20, డిసెంబర్ 2009, ఆదివారం

డిసెంబర్‌ 15-సెప్టెంబర్‌ 17

అమరజీవి పొట్టిశ్రీరాములు గారు ఆంధ్రరాష్ట్రం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారు.. ఆయన నిజంగా ప్రాతఃస్మరణీయుడు.. ఇందులో సందేహం లేదు. కాకపోతే ఆయన ఆంధ్రరాష్ట్రం సాధించారు కానీ, ఆంధ్రప్రదేశ్‌ కాదు.. అయినా తెలంగాణతో సహా రాష్ట్రం అంతటా శ్రీరాములు గారిని రాష్ట్రప్రభుత్వం అధికారికంగా స్మరించుకుంటుంది. నివాళులు అర్పిస్తుంది.. దీనికి ఎవరికీ అభ్యంతరం లేదు. ఉండకూడదు... కానీ, అదే సమయంలో హైదరాబాద్‌ భారత యూనియన్‌లో విలీనం అయిన సెప్టెంబర్‌ 17న అధికారిక కార్యక్రమాలు ఎందుకు నిర్వహించకూడదు..

వాస్తవంగా హైదరాబాద్‌స్టేట్‌కు 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాలేదు కదా... ఆ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చిన రోజును ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు జరపడానికి ఎందుకు అభ్యంతరం చెప్పాలి? అదేమీ విదేశాల్లో కలవలేదే... వేరే దేశంగా మారలేదే? ఫణిగారు పదే పదే అంటున్నట్లు పాకిస్తాన్‌ కాలేదే.. ఈ దేశంలో.. అంతా ఒకటే అనుకుంటున్న ఈ రాష్ట్రంలో భాగంగానే ఉన్నదే.... మరి విమోచన దినాన్ని జరపడానికి ఉన్న అభ్యంతరం ఏమిటి? అంటే ప్రభుత్వం ఉద్దేశంలో హైదరాబాద్‌ స్టేట్‌ నిజాం పరిపాలన నుంచి ఆంధ్ర పాలనలోకి వెళ్లిందే కానీ, దానికి స్వాతంత్య్రం రాలేదనా? సర్కారుకు ఇది చాలా చిన్న విషయం... పరిష్కరించటం పెద్ద సమస్య కానే కాదు.. ఎందుకంటే సెప్టెంబర్‌ 17న అన్ని పార్టీలు తమ కార్యాలయాల్లో జెండాలు అయితే ఎగురవేస్తాయి. రాజకీయ పార్టీలు ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నప్పుడు, ప్రభుత్వం నిర్వహించటంలో తప్పేమిటి? తెలంగాణ ప్రజలు కనీసం విమోచన దినోత్సవాన్ని కూడా అధికారికంగా జరుపుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఎందుకు ఉండాలి? ఈ ప్రశ్న అడిగితే పురుగుగా చూస్తారు..నాశనం చేయటానికే పుడతారంటారు.. పొట్టి శ్రీరాములు గారిని తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్‌ అంతా స్మరించుకున్నప్పుడు హైదరాబాద్‌ విమోచనం జరిగి తెలుగువాళ్లంతా ఏకం కావటానికి మార్గం ఏర్పడిన సందర్భాన్ని రాష్ట్రం ఎందుకు వైభవంగా తీసుకోకూడదు.. ఆంధ్రప్రాంతం వారికి ఇబ్బంది ఏమీ ఉండదే ఈ విషయంలో.. మరి ఎందుకు ఈ వివక్ష. సారీ సమస్య. సమైక్యంగా అంతా అన్నదము్మల్లా కలిసిమెలిసి ఉందామనుకునే వాళు్ల హైదరాబాద్‌ విమోచన దినోత్సవం గురించి సర్కారును ప్రశ్నించాల్సిన అవసరం లేదా? కలిసిమెలిసి ఉందామనుకునే సోదరుల ఆకాంక్షలనే పట్టించుకోలేని పరిస్థితిని ఏమని నిర్వచించాలి?

కామెంట్‌లు లేవు: