22, జూన్ 2009, సోమవారం

మావోయిస్టులపై దేశ వ్యాప్త నిషేధంమావోయిస్టులు ఇక ఉగ్రవాదులే.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.

వారం రోజులుగా లాల్‌గఢ్‌లో సాగిస్తున్న మారణ హోమానికి మావోయిస్టులు భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. అందివచ్చిన అవకాశాన్ని కేంద్రం ఏమాత్రం చేజార్చుకోలేదు. మావోయిస్టులను టెరర్రిస్టులుగా ప్రకటిస్తూ, సిపిఐ మావోయిస్టు పార్టీని ఉగ్రవాద సంస్థగా డిక్లేర్‌ చేయటానికి ఆలోచించనే లేదు... భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఎక్కడో బెంగాల్లోని నక్సల్‌బరీలో ప్రారంభమైన ఉద్యమం చివరకు ఉగ్రవాద సంస్థగా భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మరింత తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కోనుంది....
******************
వర్గశత్రు నిర్మూలన.... జమీన్‌దారీ అంతం.. భూపోరాటం... కరడు గట్టిన ఫ్యూడల్‌ సమాజం రూపొందించిన రాజ్యాన్ని ఛేదించి, నూతన రాజ్యాంగ వ్యవస్థను సాయుధ పోరాటం ద్వారా నిర్మించటం...........

1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరీ గ్రామంలో చిన్నగా ప్రారంభమైన విప్లవోద్యమం లక్ష్యాలివి... చారు మజుందార్‌, కాను సన్యాల్‌ వంటి మేధావులు విప్లవోద్యమాన్ని నక్సలిజంగా ఒక సిద్ధాంతంగా మలిచారు. జమీందారులు, భూస్వాముల దాష్టీకానికి పండుటాకుల్లా అల్లల్లాడిపోయిన అణగారిన వర్గాన్ని ఉద్ధరించటానికి ఆనాడు నక్సలిజం ఒక సైద్ధాంతిక సాయుధ ఉద్యమంగా ప్రారంభమైంది. అది క్రమంగా దేశ వ్యాప్తంగా విస్తరించింది. 1969లో నక్సల్‌బరీ ఉద్యమ స్ఫూర్తితో శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటం ఉప్పెనలా ఎగిసింది. ఆనాటి ఆ ఉద్యమంలో చారూమజుందార్‌ కూడా వచ్చి స్థానిక నాయకులకు ప్రేరణను ఇచ్చారు. వెంపటాపు సత్యం... ఆదిభట్ల కైలాసం, నాగభూషణ్‌ పట్నాయక్‌ వంటి వారు నాటి ఉద్యమ నాయకులు... అప్పటికి కొండపల్లి సీతారామయ్య తెరమీదకు రాలేదు.. పీపుల్‌‌స వార్‌ పార్టీ కూడా ఏర్పడలేదు.. మార్కి్సస్టు పార్టీ నుంచి విడిపోయిన నాయకులు సిపిఐ ఎంఎల్‌ పార్టీగానే వాళు్ల ఉద్యమాన్ని నడిపించారు.
1970లలో నక్సల్‌బరీ ఉద్యమం ఉత్తరతెలంగాణా మీదుగా దండకారణ్యానికి విస్తరించింది. కొండపల్లి సీతారామయ్య ఉత్తర తెలంగాణలో ఉద్యమ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్య వ్యవస్థ నిర్మూలనలో నక్సల్‌ ఉద్యమం ప్రధాన భూమిక నిర్వహించిందనటంలో సందేహం లేదు. ఆ తరువాత క్రమంగా ఉద్యమం విస్తరించింది.
కొండపల్లి సీతారామయ్య ఉద్యమానికి శక్తిమంతులైన నాయకులను అందించారు.
1. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి
2. నల్లా ఆదిరెడ్డి
3. సంతోష్‌రెడ్డి
4. జగన్‌
5. శ్యామ్‌
6. పులి అంజయ్య
7. పటేల్‌ సుధాకర్‌
8. మల్లోజుల కోటేశ్వర రావు
9. రామకృష్ణ
ఉద్యమ పంథాలో మెతక వైఖరి అవలంబిస్తున్నారంటూ కొండపల్లి సీతారామయ్యను పక్కకు తప్పించి గణపతి పగ్గాలు చేపట్టి ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషించారు. కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోనే 1980లో పీపుల్‌‌స వార్‌ ఏర్పడింది. సీతారామయ్య నాయకత్వంతో విభేదించిన వారు వేరు కుంపట్లు పెట్టుకున్నారు.. ఈ పరిణామంలోనే జనశక్తి, ప్రజాప్రతిఘటన, చండ్రపుల్లారెడ్డి వర్గాలు ఏర్పడ్డాయి.. సమాంతరంగా ఉద్యమాలు నడిపిస్తూ వచ్చాయి. అవన్నీ క్రమంగా నిర్వీర్యం అవుతూ వచ్చాయి....కానీ పీపుల్‌‌సవార్‌ మాత్రం బలపడుతూ వచ్చింది. ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌లలో తమ కార్యక్రమాల్ని విస్తరించింది. రాష్ట్రంలో నిషేధానికి గురైనా, ఉద్యమం నీరుగారలేదు... బీహార్‌లోని మావోయిస్టు కమూ్యనిస్టు సెంటర్‌తో సత్సంబంధాలు కొనసాగించింది. నేపాల్‌లోని మావోయిస్టులతోనూ మంచి స్నేహాన్ని పెంపొందించుకుంది. దండకారణ్యం నుంచి నేపాల్‌ దాకా రెడ్‌ కారిడార్‌ నిర్మించేందుకూ ప్రయత్నం జరిగింది. 2004లో ఓ పక్క రాష్ట్రంలో ఇక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలోనే ఎంసిసితో పీపుల్‌‌సవార్‌ విలీనమై సిపిఐ మావోయిస్టు పార్టీగా కొత్త రూపంలోకి మారిపోయింది.

అయితే వైఎస్‌ సర్కారుతో చర్చలు విఫలం కావటంతో, మావోయిస్టులు భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. కానీ అదే సమయంలో ఇతర రాషా్టల్ల్రో తమ బలాన్ని బలగాన్ని విస్తరించుకున్నారు. మన రాష్ట్రం నుంచి బయటకు వెళ్లిన నాయకులే జాతీయ స్థాయిలో ఉద్యమానికి నేతృత్వం వహించటం సాధారణం కాదు.. వారం రోజులుగా లాల్‌గఢ్‌లో జరుగుతున్న హింసాకాండలో సూత్రధారిగా మల్లోజుల కోటేశ్వరరావు వ్యవహరించారంటేనే మన రాష్ట్రం నుంచి వెళ్లిన వారు జాతీయస్థాయి ఉద్యమంలో ఏ స్థాయిలో పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఉద్యమం పరిమిత స్థాయిలో ఉన్నంత వరకు కేంద్ర ప్రభుత్వం దీన్ని రాషా్టల్ల్రో శాంతి భద్రతల సమస్యగానే పరిగణించింది. రాషా్టల్రకు అవసరమైన సైనిక సాయాన్ని అందిస్తూ వచ్చింది. కానీ, యుపిఏ సర్కారు వచ్చిన తరువాత ప్రధాని మన్మోహన్‌ ఈ సమస్యను సీరియస్‌గా పరిగణించారు. మావోయిస్టు సమస్య దేశానికి ప్రమాదకారిగా పరిణమించబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు కూడా... లాల్‌గఢ్‌, చత్తీస్‌గఢ్‌లలో పాల్పడుతున్న విధ్వంస కాండ యుపిఏ సర్కారుకు మంచి అవకాశం వచ్చింది. అటు సహజంగా నిషేధానికి వ్యతిరేకంగా ఉండే మార్కి్సస్టులు బెంగాల్‌లో జరుగుతున్న పరిణామాల వల్ల నోరు మెదపలేని స్థితి ఏర్పడింది. నందిగ్రామ్‌, సింగూరు, ఇవాళ లాల్‌గఢ్‌ ఘటనలు లెఫ్‌‌టఫ్రంట్‌ను ఆత్మరక్షణలో పడేసింది. అంతే కాదు.. ఎనిమిది నెలల క్రితం ఇదే లాల్‌గఢ్‌లో అప్పటి కేంద్రమంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌పైనా, ముఖ్యమంత్రి బుద్దదేవ్‌ భట్టాచార్జీపైనా హత్యాయత్నం చేసింది తామేనని కోటేశ్వరరావు ఇటీవలే అంగీకరించటం మరింత కలకలం రేపింది. మన మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, నేదురుమల్లిపైనా హత్యాయత్నం చేసిన చరిత్ర మావోయిస్టులకు ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో హత్యారాజకీయాలు ఎంతమాత్రం సమర్థనీయం కాదు.. దీన్ని కారణంగా చూపే యుపిఎ సర్కారు మావోయిస్టులపై ఉగ్రవాద ముద్ర వేసింది. ఇక మావోయిస్టులు ఏ విధంగా కొత్త విప్లవ మార్గాన్ని నిర్మించుకుంటారో చూడాలి...

4 కామెంట్‌లు:

Malakpet Rowdy చెప్పారు...

Somebody please tell Martanda not to post that Pro-Maoist stuff on his blog anymore. It will land him in unnecessary leagl problems!

kovela santosh kumar చెప్పారు...

malakpet rowdy garu... this article neither pro maoist nor anti maoist article.. this is only news based item with factual information. so don`t worry....please pass this information to martanda.

Malakpet Rowdy చెప్పారు...

Santosh Kumar garu,

Sorry if my comment sent a wrong message. I didnt mean to judge your article.

Just passed an "Uchita salaha" (Uchitam to Maartaanda (I cant do it on his blog since it requires a 5 year plan to register & post a comment on his blogs)

రాజ మల్లేశ్వర్ కొల్లి చెప్పారు...

"Uchita salaha" (Uchitam to Maartaanda ..."

:-)