24, ఏప్రిల్ 2010, శనివారం

ట్యాప్‌ లీడర్లు

వాళ్ల ఫోన్లు టాప్‌ అయ్యాయి... మీ ఫోన్లు టాప్‌ కాబోతున్నాయి.. ముందుగానే జాగ్రత్త పడండి.. విపక్ష రాజకీయ నాయకులకే కాదు.. అధికార పార్టీల నేతలకూ ఇదో హెచ్చరిక... అదేమని ఆశ్చర్యపోకండి.. అధికారంలో ఉన్న సర్కారు వారికి తమ పార్టీ వారిపైనే నమ్మకం లేకుండా పోయింది.. ద్రోహం చేసింది.. చివరకు ఈ దేశంలో రాజకీయ నాయకులకూ ప్రెユవసీ అన్నది లేకుండా పోయింది..
సీనియర్‌ నాయకులు..ప్రతిపక్ష నేతలు.. పార్టీల అగ్రనేతలు..ముఖ్యమంత్రులు.. కేంద్ర మంత్రులు...
వీరూ వారని కాదు.. తమ పర భేదం లేదు.. అడుగడుగునా అనుమానం.. అందరి ఫోన్లనూ సర్కారు వింటోంది.. దొంగచాటున గూఢచర్యం నిర్వహిస్తోంది.. వ్యక్తిగత సంభాషణలనూ రికార్డు చేస్తోంది.. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్‌ఫోన్లపై నిఘా పెట్టింది...

2007 ఫిబ్రవరి...
దిగ్విజయ్‌ సింగ్‌...(కాంగ్రెస్‌ సీనియర్‌ నేత)
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఎన్నికల గురించి పంజాబ్‌కు చెందిన ఓ లీడర్‌తో మాట్లాడుతుంటే ఫోన్‌ టాప్‌ చేసారు..
2007, అక్టోబర్‌..
నితిష్‌ కుమార్‌(బీహార్‌ ముఖ్యమంత్రి)
కేంద్రం నుంచి నిధుల గురించి రెసిడెంట్‌ కమిషనర్‌తో మాట్లాడుతున్న సంభాషణలు రికార్డు అయ్యాయి.
2008, జూలై
ప్రకాశ్‌ కారత్‌ (సిపిఎం ప్రధాన కార్యదర్శి)
అణు ఒప్పందం విషయంలో అవిశ్వాస తీర్మానం సమయంలో సహచరులతో మాట్లాడిన సంభాషణలు ట్యాప్‌ అయ్యాయి..
2008, జూలై
చంద్రబాబు నాయుడు (తెలుగుదేశం అధ్యక్షుడు)
యుపిఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం సమయంలో సహచర విపక్ష నేతలతో మాట్లాడిన సంభాషణలు ట్యాప్‌ అయ్యాయి.
2010, ఏప్రిల్‌..
శరద్‌ పవార్‌(కేంద్ర వ్యవసాయ మంత్రి)
ఐపిఎల్‌ చైర్మన్‌ లలిత్‌ మోడీతో జరిపిన సంభాషణలను టాప్‌ చేసి రికార్డు చేశారు..

ఫోన్‌ ట్యాపింగ్‌.. ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి.. సొంత పార్టీ వారిని సైతం విడవకుండా సాగిన ఫోన్‌ ట్యాపింగ్‌ సీనియర్‌ నాయకులకు మింగుడుపడకుండా తయారైంది.. పార్లమెంటును నిలువునా కుదిపేసిన ఈ ఉదంతం యుపిఏ సర్కారుకు ఉచ్చు బిగిస్తోంది..
ప్రముఖ నాయకుల సెల్‌ఫోన్‌లను దొంగతనంగా వినేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. అంతర్జాతీయ సంస్థల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న ఫోన్‌ ట్యాపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను యుపిఏ సర్కారు కొనుగోలు చేసింది. ౨౦౦౫-౦౬ సంవత్సరంలోనే దీనికి అంకురార్పణ జరిగింది. నేషనల్‌ టెక్నికల్‌ రీసర్చ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించటం మొదలు పెట్టారు..
౨౦౦౬ జనవరి ౭న ఈ సాఫ్ట్‌వేర్‌ ఎలా పని చేస్తున్నదీ తొలిసారి పరీక్షించారు.. అప్పటి జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్‌ ఫోన్‌ను తొలిసారి టాప్‌ చేసి ప్రయత్నించారు.. ఆ పరీక్ష సక్సెస్‌ కావటంతో ఇక నాయకులపై ప్రయోగించటం మొదలు పెట్టారు..

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ల సెల్‌ఫోన్లను కొత్త ఆఫ్‌ ది ఎయిర్‌ జిఎస్‌ఎం మానిటరింగ్‌ డివైస్‌ ద్వారా టాప్‌ చేసినట్లు సమాచారం.. ఈ డివైస్‌ రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఫోన్లను తేలిగ్గా ట్యాప్‌ చేస్తుంది.
అమెరికాతో అణు ఒప్పందం విషయంలో వామపక్ష పార్టీలు యుపిఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకుల వ్యూహ, ప్రతి వ్యూహాలను తెలుసుకోవటానికి కూడా సర్కారు ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంది.
విచిత్రమేమంటే ఈ డివైస్‌ను ఎక్కడైనా, ఎలా అయినా చాలా తేలిగ్గా ఉపయోగించవచ్చు. నేషనల్‌ టెక్నికల్‌ రీసర్చ్‌ ఆర్గనైజేషనే దీన్ని ఆపరేట్‌ చేస్తుంది. అయితే ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నట్లు రుజువు చేయటం అంత సులభం కాదు. ఇది చాలా చిన్న డివైస్‌ కావటం ఒక ఎతెユ్తతే.. సమస్య మరీ జటిలమైతే, హార్డ్‌ డిస్క్‌లో రికార్డయిన సంభాషణలను ఒక్క బటన్‌తో ఎరేస్‌ చేసేయవచ్చు.. మూడో కంటికి తెలియకుండా ఇది జరిగిపోతుంది.. దొంగ దొరక్కుండా తప్పించుకునేందుకు వీలుంది కాబట్టే సర్కారు ఈ చర్యలకు పూనుకోగలిగింది.. ఇది చట్టవ్యతిరేకమనీ, అనైతికమనీ, ఎవరు ఎన్ని మొత్తుకుంటే మాత్రం ఏం ప్రయోజనం?

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

Kovela santosh kumar గారూ...,వాళ్ల ఫోన్లు టాప్‌ అయ్యాయి... మీ ఫోన్లు టాప్‌ కాబోతున్నాయి.. ముందుగానే జాగ్రత్త పడండి.. విపక్ష రాజకీయ నాయకులకే కాదు.. అధికార పార్టీల నేతలకూ ఇదో హెచ్చరిక... అదేమని ఆశ్చర్యపోకండి.. అధికారంలో ఉన్న సర్కార_____________________చాలా మంచి పోస్ట్.......... ధన్యవాదాలండి.