12, ఆగస్టు 2009, బుధవారం

అజ్ఞాత తిమిర హరణార్థం

ఖగోళ శాస్త్రంతో సునామీకి సంబంధాలు ఉన్నాయని నేను ఎక్కడా తేల్చ లేదు.. ఖగోళ పండితులు అంటున్నారని మాత్రమే చెప్పాను..వాటివల్లే సునామీ వచ్చేస్తోందని కానీ, వచ్చిందని కానీ, దానికి భౌతిక, ఆధ్యాత్మిక కారణాలతో సంబంధాలు ఉన్నాయని కానీ ఎక్కడా నేను రాయలేదు.. వాతావరణ నిపుణులు ఆసియా లోని సునామీ బాధిత దేశాలన్నింటిలో చాలా స్పష్టంగా సునామీ హెచ్చరికలు చేసిన మాట వాస్తవం. అందుకు సాక్ష్యంగా సముద్రంలో అలలు అల్లకల్లోలం అవటమూ వాస్తవమే... ఈ నేపథ్యంలోనే సునామీ వచ్చే అవకాశాలున్నట్లు శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో రాసిన వ్యాసం ఇది.

వాతావరణ నిపుణులు హెచ్చరిక చేసిన తరువాత దాని గురించి ప్రజలకు తెలియజేయటం ఏ జర్నలిస్టు అయినా చేసే ప్రాథమిక పని. ఆ తరువాత వాళు్ల హెచ్చరికలు ఉపసంహరించుకున్న తరువాత ఆ విషయాన్నీ తెలియజెప్పటం అతని విధి. ఈ నేపథ్యంలోనే సముద్ర తీర ప్రాంతాల్లోనే ప్రధానంగా భూమి కంపించటంతో అది సునామీయేమో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారని మొదటే స్పష్టంగా చెప్పాను.. ఆ తరువాత సునామీ ఎలా సంభవిస్తుందీ, సాంకేతిక కారణాలను సవివరంగా విశ్లేషించా.. చివరలో ఈ ప్రాంతంలోని ఖగోళ పండితులు కానీ, జ్యోతిష్యులు కానీ చేస్తున్న వాదనలను, వారు చూపించిన ఉదాహరణలను ప్రస్తావించాను. అవి వారి అభిప్రాయాలు.... నావి కావు..
జర్నలిజం అంటే సొంత అభిప్రాయాలు కలగలిసి చెప్పటం కాదు.. ప్రజలను భయపెట్టడం కాదు.. ఒక ఘటన జరిగినప్పుడు దానికి సంబంధించి వివిధ మార్గాల నుంచి, వర్గాల నుంచి జరుగుతున్న చర్చను, వాదనలను ప్రజల ముందు ఉంచటం వరకే జర్నలిస్టు పని. జర్నలిజం అంటే కేవలం ఒక సమాచార వారధి మాత్రమే. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి అనేకం ఉండవచ్చు. అవి వృత్తిలో ప్రతిఫలించవు. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకోవటానికి వ్యాసాలు రాసుకుంటారు. తెలియని విషయాలేవైనా ఉంటే తెలుసుకోవటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అజ్ఞాత గారు రాసినట్లు ద్వారక విషయంలో అప్పుడే అన్న ఒక్క మాట అచ్చుతప్పుగా వచ్చింది. దానికి ఆయన అంతగా రెచ్చిపోవలసిన అవసరం లేదనుకుంటా... గ్రహణాల గురించి రాయగానే పూనకం వచ్చినట్లు ఊగిపోయి పిచ్చి రాతలురాస్తున్నారని, రాసిన వాడు ఏమీ తెలియని మూర్ఖుడన్నట్లుగా, నోరుమూసుకుని కూర్చోమని నోటికి ఏ మాట వస్తే ఆ మాట, మనసుకు ఏ అక్షరం తోస్తే ఆ అక్షరాన్ని అడ్డగోలుగా అడ్డు ఆపు లేకుండా నిర్లజ్జగా తోచిన మాటలు రాయటం వల్ల ఒరిగేదేం లేదు..
ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం పిచ్చిరాత అంటే వాళ్ల అజ్ఞానానికి సానుభూతి వ్యక్తం చేయటం తప్ప ఏమీ చేయలేం..... 2012లో ప్రళయం వస్తుందని సోకాల్‌‌డ అమెరికన్‌ మహాపురుషులు (అజ్ఞాత లాంటి వారికి వారే దేవుళ్లలాగా కనిపిస్తారేమో.. నాకు తెలియదు... తెలుసుకోవటానికి ఇబ్బంది లేదు.. ) సినిమాలు తీసి, ఇంటర్నెట్లలో రాస్తే అది పిచ్చి కాదు.. జనాల్ని భయపెట్టినట్లు ఎంతమాత్రం కాదు... నోస్టర్‌ డామస్‌ చెప్పాడనో... బైబిల్‌లో రాసి ఉందనో చెప్తే ఓహో అంటారు... అది పిచ్చి ఎంతమాత్రం కాదు.. అదేమో విజ్ఞానం.. మొన్నటికి మొన్న 2008 సెప్టెంబర్‌ 10న జనీవాలో లార్‌‌జ హాడ్రన్‌ కొలై్లడర్‌లో ప్రోటాన్‌ బీమ్‌ను సర్కు్యలేట్‌ చేసినప్పుడు బ్లాక్‌ హోల్‌‌స పెద్దగా అయిపోయి ఇక ప్రపంచమే నాశనమై పోతుందని పాశ్చాత్యమీడియా నెత్తిమీద నోరు పెట్టుకుని అరిచినప్పుడు అవి ప్రపంచ ప్రజలను భయపెట్టినట్లు కాదు!.. వాళ్లవి పిచ్చిరాతలు ఎంతమాత్రం కావు.! . ప్రపంచం ఎండ్‌ అవుతోందని.. ఆ తరువాత ఏదో అయిపోతోందని తమకున్న పైత్యాన్నంతా కుమ్మరించి హై ఇన్ఫెక్టెడ్‌ మీడియా అయిన సినిమాలో చూపిస్తే చూడవచ్చు. ఆహా... ఓహో అని మీడియాలో చర్చ జరిగితే గుడ్లప్పగించి చూడవచ్చు.! ఇక్కడ గ్రహణాలు వస్తే ఏదో జరిగిపోతుందని ఇక్కడి జ్యోతిష్యులు విశ్వసిస్తున్నారయ్యా.. ఇందుకు వాళు్ల ఉదాహరణలుగా ఇవన్నీ చూపిస్తున్నారు.. అనీ అనగానే ప్రజలంతా బెంబేలెత్తిపోయి... తట్టాబుట్టా సర్దుకుని పారిపోతారు.. అలాంటి రాతలు వీరి దృష్టిలో ఎల్లో జర్నలిజం అవుతుంది!? నోస్టర్‌ డామస్‌ గొప్ప జ్యోతిష్యుడు... భారతీయ జ్యోతిష్యశాస్త్రం మాత్రం వీరి దృష్టిలో పెద్ద ఫేక్‌..!
రోదసిలో చోటు చేసుకునే ఏ పరిణామమైనా దాని ప్రభావం అనుకూలంగానో, ప్రతికూలంగానో భూమిపై కనిపిస్తుందని ప్రపంచ బాస్‌ నిర్వహిస్తున్న నాసాయే పలుమార్లు చెప్పింది. ఈ దేశంలో విలసిల్లిన శాసా్తల్రన్నీ చాలాకాలం నుంచీ ఈ విషయాలను కుండబద్దలు కొడ్తున్నాయి. ఈ గ్రహణాలు అనేవి కూడా రోదసిలో ఏర్పడేవే... వాటివల్ల ప్రభావం ఉంటుందా లేదా అన్నది తరువాత విషయం. కానీ, ఈ గ్రహణాల వల్ల ఏదో జరుగుతుందని ఇక్కడి జ్యోతిష్కులు చెప్తున్నారు. వారి మాటల్ని విశ్వసిస్తే విశ్వసించండి.. లేకపోతే లేదు.. విశ్వసించినా.. విశ్వసించకపోయినా... ప్రాకృతిక పరిణామాలను ఎవరూ నిలువరించలేరు.. మొట్టమొదలు రచయిత ఏం రాశాడు.. అతని ఉద్దేశం ఏమిటని చదవాలి. చాలా స్పష్టం.. గ్రహణాల వల్ల సునామీ వస్తున్నదనీ కూడా రాయలేదు. నేనేం రాశానో సరిగ్గా చదవకుండా ఇష్టం వచ్చినట్లు ప్రేలాపనలు చేయటం వారి విజ్ఞతకు, విజ్ఞానానికి, సాంకేతిక పరిజ్ఞానానికి, ఆధునిక నాగరిక సమాజ ప్రతినిథిత్వానికి నిదర్శనం.. ఇక చివరగా ఒక చిన్న విన్నపం... అజ్ఞాత ఎవరో తెలియదు.. తెలియని విషయాలను తెలుసుకొమ్మని వారు సూచించారు. చాలా గొప్ప విషయాన్ని వారు నాకు తెలియజెప్పారు.. అంత గొప్ప సూత్రాన్ని సూచించిన సహృదయుల గురించి ముందుగా తెలుసుకోవటం అవసరమని ఈ అజ్ఞాని భావిస్తున్నాడు. ఆయనెవరో చెప్తే ధన్యుణ్ణి... వారు చేసిన విమర్శకు.. అది ఎలాంటిదైనా కృతజ్ఞుణ్ణి.. మినర్వాగారికి ధన్యవాదాలు.

2 కామెంట్‌లు:

శరత్ కాలమ్ చెప్పారు...

ఇంతకీ నా జ్యోతిష్యం నిజమయ్యిందా లేదా? మీ బ్లాగు మీదికి సునామీ వస్తుందని జ్యోతిష్యం చెప్పాను. నిజమయ్యింది కదా. మరి నాకు క్రెడిట్స్ ఏవీ?

kovela santosh kumar చెప్పారు...

thanks sharat garu.. thank u... munduga meeke credit ivvali