23, మార్చి 2010, మంగళవారం

భద్రాద్రి రాముడికి సర్కారు బాకీ 5 లక్షలు


అదిగో భద్రాది... అంటూ.... లక్షలమంది భక్తులు... శ్రీరామనవమి వేడుకల్ని కనులారా వీక్షించేందుకు తరలివస్తారు. జన్మలో ఒక్కసారైనా... శ్రీ సీతారాముల కల్యాణాన్ని... వీక్షించాలని తాపత్రయపడతారు. అంతటి ప్రస్థమైన సీతారాముల కల్యాణం నాడే... పాలకులు... ఆ దేవదేవుడికి బాకీపడుతున్నారు... ఇది ప్రతి ఏటా జరుగుతున్న తంతు! శాసనాలనే కాదని.... కల్యాణరాముడికి టోకరా ఇస్తున్నారు.

శ్రీరాముడికే శఠగోపం పెడుతున్న పాలకులు
భద్రాద్రి రాముడికి సర్కారు బాకీ 5 లక్షలు
ఆనవాయితీని అటకెక్కిస్తున్న సీఎంలు
భద్రాచలం దేవస్థానం నెత్తిన సొంత ఖర్చులు
ప్రభుత్వం తెలిసే ఈ తప్పులు చేస్తోందా...?
భద్రాద్రి రాముడిపై ఎందుకీ చిన్నచూపు..?


"రామ..." అనే రమ్యమైన రెండక్షరాలు సర్వకాల సర్వావస్థలలో ... తమను రక్షిస్తాయని భక్తుల నమ్మకం. అయితే... ఈ నమ్మకాన్ని మన పాలకులు వమ్ము చేస్తున్నారు. సాక్షాత్తూ దేవదేవుడినే అవమానిస్తున్నారు.


భద్రాచలంలో ప్రతిసంవత్సరం జరిగే... సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం... పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించాలి. అలాగే... సమర్పిస్తున్నారు కూడా. అయితే... ఇది అధికారికంగా జరగట్లేదు.


వాస్తవానికి... ప్రభుత్వం సొంత ఖర్చుతో .... సీతారాముల కల్యాణానికి.... పట్టువస్త్రాలను, తలంబ్రాలను సమర్పించాలి. కానీ... ఘనత వహించిన మన పాలకులు....పట్టువస్త్రాలు, తలంబ్రాల ఖర్చును... భద్రాచలం దేవస్థానం నెత్తినే రుద్దుతున్నారు.


ఎందుకిలా జరుగుతోంది...? ఎందుకు ప్రభుత్వం సొంత ఖర్చుతో... రాముడ్ని సేవించట్లేదు.. అంటే...
నిర్లక్ష్యమే కారణమని చెప్పొచ్చు. ప్రతిఏడాది...మనం... సీతారాముల కల్యాణం నాడు.... వినే మాట .... రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు,
తలంబ్రాలను సమర్పించారు...అని! కానీ.... ఇన్నాళ్లూ...మనం విన్నది తప్పు. నిజానికి.... ప్రభుత్వం భద్రాచలం దేవస్థానం తరపునే... చాలా ఏళ్లుగా.... పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తోంది. ప్రభుత్వానికి దక్కాల్సిన పుణ్యం అంతా... దేవస్తానం హుండీలో జమవుతోంది.

ఒకటి కాదు... రెండు కాదు... 20 ఏళ్లుగా...ప్రభుత్వం ఈ నిర్వాకం చేస్తోంది. ఎవరూ పట్టించుకోరన్న ధీమా ఏమో.... సీతాముల కల్యాణం ఆనావాయితీని .... మన పాలకులు... చాలా లైట్ గా తీసుకుంటున్నారు.

ఒక్కసారి...చరిత్రలోకి వెళితే.... ప్రభుత్వం ఈ ఖర్చుల్ని ఎందుకు భరించాలో తెలుస్తుంది.

తానీషా హయంలో... తలంబ్రాలు, పట్టువస్త్రాల ఖర్చును ప్రభుత్వమే భరించాలని శాసనం చేశారు. రాష్ట్ర అవతరణ తర్వాత అప్పటి ప్రభుత్వం .. తానీషా శాసనాన్ని పునరుద్దరించింది. అందులో భాగంగా... తలంబ్రాలు, పట్టువస్త్రాల కొనుగోలు కోసం... 25 వేల రూపాలతో బడ్జెట్ కేటాయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా... ఆ తర్వాత ప్రభుత్వాలు... ఆ శాసనాన్ని...అటకెక్కించాయి. దీంతో... 20 ఏళ్లుగా... ఈ ఖర్చుల్ని భద్రాచలం దేవస్థానమే భరిస్తోంది.

ఇప్పటివరకు...రాష్ట్రప్రభుత్వం... భద్రాచల దేవస్తానానికి.... అక్షరాల అయిదు లక్షల రూపాయలు అప్పుంది. ఈ బాకీ తీర్చండిబాబోయ్...అంటూ... ఏ యేటి కా ఏడు... దేవస్తానం అధికారులు.... సర్కారుకు విన్నవించుకున్నా.... ఫలితం లేదు...! వచ్చే ఏడాది చూద్దాం లే...అంటూ.... పెండింగ్ మీద పెండింగ్ వేస్తోంది..ప్రభుత్వం.

ప్రతిసంవత్సరం... సీతారాముల కల్యాణం సమయానికి...దేవస్తానమే...తలంబ్రలు, పట్టువస్త్రాలు సిద్దం చేస్తోంది. వాటిని సమర్పించేందుకు వచ్చే... సీఎంలు... చాలా స్టైల్ గా, ఠీవీగా... ప్రభుత్వం తరపున.. అందజేస్తున్నామంటూ ఫోజులిచ్చేవారు.

కనీసం... ఈ శ్రీరామనవమికైనా... ప్రభుత్వం... సొంత ఖర్చుతో... సీతారాముల సేవ చేసుకుంటుందో లేదో చూడాలి.




కామెంట్‌లు లేవు: