28, డిసెంబర్ 2009, సోమవారం

30 రోజుల్లో మన రాష్ట్రం...

అక్షరాలా నెల రోజులు... ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమాల పరంపర మొదలై అప్పుడే నెలరోజులైపోయింది. ఈ నెలరోజుల్లో ఎన్ని మార్పులు.. ఎన్ని పరిణామాలు.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది.. జైతెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తిపోయింది. శివమెత్తిన ఆందోళనల్లో 40 మంది ప్రాణార్పణ చేశారు.. కేంద్రం ఆట విడుపు ధోరణి ఇప్పట్లో ప్రశాంత పరిస్థితులు కల్పించేదిగా లేదు.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమే కనిపించని పరిస్థితి రాషా్టన్న్రి ఎక్కడికి తీసుకువెళు్తందో చెప్పలేని దశకు చేర్చింది.

ఒక వ్యక్తి నిరాహార దీక్ష సంకల్పం..తెలంగాణలో చిచ్చు రేపింది..
పది రోజుల దీక్షలు నలభై ప్రాణాల ఆత్మార్పణం జరిగింది....
తెలంగాణాకు అనుకూలంగా కేంద్రం చేసిన ఓ ప్రకటన..ఆంధ్రలో ఆందోళనలకు దారి తీసింది..
తెలుగులంతా ఒక్కటే.. అంతా కలిసే ఉంటాం..సమైక్యమే కావాలంటూ ఆందోళనలు
మమ్మల్ని విడదీయవద్దంటూ నిరసనలు... మిన్నంటిన సమైక్యాంధ్ర ఉద్యమం..
రాజకీయ సంక్షోభాన్ని సృష్టించింది..రాజ్యాంగ సంక్షోభం తలెత్తేలా చేసింది..
కేంద్రం మెడలు వంచింది.. అధిష్ఠానం తలొగ్గింది..ఢిల్లీ మలి ప్రకటన చేసింది....
కర్ర విరగలేదు..పాము చావలేదు..
ఒక దగ్గర సద్దుమణిగిన ఉద్యమం మరోచోట మళ్లీ మొదలైంది.
తెలంగాణా వీరంగం వేసింది. విచ్చుకత్తులు విసిరింది.
తెలంగాణ మళ్లీ రణరంగం అయింది...

హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా సుప్రీం కోర్టు ప్రకటించిన క్షణం నుంచి ప్రారంభమైన ఆందోళన రాషా్టన్న్రి ఇప్పట్లో విడిచిపెట్టేట్లు కనిపించటం లేదు...తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ సిద్దిపేట సమీపంలోని రంగధాంపల్లిలో దీక్షను సంకల్పించి అక్షరాలా నెలరోజులు పూర్తవుతోంది. ఈ ముపై్ఫ రోజుల్లో ఎన్నో పరిణామాలు రాషా్టన్న్రి కుదిపేశాయి. రాష్ట్రంగా విడిపోకుండానే రెండుగా చీలిపోయింది. రాజకీయాలు రెండుగా విచ్ఛిన్నమయ్యాయి. ప్రాంతాల మధ్య పరస్పర విశ్వాసం సన్నగిల్లింది. వాదాలు, వివాదాలు, ధర్నాలు, రాస్తారోకోలు.. రైలు రోకోలు.. బంద్‌లు.. అసలు విద్యాసంవత్సరమే అనుమానంలో పడే ఆందోళనకర పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి.
అసలేం జరిగింది? రంగధాంపల్లిలో దీక్ష గురించి నెల రోజుల ముందు నుంచే కెసిఆర్‌ కసరత్తు చేశారు.. మీడియా సమావేశాల్లో పలుమార్లు చెప్పారు.. ఏర్పాట్లూ చేసుకున్నారు..కానీ కెసిఆర్‌ను దీక్ష చేయనివ్వలేదు సర్కారు. 29న కెసిఆర్‌ దీక్ష ప్రారంభించటానికి వెళు్తన్నప్పుడే ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.. ఖమ్మం జైలుకు తరలించారు.. అక్కడి నుంచి ఆరోగ్యం బాగాలేని కెసిఆర్‌ ఆసుపత్రికి తరలించాక ఆయన దీక్ష విరమించినట్లు వీడియో ఫూటేజ్‌ వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణ అగ్గిమీద గుగ్గిలమై పోయింది. ఆయన బయటకు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అంతే అప్పటి నుంచే ఉద్యమం ఊపందుకుంది. ఉస్మానియాలో విద్యార్థులపై పోలీసు లాఠీలు విరిగిపడ్డా ఉద్యమం సద్దుమణగలేదు సరికదా మరింత ఉధృతమైంది. దీంతో డిసెంబర్‌ 7న ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.. అన్ని పార్టీలూ తగుదునమ్మా అంటూ రాష్ర్ట సర్కారుదే తప్పని తేల్చేశాయి. సర్కారు అసెంబ్లీలో తీర్మానం పెడితే ఆమోదించటానికి తమకేం అభ్యంతరం అని నిలదీశాయి. ఈ లోపే పదోతేదీన శాంతి ర్యాలీకి విద్యార్థులు సన్నద్ధమయ్యారు.. పరిస్థితి చేయి దాటిపోతోందన్న సంకేతాలు కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితిని కల్పించింది. అంతా ఒప్పుకున్నారు కదా.. ఇక ఇబ్బందేముంటుందని అనుకున్నారేమో.. డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటనను కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం భారత ప్రభుత్వం తరపున వెలువరించేశారు..
***
అంతే అప్పటిదాకా తెలంగాణకు సై అన్న పార్టీల నాయకులంతా రివర్‌‌స అయ్యారు.. అమ్మమాటే వేదం అన్న వారంతా తూచ్‌ పొమ్మన్నారు.. సీమాంధ్ర శివాలెత్తింది..
లగడపాటి లడాయి ప్రకటించారు.. నిరాహారదీక్షలు.. ఆందోళనలతో అట్టుడికిపోయింది ఆంధ్రప్రాంతం. లగడపాటి నిరాహార దీక్షలు ఎలా చేయాలో చేసి చూపించారు.. మోడ్రన్‌ దీక్షలు ఎలా ఉంటున్నాయో చూపించటానికే తాను దీక్ష చేశానని నిమ్‌‌స నుంచి విడుదల అయిన తరువాత లగడపాటి స్వయంగా ప్రకటించారు.. ఢిల్లీకి వెళ్లతారా అని అడిగితే.. అక్కడ కార్యం చక్కబెట్టడానికి పెద్దలు రాయపాటి, కావూరిలు ఉన్నారని చెప్పారు.. నిజంగా ఆయన అన్నట్లుగానే రాయపాటి, కావూరిలతో పాటు సీమాంధ్ర ఎంపిలు ఢిల్లీలో దాదాపు పది రోజుల పాటు ఉండి పలుమార్లు కాంగ్రెస్‌ లోని నిర్ణాయక నాయకత్వంతో పలుమార్లు లాబీయింగ్‌ చేశారు.. సోనియమ్మ నిర్ణయం మార్చుకునేంత వరకు విడిచిపెట్టలేదు..పదకొండు రోజుల వ్యవధిలో కేంద్రం తన నిర్ణయం మార్చుకోక తప్పలేదు..కరవ్రిరక్కుండా, పాము చావకుండా చిదంబరం ప్రకటన చేశారు..
ఆ ప్రకటన పరిస్థితులను చక్కబెట్టకపోగా, తెలంగాణాను మళ్లీ రగిల్చింది... ఆగిపోతుందనుకున్న అగ్గి ప్రజ్వరిల్లింది. ఈసారి తిరగబడ్డ తెలంగాణ శివసత్తులు ఊగినట్లు ఊగుతోంది. నేతల ప్రమేయం లేకుండా ఊరూవాడా జనాలు వీధుల్లోకి వచ్చారు. ఎవరికి తోచిన రీతిలో వారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.. ఆందోళనలు చేస్తున్నారు.. అరెస్టులు అవుతున్నారు.. ఒక్కమాటలో చెప్పాలంటే 9వ తేదీకి ముందు లేని ఉద్వేగాలు ఈసారి పెరిగిపోయాయి. ఆంధ్రప్రాంతంలో కొనసాగిన సమైక్యాంధ్ర ఉద్యమాలు తెలంగాణలో భావోద్వేగాన్ని మరింత రెచ్చగొట్టాయి. పర్యవసానం ప్రజల బాటలో నేతల పయనం...నేతలు సమావేశాల్లో ఉంటే, జనం వీధుల్లో రెచ్చిపోయారు.. తెలంగాణాకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట మాట్లాడినా సహించే పరిస్థితిలో ప్రజలు లేరు.. అందుకే నాయకులంతా ఒక ఛత్రం కిందకు రాక తప్పలేదు. కేంద్రం ఇప్పుడేం చేస్తుంది? రోమ్‌ తగులబడుతుంటే నీరో ఫిడేల్‌ వాయించుకుంటూ కూర్చున్నట్లు కేంద్రం వ్యవహరిస్తుందా? ఎలాంటి కమిటీలను అంగీకరించేది లేదని తెలంగాణ వాదులు ఖచ్చితంగా చెప్తున్నారు... సందిగ్ధానికి తావు లేకుండా, అస్పష్టతకు అవకాశం లేకుండా తెలంగాణ ఇచ్చే విషయంలో విస్పష్టంగా ప్రకటన చేయడం ఇప్పుడు కేంద్రం ముందున్న తక్షణ కర్తవ్యం. రాష్ట్రంలో ఇప్పటికే 30వేల కోట్ల రూపాయలు నష్టపోయినట్లు ముఖ్యమంత్రి రోశయ్య చెప్తున్నారు.. సమస్యకు పరిష్కారం వెంటనే ప్రకటించకపోతే రాష్ట్రం ఇంకా సంక్షోభంలోకి పడిపోతుంది..

ఈ నెల రోజుల్లో ఎప్పుడు ఏం జరిగింది...?

అక్టోబర్‌ 9
హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ అంటూ సుప్రీం కోర్టు ప్రకటన..
టిఆర్‌ఎస్‌ ఆందోళన ప్రారంభం...

అక్టోబర్‌ 24
సిద్దిపేటలో తెలంగాణ ఎన్‌జీవోల సంఘం బహిరంగ సభ...
నవంబర్‌లో ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు కెసిఆర్‌ ప్రకటన

అక్టోబర్‌ 28
ఫ్రీజోన్‌ తీర్పుకు వ్యతిరేకంగా ఇందిరాపార్‌‌క దగ్గర టిఆర్‌ఎస్‌ ధర్నా

నవంబర్‌ 6..
సిద్దిపేట రంగధాంపల్లిలో నవంబర్‌ 29 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు కెసిఆర్‌ ప్రకటన...

నవంబర్‌ 29
సిద్ధిపేట సమీపంలో రంగధాంపల్లిలో టిఆర్‌ ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌ ఆమరణ దీక్షకు పయనం...
దారిలోనే అరెస్టు.. ఖమ్మం జైలుకు తరలింపు...
ఉస్మానియాలో ఉద్రిక్తతలు..
ఎల్‌బి నగర్‌లో శ్రీకాంత్‌ ఆత్మాహుతి..

నవంబర్‌ 30
జైలు నుంచి ఆసుపత్రికి కెసిఆర్‌ తరలింపు..
ఆసుపత్రిలో జ్యూస్‌ తీసుకున్న కెసిఆర్‌...
ఉస్మానియాలో విద్యార్థుల భారీ ర్యాలీలాఠీచార్జి

డిసెంబర్‌ 1
కెసిఆర్‌పై తెలంగాణ ఉద్యమకారుల నిరసన..
నిరాహార దీక్ష మానినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు..దీక్షను కొనసాగిస్తున్నట్లుగా కెసిఆర్‌ ప్రకటన..

డిసెంబర్‌ 2
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో విద్యార్థుల ఆందోళన...
తెలంగాణ జిల్లాల్లో ఆందోళనలు..

డిసెంబర్‌ 3
హెచ్‌ఆర్‌సి ఆదేశంతో కెసిఆర్‌ను నిమ్‌‌సకు తరలింపు
అక్కడే దీక్ష కొనసాగింపు..
సెలైన్ల ద్వారా టోటల్‌ పేరెంటల్‌ న్యూట్రిషన్‌
పోషక పదార్థాలను అందించిన డాక్టర్లు

డిసెంబర్‌ 5
48 గంటల తెలంగాణ బంద్‌కు టిఆర్‌ఎస్‌ పిలుపు

డిసెంబర్‌ 6,7
తెలంగాణ బంద్‌
పోలీసుల దిగ్బంధంలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ

డిసెంబర్‌ 7
అఖిలపక్ష సమావేశం నిర్వహించిన రోశయ్య
తెలంగాణ తీర్మానం పెడితే సమర్థిస్తామని అన్ని పార్టీల హామీ

డిసెంబర్‌ 8
హాస్టళ్లను ఖాళీ చేయించిన పోలీసులు... స్టే ఇచ్చిన హైకోర్టు

డిసెంబర్‌ 9
ఢిల్లీలో వేడెక్కిన రాజకీయాలు...
కాంగ్రెస్‌ కోర్‌కమిటీ పలుమార్లు భేటీ
రాత్రి 11.30కు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు హోం మంత్రి చిదంబరం ప్రకటన.. అసెంబ్లీ తీర్మానానికి ఆదేశం..
కెసిఆర్‌ దీక్ష విరమణ

డిసెంబర్‌ 10
విజయ యాత్రగా మారిన చలో అసెంబ్లీ శాంతి ర్యాలీ
ఆంధ్ర ప్రాంత ఎంపిలు, ఎమ్మెల్యేల రాజీనామాలు ప్రారంభం
సమైక్యాంధ్ర ఉద్యమానికి జెసి, లగడపాటిల నాయకత్వం

డిసెంబర్‌ 11
ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన..ఆంధ్రప్రాంతంలో ఇతర ప్రాంతాల యూనివర్సిటీల్లో ఆందోళనలు...

డిసెంబర్‌ 12
ఢిల్లీలో ఆంధ్ర ప్రాంత ప్రతినిధుల లాబీయింగ్‌...
అన్ని పార్టీల నాయకులూ సమైక్య నినాదాలు... దీక్షలు...
కెసిఆర్‌ డిశ్చార్జి

డిసెంబర్‌ 13
సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం
ఆందోళనలు, నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలతో సీమాంధ్ర అతలాకుతలం
హైదరాబాద్‌లో లగడపాటి రాజగోపాల్‌ హల్‌చల్‌.. విజయవాడకులగడపాటిని తిరిగి పంపించిన పోలీసులు

డిసెంబర్‌ 15
విజయవాడలో దీక్ష ప్రారంభించిన లగడపాటి

డిసెంబర్‌ 17
ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి సమైక్యరాగం
ఎమ్మెల్యే పదవికి రాజీనామా
తెలంగాణలో పిఆర్‌పి చీలిక

డిసెంబర 19
మళ్లీ తెరముందుకు కెసిఆర్‌..
టిఆర్‌ఎస్‌లో పిఆర్‌పి నేతల చేరిక
తెలంగాణ ఆగదని తెగేసి చెప్పిన కెసిఆర్‌
విజయవాడ ఆసుపత్రికి లగడపాటి తరలింపు

డిసెంబర్‌ 20
సినిమా ఫక్కీలో ఆసుపత్రి నుంచి పారిపోయిన లగడపాటి
విజయవాడలో హైడ్రామా

డిసెంబర్‌ 21
నిమ్‌‌సలో తేలిన లగడపాటి...
పరుగులు పెడ్తూ బెడ్‌పైకి జెంప్‌ చేసి సొమ్మసిల్లిన లగడపాటి
టిఆర్‌ఎస్‌ నిరసనలు..

డిసెంబర్‌ 22
లగడపాటి డిశ్చార్జి.. దీక్ష విరమణ..
ఢిల్లీలో తెలంగాణ, సీమాంధ్ర ఎంపిలతో వీరప్ప మొయిలీ భేటీ..
మోహన్‌బాబు సినిమా షూటింగ్‌పై టిఆర్‌ఎస్‌ దాడి

డిసెంబర్‌ 23
కేంద్ర హోం శాఖ ప్రకటన...
సంయమనం పాటించాలని విజ్ఞప్తి
తెలంగాణపై సంబంధిత అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చిదంబరం వెల్లడి..
హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన ఆందోళనలు..
కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, తార్నాక వంటి ప్రాంతాల్లో
ఉద్యమకారుల విధ్వంసకాండ
కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ ఇతర పార్టీలతో జెఎసి ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభం. 48 గంటల బంద్‌కు జెఎసి పిలుపు

డిసెంబర్‌ 24
తెలంగాణ అంతటా భారీ బలగాల మోహరింపు
వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జీ
క్రిస్‌మస్‌ పురస్కరించుకుని బంద్‌ ఉపసంహరణ..
ఉస్మానియా క్యాంపస్‌లో టిడిపి నేత నాగం జనార్ధనరెడ్డిపై అర్వపల్లి నాగరాజు, అతని అనుచరుల దాడి..
రాజకీయ నాయకుల జెఏసి ఏర్పాటు..
దూరంగా ఉన్న టిడిపి

డిసెంబర్‌ 25
తెలంగాణ పది జిల్లాల్లో ఆగని విధ్వంసకాండ

డిసెంబర్‌ 26
ఉస్మానియాలో ఆమరణ దీక్షలు.. సంఘీభావం తెలిపే నాయకుల క్యూ...
రోశయ్య కేబినెట్‌ నుంచి తెలంగాణ మంత్రుల రాజీనామా

డిసెంబర్‌ 27
ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రులు.. ప్రణబ్‌తో భేటీ ప్రయత్నాలు..
జెఏసిలో చేరిన తెలుగుదేశం
ఉస్మానియా విద్యార్థుల దీక్ష భగ్నం చేసిన పోలీసులు

డిసెంబర్‌ 28
జనవరి 3న విద్యార్థి గర్జనకు పిలుపునిచ్చిన ఉస్మానియా జెఏసి
ఈ నెల 30న తెలంగాణ సంపూర్ణ బంద్‌కు పిలుపు నిచ్చిన నేతలు
కాల వ్యవధి లేని కమిటీ ఏర్పాటు యోచనలో కేంద్రం
అలాంటి కమిటీలను అంగీకరించేది లేదన్న తెలంగాణ వాదులు
సంయమనం పాటించాలని కొత్త గవర్నర్‌ నరసింహన్‌ పిలుపు



1 కామెంట్‌:

Unknown చెప్పారు...

మంచి సమాచారం / సమీక్ష అందించారు.
అభినందనలు. ధన్యవాదాలు.
ఇదంతా గడచినా ౩౦ రోజుల చరిత్ర.
రాబోయే ౩౦ రోజుల్లో మరిన్ని మలుపులు తిరగనుందో తెలంగాణా పోరు .