25, నవంబర్ 2009, బుధవారం

వేడెక్కిన తెలంగాణ..

తెలంగాణ ఉద్యమం ఎటు వెళ్తోంది... 1969 నాటి సన్నివేశాలు పునరావృతం అవనున్నాయా? తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు ప్రారంభిస్తానంటున్న ఆమరణ నిరాహార దీక్ష ఇప్పటివరకు అందిస్తున్న సంకేతాలు ఆందోళన తీవ్రతను సూచిస్తున్నాయి. రాష్టమ్రంతటా ఒకటే ఉత్కంఠ.. తెలంగాణ జిల్లాల్లో ఉద్రిక్తత... ఆమరణ దీక్ష జరుగుతుందా? ప్రభుత్వం భగ్నం చేస్తుందా? అదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి?
కెసిఆర్‌ ఆమరణ దీక్ష కొనసాగుతుందా?
తెలంగాణ ఉద్యమం హింసాత్మకం కానుందా?
ఉద్యమం హింసాత్మకమైతే పరిణామాలకు బాధ్యులెవరు?
తెలంగాణపై ప్రభుత్వ వైఖరి ఏమిటి?
కెసిఆర్‌ దీక్ష భగ్నం చేయటమే లక్ష్యమా?


ఇప్పుడు అందరి దృష్టీ నవంబర్‌ 29పైనే... సిద్దిపేటకు దగ్గర్లోని రంగదామ్‌ పల్లిలో కెసిఆర్‌ ఆమరణ దీక్ష చేపడుతున్నారు... ఆయన గతంలో చేసిన ఆందోళనలకు, ఇప్పుడు చేస్తున్న ఆందోళనకు చాలా తేడా ఉంది.. గతంలో ఆయన ఏ ఆందోళన చేసినా, దానికి జనం స్పందించినా అవన్నీ అలా పైకెగిసి కింద పడిపోయినవే... ఇప్పుడు ఉద్యమాన్ని సీరియస్‌గానే ముందుకు తీసుకువెళు్తన్నట్లు పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని కల్పించటంలో కెసిఆర్‌ సక్సెస్‌ అయ్యారు. అదే సమయంలో ఇంతకు ముందు కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం కెసిఆర్‌ దీక్షను భగ్నం చేసేందుకు సర్వ సన్నాహాలతో సన్నద్ధమైంది. సిద్దిపేట అంతటా భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. హోటళు్ల, లాడ్జిలను సైతం పోలీసులు తమ స్వాధీనంలో ఉంచుకున్నారు... అయినా చాపకింద నీరులాగా వివిధ జిల్లాల నుంచి కార్యకర్తల్ని, ప్రజల్ని సమీకరించేందుకు టిఆర్‌ఎస్‌ ప్రయత్నాలు మానలేదు..
1969లో విద్యార్థి ఉద్యమం తెలంగాణను రక్తసిక్తం చేసింది... ఇప్పుడు ఆ ఉద్యమానికి సరిగ్గా నలభై ఏళు్ల నిండాయి. ఆనాటి పరిస్థితులు మళ్లీ వస్తాయని గట్టిగా చెప్పలేం కానీ, కెసిఆర్‌ కూడా విద్యార్థి చైతన్యాన్నే అండగా తీసుకుని ముందుకు సాగుతున్నారు.. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల్లో కనిపిస్తున్న సానుకూల స్పందనలు ఇందుకు తార్కాణం. ఈ ప్రతిస్పందన చూసే కాంగ్రెస్‌ నాయకుల్లో గుబులు మొదలైంది... ప్రత్యేకించి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కెసిఆర్‌కు అనుకూలంగా స్పందించటం ప్రారంభించారు..
రాష్ట్రంలో వైఎస్‌ ఉన్నప్పటి రాజకీయ పరిస్థితులకీ, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకీ చాలా తేడా ఉంది... అందుకే తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల స్వరంలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కెసిఆర్‌ సైతం చాలా పకడ్బందీగా తన రెండో స్పెల్‌ ప్రారంభించారు.. వూ్యహాత్మకంగా నడుస్తున్నారు.. గతంలో ఢిల్లీ జంతర్‌మంతర్‌ దగ్గర ఆమరణ దీక్షకు పూనుకున్నట్లే పూనుకుని అరగంటలోనే విరమించినట్లు కాకుండా, ఈసారి పట్టుదలకు పోతున్నట్లు స్పష్టంగానే అర్థమవుతోంది. కానీ కెసిఆర్‌ ఎక్కువ రోజులపాటు ఆమరణ దీక్ష చేసే పరిస్థితులు లేవని ఆయన వ్యక్తిగత వైద్యులు చెప్తున్నారు..
మరో పక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు దూరం కావటం ద్వారా రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ రాష్ట్ర సాధన అన్న నినాదాన్ని టిఆర్‌ఎస్‌ పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. అదే జరిగితే ఉద్యమ పంథా మారినట్లే... అయితే దాని దారి ఎటు మళు్లతోంది... కెసిఆర్‌ ఎటువైపు తీసుకువెళు్తన్నారు..? ఇప్పటికైతే ఇవి సమాధానం లేని ప్రశ్నలే..

5 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

నిప్పులు చిమ్ముకుంటూ

నింగికి నే నెగిరిపోతే,

నిబిడాశ్చర్యంతో వీరు-


నెత్తురు కక్కుకుంటూ

నేలకు నే రాలిపోతే

నిర్దాక్షిణ్యంగా వీరే...

గతంలో కే సి ఆర్ ఎన్ని తప్పులైనా చేసి ఉండవచ్చు. ఎన్ని అహంభావపు మాటలైనా మాట్లాడి ఉండవచ్చు. ఎన్ని ఒంటెత్తు పోకడలకైనా పోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆయనలో గతం లో లేని నిబద్ధత, పట్టుదల చాలా స్పష్టం గా కనిపిస్తోంది. అందుకే దూరమైన వాళ్ళలో అనేకులు (నిజాయితీపరులు) సానుకూలంగా మారుతున్నారు. అందుకే తెలంగాణా లోని అన్ని విద్యార్ధి సంఘాలు , అన్ని ఉద్యోగ సంఘాలు, ఆయనకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాయి.

కే సి ఆర్ అన్నట్టు తాడో పేడో, చావో రేవో తేల్చుకునే సమయం ఆసన్న మయింది. అవకాశ వాద రాజకీయ పార్టీలు, నిబద్ధత లేని దగుల్భాజీ రాజకీయ నాయకులు తెలంగాణాతో ఆటలాడుకునే, దొంగ మాటలతో కాలక్షేపం చేసే పరిస్థితి ఇప్పుడు ఎంతమాత్రం లేదు.

తెలంగాణా ప్రజల అసహనం కట్టలు తెన్చుకోక ముందే ....ఇంకా ఈ సమస్యను కల్ల బొల్లి మాటలతో .... కమిటీలతో .... సాగదీయకుండా ప్రభుత్వం వెంటనే తెలంగాణా ఏర్పాటుకు చర్యలు ప్రారంభిస్తే మంచిది. అప్పుడే మన ప్రజాస్వామ్యానికి కనీస గౌరవం వుంటుంది.దక్కుతుంది.

అజ్ఞాత చెప్పారు...

వీడి బక్క ప్రాణం తీసుకోవాలనుకొంటే (అంత బాధపడుతూ), ఇంట్లో పురికొస తో ఉరి వేసుకొన్నా చస్తాడు. చావటానికి కూడా ఇంత హంగామా, దీన్నే అంటారేమో హడావుడిఎక్కువ, అసలు విషయం తక్కువ అని. :)

అలాగే KCR భక్తులకు all the best సుఖంగా (సారీ కడుపుకాలి) మీ వాడు చావాలని కోరుకొంటూ. :)

సరే ఇంతకముండు ఇంత హడావుడి చేసి మొదలెట్టిన "అమరణ"దీక్ష కొద్ది గంటలలో ముంగించి హడావుడి గా వెళ్లి మందుకొట్టి ఎందుకు పడుకొన్నాడో, మీ భక్తులకు ఎమైనా తెలుసా!! ఆయన అడిగినట్టే కాపలా గా మాత్రం ఖచ్చితంగా ఉండి, కొద్ది నిముషాలలలోనో, ఈసారి అన్నా కొద్ది గంటల లోనో లేచి పోకుండా గట్టిగా కాపలా కాయండే మరి. good luck. :)

Unknown చెప్పారు...

ఇంట అసహ్యం గా కూడా కామెంట్ రాయవచ్చా...!
ఈ కాలం చదువుకున్న పిల్లలు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు వెకిలి రాతలు రాస్తూ , అశుద్ధం కక్కుతూ ఇట్లా పైశాచికానందం పొందే స్థితి కి దిగజారడం చాలా బాధ కలిగిస్తోంది. రాగింగ్ విష సంస్కృతి .... విలువలను, సభ్యతను గాలికి వదిలేయడం .... చివరికి వీళ్ళని ఎక్కడికి తీసుకేళ్తుందో.

అజ్ఞాత చెప్పారు...

చ్చా, KCR వాగే వాగుడుకంటే, కామెంట్లు అసహ్యం గా ఉన్నాయా? ఓసారి వెళ్లి అద్దం లో మొఖం చూసుకోండి. ఇక సంస్క్రుతి, బూతులు మాట్లాడటమే తెలంగాణా సంస్క్రుతి అని చెప్ప్తూ, తెలంగాణా పరువు తీసే వాళ్లు కూడా సంస్క్రుతి గురించి మాట్లాడే వాళ్లే!!

ఇంతకీ గతం లో కొద్ది గంటలలో మీ KCR ఎందుకు "అమరణ"నిరాహార దీక్ష నుండి, లేచిపోయాడో చెబ్తారా? వాళ్లావిడ కల్లు ముంత fresh గా వచ్చింది అని ఫోన్ చేస్తే హడావుడిగా లేచిపోయాడని ఆయన అంటే పడనోళ్లు అంటున్నారు, మీకేమయినా తెలుసా రాజన్నా??

ఇంతకీ ఈ సారన్న లేచి పారిపోకుండా కాపలాకి పోతున్నారా లెదా? జర జాగ్రత్త అసలే మన KCR అన్న చిక్కడు, దొరకడు టైపు. ఇప్పుడు సావకపోతే, మళ్ళీ సావటానికి దొరకడు :)

ఇంకోమాటన్న రాజన్న, నువ్వే అన్నవు కదే "కే సి ఆర్ అన్నట్టు తాడో పేడో, చావో రేవో తేల్చుకునే సమయం ఆసన్న మయింది." అంటూ, నేనూ అదే అంటున్నది, తాడు కూడా అక్కర్లేదు దండగ, పురికొస చాలు చావాలనుకొంటే అని. ఇక ఆ బక్కోడు సావటానికి రేవు ఎందుకే, బాత్ టబ్ లో పడినా చాలదా!!
ఏట్టాగయినా మనకు కావాల్సింది తెలంగాణే నే కదా, ఇంకేందుకు పరేషాన్ అవుతున్నవ్?
ఆఖరుగా, కాస్త కాపలగా వెళ్లటం మాత్రం మర్చిపోకే!!

అజ్ఞాత చెప్పారు...

nee yabba agnata gadida, neeku talakaya, medakaya inka emaina kayalu unnaya. ila vedava vagudu vagina YSR lage nuvvu kuda kukka kante heenanga chastav. nuvvu nee psuedo-combined state persons will have to go back.

Jai Telangana