4, ఏప్రిల్ 2010, ఆదివారం

మతోన్మాదం తోకముడిచింది

మతోన్మాదం తోకముడిచింది.. అమాయకులను మతం పేరుతో రెచ్చగొట్టి మారణ కాండను సృష్టించేందుకు ఉన్మాదులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. హైదరాబాద్‌ పాతబస్తీ ప్రజలు తామెంత సామరస్యంగా ఉన్నారో మరోసారి నిరూపించారు.. ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా... వదంతులు పుట్టించినా ప్రజలు సంయమనం కోల్పోకపోవటం విశేషం... శాంతియుత సహజీవనానికి తాము ఆదర్శమని ప్రజలు నిరూపించిన అపురూప క్షణం ఇది..

దాదాపు పదమూడేళ్ల నుంచి ప్రశాంతంగా ఉన్న పాతబస్తీలో కొందరు ముష్కరులు విసిరిన ఓ చిన్న నిప్పురవ్వ, కార్చిచ్చును రగిల్చింది.. జెండాల ఏర్పాటులో ఇరు వర్గాల మధ్య రేగిన చిన్న వివాదాన్ని మత కల్లోలంగా మార్చేందుకు తెర వెనుక నుంచి కొందరు బడాబాబులు తీవ్రంగా ప్రయత్నించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. వదంతులను ప్రచారం చేయటం.. ఉద్రేకపూరిత వార్తలతో అల్లర్లను బాగానే రెచ్చగొట్టారు..చాలా కాలంగా పని లేకుండా ఖాళీగా ఉన్న కిరాయి రౌడీలకు మంచి అవకాశమే లభించినట్లయింది..
అల్లర్లు తీవ్రంగానే అయ్యాయి. రౌడీమూకలు కనిపించిన వాళ్లను కనిపించినట్లుగా చితకబాదారు.. వాహనాలను ధ్వంసం చేశారు. తగులబెట్టారు.. చివరకు కర్ఫ్యూ విధించే పరిస్థితిని కొని తెచ్చారు..
స్పాట్‌..యాంబియన్స్‌...
ఇంత జరిగినా.. భయం భయంగా వాతావరణం ఉన్నా.. సాధారణ ప్రజలు ధైర్యంతో ఉన్నారు.. ఇంతటి ఉద్రిక్తతలోనూ మతాలకు అతీతంగా సామరస్యంగా వ్యవహరించారు.. పరస్పరం సహకరించుకున్నారు.. ఒకరికొకరు అండగా నిలిచారు.. మేము స్నేహంగా ఉన్నాం.. సహనంతో ఉన్నాం.. ఎవరెన్ని మాటలు చెప్పినా మేం వినేది లేదు.. కర్ఫ్యూ మాకు వద్దు.. ఎత్తేయండి అంటూ నినదించారు..

ఇంత సున్నితమైన సమస్యను సమర్థంగా పరిష్కరించటంలో పోలీసుల పాత్ర కీలకమైంది. జెండాల మూలంగా వివాదాన్ని ముందుగా నివారించలేకపోయినప్పటికీ, ఆ తరువాత ఘర్షణల్ని అత్యంత వేగంగా అదుపులోకి తీసుకురావటంలో సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఎకె ఖాన్‌ నేతృత్వంలోని బృందం పూర్తిగా సక్సెస్‌ అయింది...

ప్రజల తరపున, ప్రజల వెంట, ప్రజలతో మమేకమై ఏడాది కాలంగా ముందుకు సాగుతున్న జీ ౨౪ గంటలు చానల్‌ పాతబస్తీ అల్లర్లను మరింత రెచ్చగొట్టకుండా, ఎలాంటి దృశ్యాలను ప్రసారం చేయకుండా జాగ్రత్త వహించింది. తన వంతు బాధ్యతగా పాతబస్తీలో శాంతియాత్రను నిర్వహించి ప్రజల మధ్య సామరస్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేసింది..

హైదరాబాద్‌లో, ముఖ్యంగా పాతబస్తీలో కేవలం హిందూ ముస్లింలు మాత్రమే కాదు... పార్శీలు ఉన్నారు.. అరబ్బులు ఉన్నారు.. ఇరానియన్లు ఉన్నారు... అనేక మతాల ప్రజలు ఉన్న బస్తీ అది.. నిజాం రాజసానికి నిలువెత్తు దర్పణమైన పాతబస్తీని రాజకీయాల కోసం, జిహాదీ హింసాకాండ కోసం పావుగా వాడుకోవటం ప్రజలు గ్రహించారు.. ముష్కరుల కూటనీతిని నిష్కర్షగా తిప్పికొట్టారు.. శాంతి కపోతాన్ని ఎగురవేశారు.. ప్రజల జీవితాలతో ఆటలాడుకోవాలనుకున్న ముష్కరులకు ప్రజలు శృంగభంగం కలిగించారు..



3 కామెంట్‌లు:

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

అసదుద్దీన్ ఒవైసీ కుటుంబం నిజాం కుటుంబానికి బంధువులు. అందుకే అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకిస్తున్నాడు. అందుకు మత ఘర్షణలు కూడా సృష్టించాడు. మరో ముస్లిం పార్టీ అయిన MBT తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకించలేదు. అసదుద్దీన్ ఒవైసీ ముస్లిం ప్రయోజనాల కోసం కాకుండా కుటుంబ ప్రయోజనాల కోసం పని చేస్తున్నాడు.

అజ్ఞాత చెప్పారు...

Cool

~sUryuDu

Nrahamthulla చెప్పారు...

ముస్లిం ఫోరమ్ ఫర్ తెలంగాణా వాదనలుః

* మజ్లిస్ పార్టీ ఒక్కటే తెలంగాణా ముస్లిములకు ప్రతినిధి కాదు.తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ముస్లిములకు భద్రత ఉండదని మజ్లిస్ పార్టీ చేసే వాదన నిజంకాదు.అలాగైతే తెలంగాణా లోని మిగతా జిల్లాల ముస్లిములు తెలంగాణా కావాలని ఉద్యమాలు ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు?సమైక్య రాష్ట్రంలో ముస్లిములకు వచ్చిన 4% రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన తెలంగాణాలో పెరిగే అవకాశం ఉంటుంది.తెలంగాణా ఏర్పడితే ముస్లిములకు ఉద్యోగాలు,పదవులు జనాభా దామాషాలో పెరుగుతాయి.ఇక్కడ 224 ఏళ్లుగా ఉర్దూ అధికార భాషగా ఉంది.ప్రభుత్వ అధికారిక లావాదేవీలు ఉర్దూ భాషలోనే జరిగేవి.ఉర్దూ స్థానిక ప్రజాభాష కాబట్టి మళ్ళీ ఉర్దూకు మంచి ఆదరణ పూర్వ వైభవం వస్తుంది.గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జైళ్లలో మగ్గుతున్న వేలాదిమంది ముస్లిం యువకులు తిరిగి వచ్చి ఇక్కడే ఉద్యోగాలు,వ్యాపారాలు సంపాదించుకుంటారు.హైదరాబాద్‌ చుట్టూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించిన వేలాది ఎకరాల వక్ఫ్‌ భూములు,ముస్లిం ఆస్తులు విడిపించి పేదముస్లిములకోసం వినియోగించవచ్చు.ఇరుకు సందుల్లో పాతబస్తీల్లో దుర్భర దారిద్య్రంలో జీవిస్తున్నముస్లింలను ఫుట్‌పాత్‌లపైనుండి సొంత గృహాల్లోకి తేవచ్చు.విద్యావంతులైన ముస్లిములు రౌడీషీటర్లు, ఐఎస్‌ఐ ఏజెంట్లు లాంటి నిందలు తొలగించుకొని బాధ్యతాయుతమైన తెలంగాణా సోదరులందరితో సమాన అవకాశాలు సాధిస్తారు.