత్తి తే తల్లిదండృలు విసుగెత్తి రెండు దెబ్బలు వేస్తారు. ఈ యువకులను తెగెదాకా లాగుతూ పోలిసులను విసుగెత్తిస్తె పైన చెప్పిన పరిణామాలే జరుగుతాయి. అయిన మీడియ వారు చేసె అతికి వాళ్ళు ఇంకొక రెండు తగిలిస్తె తెలుగు జాతి బాగా ఆనందిస్తుంది. ఎమీటి మీ మీడియా ప్రత్యేకత. మీరు ఇటువంటి వాటిని విస్లేషించ వల్;అసిన అవసరం ఎమీలేదు. కొంచెం బుర్ర ఉన్నవాడేవడు ఈ రోజు మీడీయా నమ్మరు. ఆ విలువని ఎప్పుడొ మీడియా కోల్పొయింది. ప్రశాంతంగా ఉన్న తెలంగాణాలో అగ్గి రాజేసింది ఎవరు? మీడియా నే,రోజూ కనిపించిన ప్రతి ఒక్కడిని తెలంగాణా మీద మీ అభిప్రాయమేమిటి అని అడుగుతూ, ఈ రోజు ఇంతవరకు తీసుకొచ్చారు. కనుక పోలీసులు కాదు మీడియ వారిని కోటెది ప్రజల చేత కోట్టిచుకుంటారు. పిచ్చి పిచ్చె టపాలు రాయకుండా గమ్ముగా ఉండండి. మీడియా వలన సమాజం బాగు జరగక పోగా మరింత చెడి పోయిందని అందరికి తెలుసు.

కెమెరా కళ్లకు గంతలు కట్టే సాహసం చేసిందెవరు? ఎమనుకుంట్టున్నరు మీరు ? మీరె మైనా పయన నుంచి ఊడి పడ్డార? మీకు రాయల్ ట్రిట్మెంట్ ఇవ్వడానికి.
మనం ఏ సమాజంలో ఉన్నాం...? ఏమిటీ దారుణం?
మీడియా వాళ్ళు ప్రజాస్వమ్యం లో ఉంటూ దానిని గరిష్టస్థాయి లో యక్స్ ప్లాయిట్ చేసారు. పాత్రికేయ స్వేచ్చ పేరుతో దేశాన్ని అల్ల కల్లొలం చేస్తున్నారు.

Insted of realizing your (midiyaa)mistakes you are blaming police and govt. Stop balming govt and police.

అజ్ఞాత చెప్పారు...

ore thokka naa kodaka...alias agnata.. pakistani varasulani nuvvu.. talibanlani inko moorkhudu nikrushatamga vadistaaru.. vaalu prapanchanike terraristulu.. meeru vaallanu saitam dochukuntamantunnaramte meeku peru pettedemundi...

phani kumar చెప్పారు...

congress panala kante...british palana nayam

PHANI చెప్పారు...

డయ్యర్ వారసులు చదివిన తర్వాత...దానికి వచ్చిన కామెంట్స్ చూసిన తర్వాత నా అభిప్రాయాలను
ఇక్కడ పంచుకుంటున్నను.ఉస్మానియా యూనివర్శిటీలో పోలిసులు సాగించిన దమనకాండకు కారణం
ఒక్కటే..విద్యార్దుల వాయిస్ బయటి ప్రపంచానికి తెలియకూడదు.అలా చేసుందుకు పోలీసులకు ప్రభుత్వం సర్వాధికారాలు ఇచ్చింది.అందుకే ఖాకీలు గూండాలుగా చెలరేగిపోయారు.స్టూడెంట్స్ ను, మీడియాను టార్గెట్ చేసుకొని యుద్దీకాండ కొనసాగించారు.ఓ అజ్ఞాత వ్యక్తి కామెంట్ రాస్తూ తప్పంతా మీడియాదే అన్నట్టు తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు.ముందుగా ఆ పెద్ద మనిషి ఇష్యూను ఇష్యూగా తీసుకొని అర్థం చేసుకోవండం నేర్చుకోవాలి.ఓయూ ఘటనలో మీడియా తప్పు ఇసుమంతైనా లేదు.పోలీసులే విరుచుకుపడ్డారు అనడానికి కెమెరా కళ్ళే ప్రత్యక్ష సాక్ష్యం. కుక్కల్లా మారివ మీడియా మిత్రులు...విద్యార్థినుల ప్రైవేట్ పార్ట్స్ తడుముతూ...వారిని వెంబడించిన
విషయం...మిగతా ప్రపంచానికి తెలియక పోవచ్చు.కానీ నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందించేందుకు కెమెరాలనే ఆయుధాలుగా చేసుకొని...రిపర్టింగ్ చేసిన జర్నలిస్టు మిత్రులకు తెలుసు.నియంత్రుత్వ పాలనలో మాత్రమే మీడియా గొంతు నొక్కేస్తారు. కానీ మనం వున్నది...గాంధీ మహాత్ముడి ఫోటోలను గోడకు తగిలించుకొని ప్రజాస్వామ్య పాలనలో వున్నాం. మీడియా స్వేచ్చకు సలాం కొట్టిన నెహ్రూ వారసుల పాలనలో మనం వున్నాం.వాళ్ళ ప్రెస్ మీట్లను కవర్ చేయడానికి మీడియా కావాలీ...వాళ్ళ రాజకీయ ఎత్తుఘడలకు మీడియా కావాలి..వాళ్ళ పధకాల ప్రచారానికి మాత్రం మీడియా కవాలి...కానీ..ప్రజల వాయిస్ వినిపించే విషయంలో
మాత్రం మీడియా అవసరం లేదా...ఓయూ లో జరిగింది అదే కదా...ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేసినందుకు...కుళ్ళపొడుచేశారే...ఇదెక్కడి న్యాయం. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా వుండే
మీడియా కళ్ళకు గంతలు కట్టేస్తే ..ప్రజా వాణిని ఇక వినిపించేదెవరు..? మీడియాను వెనకేసుకు రమ్మని ఎవరూ చెప్పరు. లోపం మానవ సహజం అయినప్పుడు...మీడియా కూడా దానికి అతీతం కాదు.కానీ మీడియాలొ లోపాలు వున్నాయని జరిగిన అరాచకాన్ని ఏ విధంగా
మీరు సమర్థిస్తారు.పలానా కులంలో పలానా వ్యక్తి తప్పుచేస్తే...ఇక ఆ కులం మొత్తాన్ని మన నిందిస్తామా...? మీడియా మొత్తాన్ని ఒకే గాటిన ఎలాకడతారు...? మీడియా పైనా దాడి జరగడం అంటే ప్రజాస్వామ్యం పై జరగడమే...అలాంటి దాడిని ఖండించ లేరివాళ్ళూ...డయ్యర్లు, ముషారఫ్ లు, హిట్లర్లే అవుతారు.

అజ్ఞాత చెప్పారు...

Police is doing their duty.
i went to university and we participated in agitations but we didn't behave like these students.
why don't you put your question to KCR, the man responsible for everything and the selfish politicians, that is going on including the death of innocent and emotionally disturbed students.

అజ్ఞాత చెప్పారు...

ఫణి తెగ మీడియాని వెనకేసు కొస్తున్నావు. ఇష్యూను ఇష్యూగా తీసుకొని అర్థం చేసుకోవండం నేర్చు కోవాలి, ఇటువంటి మటలు విని విని విసుగెత్తినిది. మీడియా అవసరం లేని రోజులోచ్చాయని గ్రహించాలి. అసలికి సుత్తంతా మీడియాతో నె. news లో సత్తా లేక పోయినా చెపిందె చెప్తూ, ప్రజలను విసుగెత్తిస్తూ న్నార్తు. మీరు నెహ్రూ రోజులలో మీడియాకి ఇప్పటి మిడియాకి పోలికా? మీకేదొ నాలుగు దెబ్బాలు పడి ఇగొ దెబ్బ తినింది అందువలన ఎదో ప్రజలను ఉద్దరించటానికి మీడీయా ఉన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. మీడీయ వారి సంగతి సమగ్రంగా తెలుసుకోవాలంటె 1940-50 లలో అయాన్ రాండ్ రాసిన ఫౌంటైన్ హెడ్ నవల చదివితే చాలు, వారు చేసే ప్రజా సేవ తెలుసు కోవటానికి. అమ్మఒడి బ్లాగు చదువు ప్రస్తుత మీడీయా పరిస్థి తెలుస్తుంది. నువ్వు పుట్టింది ఈ దేశంలో మీకేదొ నియంత్రుత్వ పాలన అనుభవం ఉన్నట్లు పద ప్రయోగం చేయటం.
*ప్రజా వాణిని ఇక వినిపించేదెవరు..? * నువ్వొక పిచ్చి బ్రమలో ఉన్నావు ప్రజా వాణి అని అసలికి ప్రపంచం లో ప్రజావాణి అనేది లేడు. అధికారం కొరకు జరిగె పోరాటంలో జనం మద్దతు కొరకు పేద ప్రజలు,మానవత్వం, ప్రజాస్వామ్య విలువలు అనే పెద్ద పెద్ద అర్థం కాని పదాలు ఉపయోగించి తెలివిగల తల కాయలు కొట్టుకుంట్టారు. అందువలన కనీసం కొన్ని రోజులు ప్రజా వాణి మీరు వినిపించ కుండా ఉంటె ఆ తలకాయలే రంగంలోకి ప్రత్యక్షం గా దిగవలసిన అవసరం కల్పించిన వారౌతారు. వాళ్ళ వాళ్ళు ఎత్తులు పైఎత్తులు వేసుకొని ఎవరు గెలుస్తారో వారి మీద మళ్ళి మీ మీడియా ప్రతాపం చూపించండి.

అజ్ఞాత చెప్పారు...

మీకు కొన్ని ప్రశ్నలు:

1)ఉస్మానియాలో ఏదైన జరిగినా పది నిముషాల్లోపే హరిష్రావు అండ్ పార్టీ పరుగు పరుగున ఎలా వస్తారు?
(వాళ్ళ ఇళ్ళు ఇక్కడ దగ్గర లేవే)
2)స్టూడెంట్స్ కి ఏమి కావాలన్న కె సి ఆర్ ని ఎందుకు అడుగుతారు?( ఇది ఆయన స్పాన్సర్ చేస్తున్నడా)?
3)విద్యార్ధి సభల్లో వక్తలుగా ఎవరు ఉండాలో కూడా కె సి ఆర్ యే డిసైడ్ చేస్తాడా?
4)తార్నాకలో ముష్కరుల్లా అత్యంత హేయమైన విధ్వంసానికి పాల్పడిన విద్యార్ధులని ఇంతవరకు ఎందుకు అదుపులోకి కూడా తీస్కోలేదు?
5)కాళ్ళకి చేతులకి చిన్న గాయలైన వారి పరిస్తితి చాలా విషమంగా వుంది అని ప్రైవేటు హాస్పటల్స్కి ఎందుకు తరలిస్తున్నారు..మీడియాలో ఈ వార్తలు ఎందుకు హైలైట్ చేస్తున్నారు?
6)జీ 24 గంటలు మరియు ఎ బి ఎన్ చానెల్స్ కి ఎవరు డబ్బులిచ్చి వార్తలు ఉన్నవి లేనివి వేయిస్తున్నారు?

అజ్ఞాత చెప్పారు...

@సంతొష్ కుమార్ గారు, ఇదే వ్యాసం పేపర్ లో వచ్చి ఉంటె పెద్దగ లెక్క చేసేవారం కాదు. బ్లాగు లోకం లో రాసె వ్యక్తులకు మాత్రమే విశ్వసనీయత ఉన్నాది. ఈ రోజూలలో పేపర్ ఉపయొగం ఎక్కడ ఇళ్ళు అమ్ముతున్నారు, మాల్స్ లో ఎమైనా డిస్కౌంట్ ఉన్నదా లాంటి అడ్వటైస్మేంట్ ల కే ప్రజలు ఆధార పడుతున్నారు. ప్రస్తుతానికి వీరి సంఖ్య ఎక్కువ ఉన్నాదో లేదో తెలియదుగాని ఖచ్చితం గా వీరి సంఖ్య పేరిగి పేపర్ల హావా అంతమౌతుంది. మీకు ఎవరైనా రీటైల్ కన్స్యుమర్ కార్డుల మార్ఖేటింగ్ లో మిత్రులు ఉంటే వారిని అడగండి వారు డిజిటల్ ఎకోసిస్టెం గురించి చేపుతారు. Coming days order of Most trusted sources 1.The man on the street 2.Friends and family 3. Alternative opinions 4.Celebrities 5. Est. authorities 6.Elders 7. Leaders. నాకు తెలిసి people started following this order. కావున మీరు రాసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని మీ బ్రాండ్ ఇమేజిని కాపడు. మీ స్పందన చాలా అతిగా ఉన్నాదని నాకు అనిపించింది. How can you use word like డయ్యర్?

అజ్ఞాత చెప్పారు...

ivala medianu tidthunna vaallanta aa roju anantapuram lo pashavikamga.. heyanga vidyarthulapai lathi charge chesinappudu.. cover chesi polisulanu nindinchina media gurinchi matlaadaru... vyasaalaku vyaasalu commentlu rasestunnaru.. ivala lathi charge jarigindi telanganalo kabatti media pai viruchuku padataaru.. ade telanganetara pranthamlo ayithe gammuna vurukuntaru.. ive blagullo polisula teerupai vimarshalu vastayi.. veellaku neeti.. jaati ledu.. media avaakulu chavaakulu pelinde anukunte ivala highcourt chesina commentla maatemiti.. high court cj polisula duraagatanni endagadutunte.. police lu duty matrame chestunnarani, mediaku vishvasaniyata ledani ag vaadinchanaina lede.. noru moosukuni venakki vacchare.. ou lo shivalayam lo phootugaa taagi mattekki, madamekki pillala pai dadi chesinatlu purthi evidencelu meeru mechukuntunna cid adhikaarulake dorikaayi.. ada pillalani chudakunda amanushamga dadi chesina vaallani toolanaadalsindi poyi.. venukesukochenduku ingitam undali.. naadu general dyer nu british vaallu punish chesaremo kaani.. neti khakeechakulanu shikshinche dammu evrikundi..phidelu vayistunna cm.. maddela kodutunna home.. ishtarajyamga vyavaharistunna police...chi.. chi....manushula jeevitalaku viluva ivvakunda rase ee commentlanu mee rela publish chestunnaru.. vishwasaniyata vyaktitvanni batti untundi.. ee agnaatal commentlaku kadu..

pannaga చెప్పారు...

ఇప్పుడున్న మావోయిస్టులంతా – 1969లో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయగా, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయి, సాయుధులై నక్సలైట్లయిన వారే ! వాళ్ళే ఇప్పుడు 16 రాష్ట్రాలకు వ్యాపించి దేశానికి ఒక గడ్డు సమస్యగా మారారు. ఈ రోజు దేశానికి బయటి దేశాల తీవ్రవాదంతో ఎంత ప్రమాదం ఉందో, అంతర్గత తీవ్రవాదంతో అంతే ప్రమాదం ఉంది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణను విద్యార్థుల న్యాయబద్ధమైన ప్రజస్వామ్య కాంక్షగా గుర్తించక, బలవంతంగా అణిచేస్తే, అంతకు నాలుగు రెట్ల మావోయిష్టులు తయారవుతారు. అప్పుడు ఇండియా కూడా పాకిస్తాన్ లా అంతర్గత పౌర యుద్ధ భూమిగా మారుతుంది. సీమాంధ్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. సమస్య మూలాల నుండి పరిష్కరించాలి.

చదువరి చెప్పారు...

"ధ్వంసం చేసుకుంటే వారి కాలేజీలను వారే ధ్వంసం చేసుకోవాలి.. వారి పుస్తకాలను వారే తగులబెట్టుకోవాలి.. అలా జరిగే అవకాశం ఎలాగూ లేదు.." - ఎందుకు లేదు? మన బస్సులను మనమే ధ్వంసం చేసుకోలేదా? మనం చేసే ప్రదర్శనలు, నినాదాలే శృతిమించి హింసకు దారితీయవని మనం గ్యారంటీ ఇవ్వగలమా?

ఒకవేళ హింసే జరిగితే మనందరం కలిసి తిట్టేది ఎవరిని? హింసకు పాల్పడ్డవాళ్ళనా? దాన్ని అడ్డుకోలేకపోయిన పోలీసులనా?
హింసకు ప్రేరేపించినవాళ్ళనా? దాన్ని ముందే ఊహించి తగు జాగర్తలు తీసుకోని ప్రభుత్వాన్నా?

పోలీసులపై సానుభూతి అని కాదుగానీ.., ఈ ఉద్యమాల కారణంగా పోలీసుల పరిస్థితి విచిత్రంగా అయిపోయింది. చేతికిందకొస్తే చేతిదెబ్బ, కాలికిందకొస్తే కాలిదెబ్బ లాగా రప్ఫాడించేస్తున్నాం అందరం కలిసి.

అజ్ఞాత చెప్పారు...

To the author:
You said: Osmania lo chaduvulak chettuku police cheda pattindi.

Good language & praasa.

But use some brain, when you define that Cheda. Its not Police Cheda. It is T Cheda.



To Pannaga:
Ippudunna Maoists are NOT old Telangana fighters.

Dont generalize and martyrize the current nuisance of T & naxalism

Naxals are formed due to your feudal systems.

The old T fighters have gone on to become Chif Ministers & ministers in AP cabinet. Ex: Chenna Reddy, Marri Sasidhara Reddy. and Now, Jana Reddy.

dont beat up Useless T drums and dont throw innocent kids infront of police.

అజ్ఞాత చెప్పారు...

పన్నగ,
అసలికి తెలంగాణాలో మీరు చెప్పిన వారు ఎందుకు కనుమరుగైనారు ఒకసారి నిజాయితీ గా ఆలోచిస్తే మీకె అర్థమౌతుంది. వీరీకి ప్రజల మద్దతు లేదు. కారణం డబ్బులు లేనపుడు, పేదరికంలో ఉన్నపుడు మద్దతిచిన ప్రజలు ఫ్రీడం వచ్చిన తరువాత ఒక 40సం|| లలో మధ్యతరగతి ప్రజలుగా రూపాంతరం చెందారు. వారు సదరు మావోయిస్ట్టులకు నాలుగు డబ్బులు, జీవితం లో స్థిరత్వం, ప్రజాస్వామ్య పాలన లో సుఖం అర్థమై వీరీ పోరు బాటకు ఒక దణ్ణం పెట్టారు. ఎవ్వరు వీరి వెనక నడవటానికి ఇప్పుడు ఇష్టపడటం లేడు. అందువలననే వీరిని ఆంధ్ర నుంచి అడ్రెస్ లేకుండా చేశారు. మీకు గత చరిత్ర నేమరు వేసుకోవటం సంస్కృతిలో బాగం కనుక దానిని నేమరు వేసుకుంట్టూ అందుబాటులో ఉన్న గద్దర్ చేత పాటలు పాడించుకొని ఆనందిస్తున్నారు. మీరు ఇలా నే ఊగి పొతే తెలంగాణామరొక బెంగాలు కన్న ఘోరం గా తయారౌతుంది. బెంగాలు వారికి అభివృద్ది అనేది పెద్ద గా తెలియదు, కాని తెలంగాణా వారికి అభివృద్ది ఎలా ఉంటుందొ కొన్ని జిల్లాలో అన్నా చూసారు. ఈ గలభా ల తో అది పోగొట్టుకుంటె మీకే మరింత కష్టం . ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరికి బాగ బతికి చేడిన వారులా జీవించటానికి ఇష్టం ఉండదు. మనం కన్స్యుమరిసం రోజులలో ఉన్నాము. ఇప్పుడు ఎవ్వరిని ఎవ్వరూ పటించుకోరు. మీరేదో మావోయిస్టుల బూచి చూపుతున్నారు. ఎవ్వరు భయపడరు. వారిని ఆదరిస్తె మీ జీవితాలే దుర్భర మౌతాయి. ప్రపంచ వ్యాప్త కమ్యునిస్ట్ ఉద్యమాల,ప్రభుత్వాల చరిత్ర ఒక సారి చదవండి.

అజ్ఞాత చెప్పారు...

మనిషివా....జర్నలిస్టువా..??
http://adantea.blogspot.com/2010/02/blog-post_19.htmlh