21, ఏప్రిల్ 2009, మంగళవారం

ఎల్టీటీఈపై ప్లేటు ఫిరాయించిన కరుణానిధి

ఎల్‌టీటీఈపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ప్లేటు ఫిరాయించారు. ఎల్‌టీటీఈ తీవ్రవాద సంస్థ కాదని తాను అనలేదని ఇవాళ వివరణ ఇచ్చారు. ఎల్‌టీటీఈ తన మిత్రుడని కాబట్టి అతను తీవ్రవాది కాదని నిన్న కరుణానిధి అన్న మాటలు తీవ్ర దుమారం రేపింది. దీంతో కాంగ్రెస్‌ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. దీంతో కరుణానిధి ఇవాళ వివరణ ఇచ్చారు. రాజీవ్‌గాంధీని హత్య చేసిన ఎల్‌టీటీఈని తాను తీవ్రవాద సంస్థ కాదని ఎలా అంటానని ఎదురు ప్రశ్నించారు. శ్రీపెరుంబదూరు సంఘటనను ఎలా మర్చిపోతామని అన్నారు. తాను శ్రీలంక తమిళల పరిస్థితులపై మాత్రమే ఆందోళన వ్యక్తం చేశానని అన్నారు. ఎల్‌టీటీఈ తీవ్రవాద సంస్థగా ప్రారంభం కాలేదని కాలక్రమేణా అది తీవ్రవాద సంస్థగా మారిందని కరుణానిధి అన్నారు.

కామెంట్‌లు లేవు: