21, ఏప్రిల్ 2009, మంగళవారం

మలివిడత ప్రచారానికి తెర...

దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్రంలో కూడా 20 లోక్ సభ, 140 అసెంబ్లీ స్థానాలకు ఎల్లుండి జరిగే ఎన్నికలకు ప్రచారం ముగిసింది. చివరి రోజు హోరాహోరీగా నేతలు ప్రచారం చేశారు. మరోవైపు.. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక బలగాలను మోహరించింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అదనపు భద్రతను పెంచారు. ప్రధాన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్ధులు వైఎస్, చంద్రబాబు, చిరంజీవి ఈ దఫా పోలింగ్‌లో ఉన్నారు. అనేక మంది మంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

కామెంట్‌లు లేవు: