22, అక్టోబర్ 2009, గురువారం

పూర్వవైభవం దిశగా కాంగ్రెస్‌..

పవార్‌ పాలిటిక్‌‌స... కాంగ్రెస్‌ విజయ ప్రస్థానం... రాజ్‌థాక్రే కేవల్‌ మరాఠా వాదం, నీరుగారిపోయిన బిజెపి, చప్పబడ్డ శివసైనికులు అన్నీ కలగలిస్తే.. మహారాష్టల్రో హస్తం హ్యాట్రిక్‌ గెలుపు.... ముంబయిపై ఉగ్రవాదుల దాడి కాంగ్రెస్‌ అధికార పీఠాన్ని ఎంతమాత్రం కదిలించలేకపోయింది. ముంబయి మహానగరంలో శివసేనకు ఉన్న కొద్దిపాటి బలాన్ని రాజ్‌థాక్రే తన్నుకుపోయారు.. ప్రతిపక్షాల ఓట్లను చీల్చటంలో కాంగ్రెస్‌ మంత్రాంగం ఫలించింది...

పదేళ్ల తరువాతైనా అధికారంలోకి వస్తామనుకున్న శివసేనబిజెపి కూటమికి మరోసారి భంగపాటు తప్పలేదు.. ప్రతిపక్షాల్లో నెలకొన్న అనైక్యత, ప్రభుత్వంపై అధికార వ్యతిరేకతను కమ్మేసింది. విపక్షాల ఓట్లు నిలువునా చీలిపోయాయి. మరాఠా లోకల్‌ నినాదంతో వివాదాస్పద రాజకీయాలు నడిపిన రాజ్‌థాక్రే.. బిజెపిశివసేన విజయావకాశాలను నిలువునా ముంచేశారు... శివసేన బలంగా ఉందనుకున్న ముంబయిలో పలు నియోజక వర్గాల్లో రాజ్‌థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన తన ప్రభావాన్ని చూపించగలిగింది. పూణె, నాగ్‌పూర్‌, లాతూర్‌, విదర్భ వంటి చాలా ప్రాంతాల్లో ఎంఎన్‌ఎస్‌ ఎన్‌డిఏ ఓట్లను చీల్చేసింది. రాజ్‌థాక్రే కారణంగా శివసేనబిజెపి 15 సీట్లను నష్టపోయింది. ఆ సీట్లన్నీ ఎంఎన్‌ఎస్‌ ఖాతాలో పడిపోయాయి.
మూడేళ్ల క్రితం ఉద్ధవ్‌ థాక్రేతో వివాదం కారణంగా బయటకు వచ్చిన రాజ్‌థాక్రే, సొంత పార్టీ పెట్టుకున్నారు... అప్పటి నుంచీ కూడా ఆయన మరాఠా స్థానిక వాదాన్ని తలకెత్తుకున్నారు.. ఆయన అనుచరులు మహారాష్టల్రో మరాఠేతరులపైన దాడులు కూడా చేశారు.. దేశమంతా ఆయన్ను ఎంత విమర్శించినా, చివరకు ఆ వాదమే ఆయన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడింది.. పదిహేను సీట్లతో చెప్పుకోతగ్గ స్థాయికి చేర్చింది.
అటు బిజెపి పూర్తిగా డీలా పడిందనే చెప్పాలి.. జాతీయ స్థాయిలోనే అటు పార్టీలో అంతర్గతంగా, రాజకీయాల్లో బహిర్గతంగా చెప్పరానన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్న బిజెపి ప్రస్తుత ఫలితాలను విశ్లేషిస్తే సమీపభవిష్యత్తులో మళ్లీ బలం పుంజుకునే అవకాశం కనిపించటం లేదు. ఒక్కో రాష్ట్రం ఆ పార్టీ చేజారిపోతూ వస్తోంది. ఏళ్లతరబడి అధికారం లేకపోతే రాజకీయంగా కేడర్‌ను కాపాడుకోవటం ఎంతకష్టమో తెలియంది కాదు.. ప్రమోద్‌ మహాజన్‌ వంటి నాయకులు లేకపోవటం, ఒక్క గోపీనాథ్‌ ముండేపైనే పూర్తిగా భారం మోపడం బిజెపికి మైనస్‌ అయింది...
ఇక శివసేనలో మునుపటి ఊపు లేనే లేదు.. మొదట్నుంచీ ఆ పార్టీకి సైనికుల్లా పనిచేసిన ఛగన్‌ భుజబల్‌, నారాయణ్‌రాణె, సంజయ్‌ నిరుపమ్‌ లాంటి వారందరినీ కొడుకును అందలం ఎక్కించటం కోసం బాల్‌థాక్రే దూరం చేసుకున్నారు.. ఫలితం ఎన్నికల్లో మరోసారి శృంగభంగం....
అయితే కాంగ్రెస్‌ఎన్‌సిపికి కూడా కంఫర్టబుల్‌ మెజారిటీ రాలేదు.. ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కనీస స్థాయిలో రాసలసిన సీట్ల సంఖ్యతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. అయితే, ముంబయిపై టెరర్రిస్టుల దాడి కాంగ్రెస్‌ విజయావకాశాలపై పెద్దగా ప్రభావం చూపించలేదు.. . అటు విదర్భ ప్రాంతంలో కరవు, కునారిల్లిన వ్యవసాయం, ఇటు పూణె వంటి చోట్ల విజృంభించిన సై్వన్‌ఫ్లూ వంటి వ్యాధులు ఎన్నికల్లో అంశాలుగా మారినా, అధికార కూటమి విజయాన్ని నిలువరించలేకపోయాయి. ఈ అంశాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో విపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయనటంలో సందేహం లేదు.. ఎందుకంటే క్రితం ఎన్నికల్లో 140 సీట్లు వచ్చిన అధికార కూటమి ఈసారి సింపుల్‌ మెజారిటీ ఫిగర్‌ను తాకగలిగింది. విపక్షాల ఓట్లలో చీలికే వారికి పూర్తిగా లాభించింది.
మరోవైపు కాంగ్రెస్‌ఎన్‌సిపి కూటమిలో కాంగ్రెస్‌ బలం క్రమంగా పెరుగుతోందని ఈ ఎన్నికలు స్పష్టంగా రుజువు చేశాయి. మహారాష్టల్రో ఇంతకాలం చక్రం తిప్పుతూ వస్తున్న శరద్‌పవార్‌ బలం తగ్గుతూ వస్తోంది. రాషా్టన్రికి సంబంధించినంతవరకు పవార్‌ కంటే కాంగ్రెస్‌కే ప్రజలు ఆదరణ చూపిస్తున్నారు.. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17 సీట్లు గెల్చుకుంటే ఎన్‌సిపికి దక్కించుకున్నది కేవలం ఎనిమిదే... ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ బలం ఇంతకు ముందున్న 69స్థానాల నుంచి పదిహేను సీట్లకు మించే ఎక్కువ పెంచుకోగలిగింది. అటు ఎన్‌సిపి ఖాతాలో కోత పడింది... మొత్తం మీద మొన్నటి లోక్‌సభ ఎన్నికలు... ఇప్పటి మహారాష్ట్ర ఎన్నికలు కాంగ్రెస్‌ను పూర్వవైభవం దిశగా తీసుకువెళు్తన్న సంకేతాల్ని స్పష్టంగానే చూపిస్తున్నాయి...

కామెంట్‌లు లేవు: